చేతులు కలిపిన ఎయిర్‌టెల్, ఐబీఎం.. | Airtel and IBM Join Hands to Boost Cloud Infrastructure in India | Sakshi
Sakshi News home page

చేతులు కలిపిన ఎయిర్‌టెల్, ఐబీఎం..

Oct 16 2025 6:41 PM | Updated on Oct 16 2025 8:13 PM

Airtel and IBM Join Hands to Boost Cloud Infrastructure in India

టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్, అమెరికన్‌ ఐటీ దిగ్గజం ఐబీఎం చేతులు కలిపాయి. ముంబై, చెన్నైలో ఎయిర్‌టెల్‌ క్లౌడ్‌ కోసం రెండు మల్టీజోన్‌ రీజియన్లను (ఎంజీఆర్‌) నెలకొల్పేందుకు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. క్లౌడ్‌ సర్వీసుల కోసం పెద్ద సంఖ్యలో డేటా సెంటర్లను ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని ఎంజీఆర్‌గా వ్యవహరిస్తారు.

దేశీయంగా ఎయిర్‌టెల్‌ క్లౌడ్‌ లభించే జోన్ల సంఖ్యను ప్రస్తుత నాలుగు నుంచి పదికి పెంచుకోనున్నట్లు భారతి ఎయిర్‌టెల్‌ వైస్‌ చైర్మన్‌ గోపాల్‌ విఠల్‌ తెలిపారు. ఐబీఎం క్లౌడ్‌ సొల్యూషన్స్‌ను ఎయిర్‌టెల్‌ క్లౌడ్‌ కస్టమర్లు పోర్ట్‌ఫోలియో యాజ్‌ ఏ సర్వీస్‌ కింద ఉపయోగించుకునేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుంది. ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు టెక్నాలజీ విషయంలో స్వతంత్రతను కోరుకుంటున్న నేపథ్యంలో తమ సంస్థకు వ్యాపార అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయని ఐబీఎం ఆసియా పసిఫిక్‌ జనరల్‌ మేనేజర్‌ హాన్స్‌ డెకర్స్‌ తెలిపారు.

ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు

  • ముంబై, చెన్నై నగరాల్లో ఎయిర్‌టెల్ క్లౌడ్ కోసం రెండు మల్టీజోన్ రీజియన్లు (MGRs) స్థాపించనున్నారు.

  • ఇవి విస్తృత స్థాయిలో క్లౌడ్ సేవలు అందించగల నెట్‌వర్క్-కేంద్రిత డేటా సెంటర్ల సమాహారంగా పనిచేస్తాయి.

  • ఎంజీఆర్‌లు అధిక స్థాయిలో లభ్యత, డేటా రిజిలియెన్సీ, డేటా ప్రాసెసింగ్ వేగాన్ని అందిస్తాయి.

  • ప్రస్తుతం నాలుగు క్లౌడ్ జోన్లతో ఉన్న ఎయిర్‌టెల్, వాటిని  పదికు పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది.

  • ఇది దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలకు, ప్రభుత్వ విభాగాలకు మరింత వేగవంతమైన, నమ్మదగిన క్లౌడ్ సేవలను అందించగలదు.

  • ఐబీఎంకు చెందిన అధునాతన సాంకేతికతలను “పోర్ట్‌ఫోలియో యాస్‌ ఏ సర్వీస్‌” రూపంలో ఎయిర్‌టెల్ క్లౌడ్ కస్టమర్లు వినియోగించవచ్చు.

  • ఇది కస్టమర్లకు స్కేలబులిటీ, డేటా కంట్రోల్, ఏఐ సామర్థ్యాలు వంటి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement