తనఖా పెట్టేస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

తనఖా పెట్టేస్తున్నారు

Jun 5 2025 7:34 AM | Updated on Jun 5 2025 7:34 AM

తనఖా

తనఖా పెట్టేస్తున్నారు

అవసరానికి డబ్బులు సర్దుబాటు కాక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. అలాంటివారిని గోల్డ్‌లోన్స్‌ ఆకర్షిస్తున్నాయి. బ్యాంకులతో పాటు పలు సంస్థలు బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకుని సులువుగా రుణాలు ఇస్తుండడంతో అందరూ అటువైపు వెళుతున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన రైతులు సహకార బ్యాంకుల్లోనే సుమారు రూ. 400 కోట్ల విలువైన గోల్డ్‌ లోన్స్‌ తీసుకోవడం గమనార్హం. ఇతర బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థల్లోనూ బంగారాన్ని తనఖా పెట్టి భారీగానే అప్పులు తీసుకున్నారు.

– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

అవసరానికి

గోల్డ్‌ లోన్‌!

సహకార

బ్యాంకులకు వరుస కడుతున్న రైతులు

ఉమ్మడి జిల్లాలో

రూ. 400 కోట్ల మేర అప్పులు

వాణిజ్య, కార్పొరేట్‌ బ్యాంకుల్లోనూ

భారీగానే రుణాలు..

బయట అప్పు పుట్టక..

గతంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారులు రైతులకు అప్పులు ఇచ్చేవారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు, ఇతర అవసరాలకు కూడా వ్యాపారులు అప్పు ఇచ్చేవారు. పంట చేతికి అందిన తరువాత అదే వ్యాపారి పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి తనకు రావలసిన అప్పు పోను మిగతా సొమ్ము రైతుకు చెల్లించేవారు. అయితే చాలాచోట్ల వడ్డీ వ్యాపారం తగ్గిపోయింది. తరువాతి కాలంలో ఫైనాన్స్‌లు వచ్చినా అవి అడ్డగోలు వడ్డీలు వసూలు చేయడంతో పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. అనుమతి లేని ఫైనాన్స్‌లపై పోలీసులు దాడులు చేయడం, కేసులు పెట్టడంతో చాలాచోట్ల ప్రవేట్‌ ఫైనాన్స్‌లు కనుమరుగయ్యాయి. ఇప్పుడు మార్కెట్‌లో సామాన్యుడికి అప్పు పుట్టే పరిస్థితి లేకుండాపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులకు బంగారం తాకట్టు రుణాలు ఉపశమనం కలిగిస్తున్నాయి.

తనఖా పెట్టేస్తున్నారు1
1/1

తనఖా పెట్టేస్తున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement