-
Lok Sabha Elections 2024: ఈసీ ‘మెనూ కార్డు’
చాయ్కి పంజాబ్లోని జలంధర్లో రూ.15. అదే మధ్యప్రదేశ్లోని మాండ్లాలో అయితే రూ.7. సమోసా కూడా పంజాబ్లో రూ.15 అయితే మధ్యప్రదేశ్లో రూ.7.5. ఏమిటీ ధరలంటారా? లోక్సభ ఎన్నికల ప్రచార నిమిత్తం అభ్యర్థులకు ఎన్నికల సంఘం నిర్ధారించిన ధరలివి. వీటిని జిల్లా ఎన్నికల విభాగాలు స్థానికంగా నిర్ధారిస్తుంటాయి. దాంతో అవి ఒక్కో ప్రాంతానికి ఒక్కోలా ఉంటాయి. అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై గరిష్ట పరిమితి ఉందన్నది తెలిసిందే. లోక్సభ ఎన్నికల్లో ఒక్కో అభ్యరి్థకి ఈసీ నిర్ధారించిన పరిమితి రూ.95 లక్షలు. అరుణాచల్, గోవా, సిక్కిం రాష్ట్రాల్లో మాత్రం రూ.75 లక్షలు. కేంద్రపాలిత ప్రాంతాల్లో రూ.75–95 లక్షల మధ్య ఉంది. నామినేషనల్ దాఖలు చేసిన నాటి నుంచి ఫలితాలు వెల్లడించే తేదీ దాకా అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయం ఈ పరిమితిని దాటకుండా ఈసీ డేగ కళ్లతో గమనిస్తూ ఉంటుంది. ఇందుకోసం బ్యానర్లు, ఫ్లెక్సీలు, సభా వేదికలు మొదలుకుని కార్యకర్తలు, అభిమానులకు ఆహారం దాకా ప్రతిదానికీ రేటును ఫిక్స్ చేస్తుంది. అయితే వాటికీ, వాస్తవ ధరలకూ చాలాసార్లు పొంతనే ఉండదు. దాంతో ఈసీ ‘మెనూ కార్డు’పై మీడియాలో, సోషల్ మీడియాలో జోకులు పేలుతుండటం పరిపాటి. మరోవైపు, ఎన్నికల వ్యయంపై అభ్యర్థులకు పరిమితి ఉన్నా పార్టీలు చేసే ఖర్చుకు మాత్రం అలాంటిదేమీ లేకపోవడం విశేషం! చాయ్ రూ.5 నుంచి 15 దాకా... చాయ్ ధరను దేశవ్యాప్తంగా ప్రాంతాన్ని బట్టి రూ.5 నుంచి రూ.15 దాకా ఈసీ నిర్ధారించింది. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో కప్పు చాయ్ రూ.5, సమోసా రూ.10. ఇడ్లీ, సాంబార్ వడా, పోహా–జిలేబీ ప్లేటు రూ.20. దోసా, ఉప్మా మాత్రం ప్లేటు రూ.30. మణిపూర్లో జాతుల హింసకు కేంద్రాల్లో ఒకటైన తౌబల్ జిల్లాలో చాయ్, సమోసా, కచోరీ, ఖజూర్, గాజా ఒక్కోటీ రూ.10. రాష్ట్రంలోని తెంగ్నౌపాల్ జిల్లాలో బ్లాక్ టీ రూ.5, సాదా టీ రూ.10. మణిపూర్లో బాతు మాంసం రూ.300. పంది మాంసం రూ.400. ఇక్కడి ఈసీ మెనూలో చికెన్తో పాటు చేపలు కూడా ఉన్నాయి. జలంధర్లో ప్లేటు చోలే భటూరేకు ఈసీ నిర్ధారించిన ధర రూ.40. కిలో చికెన్కు రూ.250, మటన్కు రూ.500. మిఠాయిల్లో ధోడా రూ.450, ఘీ పిన్నీ రూ.300. గ్లాసు లస్సీ రూ.20, నిమ్మరసం రూ.15. చెన్నైలో తగ్గిన చికెన్ బిర్యానీ రేటు చెన్నైలో 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే చాయ్ ధరను రూ.10 నుంచి రూ.15కు ఈసీ పెంచింది. కాఫీ కూడా రూ.15 నుంచి రూ.20కి పెరిగింది. కానీ చికెన్ బిర్యానీ ధరను మాత్రం రూ.180 నుంచి రూ.150కి తగ్గించడం విశేషం! ఢిల్లీ శివార్లలో నోయిడా పరిధిలోని గౌతంబుద్ధ నగర్లో వెజ్ భోజనం రూ.100. సమోసా, చాయ్ రూ.10. కచోరీ రూ.15, శాండ్విచ్ రూ.25, జిలేబీ కిలో రూ.90. ఉత్తర గోవాలో బటాటా (ఆలూ) వడ, సమోసా రూ.15. చాయ్ రూ.15, కాఫీ రూ.20. హరియాణాలోని జింద్లో దాల్ మఖానీ, మిక్స్డ్ వెజ్ కర్రీ రూ.130. మటర్ పనీర్ రూ.160. ఇక్కడ ఈసీ మెనూలో బటర్ నాన్, మిస్సీ రోటీ, ప్లెయిన్ రోటీలతో పాటు కాజూ కట్లీ, గులాబ్జామ్ వంటివి కూడా ఉన్నాయి. వీటికీ రేట్లు ఫిక్స్... ► ఖరీదైన హెలీప్యాడ్లు, లగ్జరీ వాహనాలు, ఫామ్హౌజ్లతో పాటు పూలు, కూలర్లు, టవర్ ఏసీలు, సోఫాల వంటివాటికి కూడా ఈసీ రేట్లు నిర్ధారించింది. ► సభలు, సమావేశాలకు జనాన్ని తరలించేందుకు బస్సులు మొదలుకుని టాటా సఫారీ, స్కార్పియో, హోండా సిటీ, సియాజ్... ఇలా బ్రాండ్లవారీగా కూడా ఒక్కో వాహనానికి ఒక్కో రేటు నిర్ణయించింది. ► దండల్లో కూడా గులాబీ, బంతి... ఇలా పూలను బట్టి రేట్లు నిర్ణయమయ్యాయి. పార్టీల జెండాలు, టోపీలకూ అంతే. ► సభలు, సమావేశాలకు వేదికలు, నేతలకు బస తదితరాలతో పాటు ప్రకటనలు, హోర్డింగులు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సామగ్రికి కూడా ఇంత అని ఈసీ ముందే రేట్లు ఫిక్స్ చేసి పెట్టింది. కొసమెరుపు: ఎన్నికల వేళ కార్యకర్తలకు పారీ్టలు, అభ్యర్థులు మద్యం అందుబాటులో ఉంచడం బహిరంగ రహస్యమే. కానీ ఈసీ మెనూలో మద్యానికి మాత్రం చోటులేకపోవడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సామాజిక రంగ వ్యయంలో దక్షణాదిలో ఏపీనే టాప్
సాక్షి, అమరావతి: పేదలను విద్యావంతులు, ఆరోగ్యవంతులుగా చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలపై అత్యధిక వ్యయం చేస్తున్నారు. పేదల అభ్యన్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రభుత్వ రంగ విద్య అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి పేదింటి పిల్లవాడూ లేదా అమ్మాయి చదువు మధ్యలో ఆపేయకుండా అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన వంటి అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు. అంతర్జాతీయ స్థాయి సిలబస్ను పిల్లలకు అందిస్తున్నారు. అదే విధంగా ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించి, అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. పేదల ఇంటి వద్దకే వైద్యాన్ని చేరుస్తున్నారు. గ్రామీణ, పట్టణాభివృద్ధిపైనా దృష్టి కేంద్రీకరించారు. బడి పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. గ్రామాలు, నగరాల్లో పారిశుద్ధ్యాన్ని పెంపొందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రక్షిత మంచి నీరు అందిస్తున్నారు. ఇలా సామాజిక రంగానికి సీఎం వైఎస్ జగన్ పెద్ద పీట వేస్తున్నారు. తద్వారా గత ఐదేళ్లుగా సామాజిక రంగ కేటాయింపులు, వ్యయంలో మన రాష్ట్రం ముందుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి పది నెలల్లోనూ (ఏప్రిల్ నుంచి జనవరి వరకు) సామాజిక రంగ కేటాయింపులతో పాటు వ్యయంలోనూ దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల బడ్జెట్ కేటాయింపులు, నెలవారీ వివిధ రంగాలకు చేసిన వ్యయాలపై కాగ్ గణాంకాలను వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో వైఎస్ జగన్ ప్రభుత్వం సామాజిక రంగానికి రూ.1,30,366 కోట్లు కేటాయించింది. ఇందులో పది నెలల్లోనే రూ.1,07,610 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్ తెలిపింది. ఇది ఏకంగా 82.54 శాతం. సామాజిక రంగానికి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు, ఆ నిధులను సమర్ధంగా వినియోగించడంలో దక్షిణాదిలో మిగతా రాష్ట్రాలు వెనకబడ్డాయని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ తరువాత స్థానంలో తమిళనాడు రాష్ట్రం ఉంది. మూడో స్థానంలో కర్నాటక,, నాలుగో స్థానంలో తెలంగాణ,, ఐదో స్థానంలో కేరళ రాష్ట్రాలు ఉన్నట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. సామాజిక రంగ వ్యయం అంటే.. సామాజిక రంగ వ్యయం అంటే విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారం, సంక్షేమం, పారిశుద్ధ్యం, మంచి నీటి సరఫరాపై చేసిన వ్యయంగా పరిగణిస్తారు. సామాజిక రంగ వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కొలబద్దగా కాగ్, ఆర్బీఐ పరిగణిస్తాయి. -
అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ : భారీ ఏర్పాట్లు, మొత్తం ఖర్చు ఎంతంటే..!
