-
మోదీ నుంచి నడ్డా వరకు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ హైవోల్టేజీ ప్రచారం ముగిసింది. ప్రధాని నరేంద్రమోదీ మొదలు కేంద్ర హోంమంత్రి అమిత్షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల పర్యటనలతో ప్రచారపర్వాన్ని దూకుడుగా పూర్తి చేసింది. బహిరంగసభలు, వివిధ సామాజికవర్గాల వారీగా సమావేశాలు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు, ఇంటింటికి బీజేపీ వంటి కార్యక్రమాలతో హోరెత్తించింది. ముఖ్యంగా మోదీ, అమిత్షా, నడ్డా వంటి అగ్రనేతలు. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవ ర్గాలను ఒక ప్రణాళికాబద్ధంగా చుట్టివచ్చేలా ఎన్నికల ప్రచార కార్యక్రమాల రూపకల్పన ఆ పార్టీకి కలిసొచ్చిందనే చెప్పాలి. పార్టీ కచ్చితంగా గెలిచే అవకాశమున్న సీట్లు, ఇంకా కొంచెం కష్టపడితే గెలవగలిగే స్థానాలు, పోటీలో ఉన్న స్థానాలు...ఇలా వర్గీకరించుకుని తప్పకుండా విజయం సాధిస్తామనే చోట్ల అధిక దృష్టిని కేంద్రీకరించారు. ఇందుకు అనుగుణంగానే.. ప్రచారం ప్రారంభించిన నాటి నుంచి ప్రచార గడువు ముగిసే వరకు బీజేపీ నేతలు ఉధృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార పర్వం పూర్తయ్యే ముందురోజు అంటే...శుక్రవారం సాయంత్రం ఎల్బీస్టేడియంలో ఐదు ఎంపీ సీట్ల పరిధిలో నిర్వహించిన బహిరంగసభలో మోదీ ప్రసంగించారు. అదేరోజు మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో ఎన్నికల ప్రచారంలోనూ ఆయన పాల్గొన్నారు. ఇక ప్రచారం ముగిసిన శనివారం చేవేళ్ల ఎంపీ సీటు పరిధిలోని వికారాబాద్లో, నాగర్కర్నూల్లోని వనపర్తిలో నిర్వహించిన సభల్లో అమిత్షా పాల్గొన్నారు.ప్రచారంలో దూకుడుగానేప్రధానపార్టీల కంటే ముందుగా అభ్యర్థుల ప్రకటనతో పాటు ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ వెలువడేలోగానే తొలివిడత ఎన్నికల ప్రచారం పూర్తి చేసిన బీజేపీ.. మొత్తంగా రాష్ట్రంలో ప్రచార విషయంలో మాత్రం బీజేపీ‘అడ్వాంటేజ్ పొజిషన్’లోకి ప్రవేశించిందనే చెప్పాలి. పదేళ్లపాటు కేంద్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు, తెలంగాణకు వివిధ రూపాల్లో రూ.10 లక్షల కోట్ల వరకు నిధుల కేటాయింపు వెరసి మోదీ సర్కార్ సాధించిన విజయాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రచారాన్ని ఉరకలెత్తేలా చేసింది. అయితే సీఎం రేవంత్రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు ఆరోపించిన రిజర్వేషన్ల రద్దు అంశం, మళ్లీ బీజేపీ వస్తే హైదరాబాద్ను యూనియన్ టెరిటరీ చేస్తారన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ల ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ నేతలు సర్వశక్తులూ ఒడ్డాల్సి వచ్చింది. ఈ రెండు విషయాలపై ఏకంగా మోదీ, అమిత్షా సహా రాష్ట్ర పార్టీ అ«ధ్యక్షుడు కిషన్రెడ్డి కూడా ప్రధానంగా ఫోకస్ చేయాల్సి వచ్చిందనే చెప్పాలి. -
Andhra Pradesh: నేటితో ప్రచారానికి తెర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ప్రచారంతో హోరెత్తించిన రాజకీయ పార్టీల మైకులు మూగబోనున్నాయి. మే 13న జరిగే పోలింగ్కు 48 గంటల ముందు ఎటువంటి ప్రచారం లేకుండా నిశ్శబ్ద కాలం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ప్రచురించడం, ప్రసారం చేయకూడదు. పోలింగ్ ప్రక్రియ దగ్గరపడటంతో వచ్చే 72 గంటల్లో అధికారులు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖే‹Ùకుమార్మీనా ఆదేశాలు జారీ చేశారు. హింసకు, రీ పోలింగ్కు తావు లేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలను మీనా ఆదేశించారు. ఆ ఆదేశాల్లో పేర్కొన్న ప్రకారం. 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి నిశ్శబ్ద కాలం (సైలెంట్ పీరియడ్) అమల్లోకి వస్తుంది. ఆ సమయంలో ఎన్నికల ప్రచారానికి పూర్తిగా తెరపడుతుంది.చట్టవిరుద్ధమైన సమావేశాలపై నిషేధం ఉంటుంది. పోలింగ్ ముగింపు సమయం ఆధారంగా మద్యం దుకాణాలకు 48 గంటల డ్రై డే సవరించబడుతుంది. నియోజకవర్గం వెలుపల నుంచి ప్రచారం నిమిత్తం తీసుకువచ్చిన, నియోజకవర్గ ఓటర్లు కాని రాజకీయ కార్యకర్తలు/పార్టీ కార్యకర్తలు అంతా ప్రచార సమయం ముగిసిన వెంటనే నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలి. 48 గంటల వ్యవధిలో ఓటర్లు కాని ఇతర వ్యక్తులు స్థానిక లాడ్జిలు, కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు మొదలైన వాటిలో లేరని అధికారులు నిర్ధారించుకోవాలి.ఏజెంట్ల జాబితా ఇవ్వాల్సిన అవసరం లేదు పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఏజెంట్ల నియామక జాబితాను రిటరి్నంగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. పోలింగ్ తేదీ రోజు ప్రిసైడింగ్ అధికారికి పోలింగ్ ఏజెంట్ తమ వివరాలు సమర్పించి విధులకు హాజరు కావచ్చు. -
సీఎం జగన్ రేపటి ప్రచార షెడ్యూల్ ఇలా...
