పిల్లల హక్కులను కాలరాస్తే చర్యలు | Sakshi
Sakshi News home page

పిల్లల హక్కులను కాలరాస్తే చర్యలు

Published Wed, Nov 15 2023 1:40 AM

-

జగిత్యాల: పిల్లల హక్కులను కాలరాస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా బాలల సంక్షేమ అధికారి భాస్కర్‌ అన్నారు. మహిళ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ వెల్ఫేర్‌ స్కూల్‌లో మంగళవారం బాలల దినోత్సవం నిర్వహించారు. పెద్దలతోపాటు పిల్లలకూ రాజ్యాంగం హక్కులు కల్పించిందని, హక్కులను పూర్తిస్థాయిలో వినియోగించుకున్నవారు అభివృద్ధి సాధిస్తారని పేర్కొన్నారు. బాల్య వివాహాలు, పిల్లలతో వెట్టిచాకిరీ, భిక్షాటన చేయించడం నేరమని తెలిపారు. తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లలను వేధిస్తే 1098కు ఫోన్‌ చేయాలన్నారు. అనంతరం విద్యార్థు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డీసీపీవో హరీశ్‌, సీడీపీవో వీరలక్ష్మీ, చైల్డ్‌లైన్‌ కో–ఆర్డినేటర్‌ శ్రావణ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement