కిడ్నాప్‌ కేసులో 8 మంది రిమాండ్‌ | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌ కేసులో 8 మంది రిమాండ్‌

Published Thu, Mar 28 2024 12:50 AM

-

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రేమ జంటపై దాడిచేసి కిడ్నాప్‌ చేసిన కేసులో ఎనిమిది మందిని రిమాండ్‌కు తరలించినట్లు వన్‌టౌన్‌ ఎస్సై హబీబ్‌ఖాన్‌ తెలిపారు. నిర్మల్‌లోని బేస్తార్‌పేట్‌కు చెందిన కాళ్ల విజయ్‌ హైదరాబాద్‌లోని జాహ్నవి కన్వెన్షన్‌ హాల్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ పనిచేసే సంయుక్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చి ఆ ప్రేమ జంట ఆదిలాబాద్‌లోని అశోక్‌రోడ్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 25న సంయుక్త కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలో వారు ఉంటున్న నివాసానికి వచ్చారు. ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన పలువురు వారి వెంట రాగా ఆ ప్రేమ జంటపై దాడికి దిగారు. ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు యత్నిస్తూ బస్సులో తీసుకెళ్లారు. ఇందులో మొత్తం 12 మంది ఉండగా 8 మందిని గుర్తించి వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రిమాండ్‌ అయిన వారిలో అవేజ్‌ బేగ్‌, సయ్యద్‌ హైజా ఉద్దీన్‌, సోఫియాన్‌ ఖాన్‌, సోహెబ్‌ ఖాన్‌, షాదాబ్‌ ఖాన్‌, సయ్యద్‌ మినాజ్‌, అబ్దుల్‌ ఆసిఫ్‌, మహ్మద్‌ సైబద్‌లు ఉండగా, అస్లమ్‌, జునేద్‌, అఫ్సర్‌, షాదుల్లా పరారైనట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement
Advertisement