బిలియనీర్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. గుజరాత్లోని జామ్నగర్లో అనంత్-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు పలువురు రాజకీయ, క్రీడా, సినీ రంగ ప్రముఖులతోపాటు, గ్లోబల్ టెక్ సీఈఓలు, పాప్ ఐకాన్లు హాజరు కావడం విశేషంగా నిలిచింది. మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన ఈ ఈవెంట్ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించడం విశేషం. ప్రీ వెడ్డింగ్ సందడే ఇంత ఘనంగా జరుగుతోంటే, అదీ ముఖేష్ అంబానీ సంతానంలో జరుగుతున్న చివరి పెళ్లి వేడుక కావడంతో అనంత్ అంబానీ పెళ్లి తంతు ఇంకెంత ఘనంగా ఉంటుందో అనే చర్చ మొదలైంది. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ బాష్కు రూ.1260 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. తద్వారా ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన వేడుకగా ఇది నిలిచింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, మెటా హెడ్ మార్క్ జుకర్బర్గ్, ఇవాంకా ట్రంప్, ఇలా డజన్ల కొద్దీ ఇతర ప్రముఖులు బసకోసమే ఏకంగా సుమారు రూ. 52 కోట్లు ఖర్చు పెట్టారట. పాప్ ఐకాన్ రిహన్నా సహా, వీరందరికోసం విలాసవంతమైన వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు, దేశ, విదేశీ భారతీయ అతిథుల కోసం ముఖేష్ అంబానీ ప్రైవేట్ విమానాలను కూడా ఏర్పాటు చేశారు. కేటరింగ్ కాంట్రాక్టుకే రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. మూడు రోజుల పాటు అద్భుతమైన పూలకోసం కూడా భారీగానే వెచ్చించారట. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ప్రకారం అమెరికన్ పూల డిజైనర్ జెఫ్ లీథమ్ అదిరిపోయే కలర్ఫుల్ ఫ్లవర్ సెట్టింగ్స్ తీర్చిదిద్దాడు. కాగా 2023, జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న అనంత్ -రాధికా మర్చంట్ఈ ఏడాది జూలైలో పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నారు. -
పట్టణ తలసరి వ్యయంలో తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: సగటు భారతీయుడి నెలవారీ ఖర్చు పట్టణాల్లో రూ.6,459 ఉంటే, అదే గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి రూ.3,773గా ఉన్నట్లు ఓ నివేదిక తేల్చింది. పట్టణ ప్రాంతాల్లో ఆహారేతర నెలవారీ ఖర్చు రూ.3,929 కాగా ఆహారానికి సంబంధించి రూ.2,530 వ్యయం చేస్తున్నట్లు తెలిపింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఆహారేతర ఖర్చు నెలకు రూ.2,023 కాగా ఆహారానికి రూ. 1,750 వ్యయం చేస్తున్నారు. పెద్ద రాష్ట్రాల్లో సగటు పట్టణ నెలవారీ తలసరి వ్యయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సగటు భారతీయుడి నెలవారీ ఖర్చులు ఎలా ఉంటాయి? వేటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు? పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యయాల తీరు ఎలా ఉంటుంది? ఇవన్నీ అందరికీ ఆసక్తిని కలిగించే అంశాలే. ఈ నేపథ్యంలోనే..‘హౌస్హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ (గృహావసరాల వినియోగ ఖర్చు) (మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్–ఎంపీసీఈ (నెలవారీ తలసరి ఖర్చు) సర్వే 2022–23’పేరిట కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించింది. గతంలో కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే పేరిట ప్రతి ఐదేళ్లకు సర్వే నిర్వహిస్తుండగా, చివరగా 2011–12లో దీనిని నిర్వహించారు. ఇప్పుడు పదేళ్ల తర్వాత తాజా సర్వే నిర్వహించారు. అయితే సర్వేకు అనుసరించిన విధానం (మెథడాలజీ)లో మార్పుల కారణంగా గతంలో నిర్వహించిన అధ్యయనాలతో దీనిని పోల్చలేదని నేషనల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్ఎస్వో) తెలిపింది. కాగా ఇటీవల విడుదల చేసిన ఈ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ తర్వాత ఢిల్లీ, హిమాచల్ పెద్ద రాష్ట్రాల్లో సగటు పట్టణ నెలవారీ తలసరి వ్యయంలో రూ.8,251తో తెలంగాణ టాప్లో ఉండగా, ఢిల్లీ (రూ.8,250), హిమాచల్ప్రదేశ్ (రూ.8,083) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే మొత్తంగా చూస్తే చండీగఢ్ (రూ.12,577) మొదటి స్థానంలో ఉండగా, సిక్కిం (రూ.12,125), అండమా¯న్ అండ్ నికోబార్ (రూ.10,268), గోవా (రూ.8,761), అరుణాచల్ ప్రదేశ్ (రూ.8,649) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక పట్టణాల్లో శ్రీమంతులుగా ఉన్న టాప్ 5 శాతం మంది రూ.20,824 వ్యయం చేస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,501 ఖర్చు చేస్తున్నారు. మరోవైపు దిగువ స్థాయిలో ఉన్న 5 శాతం మంది పట్టణాల్లో రూ.2,001, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,373 ఖర్చు చేస్తున్నట్లు నివేదిక వివరించింది. -
జాతీయ స్థాయిని మించి ఏపీ తలసరి వినియోగ వ్యయం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం జాతీయ స్థాయిని మించి నమోదైంది. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన గృహ వినియోగ వ్యయ సర్వే 2022–23 వెల్లడించింది. వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత ఆహార, ఇతర వస్తువులతోపాటు ఆహారేతర వస్తువుల వినియోగం ఆధారంగా 2022–23 గృహ వినియోగ వ్యయ సర్వే కోసం క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సేకరించినట్టు సర్వే నివేదిక వెల్లడించింది. ఆహార పదార్థాలైన బియ్యం, గోధుమలు, మొక్కజొన్న రాగులు, పప్పులు, చక్కెర, వంట నూనెలు, ఆహారేతర వస్తువులైన ల్యాప్టాప్, పీసీ, టాబ్లెట్, మొబైల్, సైకిల్, మోటార్ సైకిల్, స్కూటీ, స్కూల్ యూనిఫాం, స్కూల్ షూ తదితర వస్తువులను పరిగణనలోకి తీసుకుని నెలవారీ తలసరి వినియోగ వ్యయాన్ని లెక్కించినట్టు సర్వే నివేదిక తెలిపింది. రాష్ట్రంలో తలసరి వ్యయం ఇలా.. జాతీయ స్థాయిలో గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.3,860 ఉండగా.. పట్టణాల్లో ఆ వ్యయం రూ.6,521 ఉన్నట్టు సర్వే పేర్కొంది. ఏపీ విషయానికి వస్తే గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.4,996 ఉండగా.. పట్టణాల్లో రూ.6,877 ఉన్నట్టు సర్వే వెల్లడించింది. పొరుగు రాష్ట్రం తెలంగాణ గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం కంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉంది. తెలంగాణలో తలసరి వినియోగ వ్యయం రూ.4,959గా ఉంది. అత్యల్పంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.2,257 రూపాయలు ఉండగా.. పట్టణాల్లో రూ.4,557 ఉందని సర్వే తెలిపింది. కేంద్రపాలిత ప్రాంతాల్లో చూస్తే ఛండీగఢ్లో గ్రామాల్లో అత్యధికంగా నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.7,467 ఉండగా.. పట్టణాల్లో రూ.12,577 ఉంది. అత్యల్పంగా లడ్హాక్లో గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.4,062 ఉండగా.. పట్టణాల్లో రూ.5,511 ఉందని సర్వే నివేదిక తెలిపింది. -
సామాజిక హితం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత మూడేళ్లుగా అభివృద్ధి వ్యయం పెరుగుతుండగా వడ్డీల చెల్లింపుల వ్యయం తగ్గుతున్నట్లు రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) అధ్యయన నివేదిక వెల్లడించింది. రాష్ట్రాల ఆర్థిక వ్యవహారాలు, బడ్జెట్లపై నివేదిక విడుదల చేసిన ఆర్బీఐ 2021–22 నుంచి 2023–24 వరకు ప్రధాన ఆర్థిక సూచికలను ఇందులో పొందుపరిచింది. సామాజిక సేవలు, ఆర్థిక సేవల వ్యయం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొంది. సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాలపై నేరుగా చేసే వ్యయాన్ని అభివృద్ధి వ్యయంగా నిర్వచించింది. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యపై చేసే ఖర్చును అభివృద్ధి వ్యయంగా ఉదహరించింది. జీతభత్యాలు భారీగానే.. ► ఆంధ్రప్రదేశ్లో వరుసగా మూడేళ్లుగా సామాజిక రంగ వ్యయం పెరుగుతోంది. సామాజిక సేవలు, గ్రామీణాభివృద్ధి, ఆహార నిల్వలు, గిడ్డంగులు ఈ కోవలోకి వస్తాయి. ఇదే సమయంలో ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం, నీటి సరఫరా, పారిశుద్ధ్య రంగాల కోసం వెచ్చించే వ్యయం కూడా పెరుగుతోంది. ► 2021–22లో మొత్తం వ్యయంలో అభివృద్ధి వ్యయం రూ.1.19 లక్షల కోట్లు ఉండగా 2023–24 నాటికి రూ.1.92 లక్షల కోట్లకు పెరిగింది. ► వడ్డీ చెల్లింపులు పెరుగుతున్నాయనే వాదనల్లో నిజం లేదు. రెవెన్యూ రాబడిలో వడ్డీ చెల్లింపుల శాతం తగ్గుతోంది. ► ఏపీలో వేతనాలు, జీతాలు చెల్లింపులు గత ఐదేళ్లుగా పెరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగులకు పీఆర్సీ అమలుతో పాటు చిరు ఉద్యోగుల వేతనాలను పెంచడంతో వేతనాలు, జీతాల వ్యయం పెరుగుతున్నట్లు సూచికలు వెల్లడిస్తున్నాయి. -
తెలంగాణ అప్పు రూ.6,85,765 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ‘పదేళ్ల బీఆర్ఎస్ విధ్వంసం–ఆర్థిక అరాచకం’పేరుతో విడుదల చేయనున్న శ్వేతపత్రంలో భాగంగా 1956–2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టిన ఖర్చులో తెలంగాణకు వచ్చిన వాటా, తద్వారా జరిగిన అభివృద్ధి, సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాల కోసం చేసిన అప్పుల గురించి వివరించనున్నట్లు సమాచారం. అలాగే 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2023–24 బడ్జెట్ ప్రతిపాదనలతో కలిపి మొత్తం అంచనాలు, జరిగిన ఖర్చుతో పాటు అప్పుల గురించి శాసనసభకు తెలియజేయనున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. గత పదేళ్లలో ప్రభుత్వం చేసిన బడ్జెట్ ప్రతిపాదనలకు, ఖర్చుకు పొంతన లేదని, రెండింటికీ మధ్య సుమారు 20 శాతం తేడా ఉందంటూ గణాంకాలు వెల్లడించనున్నట్లు తెలిపాయి. 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2023–24 వరకు మొత్తం రూ.14,87,834 కోట్లను ప్రతిపాదిస్తే, ఖర్చు చేసింది కేవలం రూ.12,24,877 కోట్లు మాత్రమేనని ప్రభుత్వం వివరించనుంది. అప్పులు ఇలా..! ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.75 వేల కోట్ల అప్పు ఉంటే గత పదేళ్లలో అది రూ.6,85,765 కోట్లకు చేరింది. అందులో ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం) పరిమితులకు లోబడి తెచ్చిన అప్పు రూ.3.89 లక్షల కోట్లయితే, వివిధ కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికిళ్లు, సంస్థలకు గ్యారంటీల ద్వారా ప్రభుత్వం రూ.1.27 లక్షల కోట్లకు పైగా సమకూర్చి ఖర్చు పెట్టింది. మరో రూ.1.09 లక్షల కోట్లను గ్యారంటీలిచ్చి కార్పొరేషన్ల ద్వారా ఖర్చు పెట్టింది. ఇక ప్రభుత్వ గ్యారంటీలు లేకుండా రూ.60 వేల కోట్ల మేర కార్పొరేషన్లే నేరుగా అప్పులు చేశాయి..’అని విశదీకరించనున్నారు. ‘రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రూ.12 లక్షల కోట్లకు పైగా కేవలం మిషన్ భగీరథ, సీతారామ, కాళేశ్వరంతో పాటు కొంతమేర పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టారు. ఆర్అండ్బీ, మున్సిపల్ శాఖల్లో కొంత వెచ్చించి మౌలిక సదుపాయాలు సమకూర్చారు. అయితే 1956 నుంచి 2014 వరకు అన్ని బడ్జెట్లు కలిపి తెలంగాణకు వచ్చి న వాటా కేవలం రూ.5 లక్షల కోట్లకు పైగా మాత్రమే. ఈ తక్కువ మొత్తంతోనే నాగార్జున సాగర్ నుంచి కృష్ణా, గోదావరి నదులపై అనేక ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, వైద్యసంస్థలు, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ లాంటి ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ఇతర సంక్షేమ పథకాలను గత ప్రభుత్వాలు అమలు చేశాయి..’ అని వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. -
ఉచిత పథకాలపై ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: ఉచిత పథకాలపై ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పథకాలు వ్యయప్రాధాన్యతను వక్రీకరిస్తాయని చెప్పారు. ఉచిత పథకాల అంశంలో పోటాపోటీగా నడుస్తున్న రాజకీయాలపై ఆరోగ్యకరమైన చర్చ జరగాలని ఆయన సూచించారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ‘భారత మండపం’లో ఎన్హెచ్ఆర్సీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఉచిత పథకాలతో ప్రజల జేబులు నింపడం సరికాదని జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. ప్రజల జీవన శైలి, సమర్థత, నైపుణ్యాలను మెరుగుపరచాలని అభిప్రాయపడ్డారు. భారత్ మాదిరిగా ప్రపంచంలో ఏ ప్రదేశమూ మానవ హక్కులతో విరాజిల్లడం లేదని స్పష్టం చేశారు. ఉచితాలు స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని తగ్గిస్తాయని ఆయన చెప్పారు. ‘అమృత్ కాల్’ సమయంలోనే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కూడా 75వ వార్షికోత్సవాన్ని చేసుకోవడం యాదృచ్ఛికమని జగ్దీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత్లోని ఐరాస రెసిడెంట్ కోఆర్డినేటర్ శోంబి షార్ప్ పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ పంపిన సందేశాన్ని ఆయన చదివి వినిపించారు. ఎన్హెచ్ఆర్సి చైర్పర్సన్ జస్టిస్ (రిటైర్డ్) అరుణ్ కుమార్ మిశ్రా తీవ్రవాదం, ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులపై దాని ప్రభావం తీవ్రమైన సమస్యగా ప్రస్తావించారు. ఇదీ చదవండి: ఛత్తీస్గఢ్ నూతన సీఎంగా విష్ణుదేవ్ సాయి -
లెక్కలు తీస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి ఏమిటో ప్రజలకు చెప్పేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ‘ఇది ప్రజాప్రభుత్వం’అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం రోజే ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి కేబినెట్ సమావేశంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఈ పదేళ్ల కాలంలో నిధుల విడుదల, ఖర్చు, మిగులు తదితరాలు ప్రజలకు వివరించాలని నిర్ణయించిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే ప్రభుత్వ శాఖల వారీగా నివేదికలు సేకరించాలని నిర్ణయించి ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా బడ్జెట్ రూపకల్పనలో భాగంగా శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు, నిధుల విడుదల, చేసిన ఖర్చులకు సంబంధించి సమాచారం విభాగాధిపతులు సమర్పించడం ఆనవాయితీ. సీఎం ఆదేశాలతో శుక్రవారం పలు విభాగాధిపతులు ఆగమేఘాల మీద ఈ ఏడాదికి సంబంధించిన వివరాలు ప్రభుత్వానికి సమర్పించారు. ప్రత్యేక ఫార్మాట్ రూపకల్పన ! శాఖలవారీగా చేసిన ఖర్చులకు ప్రత్యేక ఫార్మాట్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినట్టు తెలిసింది. 2014 నుంచి ఇప్పటివరకు వార్షిక బడ్జెట్లో జరిపిన కేటాయింపులు, నిధుల విడుదలకు సంబంధించి బడ్జెట్ రిలీజింగ్ ఉత్తర్వులు, చేసిన ఖర్చు, సంవత్సరం వారీగా నిధుల మిగులుకు సంబంధించిన సమాచారం సమర్పించాల్సి ఉంటుంది. ఖర్చుకు సంబంధించిన అంశాలను పథకాల వారీగా వ్యయం, అభివృద్ధి కార్యక్రమాల వివరాలతోపాటు మరమ్మతులు తదితరాలను పూర్తిస్థాయిలో సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో కూడిన జాబితాతోపాటు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, విడుదలైన నిధులు, చేసిన ఖర్చు వివరాలు కూడా వేరుగా సమర్పించాలని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడంతో అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, సమావేశాలు ముగిసేనాటికి వీటిని ప్రజాక్షేత్రంలో ఉంచే అవకాశం ఉన్నట్టు సమాచారం. విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి పదేళ్ల కాలంలో రూ.25వేల కోట్లు ఖర్చు చేసినట్టు అంచనా. -
అది పార్టీ సభా..లేక కుల సభా..
అసలే ఎన్నికల సమయం. ప్రజలతో భారీ బహిరంగసభలు, రోడ్ షోలు నిర్వహించడం ద్వారా ప్రజలంతా తమవైపు ఉన్నారన్న సంకేతాలు పంపించడమే వాటి ఉద్దేశం. ఇందుకోసం కోట్లాది రూపాయల వ్యయం అవుతుంది. అయినా ఫర్వాలేదు. పార్టీ ప్రతిష్ట ముఖ్యం. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే పరమావధి. అలాంటిదే పరేడ్ గ్రౌండ్లో ప్రతిష్టాత్మకంగా భారీ బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించింది. అయితే సదరు సభ నిర్వహణకు పార్టీ పేరుమీద కాకుండా.. ఓ సంఘం పేరిట బహిరంగసభ నిర్వహణకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ బహిరంగసభకు కీలక నేత ముఖ్య ప్రసంగం ఉంటుందని, తద్వారా ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడేలా సర్వం సిద్ధం చేసుకున్నారు. కానీ ఇక్కడే తిరకాసు వచ్చిపడింది. అనుమతి తీసుకున్నది ఓ కులసంఘం. ఎన్నికల రిటర్నింగ్ అధికారి సభకు అనుమతినిచ్చారు. అయితే సభలో ఎక్కడా పార్టీ జెండాలు ఉండరాదని మౌఖికంగా ఆదేశించారట. లేదు.. కూడదు.. బహిరంగసభలో పార్టీ జెండాలు పెడితే.. సంబంధిత ఖర్చులో సగం వరకు స్థానిక అభ్యర్థి లెక్కలో వేస్తామని హెచ్చరించారట... ఏమి చేయాలో పాలుపోని నాయకులకు ఎన్నికల బహిరంగసభ రద్దుకు నిర్ణయం తీసుకున్నారట. అయితే అదే సమయానికి వాతావరణశాఖ కూడా వర్షాలు పడే సూచనలున్నాయంటూ ఇచ్చిన హెచ్చరిక కూడా వీరికి కలిసి వచ్చిందంటున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో ఓ జాతీయ పార్టీ కూడా ఓ కులసంఘానికి సంబంధించిన బహిరంగసభ నిర్వహించింది. అది కూడా ఇంచుమించుగా రాజకీయ వేదికగానే ఉపయోగించుకుంది. కానీ అక్కడ ఎక్కడా తన పార్టీ జెండాలు ఏర్పాటు చేయకుండా జాగ్రత్త పడింది. ఆ సభ ద్వారా కావాల్సినంత ప్రయోజనాన్ని ఎన్నికల్లో పొందడానికి ప్రయత్నం చేసింది. ఆ కుల సంఘం కూడా ఎన్నికల ప్రచారంలో ఆ జాతీయ పార్టీకి పూర్తి మద్దతుగా రంగంలోకి దిగింది. ఇది ఎన్నికల కాలం మహిమ. -
ఉద్యోగాలు పోతున్నాయి.నాకు మాత్రం సూపర్: క్రేజీ ‘బారీ’ ప్రకటన ఏంటంటే!
బ్రిటీష్ మల్టీ-మిలియనీర్, పారిశ్రామికవేత్త బారీ డ్రివిట్-బార్లో (53) గుర్తున్నాడా. గే కపుల్గా క్రేజీ రికార్డు క్రియేట్ చేసిన బారీ ఇపుడు మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. రానున్న క్రిస్మస్ సందర్భంగా తన ఖర్చును తగ్గించుకుంటున్నట్టు తాజాగా ప్రకటించాడు. ఎందుకంటే దేశం కష్టాల్లో ఉంది. అలాగే ప్రపంచంలో చాలా మంది ఉద్యోగాలు, ఇళ్లను కోల్పోతున్న బాధలో ఉన్నారు. అందుకే ఈ ఏడాది క్రిస్మస్ ఖర్చును కేవలం 28 కోట్ల రూపాయలకు పరిమితం చేయబోతున్నానని తెలిపాడు. అలాగే తన హాలిడే షాపింగ్ను తగ్గించాలని ప్లాన్ చేసుకున్నానని కూడా పేర్కొన్నాడు. కానీ తనకు, తన వ్యాపారాలకు మాత్రం 2023 సూపర్ రికార్డ్ సంవత్సరం అని ప్రకటించాడు. అయితే ఇప్పటికే క్రిస్మస్ బడ్జెట్లో తన ఫియాన్సీ స్కాట్ కోసం 1.9కోట్ల రూపాయల విలువైన బ్రాండ్ న్యూ ఆడి ఆర్8ని కొనుగోలు చేశాడు. అలాగే కొడుకు ఆస్పెన్ కోసం లగ్జరీ అపార్ట్మెంట్లు, ఇళ్లను నిర్మించడానికి భూమిని కొనుగోలు చేశాడు. వ్యాపారంలో విజయం,క్రిస్మస్ సందర్భంగా ఆస్పెస్కి ప్రత్యేకంగా ఏదైనా ఇవ్వాలని నిర్ణయించు కున్నాడట. అందుకే ఖరీదైన కొత్త రోలెక్స్ G-వ్యాగన్ రడీ చేశాడు. అతని భార్య పిమ్ కోసం, ఆమె ఫ్యామిలీకి దగ్గరగా ఉండేలా ఆమె సొంత ఊరు బ్యాంకాక్లోని కోట్ల విలువచేసే కొత్త అపార్ట్మెంట్, కొత్త రోజ్ గోల్డ్ రోలెక్స్ వాచ్ కొనుగోలు చేశాడు. ఇంకా అయిపోలేదు అతని కుమార్తె సఫ్రాన్ కోసం, ప్లాటినం రోలెక్స్ వాచ్, లెక్కలేనన్ని దుస్తులు, లేటెస్ట్ లూయిస్ విట్టన్ బ్యాగ్లు ఇలా బోలెడు విలువైన వస్తువులు ఆమె కోసం సిద్ధం చేశాడు. దీంతో పాటు మిగిలిన పిల్లలకి కూడా క్రిస్మస్ కానుకలుగా లగ్జరీ వాచీలు, కార్లు, ఆస్తులను పొందబోతున్నారని స్వయంగా బారీ మీడియాకు వెల్లడించాడు. బారీ డ్రూవిట్-బార్లో టోనీ రికార్డులు, పిల్లలు బ్రిటన్లో బారీ డ్రివిట్-బార్లో భాగస్వామి టోనీతో కలిసి తొలి గే కపుల్గా రికార్డు సృష్టించారు. దాదాపు 11 సంవత్సరాలు కలిసి వున్న తరువాత పిల్లల్ని దత్తత తీసుకోవాలని భావించారు. కానీ 1999లో కాలిఫోర్నియాలో సరోగేట్ ద్వారా కవలలు సాఫ్రాన్, ఆస్పెన్ జన్మనిచ్చి మరో హిస్టరీ క్రియేట్ చేశారు. అంతేకాదు జనన ధృవీకరణ పత్రాలపై తల్లి, తండ్రికి బదులుగా పేరేంట్ -1, పేరెంట్-2 అని నమోదు చేసేలా స్వలింగ తల్లిదండ్రులను అనుమతించాలని ఈ జంట కోర్టును ఆశ్రయించి విజయం సాధించింది. LGBTQ కమ్యూనిటీకి సంబంధించి ఇదొక చారిత్రాత్మక సందర్బంగా నిలిచింది. ఇపుడు ముగ్గురు తల్లిదండ్రులుగా నమోదయ్యేందుకు ప్రయత్నస్తున్నాడు ఈ క్రేజీ గే బారీ. అంతేకాదు అంతర్జాతీయ స్పెర్మ్ డోనర్గా ఇప్పటికే 17మంది పిల్లలకు జీవసంబంధమైన తండ్రిని అని ఇటీవల ప్రకటించాడు బారీ. ఆ తరువాత ఈ జంట సరోగసీ ద్వారా ఓర్లాండో, జాస్పర్ , డల్లాస్ అనే కవల పిల్లలు సహాఎనిమిది మంది పిల్లలున్నారు. కూతురు సాఫ్రాన్ మాజీ ప్రియుడు స్కాట్ హచిసన్తో ప్రేమ కారణంగా 2019లో టోనీతో 32 ఏళ్ల సంబంధాన్ని తెంచుకున్నాడు బారీ. 2020లో, బారీ స్కాట్ తొలిబిడ్డ వాలెంటినా పుట్టింది. ఇక బారీ- టోనీ వ్యాపారానికి విషయానికి వస్తే రియల్ ఎస్టేట్, ట్రాన్స్-అట్లాంటిక్ సరోగసీ వ్యాపారం, గ్లోబల్ మెడికల్ రీసెర్చ్ కంపెనీతో సహా అనేక వ్యాపారాలతో కోట్లకు పడగలెత్తారు. ముఖ్యంగా తన సంతానానికి ప్రతీ ఏడాది క్రిస్మస్ సందర్భంగా ఖరీదైన బహుమతులిచ్చి ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటాడు బారీ . గత ఏడాది క్రిస్మస్ కోసం సుమారు 4 మిలియన్ యూరోలు ఖర్చు చేశాడట. కొడుకు కోసం ఏకంగా రూ.25 కోట్ల విలువైన బోటును గిఫ్ట్గా ఇచ్చాడు పుట్టిన రెండు రోజులకే మిలియనీర్ క్లబ్లో మనవరాలు అంతేకాదు తన మనవరాలికి భారీ ఎత్తున ఆస్తులను పంచి ఇచ్చి పుట్టిన 2 రోజులకే మిలియనీర్గా అవతరించిన రికార్డును అందించాడు. విలాసవంతమైన ఇల్లు, 10 కోట్ల ఆస్తి, 52 కోట్ల ట్రస్ట్ను ఆమెకు రాసిచ్చానని బార్లో ఇన్స్టాగ్రామ్లో వెల్లడించాడం అప్పట్లో వైరల్ అయింది.ఈ భవనంలో పాపాయికి సేవలు చేసేందుకు సకల ఏర్పాట్లు చేసినట్లు పేర్కొనడం విశేషంగా నిలిచింది. -
ఆ కంపెనీల ఆదాయ వ్యయాలు అధికం
డెబ్బై గంటల పని వారాలపై ఇటీవల తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఉద్యోగులు ఎన్నిగంటలు పనిచేసినా కొన్ని కంపెనీల్లో ఉత్పాదకత పెరుగుతోంది. మరొకొన్నింటిలో తక్కువగా ఉంటుంది. కంపెనీ ఉద్యోగికి చేసే ఖర్చు, ఆ ఉద్యోగి సంస్థకు చేకూర్చే ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని సంస్థలు చేసిన సర్వేలు ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. ఆ వివరాల ప్రకారం..గత ఐదేళ్లలో కంపెనీలకు వచ్చే మొత్తం రాబడిలో సిబ్బంది ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ క్రమంగా పెరుగుతోంది. అయితే 2019లో రూ.1.46 కోట్లుగా ఉన్న టాప్ 500 లిస్టెడ్ కంపెనీల రాబడి 36% పెరిగి 2023లో దాదాపు రూ.2 కోట్లకు చేరుకుంది. కంపెనీల ఉత్పాదకత పెరుగుతుంది. దాంతోపాటు కొన్ని సంస్థలు ఉద్యోగులపై చేసే వ్యయం కూడా అధికమవుతుంది. దాదాపు కంపెనీల వ్యయంలో 10శాతం ఉద్యోగుల జీతాలకు కేటాయిస్తున్నాయి. 2020-21 కరోనా సమయంలో ఉద్యోగుల ఆదాయం పడిపోయింది. కానీ గత రెండేళ్లలో వారి ఆదాయం క్రమంగా వృద్ధి చెందుతూ వస్తుంది. ద్రవ్యోల్బణం సమయంలో కంపెనీల ఉత్పాదకత తగ్గి ఉద్యోగుల ఖర్చులు పెరిగినట్లు కనిపిస్తాయి. దాంతో వారి ఆదాయాలు పెరిగినట్లు అవుతుంది. కానీ ద్రవ్యోల్బణ భయాలు సమసిపోతున్నపుడు క్రమంగా ఆదాయ వ్యయాలు సర్దుబాటవుతాయి. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీస్, ఐటీ వంటి కొన్ని రంగాల్లో ఉత్పాదకత వాస్తవానికి మెరుగుపడింది. ఆయా రంగాలు వారి ఉద్యోగులను గరిష్ఠస్థాయిలో వినియోగించుకున్నట్లు సర్వేలు తెలిపాయి. ఆ కంపెనీల ఆదాయవ్యయాలు పెరుగుతున్నాయి. రవాణా, లాజిస్టిక్స్, మ్యానుఫాక్చరింగ్, మైనింగ్, రిటైల్ రంగాలు ఇప్పటికీ తక్కువ స్థాయిలో కార్మికులను ఉపయోగిస్తున్నాయి. అయితే 2019 నాటికి టాప్ 500కంపెనీల్లో దాదాపు 6 కోట్ల ఉద్యోగులు ఉండేవారు. 2023 నాటికి వారి సంఖ్య 7 కోట్లకు చేరింది. గడిచిన ఐదేళ్లలో కంపెనీలు ఏటా 12.6శాతం మేర వృద్ధి చెందాయి. అదేవిధంగా వారి ఉద్యోగులకు చేసే ఖర్చు సైతం ఏటా 12.5శాతం చొప్పున పెరిగింది. -
ఆ సీట్లలో రూ.కోట్ల వరద
సాక్షి, హైదరాబాద్: ఓట్ల పండగకు కొత్త నిర్వచనం నోట్ల పండగ. ఎన్నికలు వచ్చాయంటే గ్రేటర్లో నోట్ల వర్షమే కురుస్తోంది. తాజాగా జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి కనిష్టంగా రూ.50–75 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది. అంటే ఒక్కో నియోజకవర్గంలో కనిష్టంగా రూ.150–200 కోట్ల వరకు వ్యయం కానుందని విశ్లేషకుల అంచనా. ఈ మేరకు వెచ్చించగల సత్తా, ఆర్ధిక పరిపుష్టి కలిగిన వారినే అభ్యర్థులుగా ఆయా రాజకీయ పార్టీలు ఖరారు చేశాయి గ్రేటర్ హైదరాబాద్లో 29 నియోజకవర్గాలు ఉన్నాయి. పాతబస్తీ, రిజర్వ్ స్థానాలు మినహా మిగిలిన గ్రేటర్ నియోజకవర్గాల్లో ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో నోట్ల వరద పారనుంది. ఇప్పటికే ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల తాయిలాలు పంపిణీ మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు నుంచే ప్రతి రోజు కార్యకర్తలు, అనుచరుల బాగోగులు చూసు కోవడం తప్పనిసరిగా మారింది. పెట్రోల్ బంక్లలో ఇంధనం వైన్స్, బెల్ట్ షాపులలో మద్యాన్ని పద్దు రూపేణా ఆయా దుకాణాలు, బంకుల యజమాన్యాలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇవేగాకుండా నియోజకవర్గ కేంద్రం సహా మండలం, వార్డుకు, పంచాయితీకో క్యాంపు ఆఫీసును ఏర్పాటు చేశారు. ఇక్కడ పార్టీ శ్రేణులకు బ్రేక్ ఫాస్ట్ మొదలు రాత్రి విందు, మందు వరకు ఫ్రీ. మరోవైపు ప్రచారరథాలు, ప్రజలను సమీకరణకు లారీలు, డీసీఎం వంటి వాహనాలను అద్దెకు తీసుకుంటున్నారు. ఖరీదైన ఎన్నికలకు కేరాఫ్ దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలకు తెలంగాణ పేరుగాంచింది. గతేడాది నవంబర్లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలలో రెండు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అనే స్థాయిలో పోటాపోటీగా ఖర్చు పెట్టాయి. ఒక్కో ఓటుకు రెండు పార్టీలు కలిపి రూ.10 వేల వరకూ ఓటర్కు అందించినట్లు, మొత్తంగా రూ.600 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లు రాజకీయ వర్గాలలో చర్చ నడిచింది. ఇలాంటి పరిస్థితులలో వచ్చే నవంబర్లో జరగనున్న శాసనసభ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు అధికారం చేజిక్కించుకునేందుకు ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనకాడట్లేదు. అన్ని రాజకీయ పార్టీలు ఆర్థికంగా బలమైన అభ్యర్థులకే టికెట్లను కేటాయించడమే ఇందుకు నిదర్శనం. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) ప్రకారం.. ఇటీవల కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు రూ.9,500 కోట్ల నుంచి రూ.10,500 కోట్ల మధ్య ఖర్చు చేశాయని తెలిపింది. 2013 ఎన్నికల వ్యయం కంటే ఇది రెండింతలు అని పేర్కొంది. విభాగాల వారీగా తాయిలాలు.. ఒక్కో అభ్యర్థి ఎన్నికల సంఘం నిర్దేశించిన రూ.40 లక్షలకు మించి వ్యయం చేయకూడదు. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్–77 ప్రకారం ప్రతి అభ్యర్థి ఎన్నికల ఖర్చులకు సంబంధించి ప్రత్యేకంగా కరెంట్ ఖాతాను తెరవాలి. వ్యయ, నిర్వహణ రికార్డులను ఎన్నికల కమిషన్కు సమర్పించాల్సి ఉంటుంది.అయితే ఈసీ నిర్ణయించిన మొత్తానికి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వంద రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తారనేది జగమెరిగిన సత్యం. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను వర్గాల వారీగా విభజించి వారిని ఆకట్టుకుంటున్నాయి. మహిళలకు చీరలు, వెండి, బంగారం, కుట్టు మిషన్లు, కుక్కర్లు, మిక్సీలు వంటి గృహోపకరాలను అందిస్తుంటే... యువత కోసం గిఫ్ట్ కూపన్లు, ఆట వస్తువుల పంపిణీ, డ్రైవింగ్ లైసెన్స్, ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఫోన్లు బహుమతులుగా ఇస్తున్నారు. వృద్ధుల కోసం వైద్య శిబిరాలు, దసరా, దీపావళి బహుమతులు, బాణాసంచాలు అందిస్తున్నారు. ఆ సెగ్మెంట్లపై ఈసీ స్పెషల్ ఫోకస్ గ్రేటర్లో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాలపై రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఈ సెగ్మెంట్లలో అభ్యర్థులు అత్యధిక వ్యయం ఖర్చు చేయనున్నారు. హైదరాబాద్,రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని ఈ నియోజక వర్గాలలో సగటున ఐదు లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఓటింగ్ శాతం తక్కువే అయినప్పటికీ రాజకీయ పార్టీలు వెచ్చించే సొమ్ము మాత్రం ఎక్కువగా ఉంటుంది. -
108 సేవలకు రూ.725 కోట్లు
సాక్షి, అమరావతి: అనుకోని ప్రమాదాలు, అనారోగ్య సమస్యలకు గురై ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న వారికి 108 అంబులెన్స్లు సంజీవనిలా మారాయి. ఫోన్ చేసిన నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను వేగంగా ఆస్పత్రులకు చేర్చి ప్రాణాలను నిలబెడుతున్నాయి. ప్రాణం విలువ తెలిసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం టీడీపీ హయాంలో నిర్వీర్యమైన 108 వ్యవస్థకు ఊపిరి పోసింది. 768 అంబులెన్స్ల ద్వారా ప్రజలకు ఉచితంగా సేవలందించేందుకు ఇప్పటి వరకూ రూ.589 కోట్లను ఖర్చు చేయగా కొత్త వాహనాల కొనుగోలుకు మరో రూ.136 కోట్లకుపైగా వ్యయం చేయడం గమనార్హం. గర్భిణులే అత్యధికం.. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు సగటున మూడు వేల మందికి అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్లు సేవలందిస్తున్నాయి. 2020 జూలై నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు నాటికి 36 లక్షల మంది సేవలు పొందారు. వీరిలో అత్యధికంగా 23 శాతం మంది గర్భిణులుండగా 14 శాతం కిడ్నీ బాధితులు, 11 శాతం మంది రోడ్డు ప్రమాద బాధితులున్నారు. నిర్వహణకు ఏటా రూ.188 కోట్లకు పైగా రోడ్డు ప్రమాదాల బాధితులు, గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని ఎంత త్వరగా ఆస్పత్రికి తరలిస్తే ప్రాణ రక్షణకు అంత ఎక్కువ అవకాశాలుంటాయి. ఈ నేపథ్యంలో 108 అంబులెన్స్ల నిర్వహణ, ఉచితంగా అత్యవసర రవాణా సేవలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. క్షేత్ర స్థాయిలో అంబులెన్స్ కార్యకలాపాల కోసం 3700 మందికి పైగా విధులు నిర్వహిస్తుండగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్లో మరో 311 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీరికి వేతనాలతో పాటు అంబులెన్స్ల నిర్వహణ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. ప్రతి నెలా 108 అంబులెన్సుల నిర్వహణ కోసం రూ.14.39 కోట్లు వెచ్చిస్తోంది. ఏడాదికి రూ.172.68 కోట్లను నిర్వహణ కోసం కేటాయిస్తోంది. దీనికి తోడు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కోసం ఏడాదికి రూ.15.88 కోట్లు చొప్పున ఖర్చు చేస్తోంది. అంటే ఏడాదికి మొత్తం రూ.188 కోట్లకు పైగా వ్యయం చేస్తోంది. గిరిజన ప్రాంతాలకు ప్రత్యేకంగా వాహనాలు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి 108 అంబులెన్సు సేవలు 336 వాహనాలతో అరకొరగా ఉండేవి. అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉండగా మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేని పరిస్థితి నెలకొంది. ఈ దుస్థితికి తెర దించుతూ సీఎం జగన్ 2020 జూలై 1న ఏకంగా 412 కొత్త 108 అంబులెన్సులను ప్రారంభించారు. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కు పెరిగింది. ఇందుకోసం రూ.96.5 కోట్లు ఖర్చు చేశారు. గిరిజన ప్రాంతాల కోసమే ప్రత్యేకంగా 20 కొత్త అంబులెన్స్లను రూ.4.76 కోట్లతో 2022 అక్టోబర్లో అదనంగా కొనుగోలు చేశారు. దీంతో అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. 2.5 లక్షల కి.మీకిపైగా తిరిగిన పాత వాహనాలను తొలగించి వాటి స్థానంలో ఈ ఏడాది జూలైలో 146 కొత్త అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చారు. వీటి కొనుగోలుకు ప్రభుత్వం మరో రూ.34.79 కోట్లు ఖర్చు చేసింది. ఇలా రూ.136.02 కోట్లు అంబులెన్స్ కొనుగోలుకు వెచ్చించారు. తద్వారా నిర్వహణ, కొత్త వాహనాల కొనుగోలు కోసం రూ.725.02 కోట్లు ఖర్చు చేశారు. -
ఆరోగ్యమే మహా భాగ్యం!
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యమే మహాభాగ్యం... ఈ నినాదాన్ని భారతీయులు తరతరాలుగా ఒక సందేశంగా తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ భారతీయులకు దీని అవసరం ఏర్పడింది. దీనికి తగ్గట్టుగానే 2022–23 ఆర్థిక సంవత్సరంలో తమ కుటుంబ ఆదాయాల్లో పది శాతానికిపైగా ఆరోగ్య పరిరక్షణకు భారతీయులు వ్యయం చేస్తున్నట్టుగా ఇటీవల నివేదికలో వెల్లడైంది. దీనికి సంబంధించి అత్యధికంగా ఖర్చు చేస్తున్న టాప్–5 రాష్ట్రాల్లో కేరళ, మహారాష్ట్ర, యూపీ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ప్రదేశ్ నిలుస్తున్నాయి. ఇది 2017–18 స్థాయిలను బట్టి చూస్తే గణనీయంగా వైద్య, ఆరోగ్యంపై ఖర్చు పెరగడానికి ప్రధానంగా కోవిడ్ మహమ్మారి కారణంగా తలెత్తిన విపత్కర, అనిశి్చత పరిస్థితులే కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్) పురోగతిపై తాజాగా ‘మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్’విడుదల చేసిన డేటాలో ఆయా అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా మొత్తంగా చూస్తే.. 2022–23లో 6.67 శాతం ప్రజలు తమ ఆదాయాల్లో పదిశాతానికిపైగా (2017–18లో ఇది 4.48 శాతం) వ్యయం చేశారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా... మొత్తం కుటుంబ ఆదాయాల్లో 25 శాతానికి పైగా ఖర్చు చేస్తున్న వారు 2.3 శాతం మంది ఉన్నట్టుగా ఈ డేటా స్పష్టం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలతో పోలి్చతే పట్టణ ప్రాంతాల్లోని వారే తమ ఆదాయంలో పదిశాతానికి పైగా వ్యయం చేస్తున్నట్టుగా వెల్లడైంది. ఐతే కొన్ని సందర్భాల్లో...పరిస్థితులు చేయి దాటడం లేదా విపత్కర పరిస్థితులు ఎదురుకావడం వంటివి చోటుచేసుకున్నపుడు మాత్రం గ్రామాల్లోని ప్రజలు తమ కుటుంబ ఆదాయాల్లో 25 శాతానికి పైగా ఖర్చు చేయాల్సి వస్తోన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... భారతీయుల వైద్య, ఆరోగ్యానికి సంబంధించి తలసరి వ్యయం 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి (కరోనా తరువాత) అత్యధికంగా పెరిగినట్టుగా కేంద్ర మంత్రిత్వశాఖ నేషనల్ హెల్త్ అకౌంట్స్ (ఎన్హెచ్ఏ) అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్యం, కుటుంబాల ‘ఔట్ ఆఫ్ ప్యాకెట్’వైద్య, ఆరోగ్య వ్యయంపై ప్రభుత్వం ఖర్చు పెంచాక ఈ వృద్ధి నమోదైనట్టుగా ఈ అంచనాల్లోపేర్కొన్నారు. 2014–15 లలో ప్రభుత్వం చేస్తున్న తలసరిఖర్చు రూ. 1,100 కాగా, 2019–20 కల్లా అది రూ. 2,014కు పెరిగినట్టు ఇందులో తెలిపారు. -
AP: ఏడాదిలోనే జీతాల వ్యయం.. రూ.8,068కోట్లు పెరుగుదల
సాక్షి, అమరావతి: దేశంలోని పలు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వోద్యోగుల వేతనాల వ్యయం భారీగా పెరిగింది. అదే సమయంలో పెన్షన్ల వ్యయం కూడా భారీగానే అయింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2022–23 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ప్రాథమిక గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఏడాది వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం భారీగా పెరిగింది. మరోపక్క.. తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల కన్నా ఏపీలోనే ఉద్యోగుల వేతనాల వ్యయం అధికంగా ఉందని కాగ్ తెలిపింది. నివేదిక ముఖ్యాంశాలు ఏమిటంటే.. ♦ 2021–22తో పోలిస్తే రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల వేతనాల వ్యయం 2022–23లో రూ.8,068.39 కోట్లు పెరిగింది. ♦ ప్రభుత్వోద్యోగుల పెన్షన్ల వ్యయం 2021–22తో పోలిస్తే 2022–23లో రూ.2,257.29 కోట్లు పెరిగింది. ♦ 2021–22 ఆర్థిక ఏడాదిలో ప్రభుత్వోద్యోగుల వేతనాల వ్యయం ఏపీలో రూ.40,895.83 కోట్లు ఉండగా 2022–23లో అది ఏకంగా రూ.48,964.22 కోట్లకు పెరిగింది. ♦ అలాగే, 2021–22లో ప్రభుత్వోద్యోగుల పెన్షన్ల వ్యయం రూ.20,326.67 కోట్లు కాగా, 2022–23లో అది రూ.22,583.96 కోట్లకు పెరిగింది. ..ఇలా రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం ఏటేటా పెరుగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీని అమలుచేయడంతో పాటు ఉద్యోగులకు డీఏలు ఇవ్వడంతో వేతనాల వ్యయం భారీగా పెరుగుతోంది. మరోవైపు.. వైద్య ఆరోగ్య శాఖలో ఏ ఒక్క పోస్టు ఖాళీలేకుండా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తోంది. -
తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. 9 సంవత్సరాలు.. రూ.97,321 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల బలోపేతానికి రూ.97,321 కోట్ల ఖర్చు చేశామని తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్రావు తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం విద్యుత్ సౌధ, మింట్ కాంపౌండ్లోని టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘విద్యుత్ విజయోత్సవ దినం’కార్యక్రమాల్లో మాట్లాడారు. రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2022–23లో 2140 యూనిట్లుగా, జాతీయ సగటుతో పోలి్చతే 70శాతం అధికంగా నమోదైందని తెలిపారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ అభివృద్ధికి 9 ఏళ్లలో రూ.14,063 కోట్లు ఖర్చు చేశామని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి అన్నారు. వినియోగదారుల సమస్యలను సత్వరంగా పరిష్కరించి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఉద్యోగులకు సూచించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్, ట్రాన్స్కో జేఎండీ సి.శ్రీనివాసరావు, విద్యుత్ సంస్థల డైరెక్టర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. చదవండి: ఉగ్రవాదులు టార్గెట్ చేసిన రాష్ట్రాలు ఏవి? -
‘వార్ధా’ అంచనాలు పెరగలేదు!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ అంబేడ్కర్ వార్ధా ప్రాజెక్టులో భాగంగా.. 2018లో బ్యారేజీ నిర్మాణానికి మాత్రమే రూ.750 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశామని రాష్ట్ర నీటి పారుదల శాఖ పేర్కొంది. భూసేకరణ, ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్లు, ఫీల్డ్ చానళ్లు, కరకట్టలు, పంపుహౌజ్లు, విద్యుత్ సబ్స్టేషన్లు, రెగ్యులేటర్లు, క్రాస్ డ్రైనేజీ స్ట్రక్చర్లు, బ్రిడ్జీలు, నిర్వాహణ ఖర్చులతోపాటు 18 శాతం జీఎస్టీ పన్నును కలిపితే మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.4,550.73 కోట్లకు చేరిందని తెలిపింది. కేవలం జీఎస్టీ పన్ను వ్యయం రూ.622.40 కోట్లు కానుందని వెల్లడించింది. ‘వార్ధా ప్రాజెక్టు..భారీ బడ్జెట్’శీర్షికన సోమవారం ‘సాక్షి’లో వచ్చిన కథనంపై నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి వివరణ ఇచ్చారు. ప్రాజెక్టు అంచనా వ్యయం పెరగలేదని పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టితో భారం తుమ్మిడిహెట్టి వద్ద కాకుండా వార్ధా నదిపై బ్యారేజీని నిర్మించనుండటంతో వ్యయం గణనీయంగా తగ్గుతుందని నీటిపారుదల శాఖ పేర్కొంది. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ పొడవు 6.45 కిలోమీటర్లు, గేట్ల సంఖ్య 102కాగా.. వార్ధా బ్యారేజీ పొడవు 1751 మీటర్లు, గేట్ల సంఖ్య 29కి తగ్గుతాయని వివరించింది. తుమ్మిడిహెట్టి బ్యారేజీలో 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద గరిష్ట నిల్వ సామర్థ్యం 1.85 టీఎంసీలు మాత్రమేకాగా.. వార్ధా బ్యారేజీలో 155 మీటర్ల వద్ద 2.94 టీఎంసీలను నిల్వ చేయవచ్చని తెలిపింది. -
పోలవరం వ్యయం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు వ్యయం వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవహారమని స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు మొత్తం వ్యయం నుంచి విశాఖపట్నం నగరానికి మంచి నీరు అందించేందుకు కేటాయించిన రూ.7,214 కోట్లను తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) కొట్టేసింది. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని న్యాయస్థానాలు ఆదేశాలు ఇవ్వలేవని తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని మొత్తం తామే భరిస్తామని ఇచ్చిన హామీని కేంద్రం ఉల్లంఘిస్తే, దానికి కట్టుబడి ఉండాలని తాము ఆదేశాలు ఇవ్వలేమంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విభజన చట్టం, పార్లమెంట్లో ఇచి్చన హామీ మేరకు పోలవరం ప్రాజెక్టు వ్యయంలో విశాఖ నగరానికి తాగు నీరు అందించేందుకు అయ్యే వ్యయాన్ని అంతర్భాగంగా పరిగణించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అమలాపురానికి చెందిన రమేష్చంద్ర వర్మ దాఖలు చేసిన పిల్పై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది మంగెన శ్రీరామారావు వాదనలు వినిపిస్తూ.. విశాఖ ప్రజల దాహార్తిని, పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు కేటాయించిన రూ.7,214 కోట్లను పోలవరం ప్రాజెక్టు వ్యయంలో అంతర్భాగంగా పరిగణిస్తున్నట్లు కేంద్రం పార్లమెంట్లో చెప్పిందన్నారు. అయితే ఈ హామీ నుంచి కేంద్రం ఇప్పుడు తప్పుకుందన్నారు. ఇది కూడా చదవండి: పేదలందరికీ ఇళ్లు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు -
లక్ష్యంలో 82.8 శాతానికి ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.14.53 లక్షల కోట్లకు చేరింది. బడ్జెట్ అంచనాలతో పోల్చితే ఇది 82.8 శాతానికి చేరింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ)ఈ గణాంకాలను విడుదల చేసింది. 2022–23లో మొత్తం ద్రవ్యలోటు రూ.17.55 లక్షల కోట్లుగా అంచనావేయడం జరిగింది. స్థూల దేశీయోత్పత్తి ఇది 6.4 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటును జీడీపీలో 5.9 శాతానికి తగ్గించాలన్నది లక్ష్యం. -
ప్రకటనలపై వ్యయాలు 15 శాతం అప్
ముంబై: దేశీయంగా ఈ ఏడాది ప్రకటనలపై వ్యయాలు 15.5% పెరిగి రూ. 1.46 లక్షల కోట్లకు చేరనున్నాయి. 2021తో పోలిస్తే 2022లో పరిశ్రమ 15.7 శాతం వృద్ధి చెందిందని అంచనాలు నెలకొన్నాయి. మీడియా ఏజెన్సీ గ్రూప్ఎం ఈ అంచనాలను వెలువరించింది. అత్యంత వేగంగా ఎదుగుతున్న టాప్ 10 మార్కెట్లలో భారత్ కూడా ఒకటిగా ఉండనుందని, అడ్వర్టైజింగ్పై వెచ్చించే వ్యయాల విషయంలో ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉంటుందని గ్రూప్ఎం వివరించింది. స్థూల ఆర్థిక అస్థిరతలు, అంతర్జాతీయ పరిణామాలు గత మూడేళ్లుగా ప్రకటనకర్తల వ్యాపారాలు, అడ్వర్టైజింగ్ వ్యయాలపై ప్రభావం చూపాయని సంస్థ సీఈఓ (దక్షిణాసియా) ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. 2023లో ప్రకటనల వ్యయాలకు టెలికం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు.. బీమా, రిటైల్, ఫిన్టెక్, గేమింగ్, ట్రావెల్, పర్యాటకం మొదలైన విభాగాల నుంచి ఊతం లభిస్తుందని గ్రూప్ఎం బిజినెస్ ఇంటెలిజెన్స్ హెడ్ పర్వీన్ షేక్ చెప్పారు. ఈ ఏడాది గ్రామీణ ఎకానమీ కూడా పుంజుకోగలదన్నారు. టాప్ మెట్రోలను దాటి ఇతర ప్రాంతాలకూ 5జీ సేవలు విస్తరిస్తుండటం, స్మార్ట్ఫోన్లు చౌకగా లభిస్తుండటం తదితర అంశాలూ ప్రకటనకర్తలు అడ్వర్టైజింగ్పై మరింతగా వెచ్చించేందుకు దోహదపడగలవన్నారు. డిజిటల్దే పైచేయి.. గ్రూప్ఎం అంచనాల ప్రకారం మొత్తం ప్రకటన వ్యయాల్లో సింహభాగం వాటా డిజిటల్ మీడియాదే ఉండనుంది. అత్యంత వేగంగా 20 శాతం వృద్ధితో ఏకంగా 56 శాతానికి చేరనుంది. టీవీ మాధ్యమం వాటా మాత్రం స్వల్పంగా 31 శాతం నుంచి 30 శాతానికి తగ్గనుంది. ప్రింట్ మాధ్యమంలో ప్రకటనలపై వ్యయాలు మరింతగా తగ్గి 11 శాతం (2022లో) నుంచి ఈ ఏడాది 10 శాతానికి పరిమితం కానున్నాయి. విలువపరంగా మాత్రం ప్రింట్లో ప్రకటనలు రూ. 13,519 కోట్ల నుంచి రూ. 14,520 కోట్లకు పెరగనున్నాయి. -
‘21 రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకోండి’.. ఉద్యోగులకు కేంద్రం సూచనలు
న్యూఢిల్లీ: రైతులకు ఎరువులు భారీ స్థాయిలో రాయితీలకు ఇస్తుండటంతో ప్రభుత్వంపై పడిన సబ్సిడీ భారం, పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు తదితరాల పథకాల ఆర్థికభారం నుంచి కాస్తంత ఉపశమనం కోసం కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులోభాగంగా ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణ నిమిత్తం చేసే విమాన, రైలు ప్రయాణాల్లో ఖర్చులు తగ్గించుకోవాలంది. ఆ సూచనలు.. ► అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసి అధిక ధర చెల్లించేకన్నా 21 రోజుల ముందే తక్కువ ధరల శ్రేణి టికెట్లు బుక్ చేసుకోండి. ► అనవసరంగా టికెట్లు క్యాన్సిల్ చేయొద్దు. ► వేర్వేరు టైమ్–స్లాట్లుంటేనే, తప్పనిసరి అయితేనే రెండు టికెట్లు బుక్ చేయాలి. లేదంటే ఒక ప్రయాణానికి ఒక్కటే తీసుకోవాలి. ► విమాన టికెట్లను 72 గంటల్లోపు బుక్చేసినా, 24 గంటల్లోపు క్యాన్సిల్ చేసినా అందుకు కారణం తెలుపుతూ సంబంధిత విభాగానికి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ► తక్కువ క్లాస్ టికెట్తోనే ప్రయాణించండి. నాన్–స్టాప్ ఫ్లైట్ అయితే మరీ మంచిది. చదవండి👇 ఆర్మీలో అగ్నివీర్ తొలి నోటిఫికేషన్ విడుదల వందల సంఖ్యలో రైళ్లు రద్దు..రైళ్ల వివరాలు ఇవే.. -
రక్షణ వ్యయంలో ఆ మూడు దేశాలే టాప్!
ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో రక్షణ వ్యయం ఏటేటా ఎగబాకుతోంది. ప్రపంచ సైనిక వ్యయం 2 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించి సరికొత్త శిఖరాలకు చేరింది. సైనిక వ్యయంలో అమెరికా(38%), చైనా(14%), భారత్(3.6%) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎస్ఐపీఆర్ఐ) వెల్లడించింది. ప్రపంచ సైనిక వ్యయం మొత్తంలో మొదటి 5 దేశాలదే 62 శాతం ఉండటం గమనార్హం. బ్రిటన్(3.2%), రష్యా(3.1%).. నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. మొత్తం ప్రపంచ సైనిక వ్యయం 2021లో 0.7 శాతం పెరిగి 2113 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఎస్ఐపీఆర్ఐ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నమైనప్పటికీ ప్రపంచ దేశాల రక్షణ వ్యయం గణనీయంగా పెరిగిందని ఎస్ఐపీఆర్ఐ సీనియర్ పరిశోధకుడు డాక్టర్ డిగో లోపెస్ డా సిల్వా వెల్లడించారు. కోవిడ్ సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థలు మెల్లగా కోలుకోవడంతో రక్షణ వ్యయం ప్రపంచ జీడీపీలో 2.2 శాతానికి చేరుకోగా, 2020లో ఈ సంఖ్య 2.3 శాతంగా ఉంది. అమెరికా మిలటరీ ఖర్చులు 2021లో 801 బిలియన్ డాలర్లకు చేరింది. 2020తో పోలిస్తే ఇది 1.4 శాతం తగ్గింది. 2012- 2021 మధ్య కాలంలో అమెరికా సైనిక పరిశోధన, అభివృద్ధికి నిధులను 24 శాతం పెంచింది. అదే సమయంలో ఆయుధాల కొనుగోళ్ల ఖర్చు 6.4 శాతం తగ్గించింది. రెండో స్థానంలో ఉన్న చైనా 2020తో పోల్చితే 4.7 శాతం వృద్ధితో 293 బిలియన్ డాలర్లను రక్షణ కోసం వెచ్చించింది. గత ఏడాది భారత సైనిక వ్యయం 76.6 బిలియన్ డాలర్లుగా ఉంది. 2020తో పోల్చితే 0.9 శాతం పెరిగింది. 2012 నుంచి భారత రక్షణ వ్యయం 33 శాతం పెరిగింది. స్వదేశీ ఆయుధ పరిశ్రమను బలోపేతం చేయడానికి, 2021 సైనిక బడ్జెట్లో 64 శాతం మూలధన వ్యయం దేశీయంగా ఉత్పత్తి చేయబడిన ఆయుధాల కొనుగోలుకు కేటాయించారని ఎస్ఐపీఆర్ఐ పేర్కొంది. (క్లిక్: భారత్కు బంపరాఫర్.. అమెరికా, యూరప్ దేశాలకు రష్యా భారీ షాక్!) బ్రిటన్ గత సంవత్సరం రక్షణ కోసం 68.4 బిలియన్ డాలర్ల ఖర్చు చేసింది. 2020తో పోలిస్తే ఇది మూడు శాతం అధికం. రష్యా తన సైనిక వ్యయాన్ని 2021లో 2.9 శాతం పెంచడంతో 65.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. వరుసగా మూడో సంవత్సరం మిలటరీ పద్దు పెరగడంతో రష్యా సైనిక వ్యయం 2021లో జీడీపీలో 4.1 శాతానికి చేరుకుంది. (క్లిక్: ఉక్రెయిన్ను నడిపిస్తున్న... అమెరికా ఆయుధాలు) -
ఆదాయం గోరంత.. ఖర్చు కొండంత
సాక్షి, హైదరాబాద్: ‘బడ్జెట్ నిర్వహణ సరిగా లేదు. బడ్జెట్ ప్రతిపాదనలకు, సవరణలకు, ఖర్చులకు పొంతన లేదు. అప్పులు పెరుగుతున్నా సంపద సృష్టిపై దృష్టి సారించడం లేదు. కనీసం రెవెన్యూ మిగులు చూపించలేక పోయారు. ఆదాయం గోరంత పెరిగితే ఖర్చు కొండంత అవుతోంది. విద్య, వైద్య రంగాలపై ఖర్చు తగ్గిపోయింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యంతో పెద్ద ఎత్తున నిధులు స్తంభించిపోయాయి. మూలధన వ్యయం తగ్గిపోయింది. అదనంగా పెట్టిన ఖర్చుకు అసెంబ్లీ ఆమోదం తీసుకోకపోవడం శాసనసభ సాధికారతను తక్కువ చేయడమే..’అని 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక తప్పుబట్టింది. జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) చట్టానికి లోబడే అప్పులు తీసుకుంటున్నా ఏటేటా అప్పులు పెరిగిపోతున్నాయని, ప్రస్తుతమున్న అప్పుల్లో (రూ.89,228 కోట్లు) 46 శాతం ఏడేళ్లలో చెల్లించాల్సి ఉందని, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి భారమవుతుందని మంగళవారం ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ నివేదిక అభిప్రాయపడింది. నివేదికలోని ముఖ్యాంశాలివే.. రెవెన్యూ మిగులు చూపించని బడ్జెట్ ఇదే ►2019–20లో తెచ్చిన అప్పుల్లో 75 శాతం నిధులను గతంలో చేసిన అప్పులు తీర్చేందుకు వినియోగించారు. ఈ విధానం రాష్ట్రంలో సంపద సృష్టిపై ప్రభావం చూపనుంది. ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడే రాష్ట్రం అప్పులను తీసుకువస్తోంది. ఈ సంవత్సరంలో 97 శాతం ద్రవ్యలోటును మార్కెట్ రుణాలతోనే పూడ్చారు. గత ఐదేళ్ల కాలంలో రెవెన్యూ మిగులు చూపించని బడ్జెట్ ఇదే. ►అంతకు ముందు ఏడాదితో పోలిస్తే పోలిస్తే 2019–20 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ ఆదాయం రూ.1,124 కోట్లు (1.11%)పెరిగింది. అదే సమయంలో రెవెన్యూ ఖర్చు రూ.11,715 కోట్లు (12.07 శాతం) పెరిగింది. మూలధన వ్యయం తగ్గిపోయింది ►2018–19తో పోలిస్తే మూలధన వ్యయం చాలా తగ్గిపోయింది. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంతో పెద్ద ఎత్తున పెట్టుబడి స్తంభించిపోయింది. డిస్కంల నష్టాలను తగ్గించేందుకు గాను మార్చి, 2020 నాటికి ఉదయ్స్కీం కింద ఇస్తానన్న రూ.4,063.65 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ప్రజారుణం (మొత్తం అప్పు) 18.04 శాతం పెరిగింది. జీఎస్డీపీ పెరుగుదల 12.61తో పోలిస్తే కూడా ఇది ఎక్కువ. ►2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం చేసిన బడ్జెట్ ప్రతిపాదనలు వాస్తవ రూపంలోకి రాలేదు. బడ్జెట్ అమలు, పర్యవేక్షణ కూడా సరిగా లేదు. అనుబంధ గ్రాంట్లు, వినిమయాలు కూడా సరిగా లేవు. కొన్నింటికి సభ ఆమోదం కూడా పొందలేదు. రూ.84,650.99 కోట్లకు సభ ఆమోదం పొందాల్సి ఉంది. శాసనసభలో ఆమోదం పొందిన దాని కన్నా గత ఐదేళ్లుగా ఖర్చు ఎక్కువ అవుతుండడం ఆందోళన కలిగించే పరిణామం. ►సామాజిక–ఆర్థిక గ్రాంట్ల కింద చేసిన ప్రతిపాదనలో నాలుగు గ్రాంట్ల కింద ఖర్చు 50 శాతం మించలేదు. ఇది రాష్ట్ర సామాజిక–ఆర్థికాభివృద్ధికి అవరోధం కానుంది. తగ్గిన పన్నేతర ఆదాయం ►రాష్ట్ర పన్నుల ఆదాయం పెరుగుతున్నప్పటికీ అంతకుముందు ఏడాదితో పోలిస్తే పన్నేతర ఆదాయం తగ్గిపోయింది. 2019–20 ఆదాయంలో మొత్తం 7,360 కోట్లు (7%) పన్నేతర ఆదాయం కింద రాగా, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది రూ.2,647 కోట్లు తగ్గింది. ►వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కింద రావాల్సిన ఐజీఎస్టీ ఈ ఏడాదిలో రూపాయి కూడా కేంద్రం ఇవ్వలేదు. 2018–19తో పోలిస్తే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో రూ.2,753 కోట్లు తగ్గాయి. అటుదిటు..ఇటుదటు ►రెవెన్యూ ఖర్చు కింద చూపెట్టాల్సిన రూ.716 కోట్లను మూలధన వ్యయం కింద చూపెట్టారు. మూలధన వ్యయం కింద చూపెట్టాల్సిన రూ. 49.56 కోట్లను రెవెన్యూ వ్యయం కింద చూపెట్టారు. పీడీ అకౌంట్ల నిర్వహణ పారదర్శకంగా లేదు ►పీడీ అకౌంట్ల నిర్వహణ కూడా పారదర్శకంగా లేదు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వీటిని నిర్వహిస్తున్నారు. పీడీ అకౌంట్ల నుంచి నిధులను బ్యాంకులకు తరలించి అక్కడి నుంచి విత్డ్రా చేసుకుంటున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. ►అమాంబాపతు పద్దు (800) నిర్వహణ కూడా సక్ర మంగా లేదు. దీంతో కేటాయింపుల ప్రాధాన్యాలు, ఖర్చు లక్ష్యం కూడా అస్పష్టంగా మారిపోయింది. అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసిన నిధుల వినియోగ పత్రాలు(యూసీ) కూడా సమర్పించడం లేదు. ఇది ఆర్థిక నియమాల ఉల్లంఘనే. రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వ అకౌంటింగ్ ప్రమాణాలను ఇంకా పాటించాల్సి ఉంది. ఆర్థిక సంఘం అంచనాలు అందుకోలేదు ►15వ ఆర్థిక సంఘం అంచనాలను రాష్ట్రం అందుకోలేకపోయింది. పన్ను ఆదాయం కింద రూ.89,950 కోట్లు వస్తుందని ఆర్థిక సంఘం అంచనా వేయగా రాష్ట్ర ప్రభుత్వం రూ.69,329 కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించింది. కానీ, వచ్చింది మాత్రం రూ.67,957 కోట్లే. పన్నేతర ఆదాయం రూ. 12,354 కోట్ల మేర వస్తుందని ఆర్థిక సంఘం అంచనా వేస్తే, రూ.15,875 కోట్లను ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించగా, కేవలం రూ. 7,360 కోట్లు మాత్రమే వచ్చింది. ►విద్యుత్ సబ్సిడీల కింద ఇచ్చే మొత్తం ఈ ఏడాదిలో రూ. 167.48 కోట్లు పెరగ్గా, పౌరసరఫరాల సబ్సిడీలు రూ. 92 కోట్లు తగ్గాయి. -
ఓ తండ్రి ఆలోచన.. ఒకే ముహూర్తానికి ఆరు పెళ్లిళ్లు
ఈ హెడ్డింగ్కి అర్థం తెలుసుకోవాలంటే మనం కేరళకు వెళ్లాలి. అక్కడ ఒక తండ్రి తన కుమార్తెకు పెళ్లి చేయదలిచాడు. కాని పెళ్లికి అనవసర ఖర్చు వద్దనుకున్నాడు. కట్నం ఇవ్వకూడదనుకున్నాడు. ఆ డబ్బును సద్వినియోగం చేయాలనుకున్నాడు. కూతురి పెళ్లికి ఎంత డబ్బు దాచాడో ఆ మొత్తం డబ్బును అదే ముహూర్తానికి మరో ఐదు మంది అమ్మాయిల పెళ్లికి ఖర్చు చేశాడు. ఒకే ముహూర్తానికి ఆరు పెళ్ళిళ్లు జరిగాయి. ఈ ఆలోచన మనం చేయలేమా? అసలు పెళ్లికి ఖర్చు అవసరమా? పెళ్లి ఖర్చు అనే సామాజిక రుగ్మత నుంచి బయటపడలేమా? ఒక ఆలోచనాత్మక కథనం. ఇటీవల హైదరాబాద్ గోల్కొండ సమీపంలోని ఒక రిసార్ట్లో పెళ్లి జరిగింది. ఆ పెళ్లి ఖర్చు.. అంటే పెళ్లి జరిపేందుకు అయిన ఖర్చు 2 కోట్లు. ఈ మొత్తంలో లాంఛనాలు లేవు. ఇచ్చిపుచ్చుకున్న ఖర్చూ లేదు. కేవలం కల్యాణ మంటపానికి, భోజనానికి, అతిథి మర్యాదలకి, సంగీత్కి, అలంకరణలకి, అట్టహాసానికి అయిన ఖర్చు అది. ఆ రెండు కోట్లతో మధ్యతరగతి పెళ్లిళ్లు 20 అయినా చేయొచ్చు. పేద పెళ్ళిళ్లు 50 అయినా చేయొచ్చు. పెళ్లి ఇద్దరు స్త్రీ, పురుషులు కలిసే సంతోషకరమైన సందర్భం. దానిని సంతోషంగా చేసుకోవాల్సిందే. ఇరువురి ఆత్మీయులు హాజరవ్వాల్సిందే. కాని ఆ పెళ్లిని ఆసరా చేసుకుని తమ సంపదను, అహాన్ని, హోదాని, పలుకుబడిని నిరూపించాలనుకున్నప్పుడే పేచీ వస్తుంది. వెండి అంచు ఉన్న శుభలేఖలు, వాటితో పాటు ఇచ్చే పట్టుచీరలు, వస్తువులు, భోజనంలో ముప్పై నలభై వంటకాలు, ఖరీదైన వినోద కార్యక్రమాలు ఇవన్నీ పెళ్లి బడ్జెట్ను అమాంతం పెంచేస్తాయి. ఉన్నవారికి ఇదంతా తేలికే కావచ్చు. ఇమిటేట్ చేయాలనుకునే వారికి చిక్కొచ్చి పడుతుంది. ఇటీవల కేరళ లో అట్టహాసపు పెళ్ళిళ్లు, అందుకు పెళ్లికొడుకులు మారాము చేయడం, ఘనంగా చెప్పుకోవడానికి బైక్ దగ్గర కారు అడగడం, కట్నం దగ్గర ఆస్తులు అడగడం, అవి వీలు కాకపోతే భార్యను వేధించడం మామూలు అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల కన్నూరులో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. కన్నూరు సమీపంలోని ఎడచ్చేరీకి చెందిన సలీమ్, రుబీనా జంట తమ కుమార్తె రమీజా పెళ్లిని వినూత్నంగా చేయాలనుకున్నారు. గల్ఫ్లో ఉద్యోగం చేసే సలీమ్ తన కుమార్తె పెళ్లికి డబ్బు దాచి పెట్టాడు. కాని దానిని కట్నంగా ఇవ్వడం, అట్టహాసపు పెళ్లికి ఖర్చు పెట్టడం వద్దనుకున్నాడు. ఎలాగైనా సరే కట్నం అడగని పెళ్లికొడుకుని వెతికి పెళ్లి చేయాలి అని నిశ్చయించుకున్నాడు. అలాంటి వరుడే దొరికాడు. దాంతో అతనికి కట్నం డబ్బు మిగిలిపోయింది. దాంతో పాటు పెళ్లి అర్భాటంగా వద్దనుకున్నాడు కాబట్టి ఆ ఖర్చూ మిగిలింది. ఆ మొత్తం డబ్బుతో ఆర్థికంగా వెనుకబడిన ఐదుగురు అమ్మాయిలను ఎంపిక చేసుకుని వారికి అబ్బాయిలను వెతికి తన కుమార్తెకు పెళ్లి జరిగిన ముహూర్తానికే వారికీ పెళ్లి జరిపించాడు. అంతే మొత్తం ఆరు పెళ్ళిళ్లు ఒకే ముహూర్తానికి జరిపించాడు. ఇందులో ఇద్దరు వధువులు హిందువులు కావడంతో వారి పెళ్లి హైందవపద్ధతిలో జరిగింది. ఈ పెళ్ళిళ్లు జరిపించడంలో సలీమ్, రుబీనా దంపతులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ఐదుగురు అమ్మాయిలకు తగిన అబ్బాయిలను వెతికారు. అలాగే పెళ్లిలో సొంత కూతురితో పాటు మిగిలిన ఐదుగురికీ సమానంగా 10 సవరల బంగారం పెట్టారు. అందరికీ ఒకేరకమైన పట్టు చీరలు తెచ్చారు. ఇంత చక్కగా డబ్బును సద్వినియోగం చేయడం వల్ల ప్రశంసలు పొందారు. ఇందులో మతసామరస్యం కూడా ఉండటంతో పొగడ్తలు మరిన్ని వస్తున్నాయి. కాలం మారుతుంది. రెండు తీవ్రతలు కనిపిస్తున్నాయి. ఒకటి పెళ్లికి చాలా ఎక్కువగా ఖర్చు పెట్టడం...మరొకటి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కేవలం బొకేలు ఇచ్చి పుచ్చుకుని వియ్ ఆర్ మేరీడ్ అనుకోవడం. ఎవరి ఇష్టం వారిదే అయినా పెళ్లి ఖర్చును తగ్గించడం అనేది ఒక అవసరంగా పాటించడం ఆదర్శం అవుతుంది. ఆ ఆదర్శం అందరూ పాటించగలిగితే చాలా కుటుంబాలకు పెళ్లి భారం అనే ఆలోచన తప్పుతుంది. తద్వారా ఆడపిల్లలను కనేందుకు, ఆడపిల్లలను పెంచేందుకు జంకే పరిస్థితి పోతుంది. ‘అమ్మాయి పుడితే ఖర్చు’ అనే మాట ఇంకా ఎంత కాలం? ఆ ఖర్చు పెళ్లి వల్లే కదా? దానిని తేలిక చేయలేమా? సలీం వంటి ఆలోచనలు చేయలేమా? ఆలోచించాలి అందరం. పెళ్లి ఖర్చును తగ్గించడం అనేది ఒక అవసరంగా పాటించడం ఆదర్శం అవుతుంది. ఆ ఆదర్శాన్ని అందరూ పాటించగలిగితే చాలా కుటుంబాలకు పెళ్లి భారం అనే ఆలోచన తప్పుతుంది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement