తల్లీ కుమార్తెలపై యాచకుడి దాడి | Sakshi
Sakshi News home page

తల్లీ కుమార్తెలపై యాచకుడి దాడి

Published Thu, Mar 28 2024 3:40 AM

యాచకుడి దాడిలో 
గాయపడిన బాలిక  - Sakshi

ఆలమూరు: మండలంలోని బడుగువానిలంకలో తల్లీ కుమార్తెలపై యాచకుడు దాడి చేసిన సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఒక యాచకుడు బుధవారం గ్రామంలో ఇంటింటికి తిరిగి భిక్ష మెత్తుకుంటున్నాడు. ఒక ఇంటి వద్ద ముళ్ల రవీనా అనే మహిళ భిక్ష వేసేందుకు బయటకు రాగా అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె భయంతో ఇంట్లోకి పరుగులు తీసి తలుపులు మూసుకుంది.

కొద్దిసేపటికి మళ్లీ బయటకు రాగా అక్కడే మాటు వేసిన ఆ యాచకుడు ఇంట్లోకి ప్రవేశించాడు. రవీనాతో పాటు ఆమె రెండేళ్ల కుమార్తె సహస్రపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపర్చాడు. రవీనా గట్టిగా కేకలు వేసేసరికీ అక్కడి నుంచి పరారయ్యాడు. దాడికి గురైన రవీనా గర్భిణి. స్థానికంగా ఒక ఇంటిలో ఉన్న సీసీ పుటేజీ ద్వారా లభ్యమైన యాచకుడి ఫొటోను గ్రామస్తులు పోలీసులకు అందించారు. ఆలమూరు ఎస్సై ఎల్‌.శ్రీను నాయక్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సీసీ కెమెరాల్లో రికార్డయిన యాచకుడు
1/1

సీసీ కెమెరాల్లో రికార్డయిన యాచకుడు

Advertisement
Advertisement