గోదావరి తీర ప్రాంతాల పరిశీలన | Sakshi
Sakshi News home page

గోదావరి తీర ప్రాంతాల పరిశీలన

Published Sun, Mar 24 2024 1:20 AM

పడవలో తీర ప్రాంతాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ - Sakshi

పలిమెల: మండలంలోని గోదావరి తీర ప్రాంతాలను, మావోయిస్టులు దాటడానికి అనుకూలంగా ఉన్న ప్రాంతాలను డీఎస్పీ రామ్మోహన్‌ రావు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గోదావరిలో జాలర్లతో మాట్లాడారు. అపరిచితులను, అనుమానితులను పడవల ద్వారా దాటించకూడదని తెలిపారు. ఎవరైనా దాటించినట్టు తెలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పలిమెల పోలీస్‌స్టేషన్‌ను తనిఖీచేసి సిబ్బంది విధులు అడిగి తెలుసుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో సిబ్బంది జాగ్రత్తగా ఉండాలన్నారు. ముకునూరు, పలిమెల గొత్తికోయ గూడేలను పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహదేవపూర్‌ సీఐ రాజేశ్వర్‌రావు, ఎస్సై తమాషారెడ్డి, సివిల్‌, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డీఎస్పీ రామ్మోహన్‌ రావు
1/1

మాట్లాడుతున్న డీఎస్పీ రామ్మోహన్‌ రావు

Advertisement
Advertisement