ప్రధాని మోదీ యూరప్‌ పర్యటన మూడో రోజు హైలెట్స్‌..

Pm Narendra Modi Europe Visit Participates Second India Nordic Summit - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యూరప్‌ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. బుధవారం డెన్మార్క్‌లో జరిగిన రెండవ భారత్-నార్డిక్ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని హాజరయ్యారు. ఈ సమావేశం ప్రధానంగా కరోనా మహమ్మారి అనంతర ఆర్థిక పునరుద్ధరణ, వాతావరణ మార్పు, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్య, ఇంధన, మౌలిక రంగాల్లో పరస్పర సహకారం సహా ద్వైపాక్షిక బలోపేతంపై చర్చలు జరిపారు. ఈ సదస్సులో డెన్మార్క్, ఫిన్‌లాండ్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్ ప్రధాన మంత్రులు పాల్గొన్నారు.

సమావేశం అనంతరం ఫ్రాన్స్‌ ప్రధాని ఇమ్మాన్యుయెల్‌ మక్రాన్‌తో ప్రధాని మోదీ భేటికానున్నారు. బుధవారంతో ప్రధాని మూడు రోజుల యూరప్‌ పర్యటన ముగియనుంది. కాగా మొదటి ఇండియా-నార్డిక్ శిఖరాగ్ర సమావేశం 2018లో స్టాక్‌హోమ్‌లో జరిగింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top