మరింత జోరుగా క్షేత్ర స్థాయిలోకి.. | YSRCP programs from 10th to 28th Feb 2023 | Sakshi
Sakshi News home page

మరింత జోరుగా క్షేత్ర స్థాయిలోకి..

Feb 9 2023 3:57 AM | Updated on Feb 9 2023 3:57 AM

YSRCP programs from 10th to 28th Feb 2023 - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మరింత జోరుగా క్షేత్రస్థాయిలోకి వెళ్లడానికి వైఎస్సార్‌సీపీ కార్యాచరణ రూపొందించింది. ఎన్ని­కల ముందు ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేయడం, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడం, కులాలు, మతాలు, ప్రాంతాల కతీతంగా ప్రభుత్వం చేసిన మేలును ఇంటింటికి వెళ్లి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు పార్టీ ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది.

ఈ నేపథ్యంలో ఈ నెల 10 నుంచి 28 వరకు విస్తృతంగా కార్య­క్ర­మాలు నిర్వహి­ం­చనున్నారు. వైఎస్సార్‌సీపీ అధ్య­క్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మండలాల వారీగా గృహ సారథులకు శిక్షణ, ‘జగనన్నే మా భవిష్యత్తు’ ప్రచార కార్యక్రమం నిర్వహణకు రూపొందించిన షెడ్యూల్‌ను బుధ­వారం వైఎస్సార్‌­సీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

► ఈనెల 10 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ గృహ సారథుల నియామకం పూర్తి చేయాలి.
► 13న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్య­క్ష­తన ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వ­యకర్తలతో తాడేపల్లిలో సమీక్ష సమావేశం. ఈ సమావేశానికి ముందు ఎమ్మెల్యేలు, సమన్వ­యకర్తలు పార్టీ సూచించిన నిర్దిష్ట ఫార్మాట్‌లో గృహ సారథుల నియామక తుది జాబితా కాపీని సమర్పించాలి. సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, గ్రామ, వార్డు, వలంటీర్లకు తదుపరి కార్యక్రమమైన ‘జగనన్నే మా భవిష్యత్తు’ ప్రచార కార్యక్రమా­నికి సంబంధించి సవివర­మైన ప్రజెంటేషన్‌ను ఎమ్మెల్యేలు, సమన్వయ­కర్తలకు ఈ సమావేశంలో అందించడం జరుగుతుంది. 

► 14 నుంచి 19 వరకు.. మిగిలి ఉన్న మండలాల్లో ‘సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, గ్రామ,వార్డు వలంటీర్లకు’ శిక్షణ కార్యక్రమాలు.
► 20న.. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకా­లంలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలందరూ తమ నియోజకవర్గాల్లో పత్రికా సమావేశాలు నిర్వ­హించి, కనీసం 25 నుంచి 30 ఇళ్లకు తిరిగి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సచివా­లయం కన్వీనర్లు, గృహ సారథులు, గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ తిరిగి నిర్వహించే ‘జగనన్నే మా భవిష్యత్తు’ ప్రచార కార్య­క్రమం రాష్ట్రంలో మొత్తం 15,000 సచివా­లయాల పరిధిలో అదే రోజు ప్రారంభించాలి.
► 20 నుంచి 27 వరకు .. ‘జగనన్నే మా భవిష్యత్తు’ ప్రచార కార్యక్రమాన్ని నియోజక­వర్గ పరిధిలోని అన్ని ఇళ్లలో (100 శాతం) పూర్తి చేయాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement