
ఇదిగో నా తరగతి గది..
బాన్సువాడ రూరల్: దేశాయిపేట్ జెడ్పీ హైస్కూల్ను బుధవారం జిల్లా ఇన్చార్జి డీఈవో పార్శి అశోక్కుమార్ సందర్శించారు. ఆయన స్వస్థలం సోమేశ్వర్ గ్రామం. ప్రస్తుతం నిజామాబాద్ డీఈవోగా పనిచేస్తున్నారు. కామారెడ్డి డీఈవో రాజు సెలవుపై వెళ్లడంతో ఆయన జిల్లా ఇన్చార్జి డీఈవో బాధ్యతలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం దేశాయిపేట్ హైస్కూల్ను సందర్శించారు. పాఠశాల ప్రాంగణంలో కలియదిరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇదే పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకున్నానన్నారు. తాను చదువుకున్న పాఠశాలను చూసి ఆయన మురిసిపోయారు.
కామారెడ్డి ఇన్చార్జి డీఈవోగా అశోక్
నిజామాబాద్ అర్బన్: జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కామారెడ్డి జిల్లా ఇన్చార్జి డీఈవోగా బుధవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. కామారె డ్డి డీఈవో పది రోజులపాటు సెలవులో వెళ్లడంతో అశోక్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు.
చదువుకున్న బడిని చూసి డీఈవో సంతోషం