
చర్యలు చేపడుతున్నాం
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. రవాణా శాఖ, పోలీసు శాఖ సంయుక్తంగా వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. రోడ్డు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరు సీట్బెల్ట్ ధరించాలి. మద్యం సేవించి, నిద్రలేమితో, వాహనంపై అవగాహన లేనివారు డ్రైవింగ్ చేయరాదు. గూడ్స్ వాహనాల్లో సరుకులు మాత్రమే తీసుకెళ్లాలి. ప్రజలను ఎక్కించుకోరాదు. అన్ని ప్రధాన రహదారులపై సూచిక బోర్డులు ఏర్పాటు చేసేలా ఆదేశిస్తాం. హిట్ అండ్ రన్ ఘటనలపై ప్రత్యేక నిఘా ఉంచాం. రోడ్డు నిబంధనలు పాటించని వారిని తనిఖీల్లో పట్టుకొని కేసులు నమోదు చేస్తాం.
– శ్రీనివాసరావు, ఎస్పీ