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం( మే11) మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని చిలకలూరిపేట కళామందిర్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని తాలూకా ఆఫీస్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. చివరిగా మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఉప్పాడ బస్స్టాండ్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. -
పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి: సీఎం జగన్
అన్నమయ్య జిల్లా, సాక్షి: చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని.. పొరపాటున బాబుకు ఓటస్తే.. పథకాలు ముగింపేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే కోడూరు రోడ్డులో ప్రచార సభలో మాట్లాడుతూ చంద్రబాబు.. మోదీ, అమిత్షాను తీసుకొచ్చి సభలు పెట్టించారు. ప్రత్యేక హోదా హామీ వస్తుందేమోనని ప్రజలు ఎదురుచూశారు.. వాళ్లు ప్రత్యేక హోదా హామీ ఇవ్వకుండా.. విమర్శించి వెళ్లిపోయారు’’ అంటూ సీఎం జగన్ మండిపడ్డారు.‘‘చంద్రబాబు అంతటి అవినీతిపరుడు దేశంలోనే లేడని మోదీ అన్నారు. కూటమిలో చేరగానే అదే నోటితో చంద్రబాబును పొగుడుతున్నాడు. చంద్రబాబు, దత్తపుత్రుడికి ఏం కావాల్లో అది మాత్రమే మాట్లాడారు. పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి’’ అంటూ సీఎం జగన్ పిలుపునిచ్చారు.‘‘2014లో ఇదే కూటమి ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా?. చంద్రబాబు కూటమి.. పెత్తందార్ల కూటమి. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే.. వ్యతిరేకించారు. పెత్తందార్ల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా? 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చాం. 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం. అక్క చెల్లెమ్మలకు నేరుగా రూ.2 లక్షల 70 వేల కోట్లు అందించాం’’ అని సీఎం వివరించారు.గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్ట్ టీచర్లు. ప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన. ఇంటర్నేషనల్ యూనివర్శిటీలతో సర్టిఫైడ్ కోర్సులు. పిల్లల చదువు కోసం తల్లులను పోత్సహిస్తూ అమ్మఒడి. విద్యారంగంలో జరిగిన విప్లవాలు.. గతంలో ఎప్పుడైనా జరిగాయా?. మహిళా సాధికారతకు అర్థం చెప్తూ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉన్నాం. మొదటిసారి మేనిఫెస్టో అనే పదానికి విశ్వసనీయత తీసుకొచ్చాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.⇒రాజంపేటలో అక్కచెల్లెమ్మల పేరిట 4వేల ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, ఇళ్ల నిర్మాణం..⇒మరో 4 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది..⇒జరగబోయే ఈ ఎన్నికలు పథకాల కొనసాగింపును నిర్ణయించేవి..⇒మీ జగన్ తీసుకొచ్చినన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా?⇒ఈ తరహాలో పేదవాడి మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో చూశారా? ⇒ప్రత్యేకహోదాను అమ్మేశారు, పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి..⇒చంద్రబాబు ఎక్కడికి వెళ్తే అక్కడ దాన్ని జిల్లా కేంద్రం చేస్తా అంటున్నాడు..⇒రాజంపేట, మదనపల్లి, రాయచోటిలను జిల్లా కేంద్రం చేస్తానంటున్నాడు నమ్ముతారా?⇒రాజంపేటలో పింఛా డ్యాం ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేశాం⇒అన్నమయ్య ప్రాజెక్ట్, గాలేరు-నగరి కాల్వ పనులు పూర్తి చేయాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి⇒రాజంపేట కేంద్రంగా అన్నమయ్య కాలేజ్ను యూనివర్శిటీగా తీర్చిదిద్దాం⇒మీ బిడ్డ తీసుకున్న నిర్ణయం రాజంపేట చరిత్రలో నిలిచిపోతుంది⇒అధికారంలోకి వచ్చిన తర్వాత రాజంపేటలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు -
ఢిల్లీలో పంజాబ్ సీఎం ఎన్నికల ప్రచారం!
దేశంలో లోక్సభ ఎన్నికలు కొనసాగున్నాయి. వివిధ పార్టీలు మ్యానిఫెస్టోలు విడుదల చేసి, ప్రచారాలు ముమ్మరం చేశాయి. దేశరాజధాని ఢిల్లీలో జరిగే లోక్సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరపున ప్రచారం చేయనున్నారు.సీఎం భగవంత్ మాన్ మే 11న తూర్పు ఢిల్లీ, దక్షిణ ఢిల్లీలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందుకోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ఢిల్లీలో రోడ్ షో నిర్వహించారు. ఢిల్లీ సీఎం జైలుకు వెళ్లిన తర్వాత సునీతా కేజ్రీవాల్ రాజకీయాల్లో చురుకుగా మారారు.ఈసారి ఢిల్లీలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. ఆప్ నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాయి. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు మే 25న ఆరో దశలో ఓటింగ్ జరగనుండగా, జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను మే 21న ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి కేజ్రీవాల్ తీహార్ జైలులో కస్టడీలో ఉన్నారు. -
టీడీపీ కార్యకర్త దాష్టీకం
కంకిపాడు: టీడీపీ కార్యకర్తలు పెట్రేగిపోతున్నారు. నేతల అండ చూసుకుని దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. అధికారంలోకి రానివ్వండి తేలుస్తాం.. అంటూ పెనమలూరు నియోజకవర్గంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. తాజాగా పెనమలూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త ప్రచారం పేరుతో ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి చొరబడి దాషీ్టకం ప్రదర్శించాడు. ఇంట్లో సామగ్రిని ధ్వంసం చేయడమేగాక ఆమెపై దాడిచేసి తీవ్రంగా కొట్టాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ అవుతోంది. కంకిపాడుకు చెందిన గుమ్మడి కిరణ్ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో టీడీపీ ప్రచారం పేరుతో.. మహిళ ఒంటరిగా ఉన్న ఇంట్లోకి చొరబడ్డాడు. నువ్వు ఫోన్ చేస్తే వచ్చానని, ఫోన్లో డబ్బులు వేశానని అంటూ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. సామగ్రి ధ్వంసం చేసి భయాందోళనలకు గురిచేశాడు. అతడి చేష్టల్ని వీడియోలో చిత్రీకరిస్తున్న ఆమెను తిడుతూ.. తనకు యార్లగడ్డ, బోడె, పార్థసారథి అండ ఉందని హెచ్చరించాడు. ఆమెపై దాడిచేసి కొట్టాడు. తెలుగుదేశం వర్గీయుల దౌర్జన్య వ్యవహారాలు నియోజకవర్గంలో చర్చనీయాంశమయ్యాయి. -
ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేష్.. టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణ
సాక్షి, విజయవాడ: టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణ చేపట్టింది. చంద్రబాబు ఏ1గా, లోకేష్ ఏ2గా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై ఐవీఆర్ఎస్ కాల్స్తో టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. టీడీపీ అసత్య ప్రచారంపై వైఎస్సార్సీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.ఈసీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ.. విచారణ చేపట్టింది. చంద్రబాబు, లోకేష్తో పాటు 10 మందిపై కేసు నమోదు చేసింది. ఐవీఆర్ఎస్ కాల్స్ చేసిన ఏజెన్సీలపైనా కేసు నమోదైంది.కాగా, ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ తప్పుడు సమాచారంతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారం మీద ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝళిపించింది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏప్రిల్ 29న ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఈసీ టీడీపీ దుష్ప్రచారంపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని, అలా తీసుకున్న చర్యలపై తక్షణం నివేదిక ఇవ్వాలని మంగళగిరి సీఐడీ (సైబర్ సెల్) అడిషనల్ డీజీకి అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరీంధర ప్రసాద్ ఆదేశించారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారంతో దురుద్దేశపూర్వకంగా లాండ్ టైట్లింగ్ యాక్ట్పై ఐవీఆర్ఎస్ కాల్స్తో పాటు సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ప్రచారం చేస్తోందంటూ వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఇందుకు తగిన ఆధారాలనూ సమర్పించింది.వివిధ ప్రాంతాల నుంచి వేర్వేరు నెంబర్ల ఐవీఆర్ కాల్స్ వస్తున్నాయని.. వాటిని లిఫ్ట్ చేయగానే.. ‘వైఎస్ జగన్ అధికారంలోకొస్తే మీ భూములు మీ పేరు మీద ఉండవు, జగన్ కాజేస్తాడు, ఒరిజినల్స్ ఆయన దగ్గర ఉంచుకుంటాడు, మీకు జిరాక్స్ కాపీలు వస్తాయి, కాబట్టి జగన్కు ఓటు వేయకుండా తెలుగుదేశంకు ఓటు వేయండి’.. అంటూ రికార్డ్ మెసేజ్లు వస్తున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.వీటికి సంబంధించిన వాయిస్ రికార్డులను వైఎస్సార్సీపీ ఈసీకి ఆధారాలుగా సమర్పించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం ఆమోదంలేకుండా ఎలాంటి ప్రచారం చేయడానికి వీల్లేదని.. కానీ ఎటువంటి అనుమతుల్లేకుండా వివిధ చోట్ల నుంచి కాల్స్చేస్తూ ఇలా ప్రచారం చేయడం ఉల్లంఘన కిందకే వస్తుందని.. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీచేసింది.ఎన్నికల సమరంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంటుందని, ఈ విధంగా చట్టాలపై తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్న టీడీపీపై తక్షణం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ తన ఫిర్యాదులో కోరింది -
నేడు తెలంగాణకు అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణలో పర్యటించనున్నారు. కాగజ్నగర్, నిజామాబాద్, హైదరాబాద్లలో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేపట్టనున్నారు. మూడు చోట్ల జరిగే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది.అమిత్ షా షెడ్యూల్ ఇలా.. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఏపీలోని శ్రీసత్యసాయి ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 1:55 గంటలకు బేగంపేటకు అమిత్ షా చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ వెళ్లనున్నారు. అక్కడి ఎస్పీఎం క్రికెట్ గ్రౌండ్లో మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 4 గంటల దాకా బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 4:15 గంటలకు కాగజ్నగర్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 5 గంటలకు నిజామాబాద్ చేరుకోనున్నారు. సాయంత్రం 5:10 గంటల నుంచి 5:50 గంటల వరకు అక్కడి గిరిరాజ్ కాలేజీలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరి 6:30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. సాయంత్రం 6:45 గంటలనుంచి రాత్రి 7:30 గంటల దాకా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రాత్రి 7:55 నిమిషాలకు బేగంపేట నుంచి పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్కు బయలుదేరనున్నారు.నేడు తెలంగాణకు రాహుల్.. రెండు సభలకు హాజరులోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం తెలంగాణలో పర్యటించనున్నారు. నాందేడ్ నుంచి నేరుగా నిర్మల్కు రానున్న రాహుల్.. అక్కడ జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా అలంపూర్ వెళ్లి అక్కడ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత అలంపూర్ నుంచి హైదరాబాద్ చేరుకొని పార్టీ నేతలతో కాసేపు భేటీ కానున్నారు. అనంతరం ఆయన ఢిల్లీ వెళ్తారని గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. -
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉత్తరాఖండ్ టూరిజం విభాగం దేశంలోనే తొలిసారిగాఆస్ట్రో టూరిజం ప్రచారాన్ని ప్రారంభించింది. ఆకాశంలో అద్భుతాలను చూడాలని కోరుకునే ఔత్సాహికులే లక్ష్యంగా ‘నక్షత్ర సభ’ను లాంచ్ చేసింది. స్టార్స్కేప్స్ అనే ఆస్ట్రో టూరిజం కంపెనీతో కలిసి, ఖగోళ శాస్త్ర ఔత్సాహికులకు సంపూర్ణ అనుభవాన్ని అందించేందుకు కృషి చేస్తోంది.ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో, స్థానిక నివాసితులకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను అందించడమే కాకుండా భారతదేశంలో డార్క్ స్కైస్ పరిరక్షణకు పనిచేయనుంది. ఖగోళ శాస్త్ర వెంచర్ డార్క్ స్కై ప్రిజర్వేషన్ పాలసీని రూపొందించడం, ఏడాది పొడవునా ప్రాంతమంతటా అమలు చేయనుంది. దీనిపై ప్రచారం అవగాహన కల్పిస్తుంది, శిక్షణ ఇస్తుంది. వాలంటీర్లను ,డార్క్ స్కై అంబాసిడర్లనుతయారు చేస్తుంది. అంతేకాదుఆస్ట్రోఫోటోగ్రఫీ పోటీ కూడా నిర్వహిస్తుంది. రాత్రి ఆకాశంలోని అందాలను ఫోటో తీసిన వారికి ఆకర్షణీయమైన రివార్డులు కూడా అందిస్తుంది.అంతర్జిక్ష టూరిజానికి మద్దతుగా 'నక్షత్ర సభ'ను తీసుకొచ్చింది. ఇందులో స్టార్ గేజింగ్, ప్రత్యేక సౌర పరిశీలనలు, ఆస్ట్రోఫోటోగ్రఫీ పోటీలు, క్యాంపింగ్ లాంటివి అందించనుంది. ఈ ప్రచారంలో భాగంగా తొలి ఎడిషన్ జూన్లో ముస్సోరీలోని జార్జ్ ఎవరెస్ట్లో ప్రారంభమవుతుంది.ఖగోళ శాస్త్రం, పర్యాటకం కలయికగా ఆస్ట్రో-టూరిజం ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతోంది. భారతదేశంలో, భూ సంబంధమైన ఆస్ట్రో-టూరిజంను విస్తరించేందుకు వివిధ సంస్థలు కృషి చేస్తున్నాయి. కొన్ని ప్రదేశాలలో ఆస్ట్రో-స్టేలు కూడా ఏర్పాటవుతున్నాయి. ఉదాహరణకు, లడఖ్లోని పాంగోంగ్ సరస్సు వద్ద, సందర్శకులు పగటిపూట సరస్సు అద్భుతమైన అందాలను ఆస్వాదిస్తారు. రాత్రి వేళలో,స్థానికులు వారి సంప్రదాయాలు , జానపద కథలను పంచుకుంటూ నక్షత్రరాశులను గుర్తించడానికి వారికి మార్గనిర్దేశం చేస్తారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డ్ భారతదేశంలోని ప్రముఖ ఆస్ట్రో-టూరిజం కంపెనీ స్టార్స్కేప్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. నక్షత్ర సభ 2025 మధ్యకాలం వరకు కొనసాగుతుంది, ఉత్తరాఖండ్ అంతటా వివిధ ప్రదేశాలలో లీనమయ్యే ఈవెంట్ల శ్రేణిని అందిస్తుంది. ఉత్తరకాశీ, పితోర్గఢ్, నైనిటాల్, చమోలి జిల్లాల్లోని డార్క్ స్కై పొటెన్షియల్ సైట్లతో పాటు నిపుణులతో సెమినార్లు, వెబ్నార్లను నిర్వహిస్తుంది. విశ్వం అందాలను వీక్షించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్ర ఔత్సాహికులు, సాహసికులను ఒకచోట చేర్చడం ఈ కార్యక్రమం లక్ష్యం. -
బీజేపీ అగ్రనేతలతో ప్రచార దూకుడు!
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా.. బీజేపీ అధినాయకత్వం దూకుడు పెంచుతోంది. పోలింగ్ దగ్గరపడుతుండటంతో.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వరుసగా సభలు, సమావేశాల్లో పాల్గొననున్నారు. ఒకే రోజున రెండు మూడు సభలతో.. 1వ తేదీన హైదరాబాద్ ఎంపీ స్థానం పరిధిలో రోడ్ షో నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. మళ్లీ ఈ నెల 5న రాష్ట్రానికి వస్తున్నారు. ఒకేరోజు 3 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఆ రోజు ఉదయం 11:30 గంటలకు ఆదిలాబాద్ లోక్సభ సెగ్మెంట్లోని సిర్పూర్ కాగజ్నగర్లో, మధ్యాహ్నం 1.30 గంటలకు నిజామాబాద్లో, సాయంత్రం 4 గంటలకు మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో జరిగే బహిరంగ సభలలో పాల్గొని ప్రసంగిస్తారు. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా.. ఈ నెల 6న ఉదయం 11 గంటలకు పెద్దపల్లిలో, మధ్యాహ్నం ఒంటి గంటకు భువనగిరిలో, మధ్యాహ్నం 3.30 గంటలకు నల్లగొండలో జరిగే సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి గురువారం ఓ ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. మూడు నెలల్లో ఎనిమిది సార్లు మోదీ.. ప్రధాని మోదీ ఈ నెల 8, 10వ తేదీల్లో రాష్ట్రానికి వస్తున్నారు. ఈ పర్యటనతో కలిపితే.. మూడు నెలల్లోనే ఎనిమిది సార్లు ఆయన రాష్ట్ర పర్యటన చేసినట్టు అవుతుంది. మోదీ ఇంతకుముందే.. ఫిబ్రవరి మొదటివారంలో రెండు సార్లు, మార్చిలో మూడుసార్లు, ఏప్రిల్ చివరిలో ఒకసారి రాష్ట్రానికి వచ్చారు. ఇక ఈ నెల 8న వేములవాడ, వరంగల్లలో నిర్వహించే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు.10న హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపీ స్థానాలను కవర్ చేసేలా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే భారీ సభలో పాల్గొంటారు. అదేరోజున నారాయణపేటలో ప్రచారసభలోనూ మోదీ పాల్గొననున్నారు. మరోవైపు మధ్యప్రదేశ్, గుజరాత్, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారు. అయితే వారికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. పోలింగ్కు ముందు మరోసారి ఇంటింటి ప్రచారం పార్టీ అగ్రనేతలు హాజరయ్యే సభలను మాత్రమే భారీగా నిర్వహించి.. మిగతా అంతా కూడా ఇంటింటి ప్రచారానికే ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు నిర్ణయించాయి. అందులో భాగంగా ఇప్పటికే రెండు విడతల పాటు ‘హర్ఘర్ బీజేపీ’కార్యక్రమాన్ని పూర్తి చేసిన బీజేపీ నేతలు.. పోలింగ్కు ముందు 9, 10, 11 తేదీల్లో తుది విడత ఇంటింటి ప్రచారం చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. బుధవారం రాత్రి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ముఖ్య నేతల భేటీలో.. పోలింగ్ తేదీ వరకు వీలైనన్ని ఎక్కువ సార్లు ఓటర్లను కలుసుకోవడంపై దృష్టి పెట్టాలని అమిత్ షా సూచించారు. -
జయరాం.. రాం!
గుంతకల్లులోని 18వ వార్డులో బుధవారం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎదుటే టీడీపీలోని తలారి మస్తానప్ప వర్గం, మధు, శివల వర్గం మాటల యుద్ధానికి దిగారు. గుమ్మనూరు నచ్చజెప్పినా వినలేదు. దీంతో విసిగిపోయిన జయరాం.. ‘‘మీకు చేతులు జోడించి మొక్కి చెబుతున్నా.. పార్టీని భ్రష్టు పట్టించకండి..’’ అని నిట్టూరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదొక్కటే కాదు.. ఇప్పటివరకూ గుమ్మనూరు ప్రచారం నిర్వహించిన ప్రతి చోటా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని, ఏదేదో అనుకుని గుంతకల్లు బరిలో దిగితే ఇంకేదో జరుగుతుండడంతో ‘గుమ్మనూరు’ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గుంతకల్లు: ‘అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే... జేబులు ఖాళీ ఆయెనే’’ అదేదో సినిమాలోని ఈ పాట టీడీపీ గుంతకల్లు అభ్యర్థి గుమ్మనూరు జయరామ్కు సరిగ్గా సరిపోతోంది. డబ్బుతో ఎన్నికలు గట్టెక్కవచ్చు అనుకున్న ఆయన అంచనాలు తలకిందులవుతున్నాయి. తెలుగు తమ్ముళ్ల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు జయరామ్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అసలే ఆరాచకవాదిగా ముద్ర పడిన జయరామ్ పట్ల ఇప్పటికే గుంతకల్లు ప్రజల్లో సదభిప్రాయం లేదు. ఈ క్రమంలోనే సొంత పార్టీ కేడర్ కూడా కలిసి రాకపోవడంతో ఆయన ఏటికి ఎదురీదుతున్నారు.పుండుపై కారం.. 👉 గుంతకల్లు నియోజకవర్గంలో చాలా చోట్ల టీడీపీ నాయకుల మధ్య కోల్డ్వార్ నడుస్తున్నా ఇప్పటి వరకూ బయటపడలేదు. అయితే, ప్రచారం నిమిత్తం గుమ్మనూరు ఆయా ప్రాంతాల్లో పర్యటించిన సమయాల్లో తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శిస్తూ రచ్చకెక్కుతున్నారు. 👉 టీడీపీ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ భర్త, ప్రస్తుతం గుంతకల్లు పదో వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ ఐదేళ్లుగా పారీ్టకి దూరంగా ఉన్నాడు.👉 దీంతో ఆ వార్డు బాధ్యతలను రాయల్ వెంకటే‹Ùకు పార్టీ అధిష్టానం అప్పగించింది. ఇటీవల వెంకటేష్ ఆహా్వనం మేరకు గుమ్మనూరు జయరాం 10వ వార్డుకు రాగా, దీన్ని జీరి్ణంచుకోలేని చంద్రశేఖర్.. గుమ్మనూరు ఎదుటే వెంకటేష్తో గొడవకు దిగారు. ఈ క్రమంలోనే చంద్రశేఖర్ వర్గానికి చెందిన పలువురు వెంకటే‹Ùపై దాడికి దిగారు. తమ కులానికి చెందిన వ్యక్తిపై దాడి జరగడంతో బలిజ సంఘం నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు. చంద్రశేఖర్తో బేషరుతుగా క్షమాపణలు చెప్పించాలంటూ ఇప్పటికే గుమ్మనూరు సోదరుల వద్దకు పంచాయితీకి వెళ్లినా ఏ మాత్రం స్పందన లేకపోవడంతో గుమ్మనూరు తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. 👉 10 రోజుల కిత్రం జితేంద్రగౌడ్ ఆధ్వర్యంలో ఏబీ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన అత్మీయ సమావేశానికి గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. ఈ సమావేశంలో తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని కొందరు బహిరంగంగా విమర్శించారు. మాజీ కౌన్సిలర్లు ఆమ్లేట్ మస్తాన్యాదవ్, కేశప్ప మధ్య వాగ్వాదం చేటు చేసుకొని, బూతులు తిట్టుకున్నారు. 👉 కథలగేరిలోని మాజీ కౌన్సిలర్ ఆమ్లేట్ మస్తాన్యాదవ్, మరో మాజీ కౌన్సిలర్ కథల మారెప్ప, కుమారుడు మహేష్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం గుమ్మనూరు నిర్వహించిన ప్రచారంలో తారస్థాయికి చేరాయి. మస్తాన్యాదవ్ను వార్డులో తిరగనీయనంటూ గుమ్మనూరు ఎదుటే మహేష్ హెచ్చరికలు జారీ చేశాడు. జనసేన, బీజేపీ నాయకులూ గరంగరం..👉కూటమిలో భాగస్వామ్య పారీ్టలైన జనసేన, బీజేపీల నుంచి కూడా గుమ్మనూరుకు వ్యతిరేకతే ఎదురవుతోంది. ఇటీవల జనసేన నాయకుడు పూలరమణ తన నివాసంలో ఆతీ్మయ సమావేశం ఏర్పాటు చేయగా, జయరాంతోపాటు టీడీపీ డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షురాలు పత్తి హిమబిందు హాజరయ్యారు. ఈ సందర్భంగా హిమబిందు మాట్లాడుతూ జన సైనికులు ఆవేశం తగ్గించుకుని మాట్లాడాలని అనడంతో ఒక్కసారిగా ఆ పార్టీ కార్యకర్తలు భగ్గుమన్నారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే ఊరుకునేది లేదని గుమ్మనూరు ఎదుటే హిమబిందును హెచ్చరించారు.👉 బీజేపీలో నాయకుల మధ్య వర్గ పోరు కూడా గుమ్మనూరుకు మైనస్లా మారింది. బీజేపీ నాయకులు మంజుల వెంకటే‹Ù, కొలిమి రామాంజనేయులు మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇలా.. గుంతకల్లు నియోజకవర్గంలోని ప్రతి వార్డులో, గ్రామాల్లో వ్యతిరేకతకు తోడు బీజేపీ, జనసేనల నుంచి కూడా చిక్కుముళ్లు ఎదురవుతుడడంతో గుమ్మనూరు జయరామ్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు తెలుస్తోంది. -
గాంధీ మార్గంలో ప్రచారం.. భేష్ అంటున్న జనం!
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటింగ్ జరగని స్థానాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. నాయకులు వివిధ రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. అయితే గుజరాత్లోని పోర్బందర్ లోక్సభ స్థానం నుండి ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రత్యేక రీతిలో ప్రచారం సాగిస్తున్నారు. పోర్బందర్.. జాతిపిత మహాత్మా గాంధీ జన్మస్థలం. అందుకే మన్సుఖ్ మాండవియా.. మహాత్మాగాంధీని స్పూర్తిగా తీసుకుని ఎన్నికల ప్రచారంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఓట్లు అడుగుతున్నారు.మన్సుఖ్ మాండవియా గ్రామ గ్రామాన పాదయాత్ర చేస్తూ రోడ్ షోలకు దూరంగా ఉంటున్నారు. ఈ పాత విధానంలో ప్రచారానికి కారణమేమిటని విలేకరులు అడగగా, ఆయన తాను పోర్బందర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, అందుకే మహాత్మాగాంధీ పాదయాత్రలు చేపట్టిన మాదిరిగా ప్రచారం కొనసాగిస్తున్నానని అన్నారు.తన ఎన్నికల పాదయాత్ర ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య మద్దతు వస్తున్నదని ఆయన తెలిపారు. కాలినడకన ఇంటింటికీ ప్రచారం చేయడం వల్ల ఎన్నికల ఖర్చు కూడా తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అనవసర ఖర్చులు తగ్గించాలని అన్నారు. బహిరంగ సభ నిర్వహిస్తే, వేడి వాతావరణంలో జనం కూర్చోలేరని, అందుకే ఇంటింటికీ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. కాగా పోర్బందర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి లలిత్ వసోయాపై మాండవ్య పోటీ చేస్తున్నారు. గుజరాత్లోని 25 లోక్సభ స్థానాలకు మే 7న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. -
ఆమ్ఆద్మీపార్టీకి ‘ఈసీ’ షాక్
న్యూఢిల్లీ: ఎన్నికల వేళ ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)కి ఎన్నికల కమిషన్(ఈసీ)కి షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచార సభలో భాగంగా ఆప్ వాడుతున్న పాటలో పలుసార్లు రిపీట్ అవుతున్న నినాదం పట్ల ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పాటలో మార్పులు చేయాలని ఆప్ను ఆదేశించింది. పాటలో మార్పులు చేసిన తర్వాత మళ్లీ తమ ఆమోదం తీసుకోవాలని కోరింది. ఎన్నికల ప్రచార ప్రకటనలో ‘జైల్ కె జవాబ్ మే హమ్ ఓట్ సే దేంగె’అన్న నినాదం వచ్చినపుడు కేజ్రీవాల్ జైళ్లో ఉన్న చిత్రాన్ని ప్రదర్శిస్తున్న గుంపు అంతా కలిసి న్యాయవ్యవస్థను దూషించినట్లుగా పాటలో ఉంది. న్యాయవ్యవస్థపై నిందలు వేయడం ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమేనని ఈసీ పేర్కొంది. కాగా, తమ ప్రచార ప్రకటనపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు బీజేపీ కుట్ర అని ఆప్ మండిపడింది. ఎన్నికల చరిత్రలో ఒక ప్రచార పాటపై నిషేధం విధించడం ఇదే మొదటిసారని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిషి అన్నారు. సీబీఐ, ఈడీలపై నిందలు వేస్తే ఎన్నికల కమిషన్ తమ ప్రచార పాటపై నిషేధం విధించడమేంటని ప్రశ్నించారు. ఈడీ, సీబీఐలు తమని అక్రమ అరెస్టులు చేస్తున్నప్పుడు ఎన్నికల కమిషన్ ఎందుకు స్పందించలేదో చెప్పాలన్నారు. -
‘నా ఓటు మార్పు కోసం... ద్వేషం కోసం కాదు’
‘‘ఎవరో ఒకరు... ఎపుడో అప్పుడు...నడవరా ముందుగా.. అటో.. ఇటో.. ఎటో వైపు’’అప్పుడెప్పుడో వచ్చిన సినిమా ‘అంకురం’ కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన గీతం!ఈ వీడియో చూస్తే ఆ పాట గుర్తుకు రాక మానదు. బెంగళూరు ట్రాఫిక్ కూడళ్లలో పండు ముదుసలి ఒకరు.. ‘‘నా ఓటు మార్పు కోసం... ద్వేషం కోసం’ కాదు అన్న ప్లకార్డ్ పట్టుకుని ఒంటరిగా ప్రచారం చేశారు. ఆ అనుభవజ్ఞుడి ప్రచారానికి జనాలూ ఫిదా అయ్యారు. ‘‘మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు’’ అంటూ కొందరు ప్రశంసించడమూ ఈ వీడియోలో చూడొచ్చు. ನನ್ನ ಮತ ದ್ವೇಷಕ್ಕಾಗಿ ಅಲ್ಲ❌ನನ್ನ ಮತ ಬದಲಾವಣೆಗಾಗಿ✅ಒಂದು ವಿನೂತನ ಕ್ಯಾಂಪೇನ್👇 pic.twitter.com/MwkXcYe3JR— Mamatha R (@mamathcr) April 25, 2024 ఇక.. రేపు (శుక్రవారం) దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరగనుంది. లోక్సభ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. -
సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు.. షెడ్యూల్ ఇదే
సాక్షి, తాడేపల్లి: 22 రోజుల్లో 23 జిల్లాలు.. 86 నియోజకవర్గాలు.. 2,188 కి.మీలు.. 9 భారీ రోడ్ షోలు 6 ప్రత్యేక సమావేశాలు 16 బహిరంగ సభలు.. జన ప్రభంజనం మధ్య జైత్ర యాత్రలా సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సాగింది. మండుటెండైనా, అర్ధరాత్రయినా పిల్లలు, పెద్దలు ఆత్మీయ స్వాగతం పలికారు. యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసింది. మరో జైత్రయాత్రకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. ఈ నెల 28న తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచార సభలు ప్రారంభించనున్నారు.మొదటి నాలుగు రోజుల టూర్ షెడ్యూల్ను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసింది. ప్రతిరోజూ మూడు బహిరంగ సభల్లో సీఎం పాల్గొననున్నారు. 28న ఉదయం తాడిపత్రి, మధ్యాహ్నం వెంకటగిరి, సాయంత్రం కందుకూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరు.. 30న కొండేపి, మైదుకూరు, పీలేరు.. మే 1న బొబ్బిలి, పాయకారావుపేట, ఏలూరులో జరిగే సభలకు సీఎం జగన్ హాజరుకానున్నారు.మొదటి నాలుగు రోజుల టూర్ షెడ్యూల్28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరు30న కొండెపి, మైదుకూరు, పీలేరుమే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు -
డీజిల్ మొదలుకొని సభల వరకూ.. ప్రజల సొమ్ముతోనే ప్రచారం!
దేశంలో లోక్సభ ఎన్నికల సందడి నెలకొంది. పలు పార్టీలకు చెందిన నేతలు తమ ప్రచారాలను ముమ్మరం చేశారు. ఈ నేపధ్యంలో పలు వింత దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. గుజరాత్లోని బనస్కాంత లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన గనీబెన్ ఠాకూర్ ప్రచారతీరును చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే! ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకువెళుతున్న గనీ బెన్ అందుకు అయ్యే ఖర్చును అక్కడి జనం నుంచి వసూలు చేస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ తన ఎన్నికల ఖర్చుల కోసం చాలామంది విరాళాలు ఇచ్చారని తెలిపారు. అందుకు ప్రతిగా బనస్కాంత ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. గత 10 రోజుల్లో తాను నిర్వహించిన బహిరంగ సభల ఏర్పాటుకు అయ్యే ఖర్చులను పలువురు భరించారని తెలిపారు. తన కారు డీజిల్ ఖర్చును కూడా జనమే చూసుకుంటున్నారని తెలిపారు. ప్రజల నుండి ఆర్థిక సహాయం కోరేందుకు కాంగ్రెస్ ‘దేశం కోసం విరాళం’ ప్రచారాన్ని ప్రారంభించిందని ఆమె తెలిపారు. బనస్కాంతలో కాంగ్రెస్ అభ్యర్థి గనీ బెన్పై బీజేపీ నుంచి ప్రొఫెసర్ రేఖా చౌదరి ఎన్నికల బరిలోకి దిగారు. రేఖా చౌదరి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గుజరాత్లోని మొత్తం 26 లోక్సభ స్థానాలకు మే 7న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. కాగా 2013లో జరిగిన ఉప ఎన్నికతో సహా గత మూడు లోక్సభ ఎన్నికల్లో బనస్కాంత సీటును బీజేపీ గెలుచుకుంది. -
ప్రచారం చేస్తా.. బెయిల్ ఇవ్వండి: మనీష్ సిసోడియా
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మధ్యంతర బెయిల్ పిటిషన్ను కోర్టు శుక్రవారం(ఏప్రిల్ 12) విచారించింది. ఈ నెల 20లోపు సిసోడియా బెయిల్ పిటిషన్పై స్పందన తెలియజేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐలకు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. లోక్సభ ఎన్నికలు సమీపించింనదున ఆమ్ఆద్మీపార్టీ తరపున ప్రచారం కోసం తనకు మధ్యంత బెయిల్ ఇవ్వాలని కోర్టును సిసోడియా కోరారు. ఈ నెల 20వ తేదీన కోర్టు సిసోడియా మధ్యంతర బెయిల్పై విచారణ జరిపే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ మనీష్ సిసోడియాను అరెస్టు చేసింది. అనంతరం ఈడీ కూడా సిసోడియాను ఇదే కేసులో అరెస్టు చేయడం గమనార్హం. అరెస్టు అనంతరం ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవికి సిసోడియా రాజీనామా చేశారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల అరెస్టయిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితుల అరెస్టు.. స్పందించిన ‘దీదీ’ -
ఎన్నికల సిత్రాలు : మండుటెండలో హేమమాలిని జోరు
ప్రముఖ నటి బీజేపీ ఎంపీ హేమమాలిని లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్, మథురలో ఎన్నికల ప్రచారంలో రైతులను కలిసిన హేమమాలిని గోధుమ పొలంలో గడ్డికోసి సందడి చేశారు. పొలాల్లో పని చేసే మహిళలతో ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. ఈ పదేళ్లుగా తాను క్రమం తప్పకుండా కలుస్తున్న రైతులతో మరోసారి మమేకమయ్యేందుకు వారిని కలిసానని, వారి మధ్యలో ఉండటం వారికి కూడా సంతోషాన్నిచ్చిందని, రైతు మహిళలతో కలిసి ఫోటోలకు పోజులివ్వాలని పట్టుబట్టారంటూ ఆమె రాసుకొచ్చింది. మథుర లోక్సభ స్థానం నుంచి బీజేపీ వరుసగా మూడోసారి హేమమాలిని బరిలోకి దిగింది. 1991 నుండి 1999 వరకు, మధుర నాలుగు సార్లు బీజేపీకి కంచుకోటగా ఉంది. అయితే 2004లో మధుర కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. 2009లో ఆర్ఎల్డీకి చెందిన జయంత్ చౌదరి మధుర నుంచి ఎంపీ అయ్యారు. ఇక ఆ తరువాత 2014లో హేమమాలినిని బీజేపీ రంగంలోకి దించింది. 2019 ఎన్నికల్లో, హేమ భర్త, నటుడు ధర్మేంద్ర కూడా ఆమె కోసం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. Today I went into the farms to interact with the farmers who I have been meeting regularly these 10 years. They loved having me in their midst and insisted I pose with them which I did❤️ pic.twitter.com/iRD4y9DH4k — Hema Malini (@dreamgirlhema) April 11, 2024 తిరిగి ఇదే స్థానం బీజేపీ తరఫున 2024 ఎన్నికల్లో హేమమాలిని నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 26న మధురలో రెండో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. 80 మంది పార్లమెంటు స్థానాలున్న యూపీలో మొత్తం ఏడు దశల్లో ఓటింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 19, 26 మే 7, మే 13, మే 20, మే 23 , జూన్ 1 ఏడు దశల్లో ఓటింగ్ జరుగుతుంది. -
గుర్తుతెలియని ప్రచార హోర్డింగ్లపై ఈసీ నిషేధం
సాక్షి,అమరావతి: ఎన్నికల ప్రచార హోర్డింగులపై ప్రింటర్ మరియు పబ్లిషర్ల స్పష్టమైన గుర్తింపును తప్పనిసరి చేస్తూ భారత ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలను బుధవారం( ఏప్రిల్ 10) ఆదేశించింది. మున్సిపాలిటీల స్థలాల్లో గుర్తింపు లేకుండా ఉన్న హోర్డింగ్లపై ఈసీకి ఫిర్యాదులు అందడంతో ప్రధాన ఎన్నికల కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 127A, ప్రింటర్ మరియు ప్రచురణకర్త పేరు, చిరునామా లేకుండా ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, ప్లకార్డులు లేదా బ్యానర్లను ముద్రించడం లేదా ప్రచురించడాన్ని నిస్సందేహంగా నిషేధిస్తున్నట్లు ఈసీ తెలిపింది. పార్టీ, అభ్యర్థి ప్రచారం కోసం ఇచ్చే ప్రకటనలు, వ్యతిరేకంగా ఇచ్చే ఎలాంటి ప్రకటనపై అయినా చిరునామా లేకపోతే నిషేధం వర్తిస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ లేదా ప్రభుత్వం ప్రకటనలకు సంబంధించి ప్రభుత్వ ఖజానా ఖర్చుతో విడుదల చేసే రాజకీయ ప్రకటనలను కూడా ఈసీ నిషేధించింది. ఇదీ చదవండి.. రూ.200 కోట్ల హవాలా గుట్టురట్టు -
జోషీమఠ్లో కానరాని ప్రచారం.. కారణమిదేనా?
ఉత్తరాఖండ్లోని జోషీమఠ్ పేరు వినగానే గతంలో అక్కడ చోటుచేసుకున్న భూమి కుంగుబాటు ఉదంతం గుర్తుకు వస్తుంది. ఇంతకుమునుపు ఈ ప్రాంతం నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన నేతలు ఈసారి ఈ సమీప ఛాయలకు కూడా రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. లోక్సభ ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు శరవేగంగా ప్రచారం సాగిస్తున్నాయి. నేతలు వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఉత్తరాఖండ్లోని జోషిమఠ్, చమోలి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం కనిపించడం లేదు. రాజకీయ నేతలు ఈ ప్రాంతానికి దూరంగా ఉంటున్నారు. ఉత్తరాఖండ్లోని పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో జోషీమఠ్, దసౌలి డెవలప్మెంట్ బ్లాకులో భూమి కుంగిన దరిమిలా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహించిందనే ఆరోపణలున్నాయి. ఈ నేపధ్యంలో అక్కడి ప్రజలు తమను ప్రశ్నిస్తారనే భయంతో ప్రచారానికి నేతలు వెళ్లడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జోషీమఠ్కు చెందిన బీజేపీ నేతలు కూడా ఈ ప్రాంతంలో ప్రచారం నిర్వహించకపోవడం విశేషం. కాగా లోక్సభ ఎన్నికల మొదటి దశలో అంటే ఏప్రిల్ 19న ఉత్తరాఖండ్లోని ఐదు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉత్తరాఖండ్లోని తెహ్రీ గర్వాల్, గర్వాల్, అల్మోరా, నైనిటాల్-ఉధమ్ సింగ్, హరిద్వార్ స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. -
తుక్కుగూడ నుంచే సమర శంఖం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికల సమర శంఖాన్ని పూరించేందుకు సిద్ధమైంది. శనివారం సాయంత్రం హైదరాబాద్ నగర శివార్లలోని రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జన జాతర పేరిట నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ దీనికి వేదిక కానుంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సభ వేదికగా పార్టీ మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయనున్నారు. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన హామీలను కూడా ప్రకటించనున్నారు. మరోవైపు ఈ సభలోగానీ, అంతకుముందుగానీ కాంగ్రెస్ పెద్దల సమక్షంలో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు పారీ్టలో చేరుతారని అంటున్నారు. ఇందులో ముగ్గురి నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తుక్కుగూడ సభ ప్రారంభానికి ముందు నోవాటెల్ హోటల్లో రాహుల్ సమక్షంలో ఈ చేరికలు జరగొచ్చని.. తర్వాత వారు సభలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. చేరేది ఎవరన్నదానిపై మాత్రం గోప్యత పాటిస్తున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి.. టీపీసీసీ జన జాతర సభకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేపట్టింది. 70 ఎకరాల్లో సభా ప్రాంగణం, 550 ఎకరాల్లో పార్కింగ్ సిద్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీపీసీసీ ఇదే ప్రాంగణంలో సభ నిర్వహించి.. సోనియా గాం«దీతో ఆరు గ్యారంటీలను ప్రకటింపజేసింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల శంఖారావానికి కూడా ఇదే ప్రాంగణాన్ని ఎంచుకోవడం గమనార్హం. ఇక ఎండలు మండిపోతున్న నేపథ్యంలో సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మంచినీటి కొరత రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంటు స్థానాల వారీ ఇన్చార్జులు, అసెంబ్లీ సమన్వయకర్తల సమన్వయంతో.. సభకు 10లక్షల మందికిపైగా తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని కా>ంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన విజయాలను ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణకు ప్రత్యేక హామీలు తుక్కుగూడ సభలో కాంగ్రెస్ జాతీయ స్థాయి మేనిఫెస్టో ‘పాంచ్ న్యాయ్’ను తెలుగులో విడుదల చేయనుంది. దీనితోపాటు రాహుల్ గాంధీ తెలంగాణకు ప్రత్యేక హామీలను ఇవ్వనున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీలో కలిపిన ఐదు భద్రాచలం సమీప గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తామని.. విభజన చట్టం హామీలన్నీ అమలు చేస్తామని హామీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఐటీఐఆర్ వంటి ఉపాధి ప్రాజెక్టును కేటాయిస్తామనే హామీ కూడా ఉంటుందని తెలిసింది. చేరికలపై గోప్యత జన జాతర సభ సందర్భంగా బీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చేరికల అంశాన్ని టీపీసీసీ గోప్యంగా ఉంచుతోంది. పార్టీ ముఖ్య నేతతోపాటు ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఓ నాయకుడికి మాత్రమే దీనిపై స్పష్టత ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి చేరే అవకాశం ఉందని.. నోవాటెల్ హోటల్లో రాహుల్ గాం«దీని ఎంపీ కె.కేశవరావు కలుస్తారని మాత్రం పేర్కొంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్లో చేరేవారు వీరే అంటూ కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు ప్రచారం అవుతున్నాయి. కాలేరు వెంకటేశ్, కోవ లక్ష్మి, కాలె యాదయ్య, బండారి లక్ష్మారెడ్డి, గంగుల కమలాకర్, టి.ప్రకాశ్గౌడ్, మాణిక్రావు, డి.సు«దీర్రెడ్డి, అరికెపూడి గాం«దీ, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్ ఈ జాబితాలో ఉన్నట్టు చెప్తున్నారు. కానీ వీరిలో ఎందరు చేరుతారు, ఎవరు చేరుతారన్నది స్పష్టత లేదు. దీనిపై టీపీసీసీ ముఖ్య నాయకుడొకరు మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్కు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడమైతే ఖాయమే. అన్ని సన్నివేశాలను వెండితెరపై చూడాల్సిందే..’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. శంషాబాద్ నుంచి నోవాటెల్కు.. తర్వాత సభకు.. రాహుల్ గాంధీ శనివారం సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్ హోటల్కు వస్తారు. కొంతసేపు పార్టీ నేతలతో భేటీ అయ్యాక.. తుక్కుగూడ సభకు చేరుకుంటారు. సభ ముగిశాక రాత్రి 7 గంటల సమయంలో శంషాబాద్ మీదుగా తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు. -
‘జన జాతర’కు ప్రియాంక
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. ఇందిరాగాంధీ గతంలో ప్రాతినిధ్యం వహించిన మెదక్ లోక్సభ స్థానంతో పాటు పార్టీకి విజయావకాశాలున్న పలు చోట్ల ఆమె చురుగ్గా ప్రచారం నిర్వహించే అవకాశాలున్నాయని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఈసారి ఎన్నికల్లో తెలంగాణ పరిధిలో ఆమె సేవలు వినియోగించుకోవాలని ఏఐసీసీ స్థాయిలో నిర్ణయించిన కారణంగానే ఈనెల 6వ తేదీన తుక్కుగూడలో జరగనున్న ‘జనజాతర’సభకు హాజరు కానున్నట్టు సమాచారం. తొలుత ఈ సభకు రాహుల్గాందీ, మల్లికార్జు న ఖర్గే మాత్రమే రావాలని నిర్ణయించినా ప్రియాంకను కూడా పంపాలని ఏఐసీసీ నిర్ణయించింది. తుక్కుగూడ సభతో పాటు లోక్సభ ఎన్నికల ప్రచార షెడ్యూల్ను ఏఐసీసీతో సమ న్వయం చేసే బాధ్యతలను టీపీసీసీ ముఖ్య నేతలకు అప్పగించినట్టు తెలుస్తోంది. మేనిఫెస్టో.. మరుసటి రోజే తుక్కుగూడ సభను టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశ వ్యాప్తంగా జరిగే లోక్సభ ఎన్నికల కోసం ఈనెల ఐదో తేదీన మేనిఫెస్టో విడుదల చేసిన మరుసటి రోజే తుక్కుగూడలో సభ జరుగుతుండడం, సభకు రాహుల్, ప్రియాంక, ఖర్గే తదితర ముఖ్యులు హాజరు కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జనసమీకరణ చేపట్టాలని భావిస్తోంది. భారీ జనసందోహం మధ్య లోక్సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ నుంచే ఏఐసీసీ జంగ్ సైరన్ మోగిస్తుందని టీపీసీసీ వర్గాలు చెపుతున్నాయి. ఈ సభలో పార్టీ మేనిఫెస్టోతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలుచేయనున్న ఐదు గ్యారంటీలను తెలుగులో విడుదల చేయనున్నారు. అచ్చొచ్చిన చోట.. పది లక్షల మందితో తుక్కుగూడలోని 60 ఎకరాల విశాలమైన మైదానంలో జన జాతర బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. మైదానం పక్కనే వాహనాల పార్కింగ్ కోసం 300 ఎకరాల స్థలాన్ని అందుబాటులో ఉంచారు. ఈ సభకు కనీసం పదిలక్షల మంది హాజరవుతారని గాందీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు, జహీరాబాద్ నుంచి భద్రాచలం వరకు పెద్ద ఎత్తున పార్టీ కేడర్ తరలివచ్చేలా ఎక్కడికక్కడ ఏర్పాట్లుచేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డితో పాటు పలువురు మంత్రులు ఈ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా తుక్కుగూడ నుంచే రేవంత్ నేతృత్వంలో టీపీసీసీ ఎన్నికల సమర శంఖాన్ని పూరించింది. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా గత ఏడాది సెపె్టంబర్ 17న ఇక్కడ నిర్వహించిన సభకు సోనియాగాంధీ హాజరై ఆరు గ్యారంటీలను ప్రకటించారు. విజయభేరి పేరుతో సభ నిర్వహించిన ఈ ప్రాంతం కలిసివచ్చిందని, తెలంగాణలో అధికారంలోకి తెచ్చిన ప్రారంభ సభ ప్రాంతాన్నే లోక్సభ ఎన్నికల కోసం ఎంచుకున్నామని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సభ స్ఫూర్తితోనే దేశంలో పదేళ్లనియంతృత్వ, అప్రజాస్వామిక బీజేపీ పాలనకు తెరదించుతామని చెబుతున్నాయి. ఆసక్తి రేపుతున్న రేవంత్ వ్యాఖ్యలు గత ఎన్నికలకు ముందు తుక్కుగూడలో నిర్వహించిన సభలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతుందని అప్పటి పీసీసీ అధ్య క్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. డిసెంబర్ 9న కొలువుదీరే ప్రజాప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి అందరూ ఆహా్వనితులేనని చెప్పుకొచ్చారు. ఈనెల 6న జరిగే సభ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించేందుకు రెండురోజుల కిందట తుక్కుగూడకు వచ్చిన సీఎం.. జూన్ 9న ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ప్రకటించారు. దీంతో తుక్కుగూడ వేదికగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. -
‘మా ఊరికి రావద్దు.. అన్ని ఓట్లూ నోటాకు వేసేస్తాం’
ఎన్నికల ప్రచారం ఎక్కడికక్కడే ఊపందుకుంటోంది కానీ కేరళ రాష్ట్రం కన్నూర్లోని నడువిల్ గ్రామ వాసులు మాత్రం ప్రచారానికి నో చెబుతున్నారు. కారణం అధ్వాన్నమైన రోడ్లు. మెరుగైన రోడ్లు వేయనందుకు నిరసనగా తమ గ్రామంలో ఎలాంటి ఎన్నికల ప్రచారానికి అనుమతించబోమని ఆ గ్రామస్తులు ప్రకటించారు. తమ ప్రాంతానికి ఓట్లు అడగడానికి అభ్యర్థులెవరూ రాకూడదంటూ వివిధ చోట్ల ఫ్లెక్స్ బోర్డులు ఏర్పాటు చేశారు. నడువిల్లి పంచాయతీ పరిధిలోని 9, 10, 11, 12 వార్డుల్లోని నాలుగు ప్రధాన రహదారులు అధ్వానంగా మారాయి. రోడ్ల మరమ్మతులకు ఎన్నిసార్లు విన్నవించినా ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్లు అధ్వానంగా ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో తమ గ్రామానికి డ్రైవర్లు ఎవరూ రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహిస్తున్నారు. "ఎన్నో ఏళ్లుగా ఈ బూటకపు వాగ్దానాలు వింటూనే ఉన్నాం. వారి మాటలను ఇకపై విశ్వసించం. ప్రజాప్రతినిధులు, అధికారులు రాతపూర్వక హామీ ఇస్తేనే ఈ ఎన్నికల్లో పాల్గొంటాం. లేకపోతే అన్ని ఓట్లు నోటా వేసేస్తాం" అని నడువిల్లి గ్రామస్తులు తెగేసి చెప్పేస్తున్నారు. కాగా ఇటీవలే రెండు రోడ్లకు నిధులు కేటాయించామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు చేపడతామని పంచాయతీ అధికారులు చెబుతున్నారు. -
మొదలైన యూసఫ్ పఠాన్ ప్రచారం: అధీర్ చౌదరి కీలక వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రకటించిన 42 మంది అభ్యర్థులలో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ 'యూసఫ్ పఠాన్' (Yusuf Pathan) పేరు కూడా ఉంది. ఈయన బహరంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. 'అధీర్ రంజన్ చౌదరి'కి కాంగ్రెస్ కంచుకోట అయిన బహరంపూర్ నియోజకవర్గంలో యూసఫ్ పఠాన్ నిలబడటం సర్వత్రా చర్చలకు దారి తీసింది. నిజానికి ఇప్పటికే చౌదరి బహరంపూర్ నుంచి ఐదుసార్లు గెలిచారు. అలాంటి చోట నుంచి ఇప్పుడు యూసఫ్ పఠాన్ పోటీ చేయనున్నారు. #WATCH | West Bengal: Former cricketer and Trinamool Congress (TMC) candidate from Berhampore Yusuf Pathan says, "The field is very different but the expectations of the people remain the same- that I work for them, and carry forward the work done by my team (TMC)... I am as… pic.twitter.com/1XGmyrKhTW — ANI (@ANI) March 21, 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించినందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి యూసఫ్ పఠాన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రచారాన్ని ప్రారంభించిన సమయంలో యూసుఫ్ పఠాన్ మాట్లాడుతూ.. తాను క్రికెట్ ఆడేటప్పుడు ప్రజల ప్రేమను పొందానని, ఇప్పుడు లోక్సభ పోటీదారుగా ప్రజల్లో ఉండటానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. 'అధీర్ రంజన్ చౌదరి' యూసుఫ్ పఠాన్ బెర్హంపూర్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడంపై వ్యాఖ్యానిస్తూ.. రాజకీయాలు & క్రికెట్ ఒకేలా ఉండవని అన్నారు. అయితే చౌదరిని బెర్హంపూర్ స్థానం నుంచి లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ అధికారికంగా నామినేట్ చేయలేదు. బెర్హంపూర్ లోక్సభ స్థానానికి మే 13న నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి. #WATCH | Murshidabad, West Bengal: Yusuf Pathan, former cricketer and Trinamool Congress (TMC) candidate from Berhampore says, "I am grateful to Mamata Didi (CM Mamata Banerjee) for giving me the opportunity to serve you. I hope that the way you people have given me love for the… pic.twitter.com/N7ihjlPXhU — ANI (@ANI) March 21, 2024 -
ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ సిద్ధం..ప్రచారం అక్కడినుండే..
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement