-
ప్రయాణికులు అభ్యర్థించకపోయినా డబ్బు రీఫండ్!
విమాన ప్రయాణికులు ప్రత్యేకంగా అభ్యర్థించకపోయినా వారికి అందించాల్సిన రిఫండ్లను ఆటోమేటిక్గా చెల్లించాలని అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. చాలాసమయాల్లో విమానాలను రద్దుచేస్తుంటారు లేదా వాటిని ఏదో కారణాలతో మళ్లిస్తుంటారు. దాంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. దాంతోపాటు అప్పటికే వారు తీసుకున్న టికెట్ ధర తిరిగి చెల్లించేందుకు కొన్నిసార్లు విమాన సంస్థకు దరఖాస్తు చేసుకోవాలి. అయితే కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారికి ఆటోమేటిక్గా రీఫండ్ వచ్చేలా సదుపాయం కల్పిస్తున్నారు.కార్పొరేట్ల అనవసరపు రుసుముల నుంచి ప్యాసింజర్లను రక్షించేందుకే కొత్త నిబంధనలు తీసుకున్నట్లు బైడెన్ కార్యవర్గం బుధవారం తెలిపింది. విమానయాన సంస్థ ప్రయాణికులకు డబ్బు ఇవ్వాల్సి వచ్చినపుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి వెంటనే రీఫండ్ చేయాలని యూఎస్ రవాణా కార్యదర్శి పీట్ బుట్టిగీగ్ ఒక ప్రకటనలో తెలిపారు.కొత్త నిబంధనలు ఇలా..ప్రయాణికులు ప్రత్యేకంగా అభ్యర్థించకపోయినా వారికి అందించాల్సిన రిఫండ్లను ఆటోమేటిక్గా చెల్లించాలి.దేశీయ విమానాలు 3 గంటలు, అంతర్జాతీయ సర్వీసుల రాకపోకల్లో 6 గంటలు అంతరాయం ఉంటే రీఫండ్కు అర్హులు.మొదట కొనుగోలు చేసిన దాని కంటే తక్కువ తరగతికి డౌన్గ్రేడ్ చేయడం. ఉదాహరణకు ఫస్ట్ క్లాస్ నుంచి ఎకానమీకి పంపిస్తే రీఫండ్ పొందవచ్చు.ఏదైనా కారణాలవల్ల చేరుకునే లేదా బయలుదేరే విమానాశ్రయంలో మార్పులుంటే అర్హులు.దివ్యాంగులకు సరైన సౌకర్యాలు కల్పించకపోతే రీఫండ్ పొందవచ్చు.దేశీయ విమానాలు విమానాశ్రయంలో దిగాక నిర్దేషించిన సమయంలోపు బ్యాగేజ్ డెలివరీ చేయకపోతే ప్రయాణికులు తనిఖీ చేసిన బ్యాగ్ ఫీజు వాపసు పొందవచ్చు. విమానంలో వైఫై లేదా ఎంటర్టైన్మెంట్ వంటి సేవల కోసం ఎవరైనా డబ్బు చెల్లించి వాటిని పొందకపోతే తిరిగి తమ డబ్బును రీఫండ్ కోరవచ్చు.ఇదీ చదవండి: ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్2020లో కొవిడ్ మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో ఎయిర్లైన్స్, టిక్కెట్ ఏజెంట్లు ప్రయాణికుల రీఫండ్లను తిరస్కరించారని పెద్దమొత్తంలో ఫిర్యాదులు అందాయి. రీఫండ్ ఆలస్యం అవుతుందని కూడా కొందరు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అలా ఎయిర్లైన్స్ శాఖకు అందిన విమాన ప్రయాణ సర్వీస్ ఫిర్యాదుల్లో 87% రీఫండ్కు సంబంధించినవే ఉన్నట్లు సమాచారం. దాంతో స్పందించిన ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలులోకి తీసుకొచ్చింది. -
గగనవీధిలో పెరుగుతున్న ప్రయాణికులు.. ఒకే రోజు భారీ రికార్డు..
వేసవికాలం కావడంతో దేశంలోని చాలామంది సమ్మర్ సెలవులు, ఇతర విహారయాత్రలు చేస్తూంటారు. ఈ తరుణంలో ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. దాంతో దేశంలో విమాన ప్రయాణీకుల రద్దీ పెరుగుతోంది. ఒక్కరోజే దాదాపు 5 లక్షల మంది ప్యాసింజర్లు దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయాణించి రికార్డు నెలకొల్పారు. ఆదివారం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల మధ్య నడిచిన 6,128 విమాన సర్వీసుల్లో ఏకంగా 4,71,751 మంది ప్రయాణించినట్టు తేలింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తాజాగా వివరాలు వెల్లడించింది. కరోనాకంటే ముందు విమాన ప్రయాణీకుల సగటు (3,98,579)తో పోల్చితే ఇది 14 శాతం అధికం. గతేడాది ఏప్రిల్ 21న 5,899 విమాన సర్వీసుల్లో 4,28,389 మంది ప్రయాణించారు. ఈ ఏడాది జనవరి-మార్చిలో దేశీయ విమానయాన సంస్థల సర్వీసుల్లో ప్రయాణించినవారు 3.91కోట్లుగా ఉన్నట్టు గత వారం భారతీయ విమానయాన నియంత్రిత సంస్థ డీజీసీఏ తెలిపింది. గత ఏడాది ఇదే వ్యవధిలో ప్యాసింజర్లు 3.75కోట్లుగా ఉన్నారు. దీంతో వార్షిక వృద్ధి 4.38 శాతంగా నమోదైందని తెలిపింది. ఇదీ చదవండి: టాప్ 3 కంపెనీల్లో 64 వేలమందికి లేఆఫ్స్..! ‘ఆర్థికాభివృద్ధి, ప్రభుత్వ విధానాలు, అందుబాటు ధరల్లో విమాన సేవలందించే సంస్థలు విస్తరిస్తున్నాయి. రోజురోజుకూ సరికొత్త స్థాయికి ప్యాసింజర్ల సంఖ్య చేరుతుంది. భవిష్యత్తులో ఇది మరింత పెరుగనుంది’ అని విమానయాన మంత్రిత్వ శాఖ తన అధికారిక ‘ఎక్స్’(ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది. -
ఆకాశవీధిలో 15.4 కోట్ల ప్రయాణికులు
భారత్ నుంచి విదేశాలకు వెళ్లేవారితోపాటు డొమెస్టిక్ విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 2023-24లో అంతకుముందు ఏడాదితోపోలిస్తే 13 శాతం మేర ప్రయాణికుల రద్దీ పెరిగినట్లు ఇక్రా నివేదిక ద్వారా తెలిసింది. దాంతో 2023-24 ఏడాదిలో విమానాల్లో ప్రయాణించినవారి సంఖ్య 15.4 కోట్లకు చేరినట్లు నివేదికలో తెలిపింది. నివేదికలోని వివరాల ప్రకారం..కరోనాకు ముందు విమానాల్లో ఎంతమంది ప్రయాణించేవారో వారి సంఖ్యను తాజా గణాంకాలు అధిగమించాయి. 2019-20లో 14.2 కోట్ల మంది డొమెస్టిక్ విమానాల్లో ప్రయాణించారు. కేవలం 2024 మార్చిలోనే దేశీయ విమానాల్లో 1.35 కోట్ల మంది ప్రయాణించారని అంచనా. ఫిబ్రవరిలో ప్రయాణించిన 1.26 కోట్ల మంది కంటే ఈ సంఖ్య 6.9శాతం అధికం. ఏడాదివారీగా చూసినా 4.9 శాతం పెరిగింది. ఇదీ చదవండి: అలర్ట్.. 48 గంటల్లో యుద్ధం.. భారత వాణిజ్యంపై ప్రభావం ఎంతంటే.. దేశీయ విమానయాన పరిశ్రమకు 2022-23లో నికరంగా రూ.17,000కోట్లు-రూ.17,500 కోట్ల నష్టం వాటిల్లింది. అయితే అది 2023-24, 2024-25లలో రూ.3,000 కోట్లు-రూ.4,000 కోట్లకు పరిమితం కావొచ్చు. ఫిబ్రవరితో ముగిసిన 2023-24 తొలి 11 నెలల్లో దేశీయ విమాన సంస్థల్లో ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ 2.7 కోట్లుగా నమోదైంది. 2022-23 ఇదే సమయంతో పోలిస్తే ఇది 25% అధికంగా ఉంది. -
టికెట్ లేకుండా విమానం ఎక్కిన వ్యక్తి.. చివరికి ఏమైందంటే..
విమాన ప్రయాణం అంటే పకడ్బందీ తనిఖీలుంటాయి. అన్ని ధ్రువపత్రాలు సరిచూసి, స్కాన్ చేసి మరీ ప్రయాణికులను విమానంలోకి పంపిస్తారు. అలాంటిది వారి కళ్లుకప్పి టికెట్ లేకుండా ఓ వ్యక్తి రహస్యంగా విమానంలోకి ప్రవేశించిన ఘటన అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..ఇటీవల టెక్సాస్కు చెందిన 26 ఏళ్ల విక్లిఫ్ వైవ్స్ ఫ్లూరిజార్డ్ అనే వ్యక్తి పార్క్సిటీలోని ఉటాలో జరిగిన స్నోబోర్డింగ్ట్రిప్ కోసం వచ్చాడు. తాను వచ్చేపుడు తన స్నేహితుడి ‘బడ్డిపాస్’ ద్వారా ఉటా చేరుకున్నాడు. తిరిగి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలో తాను వెళ్లాలనుకున్న రెండు విమానాలు అప్పటికే ప్రయాణికులతో నిండిపోయాయి. దాంతో డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన వేరే విమానంలో ప్రయాణించాలనుకున్నాడు. అయితే తాను అప్పటికీ టికెట్ తీసుకోలేదు. విమానం కోసం లాంజ్లో వేచిచూస్తున్న ఇతర ప్రయాణికుల వివరాలు, టికెట్ ఫొటోలు వారికి తెలియకుండా దొంగతనంగా తన ఫోన్లో ఫొటోలు తీసుకున్నాడు. సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి ఎలాగోలా ముందే విమానం ఎక్కేశాడు. విమానం ఎక్కిన విక్లిఫ్ చివరి లావేటరీకి చేరుకున్నాడు. తాను ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. షెడ్యూల్ ప్రకారం విమానం బయలుదేరే సమయానికి సిబ్బంది ఇతర ప్రయాణిలను ఎక్కించారు. అప్పటి వరకు చివరి లావేటరీలో ఉన్న విక్లిఫ్ విమానం కదులుతుంటే సిబ్బంది వద్దకు చేరుకుని తన సీటు ఖాళీగా లేదన్నారు. దాంతో సిబ్బంది టికెట్ వివరాలు అడగ్గా తన సీటు నంబర్ 21 ఎఫ్ అని అటెండర్కి చెప్పాడు. అయితే ఆ సీటు కోసం టికెట్ కొన్న వ్యక్తి అప్పటికే అక్కడ కూర్చున్నాడని సిబ్బంది ధ్రువీకరించారు. ఇదీ చదవండి: వర్షం కురిస్తే ట్యాక్స్ కట్టాల్సిందే..! విమానం అప్పటికే రన్వేపైకి చేరుకుంది. వెంటనే సిబ్బంది గ్రౌండ్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తాను రహస్యంగా విమానంలో ప్రవేశించినట్లు తేలడంతో తనను ఫ్లైట్ నుంచి దింపేసి పోలీసులకు అప్పగించారు. విచారణ జరిపిన పోలీసులు తాను ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుని ఈ చర్యకు పాల్పడ్డాడని చెప్పారు. కేసు నమోదు చేసి ఉటా కోర్టుకు పంపించారు. ఎయిర్పోర్ట్లో తాను రహస్యంగా ఇతర ప్రయాణికుల నుంచి దొంగతనంగా ఫొటోలు తీసుకోవడం సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ వివరాలను పోలీసులు కోర్టులో సమర్పించినట్లు తెలిసింది. కోర్టు ఆదేశాల మేరకు పూర్తి విచారణ జరిపి పోలీసులు విక్లిఫ్ను సాల్ట్ లేక్ కౌంటీ మెట్రో జైలుకు తరలించారు. -
విమానం ల్యాండింగ్ సమయంలో ట్రే టేబుల్ ఎందుకు మూసివేయాలి?
ఈ రోజుల్లో చాలామంది దూర ప్రయాణాలు చేసేటప్పుడు సమయం ఆదా అవుతుందనే ఉద్దేశంతో విమాన ప్రయాణాలను ఎంచుకుంటున్నారు. అయితే విమాన ప్రయాణం చేసేటప్పుడు పలు నిబంధనలు పాటించాలని ఎయిర్ హోస్టెస్లు చెబుతుంటారు. విమాన ప్రయాణంలో ధూమపానం చేయకూడదు, సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇలాంటి నిబంధనలలో ల్యాండింగ్ సమయంలో ట్రే టేబుల్ను మూసివేయాలని కూడా చెబుతారు. అయితే ఇలా ఎందుకు చేయాలి? ట్రే టేబుల్ మూసివేయకపోతే ఏమైనా జరుగుతుందా? ఎయిర్ హోస్టోస్ హన్నా టెస్సన్(23) అమెరికాలోని కొలరాడోలో ఉంటున్నారు. విమానం ల్యాండింగ్ సమయంలో ప్రయాణికులు ట్రే టేబుల్ ఎందుకు మూసివేయాలనే విషయాన్ని ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రయాణికులు తాము చెప్పే సూచనలను పాటించనప్పుడు కోపం వస్తుందని అన్నారు. ప్రయాణీకులు టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో ట్రే టేబుల్ మూసివేయాలని చెప్పినా, వెంటనే అమలు చేయరని ఆమె తెలిపారు. ఇలాంటి ఈ నిబంధనలను విమాన ప్రయాణికులు తప్పని సరిగా తెలుసుకోవాలని ఆమె అన్నారు. హన్నా తెలిపిన వివరాల ప్రకారం.. విమాన ప్రమాదాలు చాలావరకూ ల్యాండింగ్ లేదా టేకాఫ్ సమయంలో జరుగుతాయి. అటువంటి పరిస్థితిలో ఓపెన్ ట్రే టేబుల్ కారణంగా ప్రయాణికులు గాయపడే అవకాశముంది. అందుకే ట్రే టేబుళ్లను మూసి వేయాలని ప్రయాణికులకు ఎయిర్ హోస్టెస్లు చెబుతుంటారు. ఆహారం అందించడం ఒక్కటే తమ పని కాదని, ప్రయాణికుల భద్రతను చూడటం కూడా తమ పనే అని హన్నా తెలిపారు. విమానం టేకాఫ్ చేయడానికి ముందు విమానంలోని భద్రతా పరికరాలను తనిఖీ చేస్తామని, అంతే కాకుండా ప్రయాణికుల వింత ప్రవర్తనపై కూడా నిఘా ఉంచుతామన్నారు. ఎవరైనా ప్రయాణికులు ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తే వెంటనే అవసరమైన చర్యలు చేపడతామన్నారు. -
Australia to New Zealand: గాల్లో కుదిపేసిన విమానం
సిడ్నీ: ఆ్రస్టేలియా నుంచి చిలీకి వెళ్తున్న ఒక విమానం మార్గమధ్యంలో ఒక్కసారిగా కుదుపులకు లోనై ప్రయాణికులకు చుక్కలు చూపించింది. విమాన ప్రయాణికులు కుదుపులకు సీట్లలోంచి చెల్లాచెదురుగా పడి గాయాలపాలయ్యారు. విమానంలో తలెత్తిన ఒక సాంకేతికత సమస్య దీనికి అసలు కారణం. దాదాపు 50 మంది ప్రయాణికుల రక్తం కళ్లజూసిన ఈ ఎల్ఏ800 లాటన్ విమానం.. ఘటనకు ముందు సిడ్నీ నుంచి చిలీ దేశంలోని శాండిగో నగరానికి సోమవారం బయల్దేరింది. మార్గమధ్యంలో షెడ్యూల్ ప్రకారం ఆక్లాండ్లో దిగాలి. ఆ లోపే ఆకాశంలో కుదుపులకు లోనైందని ఎయిర్లైన్స్ వెల్లడించింది. విమానంలో గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించేందుకు అక్లాండ్ ఎయిర్పోర్ట్ వద్ద 10 అత్యయిక వాహనాలను సిద్ధంగా ఉంచారు. విమానం ఎయిర్పోర్ట్లో దిగగానే గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రులకు తరలించారు. అందరికీ మోస్తరు దెబ్బలే తగిలాయి. ఒక వ్యక్తికి మాత్రం తీవ్రమైన గాయాలయ్యాయని ఎయిర్లైన్స్ సంస్థ పేర్కొంది. -
ఎకానమీ క్లాస్లో సూపర్ స్టార్.. వీడియో వైరల్!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల లాల్ సలామ్ సినిమాలో మెప్పించారు. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో కీ రోల్ పోషించారు. గతనెల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఆయన ప్రస్తుతం వెట్టైయాన్ చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాకు టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా తలైవా కడప ఎయిర్పోర్ట్లో మెరిశారు. ఓ సామాన్యుడిలా ఎకానమీ క్లాస్లో దర్శనమిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన తలైవా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దటీజ్ సూపర్ స్టార్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఓ ప్రయాణికుడు ట్విటర్లో రాస్తూ.. నేను దేవుడికి అత్యంత సన్నిహితంగా ఉన్నాను అంటూ పోస్ట్ చేశాడు. అదే ఫ్లైట్లో ఉన్న నటుడు జీవా కూడా ఉన్నారు. ఆ తర్వాత రజనీకాంత్ బస్సులో ప్రయాణిస్తున్న వీడియోను నటుడు జీవా తన ఇన్స్టాలో షేర్ చేశారు. రజనీకాంత్, జీవా బస్సులో నిలబడి ఉన్న ఫోటోలు, వీడియోలు కూడా వైరలయ్యాయి. సీసీఎల్ కోసం చెన్నై రైనోస్ టీమ్తో కలిసి వీరిద్దరు బస్సులో వెళ్లారు. View this post on Instagram A post shared by Jiiva (@actorjiiva) #Thalaivar at flight ❤️❤️❤️❤️#Rajinikanth | #Rajinikanth𓃵 | #SuperstarRajinikanth | #SuperStarRajinikanth𓃵 | #Jailer | #Thalaivar171 | #Jailer2 | #Vettaiyan | #superstar @rajinikanth pic.twitter.com/b443yrgcU0 — Suresh balaji (@surbalutwt) February 29, 2024 -
ఫ్లైట్ ఎక్కుతున్నారా? అయితే ఈ రీచార్జ్ ప్లాన్స్ తెలుసుకోండి..
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లు మనిషి జీవితంలో భాగమైపోయాయి. వీటిని వినియోగించకుండా నిమిషాలు కూడా ఉండలేని పరిస్థతి. విమాన ప్రయాణంలో సాధారణ రీచార్జ్ ప్లాన్లు పనిచేయవని మనందరికీ తెలుసు. ప్రత్యేక రీచార్జ్ ప్లాన్లు ఉంటేనే ఫ్లైట్లో ఉన్నంత సేపూ కాలింగ్ కానీ, ఇంటర్నెట్ కానీ వినియోగించుకునేందుకు వీలుంటుంది. టెలికాం ఆపరేటర్లు ఎయిర్టెల్, రిలయన్స్ జియో కొన్ని ఇన్-ఫ్లైట్ రీచార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇవి ఫ్లైట్లో ఉన్నప్పుడు యూజర్లు కనెక్ట్ అయి ఉండేందుకు వీలు కల్పిస్తాయి. ఈ ప్లాన్లు డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలను అందిస్తాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ అందిస్తున్న ఇన్-ఫ్లైట్ ప్లాన్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. జియో రూ.195 ప్లాన్ డేటా: 250MB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు జియో రూ. 295 ప్లాన్ డేటా: 500MB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు జియో రూ. 595 ప్లాన్ డేటా: 1GB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు ఎయిర్టెల్ రూ.195 ప్లాన్ డేటా: 250MB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు ఎయిర్టెల్ రూ. 295 ప్లాన్ డేటా: 500MB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు ఎయిర్టెల్ రూ. 595 ప్లాన్ డేటా: 1GB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు -
విమాన ప్రయాణికులకు టాటా గ్రూప్ బంపరాఫర్!
విమాన ప్రయాణికులకు టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ శుభవార్త చెప్పింది. చెక్ ఇన్ బ్యాగేజీ లేకుండా ప్రయాణించడానికి ఇష్టపడే ప్రయాణీకులకు తగ్గింపు ధరలలో టికెట్ల ధరలను అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఎక్స్ప్రెస్ లైట్ ద్వారా ప్రయాణికులు సాధారణ ఛార్జీల కంటే తక్కువ ధరలో విమాన టికెట్లను పొందవచ్చు. ఎక్స్ ప్రెస్ చెక్ ఇన్ ఫ్లయర్ కౌంటర్లు, బ్యాగేజీ బెల్ట్ వద్ద క్యూలను నివారించేందుకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా బుక్ చేసుకుంటే 15 కిలోలు, 20 కిలోల చెక్ ఇన్ బ్యాగేజీలపై డిస్కౌంట్ వస్తుందని తెలిపింది. ఎక్స్ప్రెస్ లైట్ ఛార్జీలపై ప్రయాణించే ప్రయాణికులు కాంప్లిమెంటరీ కింద అదనంగా 3 కిలోల బ్యాగేజీని ఫ్రీగా బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఎయిర్ పోర్ట్ ఎయిర్ లైన్ కౌంటర్లలోని ప్రయాణికులు చెక్ ఇన్ బ్యాగేజీ సేవలను వినియోగించుకోవచ్చని ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
‘వాటే లాజిక్ .. వాటే లాజిక్’.. ఇండిగో!
ఇటీవల కాలంలో పలు విమాన సంస్థలు ప్రయాణికులకు అందించే సేవలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఆహారంలో బొద్దింకలు, రాళ్లు ప్రత్యక్షమవుతున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఆయా ఘటనలపై సదరు విమానయాన సంస్థలు క్షమాపణలు చెప్పడం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) జరిమానాలు విధిస్తున్నాయి. కానీ విమానయాన సేవల్లో ఎలాంటి మార్పులు రావడం లేదు. తాజాగా ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలు కొనుగోలు చేసిన శాండ్విచ్లో స్క్రూ ప్రత్యక్షమవ్వడంతో నెవ్వెరపోయింది. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. జ్యోతి రౌతేలా ఫిబ్రవరి 1న బెంగళూరు నుండి చెన్నైకి ఇండిగో ఫ్లైట్లో బయలుదేరింది. విమానంలోనే స్పినాచ్ కార్న్ చీజ్ శాండ్విచ్ను ఆర్డర్ పెట్టుకుంది. ఆ శాండ్ విచ్ను తినడకుండా అలాగే జర్నీ చేసింది. Got a screw in my sandwich byu/MacaroonIll3601 inbangalore సరిగ్గా చెన్నై విమానశ్రయంలో దిగిన తర్వాత జ్యోతి రౌతేలాను అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ భద్రతా తనిఖీల్లో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇండిగో ఫ్లైట్లో ఆర్డర్ పెట్టిన శాండ్విచ్లో బోల్ట్ ఉండడం చూసి కంగుతిన్నది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావించారు. సంబంధిత విభాగంపై చర్యలు తీసుకోవాలని ఇండిగో అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇండిగో అధికారులు మాత్రం .. మీరు విమాన ప్రయాణంలో శాండ్ విచ్ తిని ఉంటే చర్యలు తీసుకోనే వాళ్లం. కానీ మీరు విమానం దిగిన తర్వాత శాండ్ విచ్లో బోల్ట్ ఉందని ఫిర్యాదు చేస్తే లాభం లేదని చెప్పడంతో నిర్ఘాంతపోయినట్లు చెప్పారు. ఈ విషయంపై నెటిజన్ల ఇండిగో తీరును విమర్శిస్తున్నారు. ప్రయాణికుల పట్ల ఇండిగో బాధ్యతా రహితంగా వ్యవహరించడం సరికాదని హితువు పలుకుతున్నారు. -
బంపరాఫర్.. రూ. 1799కే ఫ్లైట్ జర్నీ!
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా బంపరాఫర్ ప్రకటించింది. వన్వే టికెట్ డొమెస్టిక్ రూట్లలో రూ. 1,799, అంతర్జాతీయ రూట్లలో రూ. 3,899 నుంచి ప్రారంభమయ్యే నెట్వర్క్-వైడ్ సేల్ను ప్రారంభించింది . ఎయిర్ ఇండియా నమస్తే వరల్డ్ సేల్ పేరిట పరిమిత-కాల నెట్వర్క్-వ్యాప్త ఆఫర్ను ఫిబ్రవరి 2న ప్రారంభించింది. ఇది ఫిబ్రవరి 5 వరకు చెల్లుబాటులో ఉంటుంది. దీంతోపాటు ఎయిర్ ఇండియా వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా చేసే బుకింగ్ చేస్తే ఈ ఆఫర్పై కన్వీనియన్స్ ఫీజు కూడా మినహాయించనున్నట్లు ఎయిర్ఇండియా ఒక విడుదలలో తెలిపింది. షరతులు ఇవే.. ఎయిర్ ఇండియా నమస్తే వరల్డ్ సేల్ కింద బుకింగ్లు కేవలం నలుగురికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 2 నుంచి సెప్టెంబర్ 30 మధ్య చేసే ప్రయాణాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఫిబ్రవరి 5వ తేదీ లోపు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దేశీయ మార్గాల్లో అన్నీ కలుపుకొని వన్-వే ఎకానమీ క్లాస్ ఛార్జీలు రూ.1,799 నుంచి ప్రారంభమవుతాయి. అయితే వన్-వే బిజినెస్ క్లాస్లో ఇది రూ. 10,899. ఇక అంతర్జాతీయ మార్గాల్లో వన్-వే ఎకానమీ క్లాస్ ఛార్జీలు రూ. 3,899 నుంచి ప్రారంభమవుతాయి. ఈ సేల్ అందుబాటులో ఉన్న సీట్లు పరిమితంగా ఉంటాయి. ముందుగా బుక్ చేసుకున్నవారికి సీట్లు లభిస్తాయని ఎయిర్ లైన్స్ తెలిపింది. ఎయిర్ ఇండియా వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు చేసిన టిక్కెట్లపై కన్వీనియన్స్ ఫీజు ఆదా చేసుకోవచ్చు. దేశంలోని పలు నగరాలతో పాటు యూఎస్, కెనడా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, గల్ఫ్ & మిడిల్ ఈస్ట్, ఆసియా పసిఫిక్, దక్షిణ ఆసియాలో ఎయిర్లైన్ నిర్వహించే గమ్యస్థానాలకు తగ్గింపు ధరలు అందుబాటులో ఉంటాయి. -
అందులో కోటి 30 లక్షల మంది ప్రయాణం..
సామాన్యులకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం ఉడాన్ యోజన(ఉడే దేశ్కా అమ్ నాగరిక్) పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా విమానయాన కంపెనీలకు కొన్ని రాయితీలు ఇస్తోంది. కేంద్రం ఇచ్చే రాయితీ గడువు ముగిసిన తర్వాత కొన్ని సర్వీసులు ఆగిపోయాయనే వాదనలు ఉన్నాయి. కొన్ని అంతకు ముందు నిలిచిపోయినట్లు తెలిసింది. అయితే తాజాగా కేంద్రం రూట్లను తగ్గించి విమానాలు నడుపుతున్నారని పలువురు భావిస్తున్నారు. దాంతో సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. చాలా పార్టీల నేతలు వాటిపై ఎలాంటి ప్రశ్నలు అడగడంలేదు. అయితే తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాధిత్యసింథియా స్పందించారు. ఇప్పటికే కోటి 30 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారని తెలిపారు. ‘దేశ వ్యాప్తంగా ప్రభుత్వం కేటాయించిన రూట్లలో మూడేళ్ల కన్సెషన్ గడువు ముగిసింది. దాంతో కేవలం 7 శాతం (54 రూట్లు) మాత్రమే కార్యకలాపాలు సాగుతున్నట్లుగా కాగ్ నివేదిక వెల్లడిస్తోంది. మిగిలిన రూట్లు కన్సెషన్ గడువు వరకు కూడా ఎందుకు మనుగడ సాగించలేకపోయాయి’ అంటూ సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. ‘ఉడాన్ యోజన పథకం ద్వారా ఇప్పటి వరకు కోటి 30 లక్షల మంది విమాన ప్రయాణం చేశారు. దేశ వ్యాప్తంగా 76 ఎయిర్పోర్టులు ఉడాన్ యోజనలో భాగంగా ఉన్నాయి. ఈ స్కీం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) వల్ల ఇప్పటి వరకు 2 కోట్ల 75 లక్షల విమాన ప్రయాణాలు జరిగాయి. విమానయాన ప్రయాణానికి దూరంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేయబడ్డాయి. ఈ రాష్ట్రాల్లో కొత్తగా 9 ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరిగింది. అందులో 6 ఎయిర్పోర్ట్లు కేవలం ఉడాన్ యోజన కిందే ఏర్పాటయ్యాయి. ఈ పథకం కింద ఆయా రూట్లలో విమానాలు నడిపే సంస్థలకు మూడేళ్లపాటు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ను చెల్లించాలని ప్రతిపాదించాం. దాంతో ఈ పథకం ద్వారా మొదట్లో వేయి రూట్లను లక్ష్యంగా చేసుకున్నాం. ఇందులో 74 రూట్లలో మూడేళ్ళ కాల వ్యవధి తర్వాత కూడా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అయితే మూడేళ్ల తర్వాత గిట్టుబాటు కాని రూట్ల స్థానాల్లో కొత్త రూట్లను గుర్తిస్తున్నాం. ప్రజలు విమాన ప్రయాణానికి అలవాటు పడుతున్న కొద్దీ ఈ రూట్ల సంఖ్య కూడా పెరుగుతుంది. 1920లో కోటి 44 లక్షలు ఉన్న విమాన ప్రయాణికుల సంఖ్య 2030 నాటికి 42 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నాం’అని మంత్రి వివరించారు. దేశంలో ఇటీవల నెలకొన్న ప్రత్యేకపరిస్థితుల వల్ల గరిష్ఠంగా ఒకరోజు 4 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. కొవిడ్కు ముందు 2019 లెక్కల ప్రకారం దేశీయంగా నడిచే విమానాల్లో వారానికి దాదాపు 90 వేల మంది ప్రయాణించారని సమాచారం. ఇదీ చదవండి: ప్రపంచంలోనే నాసా కంటే ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్..! కానీ.. ఏపీలో గతంలో మొత్తం 4 రౌండ్ల బిడ్డింగ్ తర్వాత 40 ఉడాన్ రూట్లను గుర్తించారు. ఉడాన్ రూట్లలో భాగంగా కడప, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్నూలు, ప్రకాశం బ్యారేజి (సీ ప్లేన్) నుంచి విమాన సర్వీసులకు అనుమతులు మంజూరయ్యాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలతో పాటు బెలగాం, కొల్హాపూర్, హుబ్లి, జగ్దల్పూర్, కలబురిగి (గుల్బర్గా), కలైకుండ ప్రాంతాల నుంచి విమాన సర్వీసులు నడిపేలా ఆమోదం తెలిపారు. -
రైల్లో సీటు కింద... విమానంలో నెత్తి మీద
‘కౌన్ బనేగా కరోడ్పతి’ తాజా సీజన్ లో కోల్కతాకు చెందిన ఒక గృహిణి తాను నవ్వడమే కాక అమితాబ్ను విపరీతంగా నవ్వించింది. కేబీసీ వల్ల మొదటిసారి విమానం ఎక్కిన ఆమె రైల్లోలాగా చీటికి మాటికి సీటు కింద చూసుకుంటూ లగేజీ ఉందా లేదాననే హైరానా విమానంలో లేకపోవడం తనకు నచ్చిందని చెప్పింది. ఇంకా సరదా కబుర్లు చెప్పి అమితాబ్ను నవ్వించిన అలోకిక భట్టాచార్య వైరల్ వీడియో గురించి.... సోనీ టీవీలో ప్రసారమవుతున్న ‘కౌన్ బనేగా కరోడ్పతి’ తాజా సిరీస్ తాజా ఎపిసోడ్లో కోల్కటాకు చెందిన అలోకిక భట్టాచార్య అనే గృహిణి అమితాబ్నే కాక ప్రేక్షకులను చాలా నవ్వించింది. ఆమె క్లిప్పింగ్ను అమితాబ్తో పాటు ఇతరులు ‘ఎక్స్’లో షేర్ చేయడంతో నెటిజన్లు ముచ్చటపడుతున్నారు. గత 17 ఏళ్లుగా ప్రయత్నిస్తే ఇప్పటికి కేబీసీలో పాల్గొనే అవకాశం దొరికిన అలోకిక ‘జై కేబీసీ’ నినాదంతో హాట్సీట్లో కూచుంది. ‘మీ ప్రయాణం ఎలా సాగింది?’ అని అమితాబ్ అడిగితే ‘కేబీసీ పుణ్యమా అని మొదటిసారి విమానం ఎక్కాను. మాలాంటి వాళ్లం రైలెక్కి ప్రతి పది నిమిషాలకూ ఒకసారి సీటు కింద లగేజ్ ఉందా లేదా చూసుకుంటాం. అర్ధరాత్రి మెలకువ వచ్చినా మొదట సీటు కిందే చూస్తాం. విమానంలో ఆ బాధ లేదు. లగేజ్ నెత్తి మీద పెట్టారు. పోతుందనే భయం వేయలేదు’ అనేసరికి అమితాబ్ చాలా నవ్వాడు. ‘కేబీసీ వాళ్లు ఎలాంటి ప్రశ్నలు వెతికి ఇస్తున్నారంటే నేనసలు ఏమైనా చదువుకున్నానా అని సందేహం వస్తోంది’ అని నవ్వించిందామె. ‘నువ్విలా నువ్వుతుంటే మీ అత్తగారు ఏమీ అనదా?’ అంటే ‘అంటుంది. కాని నేను నా జీవితంలో జరిగిన మంచి విషయాలు గుర్తు తెచ్చుకుని ఎప్పుడూ నవ్వుతుంటాను. అదే నా ఆరోగ్య రహస్యం. మూడు పూటలా అన్నం, పప్పు, చేపలు తింటూ కూడా సన్నగా ఎలా ఉన్నానో చూడండి. ఫ్రీగా. కొంతమంది ఇలా ఉండటానికి డబ్బు కట్టి జిమ్ చేస్తుంటారు’ అని నవ్వించిందామె. అలోకిక ఈ ఆటలో పన్నెండున్నర లక్షలు గెలిచి ఆట నుంచి విరమించుకుంది. ఆ మొత్తం ఆమెకు చాలా ముఖ్యమైనదే. కాని అమితాబ్తో నవ్వులు చిందించడం అంతకంటే ముఖ్యంగా ఆమె భావించింది. This clip of #KBC is so very endearing! Her innocent, Joyous State of being is infectious. @SrBachchan Sahab is equally amazing.. Now Watch it and get infected with Joy! pic.twitter.com/5ylvrUGhlH — Adil hussain (@_AdilHussain) December 1, 2023 -
14 వేల అడుగుల ఎత్తునుంచి జారిపడిన స్కైడైవర్.. కాపాడిన అగ్ని చీమలు!
స్కైడైవింగ్కు ప్రయత్నించే ధైర్యం అందరికీ ఉండదు. ఈ ఫీట్ చేసేందుకు కొందరు సిద్ధమైనా.. మధ్యలో పారాచూట్ విఫలమైతే ఏమైపోతామోనని భయపడిపోతారు. ఈ భయంతోనే స్కై డైవింగ్కు దూరంగా ఉంటారు. అయితే స్కైడైవింగ్ చేసేటప్పుడు పారాచూట్ విఫలం కావడం అనేది చాలా అరుదు. స్కైడైవర్ల కోసం తయారైన పారాచూట్లు వంద శాతం మేరకు తెరుచుకుంటాయి. అయితే దీనికి విరుద్ధమైన పరిస్థితి జోన్ ముర్రే అనే మహిళకు ఎదురయ్యింది. అత్యంత విచిత్ర పరిస్థితుల్లో ఆమె ప్రాణాలతో బయటపడింది. అది 1999, సెప్టెంబర్ 25.. జోన్ ముర్రే(40) అనే మహిళ స్కైడైవింగ్కు దిగింది. 14,500 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం నుండి పారాచూట్ సాయంతో దూకేందుకు ప్రయత్నించింది. అయితే ఆ పారాచూట్ తెరుచుకోలేదు. అలాగే ఆమెకు సాయం అందించాల్సిన సెకండరీ పారాచూట్ కూడా విఫలమైంది. ఫలితంగా ముర్రే గంటకు ఎనభై మైళ్ల వేగంతో భూమిపైకి దూసుకొస్తూ అగ్ని చీమల దండుపై పడింది. అయితే ఈ అగ్ని చీమలే ఆమెను కాపాడాయి. అపస్మారక స్థితికి చేరిన ఆమెపై ఆ అగ్ని చీమలు దాడి చేశాయి. ఈ దాడి కారణంగానే ఆమె బతికి బట్టకట్టిందంటే ఎవరూ నమ్మలేరు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆ అగ్ని చీమల దాడికి ముర్రే శరీరంలోని నరాలు ఉత్తేజితమయ్యాయి. ఆమె గుండె కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి వెళ్లే వరకు అగ్ని చీమలు ఆమె ప్రాణాలతో ఉండేలా సహాయపడ్డాయి. ఆసుపత్రిలో ముర్రే రెండు వారాల పాటు కోమాలో ఉంది. వైద్యులు ఆమె ప్రాణాన్ని నిలిపి ఉంచేందుకు పలు ఆపరేషన్ల చేయవలసి వచ్చింది. అయితే ఈ ఘటనలో ఆమె ప్రాణాలను అగ్ని చీమలే కాపాడాయని చెప్పకతప్పదు. ఇది కూడా చదవండి: అడవిలో వృద్ధుడు గల్లంతు.. 48 గంటలు గడిచాక.. The story of Joan Murray, who survived a 4,500 meter fall when her main parachute failed while skydiving. She landed in a fire ant mound where numerous venomous stings caused an adrenaline rush to keep her heart beating long enough for doctors to assist https://t.co/YUMFGJCXX6 pic.twitter.com/GOPpFwKjqB — Massimo (@Rainmaker1973) May 13, 2020 -
హైదరాబాద్ నుంచి అమృత్సర్కు విమాన సేవలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి మరో నాలుగు నగరాలకు విమాన సర్విసులు అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సహకారంతో దేశీయ విమానయాన సేవలను విస్తరించినట్లు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు తెలిపారు. వీటిలో మూడు నగరాలకు శుక్రవారం నుంచి (17వ తేదీ) సర్విసులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి అమృత్సర్కు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం (ఐగీ 954) రోజూ ఉదయం 07:30కి హైదరాబాద్ నుంచి బయల్దేరి 10.15కి అమృత్సర్కు చేరుకుంటుంది. ఇక లక్నో–హైదరాబాద్ మధ్య వారానికి ఆరు సర్విసులు అందుబాటులో ఉంటాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (ఐగీ 953) హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2.30కి బయల్దేరి సాయంత్రం 4.35కి లక్నోకు చేరుకుంటుంది. అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ( ఐగీ 955) ప్రతీరోజు సాయంత్రం 7.45 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి రాత్రి 9.30 గంటలకు కొచ్చిన్కు చేరుకుంటుంది. గ్వాలియర్కు ఆరు సర్విసులు నవంబర్ 28 నుంచి హైదరాబాద్–గ్వాలియర్ మధ్య వారానికి మూడు సర్విసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విమానం హైదరాబా ద్ నుంచి మధ్యాహ్నం 2.30కి బయల్దేరి సాయంత్రం 4.20కి గ్వాలియర్ చేరుకుంటుంది. ఈ సందర్భంగా జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈవో ప్రదీప్ ఫణిక్కర్ మాట్లాడుతూ...ఈ మార్గాల్లో మెరుగైన అనుసంధానం కోసం కొత్త విమానాలు దోహదం చేయనున్నాయని చెప్పారు. -
ఆకాశ ఎయిర్లైన్స్ సంచలన నిర్ణయం
దేశీయ విమానయాన రంగం సంస్థ అయిన ఆకాశ ఎయిర్ త్వరలో అంతర్జాతీయ రూట్స్లో విమానాలు నడపనుంది. అందుకు అనువుగా ఫ్లైట్స్ ఆర్డర్ పెట్టనున్నట్లు కంపెనీ సీఈఓ వినయ్దూబే తెలిపారు. సంస్థ ప్రస్తుతం 4.2 శాతం మార్కెట్ వాటాతో కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రాకేశ్ ఝన్ఝన్వాలా పెట్టుబడి పెట్టిన ఆకాశ ఎయిర్ త్వరలో అంతర్జాతీయ రూట్స్లో ప్రయాణించడానికి సిద్ధపడుతోంది. దీనికి తోడు స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసేందుకూ ప్రయత్నిస్తున్నామని ప్రకటించారు. ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, దిల్లీతో సహా 16 దేశీయ గమ్యస్థానాలకు ఆకాశ తన సేవలు అందిస్తోంది. ఈ ఎయిర్ లైన్స్ వారానికి 750 కంటే ఎక్కువ విమానాలను నడుపుతోంది. కాగా ఈ దశాబ్దం చివరి నాటికి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్గా మార్కెట్లలో లిస్ట్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అంతర్జాతీయ సేవలను ప్రారంభించాలని చూస్తోంది. 76 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కోసం ఇప్పటికే ఆర్డర్ చేయగా.. 2027 మధ్య నాటికి ఇవి డెలివరీ అవుతాయని బావిస్తోంది. ప్రస్తుతం ఆకాశ ఎయిర్కు 20 విమానాలు ఉన్నాయి. -
విమానంలో తల్లికి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చిన కొడుకు.. వీడియో వైరల్
అమ్మను స్కూటర్లో కూచోబెట్టి తిప్పేవాళ్లున్నారు. కార్లలో తిప్పేవాళ్లున్నారు. కాని విమానంలో తిప్పేవాళ్లు... అదీ విమానం నడుపుతూ తిప్పేవాళ్లు కొంచెం అరుదు. ఈ తల్లికి తన కుమారుడే తను ప్రయాణిస్తున్న ఫ్లయిట్కి పైలెట్ అని తెలియదు. కాని తెలిసి గొప్పగా ఆనందించింది. మురిసిపోయింది. నెటిజన్లు కూడా భలే ముచ్చటపడ్డారు. అది ఇండిగో విమానం. కొచ్చి నుంచి బయలుదేరబోతోంది. ఒకామె అదే ఫ్లయిట్లో చాలా క్యాజువల్గా ఎక్కింది. ఇంతలో ‘అమ్మా’ అనే పిలుపు. తిరిగి చూస్తే కాక్పిట్ నుంచి బయటికొచ్చి నిలబడిన పైలెట్. ‘హార్ని.. నువ్వేనా’ అని ఆమె సంబరంగా నోరు తెరిచేసింది. ఎందుకంటే ఆ పైలెట్ ఆమె కొడుకే. అతని పేరు విమల్ శశిధరన్. తను ప్రయాణించే ఫ్లయిట్కి కొడుకే పైలెట్ అని తెలిసిన తల్లి సంతోషంగా కొడుకును హగ్ చేసుకుంది. ఆ స్వీట్ సర్ప్రయిజ్కి మురిసిపోయింది. కొచ్చికి చెందిన విమల్ శశిధరన్ ఇదంతా వీడియో తీయించి ఇన్స్టాలో ΄ోస్ట్ చేశాడు. ‘ఇలాంటి క్షణాలే జీవితాన్ని అత్యధ్భుతం చేస్తాయి’ అని కామెంట్ చేశాడు. ఆ వీడియోలో కన్నకొడుకు ఉన్నతి చూసి గర్వపడే తల్లిని, తల్లిని ఆనందపరిచే కొడుకును చూసి నెట్లోకం పులకించింది. కామెంట్లు, లైక్లు మామూలే. ‘మీ అమ్మ వయసులో చిన్నదిగా కనిపిస్తోంది. పిల్లలు బాగా చూసుకుంటే తల్లిదండ్రుల వయసు తగ్గుతుంది’ అని ఒకరు రాస్తే ‘ఆ అమ్మ నవ్వు ఎంత బాగుంది’ అని మరొకరు రాశారు. ఏమైనా అమ్మను విమానంలో కూచోబెట్టి తానే నడిపి తిప్పే అదృష్టం ఎంతమందికొస్తుంది చెప్పండి. View this post on Instagram A post shared by Vimal Sasidharan (@iflya320) View this post on Instagram A post shared by People of India (@officialpeopleofindia) -
నా జీవితంలో తొలిసారి ఇలా.. జగపతి బాబు పోస్ట్ వైరల్
ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించిన జగపతి బాబు..ఇప్పుడు విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దూసుకెళ్తున్నాడు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే వెబ్సిరీస్లపై దృష్టిపెడుతున్నారు. ఆ మధ్య ‘పరంపర’ అనే వెబ్సిరీస్లో నటించారు. ప్రస్తుతం జగపతి బాబు సలార్ తో పాటు మహేశ్బాబు-త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటాడు జగ్గూ భాయ్. సినిమా అప్డేట్స్తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటాడు. తాజాగా ఆయన షేర్ చేసిన ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. విమానంలో ప్రయాణం చేస్తున్న ఫోటోని నేను చేస్తూ.. అందులో మొదటి సారిగా మొదటి ప్రయాణికుడిగా ఎక్కానని చెప్పుకొచ్చాడు. (చదవండి: తల్లితో కలిసి అమెరికాకు సమంత.. దాని కోసమేనా?) ‘నా జీవితంలో ఫస్ట్ టైమ్ మొదటి ప్యాసింజర్గా విమానం ఎక్కాను. ఈ సందర్భంగా త్రివిక్రమ్ చెప్పిన చెప్పిన డైలాగ్ ఒకటి గుర్తుకొస్తుంది. ‘విమానం ఎగురుతుంది కానీ.. నువ్వు కాదు. నువ్వు సీట్లో కూర్చుంటావ్ అంతే’..త్రివిక్రమ్ చెప్పిన ఈ డైలాగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక్క డైలాగ్తో జీవితం మొత్తాన్ని చెప్పాడు’అని జగపతి బాబు రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ కాగా.. ‘ఫ్లైట్ని హైజాక్ చేస్తున్నారా?’, ఒక్కరే ఫ్లైట్ బుక్ చేసుకున్నారా? ఏ సినిమా షూటింగ్ ఇది? అప్డేట్ ఇవ్వండి’అని కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Jaggu Bhai (@iamjaggubhai_) -
‘ఢిల్లీ’కి ఫుల్ డిమాండ్!.. తరువాత ముంబైకి గిరాకీ
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం–ఢిల్లీల మధ్య నడిచే విమానాలకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. మరే విమాన సర్వీసుకు లేని ప్రయాణికుల తాకిడి వీటికి కనిపిస్తోంది. ఈ రెండు నగరాల మధ్య రోజుకు ఐదు సర్వీసులు నడుస్తున్నాయి. ఇవి ఉదయం 8.15 నుంచి రాత్రి 9.50 గంటల వరకు తిరుగుతున్నాయి. వీటిలో సీట్లు 95 శాతానికి పైగా నిండుతున్నాయి. ఒక్కోసారి ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) 100 శాతం కూడా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్లేందుకు రెండు రోజుల ముందుగా టికెట్లు దొరకడం లేదు. ఆ తర్వాత స్థానం విశాఖపట్నం–ముంబై విమాన సర్వీసులకు ఉంది. ఈ రెండు నగరాల మధ్య 90 శాతం పైగా ఓఆర్ ఉంటోంది. ఈ విమాన సర్వీసులకు కూడా ఒకట్రెండు రోజుల ముందుగా టికెట్లు లభించని పరిస్థితి ఉంది. ఇక విశాఖపట్నం–సింగపూర్ సర్వీసుకు కూడా మంచి గిరాకీ కనిపిస్తోంది. ఈ విమాన సర్వీసుకు 80 శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్కు ఒక్క ఇంటర్నేషనల్ సర్వీసు మాత్రమే నడుస్తోంది. అందువల్ల ఇతర దేశాలకు వెళ్లాలంటే విశాఖ నుంచి నేరుగా విమానాలు లేవు. ఢిల్లీ, ముంబైల నుంచి ప్రపంచంలోని పలు దేశాలకు కనెక్టివిటీ ఉంది. దీంతో ఇక్కడ నుంచి డొమెస్టిక్ సర్వీసుల్లో ఢిల్లీ, ముంబైలకు వెళ్లి అక్కడ నుంచి ఆయా దేశాలకు విమానాల్లో చేరుకుంటున్నారు. ఫలితంగా ఈ విశాఖ విమానాశ్రయం నుంచి దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలకు వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఉద్యోగ, వ్యాపార అవసరాలతో పాటు పర్యాటకంలో భాగంగా పెద్ద సంఖ్యలో విదేశాలకు రాకపోకలు సాగించే వారున్నారు. దీంతో ఈ నగరాల మధ్య ప్రయాణికుల రద్దీ పెరగడానికి దోహదపడుతోంది. విశాఖ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే విమానాల్లో ఢిల్లీ, ముంబై సర్వీసులకు అధిక డిమాండ్ ఉండడానికి ఇదే కారణమని ఎయిర్పోర్టు డైరెక్టర్ ఎస్. రాజారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. మరోవైపు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రద్దీకనుగుణంగా తగినన్ని సర్వీసులు పెంచేందుకు విమానాల కొరత ఉందని విమానయాన నిపుణులు చెబుతున్నారు. -
గద్దర్కు ఎన్నో ఆహ్వానాలు.. అయినా విమానం ఎక్కలేదు, విదేశాలకు పోలేదు
మంచిర్యాలఅర్బన్: గద్దర్ గళం..దేశవిదేశాల్లో ఎందరో అభిమానాన్ని చూరగొన్నది. ఆయన పాట వినేందుకు విదేశాల నుంచి అభ్యుదయ, సాంస్కృతిక సంఘాల నుంచి ఆహ్వానం వచ్చినా విమానం ఎక్కి వెళ్లలేకపోయారు. 1997, ఏప్రిల్ 6న ఆయనపై కాల్పులు జరగ్గా, ఆరు బుల్లెట్లు శరీరంలోకి చొచ్చుకుపోయాయి. ఐదు బుల్లెట్లను తొలగించిన వైద్యులు, వెన్నుపూసలో ఉన్న మరో బుల్లెట్ తొలగిస్తే ప్రాణానికే హాని ఉంటుందని చెప్పారు. దీంతో అప్పటి నుంచి ఆ బుల్లెట్ శరీరంలోనే ఉండిపోయింది. దేశంలో ఇతర రాష్ట్రాల పర్యటనకు ఎయిర్పోర్ట్కు గద్దర్ వెళ్లినా, తనిఖీల్లో స్కానర్లో బుల్లెట్ చూపడం, అధికారులకు సమాధానం చెప్పడంలో అనేకసార్లు ఇబ్బంది పడినట్టు తెలిసింది. శరీరంలో బుల్లెట్, కేసులు పాస్పోర్టు జారీకి అడ్డంకిగా మారాయి. దీంతో ఎన్ని ఆహా్వనాలు వచ్చినా విమానం ఎక్కి విదేశాలకు వెళ్లలేకపోయారు. ► 1980 సమయంలో నక్సల్స్తో కలసి అజ్ఞాతంలోకి వెళ్లారు. ► పీపుల్స్వార్ పార్టీ నిర్ణయం మేరకు 1982లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కాలపు జననాట్యమండలి సభ్యుడిగా పనిచేశారు. ► 1990 ఫిబ్రవరి 18న తిరిగి బహిరంగ జీవితంలోకి అడుగుపెట్టారు. ► 1995లో పీపుల్స్వార్ పార్టీ గద్దర్ను బహిష్కరించింది. ఆయన తీవ్రంగా ఆవేదనకు గురవడంతో తిరిగి పార్టీలోకి ఆహా్వనించింది. 25 ఏళ్లుగా వెన్నులో బుల్లెట్తో గద్దర్పై చాలా సార్లు హత్యాయత్నాలు జరిగాయి. నల్లదండు ముఠా, బ్లాక్ టైగర్స్, గ్రీన్ టైగర్స్ ముఠాలు ఆయనను చంపడానికి ప్రయత్నించాయి. ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 1997 ఏప్రిల్ 6న గద్దర్పై హత్యాయత్నం జరిగింది. గ్రీన్టైగర్స్ పేరుతో కొందరు ఆగంతకులు ఆయనపై కాల్పులు జరిపారు. ఆయన ప్రాణాలకు ప్రమాదమని ఒక బుల్లెట్ను వదిలేశారు. దీనితో దాదాపు 25 ఏళ్లుగా ఆ బుల్లెట్ గద్దర్ ఒంట్లోనే ఉండిపోయింది. ‘‘రాష్ట్ర అణచివేతకు చిహ్నంగా నా వెన్నెముకలో బుల్లెట్ అలాగే ఉంది. దానితో నాకు భయమేమీ లేదు, ఏ ప్రభావమూ పడలేదు. నా లక్ష్యాలకు కట్టుబడి ప్రజల కోసం పనిచేస్తూనే ఉన్నా..పనిచేస్తూనే ఉంటా..’’ అని గద్దర్ తరచూ గుర్తు చేసుకునేవారు. -
ఎయిర్పోర్టులో దుమ్మురేపుతున్న దోస్తులు, ఫ్యామిలీ మెంబర్స్, ప్లీజ్ రావొద్దు!
శంషాబాద్: ప్రయాణికుల స్వాగత, వీడ్కోలు జరిగే సమయాల్లో అత్యధికమంది రావడంతో ఎయిర్పోర్టు పరిసరాల్లో పార్కింగ్, రద్దీ పెరిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఎయిర్పోర్టు వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఇటీవల విదేశాలకు వెళుతున్న విద్యార్థుల వెంట పరిమితికి మించి పెద్దఎత్తున స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యుల రాకతో ఎయిర్పోర్టు ప్రాంగణం కిక్కిరిసిపోతున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. సుఖవంతమైన ప్రయాణం కోసం ప్రయాణికులు, వారి కుటుంబసభ్యులు సహకరించాలన్నారు. -
విమానంలో తోటి ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులు..
న్యూఢిల్లీ: విద్య లేని వారిలోనే కాదు విద్యాధికుల్లో కూడా వింతపశువులు ఉంటారని రుజువు చేశాడు ఓ ప్రొఫెసర్. తోటి ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఎక్కడ పెడితే అక్కడ చేతులు వేసి తనని లైంగికంగా వేధించారని బాధితురాలైన 24 ఏళ్ల డాక్టర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడైన ప్రొఫెసర్ ని అదుపులోకి రిమాండ్ కు తరలించారు పోలీసులు. బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 5.30 గంటలకు ఢిల్లీ నుండి ముంబై బయలుదేరిన ఓ విమానంలో ప్రొఫెసర్(47), డాక్టర్(24) పక్కపక్కన సెట్లలో కూర్చున్నారు. ప్రయాణం మొదలైంది మొదలు ప్రొఫెసర్ ఇష్టానుసారంగా తనపై చేతులు వేస్తూ లైంగికంగా వేధించారని, ప్రశ్నించినందుకు తనతోపాటు ఫ్లైట్ సిబ్బందితో కూడా వాదనకు దిగారని.. ఫ్లైట్ ముంబైలో దిగేంతవరకు ప్రొఫెసర్ వేధిస్తూనే ఉన్నారని బాధితురాలు చెప్పినట్లు వెల్లడించారు సహర్ పోలీసులు. బాధితురాలి కంప్లైంట్ ఆధారంగా నిందితుడైన ప్రొఫెసరుని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామని కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిందని.. విచారణ కొనసాగుతోందని తెలిపారు పోలీసులు. ఇది కూడా చదవండి: 11 మంది కలిసి రూ.10 కోట్లు గెలుచుకున్నారు.. -
ఇంత బరువుంటే విమానం టేకాఫ్ కాదు.. ప్లీజ్ కొందరు దిగిపోండి..
విమానాశ్రయంలో విమానం టేకాఫ్కు రెడీగా ఉంది. ప్రయాణీకులందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఇంతలో విమానంలో ఉన్న వారికి పైలట్ ఓ షాకింగ్ వార్త చెప్పాడు. విమానంలో ప్రయాణీకుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో టేకాఫ్ చేయలేము.. అందకు కొందరు ప్రయాణీకులు విమానం దిగాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో, ప్రమాణీకులంతా ఒక్కసారిగా ఒకరి ముఖం ఒకరు చూసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన స్పెయిన్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బ్రిటన్కు చెందిన ఈజీ జెట్ విమానం లాంజరెటో నుంచి లివర్ పూల్ వెళ్లాల్సి ఉంది. ఈ విమానం షెడ్యూల్ ప్రకారం టేకాఫ్ అవ్వాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులతో టేకాఫ్ ఆలస్యమైంది. దీంతో, ప్రయాణీకులకు విమాన పైలట్ అసలు విషయం చెప్పుకొచ్చాడు. విమానాశ్రయం రన్వే పొడువు తక్కువగా ఉండటం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల విమాన టేకాఫ్ ఆలస్యమవుతోందని పైలట్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో టేకాఫ్ కష్టమవుతోందని వివరించాడు. ఇక, పైలట్ వ్యాఖ్యలతో విమానం ఉన్న ప్రయాణీకులందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇదే సమయంలో, పైలట్ మాట్లాడుతూ.. ఇటువంటి పరిస్థితుల్లో బరువైన ఈ విమానాన్ని టేకాఫ్ చేయడం కష్టతరమని తెలిపాడు. విమానం టేకాఫ్ కావలంటే కొందరు ప్రయాణీకులు విమానం దిగిపోవాల్సిందేనని చెప్పాడు. కనీసం ఓ 20 మంది ప్రయాణికులు స్వచ్ఛందంగా విమానం దిగి, తమ ప్రయాణాన్ని మరుసటి రోజుకు వాయిదా వేసుకోవాలని సూచించాడు. అలా దిగిన వారికి 500 యూరోలు పారితోషికం కూడా ఇస్తామనీ చెప్పాడు. అయినా ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. చివరికి 19 మంది ప్రయాణికులకు నచ్చజెప్పి సిబ్బంది తర్వాతి విమానంలో ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు. దీంతో మిగిలిన ప్రయాణికులతో విమానం రెండు గంటల ఆలస్యంగా టేకాఫ్ అయ్యింది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. #easyJet's Captain asked 20 passengers to leave the aircraft because it was overweight and wouldn't be able to takeoff from #Lanzarote due to wind and warm weather. The flight from Lanzarote to #Liverpool was delayed by about 2 hours. 🎥 ©razza699/TikTok#Spain #uk #aviation pic.twitter.com/oa8pi4Imox — FlightMode (@FlightModeblog) July 8, 2023 ఇది కూడా చదవండి: మూడేళ్ల పరిచయానికి రూ.900 కోట్లు ఇచ్చేశాడు..! -
ఎలా వస్తాయ్ వీళ్లకీ ఐడియాలు! ఇంటి అద్దె ఎక్కువని.. విమానంలో జాబ్కు వెళ్తోంది!
ప్రజలు సొంతూళ్లను వదిలి ఉద్యోగాలు, ఉపాధి కోసం నగరాలకు వలసపోతున్నారు. అయితే ఉద్యోగాలైతే దొరుకుతున్నాయి గానీ నివసించేందుకు సొంత ఇళ్లు అంటేనే.. అనుకున్నంత ఈజీ కాదు. సరే పోనీ అద్దె ఇంట్లో ఉంటూ బతుకు బండిని ముందుకు నడిపిద్దామని అనుకుంటే.. నగరాల్లో అద్దెలా భారం భయాన్ని పుట్టిస్తోంది. దీంతో చేసేదేమి లేక తక్కువ అద్దె చూసుకుని.. పని చేస్తున్న కంపెనీకి కిలీమీటర్ల దూరం అయినా..ట్రాఫిక్ జామ్లో గంటల సమయాన్ని వృథా చేసుకుంటూ జీవనాన్ని గడిపేస్తుంటాం. ఇదంతా మనకి తెలిసిన కథే.. అయితే ఓ యువతి చేసిన పనికి నెటిజన్స్ అవాక్కవుతున్నారు. అద్దె భరించలేక.. విమాన ప్రయాణం ఒక యువతి ఇంటి అద్దె భరించలేక విమానంలో ఉద్యోగానికి మరొక రాష్ట్రానికి వెళ్ళొస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సోఫియా సెలెంటానో అనే 21 ఏళ్ల యువతి న్యూజెర్సీలోని ఓగిల్వీ హెల్త్లో సమ్మర్ ఇంటర్న్షిప్ చేస్తోంది. కానీ ఆ నగరంలో అపార్ట్మెంట్ల అధిక ధర పలుకుతూ ఆకాశాన్నంటుతున్నాయి. కనీసం ఆ నగరం శివారు ప్రాంతం ఉండాలంటే కూడా.. కనీసం నెలకు 3400 డాలర్లు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. రెండునెలల తన ఇంటర్న్షిప్ కాలంలో సోఫియా వారానికి ఒక రోజే ఆఫీసుకు వెళ్లాలట. అందుకని ఆమె తాను ఇంటర్న్షిప్ చేస్తున్న ప్రదేశం నుంచి దాదాపు 700 కి.మీ దూరంలో తక్కువ అద్దెకు రూం తీసుకుంది. ఆఫీసుకు వారానికి ఒక రోజు కాబట్టి విమానం ప్రయాణాన్ని ఎంచుకుంది. ఎందుకంటే.. రెండు నెలల్లో మొత్తంగా 8 రోజులు ఆఫీసుకు వెళ్లాల్సి ఉండగా అందుకు విమాన టికెట్, క్యాబ్ ఖర్చులు అంతా కలిపి 2,250 డాలర్లే ఖర్చవుతుందట. న్యూజెర్సీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉండటం కంటే.. ఇదే నయమని తాను ఈ దారిని ఎంచుకుంది. అందుకోసం తాను తెల్లవారుజాము 3 గంటలకే లేవాల్సి వస్తోందని, రాత్రి పొద్దుపోయాక ఇల్లు చేరుతున్నట్లు ఆమె తెలిపింది. టిక్టాక్లో ఆమె మాట్లాడిన తర్వాత తన కథ వెలుగులోకి వచ్చింది. చదవండి: Hayden Bowles Success Story: 17కు వ్యాపారం.. 19కి సెటిల్.. 22కు రిటైర్మెంట్.. అమెరికా కుర్రాడి సక్సెస్ స్టోరీ! -
‘బాంబు.. బాంబు’ విమానంలో యువకుని కేకలు.. తరువాత జరిగిందిదే!
కోల్కతా నుంచి దోహా వెళుతున్న కతర్ ఎయిర్వేస్లో ఆ సమయంలో ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. విమానంలో ఉన్న ఒక యువకుడు ‘బాంబు.. బాంబు’ అంటూ పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. దీంతో క్రూ మెంబర్స్ ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్కు తెలియజేశారు. వెంటనే విమానంలో తనిఖీ చేపట్టారు. అయితే ఆ యవకుని తండ్రి అధికారులతో మాట్లాడుతూ తన కుమారుని మానసిక పరిస్థితి సరిగా లేదని తెలిపారు. వివరాల్లోకి వెళితే కతర్ ఎయిర్వేస్కు చెందిన క్యూఆర్541, విమానం కోల్కతా నుంచి దోహాకు బయలుదేరడంలో ఆలస్యం జరిగింది. ఒక యువకుడు విమానంలో బాంబు ఉందంటూ పెద్దగా కేకలుపెట్టాడు. విమానంలోని క్రూ మెంబర్స్ వెంటనే ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్కు చేరవేశారు. వెంటనే భద్రతా దళాలు పరుగుపరుగున వచ్చి, విమానంలోని ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. వారు ఆ యువకుడిని ప్రశ్నించగా... ఎవరో తనతో విమానంలో బాంబు ఉందని చెప్పారని అన్నాడు. కాగా సీఐఎస్ఎఫ్ బృందం ఎయిర్క్రాఫ్ట్ను స్నిఫర్ డాగ్స్ సాయంతో తనిఖీ చేయించారు. ఇంతలో ఆ యువకుని తండ్రి అధికారులతో మాట్లాడుతూ తన కుమారుని మానసిక పరిస్థితి బాగోలేదని చెబుతూ, అందుకు సంబంధించిన ధృవపత్రాలను కూడా చూపించాడు. ఈ ఘటన కారణంగా విమానం బయలుదేరడంలో ఆలస్యం జరిగింది. బాంబు లేదని నిర్థారించాక ప్రయాణికులను తిరిగి విమానంలోకి అనుమతించారు. కాగా దీనికిముందు గత ఫిబ్రవరిలో హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న విమానంలో బాంబు ఉందంటూ సూచన అందించింది. దీంతో ఆ విమానాన్ని లక్నోలోని చౌదరి చరణ్సింగ్ ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. తరువాత విమానంలో తనిఖీలు జరిపారు. అయితే విమానంలో ఎటువంటి బాంబు లభ్యంకాలేదు. ఈ ఘటనలో బాంబు ఉందంటూ వదంతులు వ్యాపింపజేసిన హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: ఆమె 18 ఏళ్ల తరువాత తన ఎల్కేజీ ఫ్రెండ్ను కనిపెట్టిందిలా..
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లక్నోపై ఢిల్లీ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
AP: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్
హీరోతో వివాదం.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్!
టీమిండియా హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..!?
తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
చెలరేగిన స్టబ్స్, అభిషేక్.. లక్నో ముందు భారీ టార్గెట్
వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. డీహెచ్ఎఫ్ఎల్ ధీరజ్ వాధావన్ అరెస్ట్
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement