మూడు పంట కాలాలకు చెందిన ధాన్యం కమీషన్ డబ్బులు రావాల్సి ఉంది. డబ్బులు చెల్లిస్తే సంఘం అభివృద్ధికి వినియోగించుకుంటాం. ఈ పంట కొనుగోలు కోసం కేంద్రాల ఏర్పాటుకు చేసేందుకు సిద్ధమవుతున్నాం. పెండింగ్లో ఉన్న కమీషన్ చెల్లిస్తే కేంద్రాల నిర్వహణకు ఉపయోగపడుతాయి.
– గట్టు కొమురవ్వ, గ్రామ సంఘం
అధ్యక్షురాలు, పెగడపల్లి
సంఘాల అభివృద్ధికి
సహకార సంఘాలకు కేంద్రాల నిర్వహణ అప్పగించారు. కేంద్రాల ద్వారా సమకూరే కమీషన్ డబ్బులు ప్రభుత్వం వెంటవెంట చెల్లిస్తే సహకార సంఘాలను మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం కలుగుతుంది. మా సంఘానికి మూడు పంటలకు చెందిన సుమారు రూ.80 లక్షలు కమీషన్ రావాల్సి ఉంది.
– వోరుగంటి రమణారావు, పీఏసీఎస్ చైర్మన్ పెగడపల్లి
నిధులు రాగానే విడుదల చేస్తాం
నిర్వాహకులకు కమీషన్ డబ్బులు విడుదల కావాల్సి ఉంది. రాగానే ఆయా కేంద్రాలకు అందిస్తాం. జిల్లాలో ఐకేపీ, సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఇందుకు మూడు పంటలకు చెందిన కమీషన్ డబ్బులు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వానికి కమీషన్ డబ్బుల విడుదల కోసం ప్రతిపాదనలు పంపించాం.
– వెంకటేశ్వర్లు,
సివిల్ సప్లై అధికారిఽ