-
మాజీ సీఎంపై కేసు.. ఆశ్చర్యం కలిగించిందన్న ప్రముఖ సింగర్!
కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పపై లైంగికదాడి కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తన కూతురిపై యడ్యూరప్ప లైంగికదాడి చేశారని ఓ 17 ఏళ్ల బాలిక తల్లి బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్స్టేషన్లో కేసు పెట్టింది. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద యడ్యూరప్పపై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ అరెస్ట్పై ఫెమినిస్ట్, సింగర్ చిన్మయి శ్రీపాద రియాక్ట్ అయింది. ఇది తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందని ట్వీట్ చేసింది. అంతే కాకుండా ఆ వార్తకు సంబంధించిన క్లిప్ను షేర్ చేసింది. కాగా.. దేశంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అన్యాయాలపై సోషల్ మీడియా వేదికగా పోరాటం చేస్తోంది. మనదేశంలో మహిళలకు రక్షణ లేదని చాలాసార్లు తన ట్వీట్ల ద్వారా వెల్లడించింది. ఇటీవల స్పెయిన్ జంటపై జరిగిన లైంగిక దాడిపై కూడా చిన్మయి స్పందించిన సంగతి తెలిసిందే. అసలేం జరిగిందంటే.. ఒక కేసులో సాయం అడిగేందుకు ఫిబ్రవరి 2న యడ్యూరప్ప ఇంటికి వెళ్లినపుడు తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో బాలిక తల్లి పేర్కొన్నట్లు సమాచారం. యడ్యూరప్ప ఇప్పటికి మూడుసార్లు కర్ణాటక సీఎంగా పనిచేశారు. 2021లో యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు. There is a POCSO case lodged against former Karnataka Chief Minister B S Yediyurappa for sexually harassing a minor. I am stunned. pic.twitter.com/vjY4ynwurR — Chinmayi Sripaada (@Chinmayi) March 15, 2024 -
సింగర్ చిన్మయి శ్రీపాదపై కేసు నమోదు
-
ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా నుంచి వీడియో సాంగ్ లాంచ్
ప్రణవ్, షజ్ఞ శ్రీ హీరో హీరోయిన్లుగా శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో కొవ్వూరి అరుణ గారి సమర్పణ లో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వస్తున్న సినిమా ప్రభుత్వ జూనియర్ కళాశాల. గతంలో ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్, టీజర్ అండ్ సాంగ్ విడుదలై మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన రెండో సాంగ్ చల్లగాలి అంటూ సాగే రొమాంటిక్ పాటని వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పటివరకు లిరికల్ సాంగ్స్ రిలీజ్ అవ్వడమే కానీ ఫస్ట్ టైం మూవీకి సంబంధించిన వీడియో సాంగ్ మూవీ రిలీజ్కు ముందే విడుదల చేయడం చాలా కొత్తగా ప్లాన్ చేశారు టీం. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీనియర్ జర్నలిస్ట్ ప్రభు విచ్చేశారు. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ : 2000's బ్యాక్ డ్రాప్ నేటివిటికి తగినట్టుగా సినిమాను తీసుకొచ్చారు. విజువల్స్ చాలా బాగున్నాయి. మంచి సినిమా, మంచి కంటెంట్కు మీడియా సపోర్ట్తో పాటు ప్రేక్షకుల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అన్నారు. దర్శకుడు శ్రీనాథ్ పులకురం మాట్లాడుతూ : ఈ కాలంలో ప్రైవేట్ కాలేజీలు తప్ప ప్రభుత్వ జూనియర్ కళాశాల అనే మాట చాలా తక్కువ వినిపిస్తోంది. 2000's బ్యాక్ డ్రాప్లో పుంగనూరు గ్రామంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది. చిన్న సినిమా పెద్ద సినిమా అని చూస్తున్నారు కానీ మేము ఒక మంచి సినిమా మంచి బ్యానర్ అండ్ డీసెంట్ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించాం. ఈ సినిమాను ప్రేక్షకులు, మీడియా సపోర్ట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు. నిర్మాత భువన్ రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ : శ్రీనాథ్ చెప్పిన కథ బాగా నచ్చి తనని నమ్మి కథను నమ్మి సినిమా దర్శకుడు అని పేరే కానీ అన్ని దగ్గరుండి చూసుకుని మంచి కాన్సెప్ట్ తో కొత్త కథగా ఈ సినిమాను మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. సినిమా మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు. హీరో ప్రణవ్ మాట్లాడుతూ : డైరెక్టర్ శ్రీనాథ్ గారు నన్ను నమ్మి ఈ కథకు నన్ను సెలెక్ట్ చేశారు సంతోషంగా ఉంది. షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ ఒక యాక్టర్ గా ఎదగాలనుకున్న నన్ను హీరోను చేశారు. కథ చాలా కొత్తగా ఉంటుంది రెండు దశాబ్దాల వెనక్కు వెళ్లేలా రియలిస్టిక్ గా ఈ సినిమాను చేసాం. మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. చిన్మయి పాడిన ఈ పాట కూడా మంచి సక్సెస్ అవుతుంది. సినిమాను మంచి సక్సెస్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము అన్నారు. హీరోయిన్ షజ్ఞ శ్రీ మాట్లాడుతూ : ఈ సినిమాకి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు మా డైరెక్టర్ శ్రీనాథ్కు థాంక్స్ చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఈ సాంగ్ గురించి మాట్లాడదలుచుకున్నాను. విజువల్స్ చాలా బాగా వచ్చాయి డైరెక్టర్ టేకింగ్తో పాటు ప్రొడ్యూసర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సాంగ్ను అలాగే సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నారు. మీడియా తలుచుకుంటే ఏదైనా చేయగలదు. మీడియా ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు. -
మళ్లీ రెచ్చిపోయిన సింగర్ చిన్మయి.. తమిళనాడు సీఎంపైనే విమర్శలు!
ప్రముఖ సింగర్ చిన్మయి మరోసారి తన రెచ్చిపోయింది. తనని లైంగికంగా వేధించి, కెరీర్ సర్వనాశనం అయ్యేలా చేసిన వ్యక్తిపై, అతడితో పాటు ఉన్న కమల్ హాసన్, పి.చిదంబరం, సీఎం స్టాలిన్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సింగర్ చిన్మయి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. (ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ చేసుకున్న 'దసరా' విలన్.. అమ్మాయి ఎవరో తెలుసా?) అసలేం జరిగింది? ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు రాసిన 'మహా కవితై' పుస్తకావిష్కరణ తాజాగా చెన్నైలో జరిగింది. దీనికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం, స్టార్ హీరో కమల్హాసన్ తదితరులు హాజరయ్యారు. 'నన్ను వేధింపులకు గురిచేసిన వ్యక్తితో కలిసి తమిళనాడుకు చెందిన కొందరు ప్రముఖులు వేదికపై ఉన్నారు. అతడి గురించి బయటకు చెప్పిన నేను మాత్రం నిషేధానికి గురయ్యాను. కొన్నేళ్లపాటు నా వృత్తి జీవితాన్ని కోల్పోయాను. నా కోరిక నెరవేరేవరకు ప్రార్ధించడం మినహా నేను చేసేది ఏమీలేదు' అని చిన్మయి ట్వీట్స్ చేసింది. అసలేంటి గొడవ? సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ అయిన చిన్మయి.. 2018లో రైటర్ వైరముత్తుపై ఆరోపణలు చేసింది. తనని ఈయన లైంగికంగా వేధించాడని బయటపెట్టింది. మీటూ ఉద్యమం జరుగుతున్న సమయంలో చిన్మయి ఈ ఆరోపణలు చేసింది. ఈమెతో పాటు పలువురు కూడా వైరముత్తు నిజస్వరూపాన్ని బయటపెట్టారు. అయితే వైరముత్తుపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. తమిళ ఇండస్ట్రీలో చిన్మయిపై నిషేధం విధించారు. దీంతో అప్పటినుంచి వైరముత్తపై చిన్మయి ఎప్పటికప్పుడు విరుచుకపడుతూనే ఉంది. ఇప్పుడు కూడా అలానే వైరముత్తుకి సపోర్ట్ చేస్తున్న స్టాలిన్, కమల్ తదితరులపై కూడా విమర్శలు చేసింది. (ఇదీ చదవండి: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు) Some of the most powerful men in Tamilnadu platforming my molester whilst I got banned - years of my career lost. May the entire ecosystem that promotes and supports sex offenders whilst incarcerating honest people who speak up start getting destroyed from this very moment,… https://t.co/J7HcqJYAcV — Chinmayi Sripaada (@Chinmayi) January 1, 2024 Thodangi? yevangalta nyayathukku poganum? Ivangaltaya? Just check the number of politicians with Vairamuthu alone. How does one get justice in this ecosystem? https://t.co/0ubXKXZq7e pic.twitter.com/xjnVZL0xwb — Chinmayi Sripaada (@Chinmayi) January 1, 2024 -
ఐశ్వర్య రాయ్పై అత్యాచారం చేస్తానంటే స్పందించలేదేంటి?: చిన్మయి
స్టార్ హీరోయిన్ త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దూమారం రేపుతున్నాయి. లియో సినిమాలో త్రిషతో బెడ్ రూమ్ సన్నివేశాలు ఉంటాయని భావించానని, అలాంటి సీన్స్ లేకపోవడం నిరాశకలిగించిందని మన్సూర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అతని వ్యాఖ్యలపై త్రిష తీవ్రంగా మండిపడింది. ఇకపై అతనితో నటించబోనని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సినీ ప్రముఖులంతా త్రిషకు మద్దతుగా నిలిచారు. ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవితో పాటు పలువురు హీరోహీరోయిన్లు త్రిషకు మద్దతు ప్రకటిస్తూ..మన్సూర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఒక అడుగు ముందుకేసి ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని మన్సూర్కు నోటీసులు జారీ చేసింది. అయితే మన్సూర్ మాత్రం త్రిషకు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదంటున్నారు. తాను సరదాగా అన్న మాటలను కొంతమంది కావాలనే వక్రీకరించారని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. ఈ వివాదంపై గాయని చిన్మయి శ్రీపాద తనదైన స్టైల్లో స్పందించింది. మన్సూర్ మాత్రమే అలాంటి వ్యాఖ్యలు చేయలేదని..గతంలో చాలా మంది హీరోయిన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. నటుడు రాధా రవికి సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. (చదవండి: త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. సారీ చెప్పే ప్రసక్తే లేదన్న మన్సూర్) అందులో రాధా రవి ఓ సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ..‘నాకు హిందీ భాష రాదు. ఒకవేళ వచ్చి ఉంటే ఐశ్వర్యను రేప్ చేసే వాడ్ని. ఎందుకంటే అక్కడి వాళ్లు ఎలాగో నాకు మంచి పాత్రలు ఇచ్చేవాళ్లు కాదు. అత్యాచారం చేసే పాత్రలే ఇచ్చేవాళ్లు’ అని సరదాగా అన్నారు. రాధ రవి మాటలకు అక్కడి వారంతా నవ్వేశారు. ఈ వీడియోని చిన్మయి ఎక్స్(ట్విటర్)లో షేర్ చేస్తూ.. రాధరవి..ఐశ్వర్య రాయ్ని రేప్ చేస్తానంటే అంతా జోక్గా తీసుకొని నవ్వేశారు. అలాంటి వ్యాఖ్యలే చేసిన మన్సూర్పై చర్యలు తీసుకోవాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. మరి రాధ రవి వ్యాఖ్యల మీద ఎవరూ స్పందించకపోవడానికి కారణం ఏంటో తెలుసుకోవాలని ఉంది’అని చిన్మయి రాసుకొచ్చింది. (చదవండి: యాంకర్ రష్మీతో పెళ్లెప్పుడు? సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్!) చిన్మయి షేర్ చేసిన వీడియోపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. అతను రేప్ సన్నివేశాల గురించి మాత్రమే మాట్లాడరని కొంతమంది కామెంట్ చేస్తే.. మరికొంతమంది రాధరవిపై కూడా చర్యలు తీసుకోవాల్సిందని అభిప్రాయపడుతున్నారు. "I have once said that if I had known Hindi, I would have had the opportunity to rape Aishwarya Rai. What I meant was I would have acted in Bollywood. Why the hell should I then act with these saniyans (idots/sinners in Tamil)." - Radha Ravi Here in this video in Tamil where you… pic.twitter.com/j9qLQwdRA7 — Chinmayi Sripaada (@Chinmayi) November 21, 2023 -
నన్ను చాల హెరాస్ చేశాడు..!
-
నేను చూసిన వారిలో సమంత స్ట్రాంగ్ ఉమెన్
-
అమ్మాయిలకు పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి: చిన్మయి
-
ఎంత కావాలో చెప్పు అంటూ.. సింగర్ చిన్మయిపై వల్గర్ కామెంట్
ప్రముఖ గాయనిగా చిన్మయి శ్రీపాదకు మంచి గుర్తింపు ఉంది. అంతేకాకుండా సమంతకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించిన ఆమె మల్టీటాలెంటెడ్గా చిత్ర పరిశ్రమలో రానించింది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చిన్మయి తరుచూ సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతుంది. ఎదుటివారు ఎంతిటివారైనా సరే తను ఓపెన్గానే విరుచుకుపడుతుంది. దీంతో ఆమెపై ఒక వర్గం నెటిజన్లు ట్రోల్స్ కూడా చేస్తూ ఉంటారు. (ఇదీ చదవండి: బోరున ఏడ్చేసిన రతిక తల్లిదండ్రులు.. అందరినీ కదిలిస్తున్న వ్యాఖ్యలు ) తాజాగా అలాంటి సంఘటనే సోషల్ మీడియాలో ఆమెకు ఎదురైంది. కొద్దిరోజుల క్రితం ఆమెకు ఒక నెటిజన్ ఇలా మెసేజ్ చేశాడు. 'మీరంటే నాకు చాలా ఇష్టం. సాటి అమ్మాయిల కోసం నిలబడే తీరు నాకు ఎంతో నచ్చింది. ఇలాగే మీరు ఎప్పుడూ ఉండాలి. మా సోదరికి కూడా అలాంటి చేదు అనుభవాల వల్ల ఇబ్బందులు ఎదుర్కుంది.' అని మెసేజ్ చేశాడు. కానీ చిన్మయి తిరిగి సమాధానం ఇవ్వకపోవడంతో అతనిలో దాగున్న అసలు స్వరూపం బయటకు వచ్చింది. మళ్లీ ఇలా మెసేజ్ చేశాడు. 'నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తా.. నాతో కొంత సమయం స్పెండ్ చేస్తావా.?' అంటూ మరో అర్థం వచ్చేలా మెసేజ్ పెట్టాడు. అంతటితో ఆగక 'నీకు ఏం కావాలన్నా కొంటాను.. లగ్జరీ జీవితాన్ని ఇస్తాను.' అని వరుసబెట్టి మెసేజ్లు పంపాడు. (ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్, ఏడ్చేసిన వరుడు) దీనిపై చిన్మయి ఫైర్ అయింది. ఈ చెత్త ఎదవను చూడండి మొదట పద్దతిగా మెసేజ్లు చేశాడు.. నేను తిరిగి రిప్లై ఇవ్వకపోవడంతో వాడి ఈగో దెబ్బతిన్నట్లు ఉంది. దీంతో వాడి అసలు రూపం బయటకొచ్చింది. ఇలాంటి వాడ్ని ఏం చేయాలి.. ముందు వాడి నాన్నను అనాలి. ఇంత చెత్తగా పిల్లలను ఎలా పెంచాడు. ఇలాంటి ఎదవలు సమాజంలో చాలామందే ఉన్నారు. అమ్మాయిలా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చిన్మయి తెలిపింది. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
అక్కడికెళ్లిన అమ్మాయిల వీడియో షేర్ చేసిన నటి.. నెటిజన్ల ఫైర్
నటి కస్తూరి శంకర్ మొదట్లో సినిమాలకు మాత్రమే పరిమితం అయిన ఆమె పలు స్టార్ హీరోలతో నటించడమే కాకుండా పాపులర్ అయింది. ప్రస్తుతం ఆమె స్టార్ మాలో ప్రసారమయ్యే ఇంటింటి గృహాలక్ష్మి సీరియల్లో తులసిగా బుల్లితెరపై అలరిస్తోంది. ఓ గృహిని పడే కష్టాలు, భర్త నుంచి విడిపోయిన అనంతరం సమాజం నుంచి ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉంటాయనేది తెరపై చూపిస్తోంది. దీంతో తులసిగా కస్తూరి బుల్లితెరపై ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే కస్తూరి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందనే విషయం తెలిసిందే. సమాజంలో జరిగే ప్రతి అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంది. దీంతో ఒక్కోసారి ఆమెపై వ్యతిరేకత కూడా వస్తుంటుంది. (ఇదీ చదవండి; స్టార్ హీరోపై విడాకుల రూమర్స్.. విదేశాల్లో ఉందంటూ!) తాజాగా ఆమె ఇద్దర అమ్మాయిలకు సంబంధించిన వ్యక్తిగత వీడియోను షేర్ చేసింది. దీంతో ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు వైన్ షాపునకు వెళ్లి మద్యం సీసాలు కొంటారు. దానిని షేర్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చింది. 'తాగండి అమ్మాయిలు తాగండి.. ఏ మాత్రం తగ్గద్దు. ఎనిమిది మందిలో ఈమె ఒక్కరే మగరాయుడు. ఇదీ ఏ మాత్రం తప్పుకాదు, అసహ్యమూ కాదు. ఏమవుతుంది మహా అయితే వాట్సాప్ ఫార్వర్డ్ ఆఫ్ ద డే అవుతుంది. మీరు సూపర్.. మహిళల హక్కుల గురించి ఆలోచించకుండానే తిరిగి వస్తున్నాయి.' అంటూ కామెంట్ చేసింది. దీంతో వాళ్లను పొగుడుతున్నావా..? లేదా తప్పుబడుతున్నావా..? ఏ మాత్రం అర్థం కావడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే కస్తూరిపై సీరియస్ అవుతున్నారు. అమ్మాయిల వీడియోను ఇలా నెట్టింట షేర్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చిత్రపరిశ్రమలోని ప్రముఖలకు చెందిన అమ్మాయిలు పబ్లకు వెళ్తున్నారు. వారి ఫోటోలు కూడా ఇలా షేర్ చేసే దమ్ము నీకు ఉందా..? అంటూ మండిపడుతున్నారు. ఇదే విషయంపై ప్రముఖ సింగర్ చిన్మయి కూడా స్పందించింది. 'కస్తూరి నువ్వు ఇలా షేర్ చేయాల్సిన అవసరం ఏమెచ్చింది. నిజాయితీగా చెప్తున్నా. ఇది చాలా తప్పు' అంటూ ట్వీట్ చేసింది. దీంతో చిన్మయిని నెటిజన్లు మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. అమ్మాయిలు అయినంత మాత్రనా మద్యం తీసుకోకుడదా..? వారికంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయినేది గుర్తించాలి. మద్యం మగవారు మాత్రమే తీసుకోవాలని రాసి ఉందా..? అని కస్తూరిపై ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా వీడియో షేర్ చేయడంతో ఆమెపై కోలీవుడ్లో పెద్ద దుమారమే రేగుతుంది. தண்ணியடி, பெண்ணே தண்ணியடி ! எட்டு மறிவினில் ஆணுக்கிங்கே பெண் இளைப்பில்லை காணென்று தண்ணியடி. WhatsApp fwd of the day. As received. Super. அப்ப பெண்கள் உரிமை தொகை சிந்தாம சிதறாம திரும்பிடும் 🫤#dravidamodel pic.twitter.com/7SA889fwpp — Kasturi (@KasthuriShankar) July 13, 2023 (ఇదీ చదవండి: స్టార్ హీరో కుమారుడు తెరంగేట్రం.. ఏకంగా స్టార్ హీరోయిన్ కూతురితోనే!) -
మీరు అలా మాట్లాడుతుంటే సిగ్గేస్తోంది సార్: సీఎం తీరుపై సింగర్ ఫైర్
సింగర్ చిన్మయి పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. గతంలో మీటూ ఉద్యమంలో పలువురిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. తమిళ పాటల రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలతో ఆమెను కోలీవుడ్ నుంచి నిషేధానికి కుడా గురైంది. అయితే తాజాగా గురువారం వైరముత్తు బర్త్ డే సందర్భంగా సీఎం స్టాలిన్ చేసిన పనికి మరోసారి వార్తల్లో నిలిచింది. ట్విటర్ వేదికగా ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. (ఇది చదవండి: నాది చాలా చిన్న వయసు.. వారి ఉద్దేశమేంటో గుర్తించలేకపోయా: బుల్లితెర నటి) సింగర్ చిన్మయి చేసిన ట్వీట్ కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. వైరముత్తు బర్త్ డే సందర్భంగా సీఎం స్టాలిన్ వ్యక్తిగతంగా కలిసి.. ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సింగర్ చిన్మయికి ఆగ్రహం తెప్పించింది. రాజకీయ నాయకులు మహిళల భద్రతల గురించి మాట్లాడితే సిగ్గేస్తోందని ఘాటుగా విమర్శించింది. రాజకీయ నాయకుల అండతోనే వారు మరింత రెచ్చిపోతున్నారని ఆరోపించింది. ట్వీట్లో చిన్మయి రాస్తూ.. 'తమిళనాడు ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంటికి వెళ్లి అతని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపడం. నేను ఒక మహిళగా అతనిపై మీటూ ఉద్యమంలో ఆరోపణలు చేసినందుకు 2018 నుంచి తమిళ ఇండస్ట్రీలో బ్యాన్ విధించారు. రాజకీయ అండతో ఒక రచయిత ఏ స్త్రీపైనా చేయి వేయగలడని ఫిక్స్ అయిపోయాడు. రాజకీయ నాయకులతో అతనికి ఉన్న సాన్నిహిత్యంతో మౌనంగా ఉండమని ఓ మహిళను బెదిరించాడు. అందుకే పద్మ అవార్డులు, సాహిత్య నాటక అకాడమీ, జాతీయ అవార్డులను అందుకున్నాడు. ఈ మనిషికి ఉన్న శక్తి ఇది. నన్ను చాలా మంది మహిళలు ఇంతకు ముందు ఎందుకు మాట్లాడలేదని అడిగారు. తమిళనాడులో రాజకీయ నాయకులు చేసే ప్రసంగాల్లో మహిళల భద్రత కోసం మాట్లాడడం తలుచుకుంటే సిగ్గేస్తోంది. ఎందుకంటే వైరముత్తు అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు వారంతా మౌనంగా ఉంటారు. ఈ భూమి అద్భుతమైన సంస్కృతిని కలిగి ఉంది. ప్రతి సంవత్సరం మహిళలను వేధించేవారి పుట్టినరోజు జరుపుకుంటారు. కానీ వీటిపై మాట్లాడిన మహిళలను వేధిస్తారు. మనకు సున్నితత్వం, సానుభూతి, విద్యపైనా అవగాహన మాత్రం శూన్యం. బ్రిజ్ భూషణ్ నుంచి వైరముత్తు వరకు ఎల్లప్పుడు రాజకీయ నాయకులు వీరిని కాపాడతారు. ఈ భూమిలో ప్రాథమికంగా దొరకని న్యాయం కోసం ఎదురుచూడటం బాధాకరమైన విషయం' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (ఇది చదవండి: ప్రియుడిని పెళ్లాడిన హీరోయిన్, వీడియో వైరల్) The Chief Minister of Tamilnadu personally visits the home of a man accused by several women of sexual harassment to wish him on his birthday; I, as a multiple award winning singer and voice over artiste, face a work ban by the Tamil Film Industry since 2018, for naming this poet… https://t.co/8RpQ120swZ — Chinmayi Sripaada (@Chinmayi) July 13, 2023 -
సింగర్ చిన్మయిపై ట్రోల్స్ మొదటిసారి స్పందించిన రాహుల్
ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాదపై ట్రోల్స్ ఆపేయండని ఆమె భర్త నటుడు రాహుల్ వవీంద్రన్ తొలిసారి విజ్ఞప్తి చేశారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చిన్మయి తరుచూ సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతుంది. మీటూ ఉద్యమం సమయంలో కోలీవుడ్ సినీ గేయ రచయిత వైరముత్తు వంటి వారి ప్రవర్తనపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఆతనిపై చిన్మయి లైంగిక ఆరోపణలు కూడా చేసింది. వైరముత్తుపై చర్యలు తీసుకోవాలని పెద్ద పోరాటమే చేసింది. దీంతో ఆమె కోలీవుడ్ పరిశ్రమ నుంచి కూడా బహిష్కరణ ఎదుర్కొంది. తాజాగా మళ్లీ నెటిజన్లు ఆమెను ట్రోల్స్ చేస్తూ.. రాహుల్ ఖాతాను ట్యాగ్ చేయడంతో ఆయన ఒక నోట్ విడుదుల చేశారు. (ఇదీ చదవండి: అలాంటి సన్నివేశాల్లో నటిస్తే నా భర్తకు ఏం చెప్పాలి : ప్రియమణి) 'చిన్మయిని ఒక సెలబ్రిటీగా చూడకండి. సమాజంలోని సమస్యలపై ఆమె చేసే పోరాటాన్ని చూడండి. ఆమే చేస్తున్న పనిని మెచ్చుకోకపోయిన అర్ధం చేసుకునేందకు ప్రయత్నం చేయండి. ముందుగా ఒక్కసారి ఆమె చెప్పేది వినండి ఏకీభవిస్తారా వ్యతిరేకిస్తారా అనేది మీ ఇష్టం. ఆమె అందరితో ప్రేమగా ఉంటుంది. మీ అభిమానిలా, ఒక అక్కలా ఉంటుంది. ఆమె ప్రేమకు లిమిట్స్ ఉండవు. ఎవరికైన సమస్య వస్తే మరో కోణంలో చూడటం ఉండాలి. అప్పుడే విషయం అర్ధం అవుతుంది.' అని ఆయన నోట్లో తెలిపారు. రాహుల్ పోస్ట్పై తన అభిమానులు మద్దతుగా నిలవగా మరికొందరు నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు పెట్టారు. (ఇదీ చదవండి: Trolls On Bro Teaser: ఇదేం ట్రోలింగ్ 'బ్రో'.. ఆడుకుంటున్నారుగా!) -
తొలిసారి ట్విన్స్ ఫోటోలు షేర్ చేసిన సింగర్..ఏడాది తర్వాత!
సింగర్ చిన్మయి శ్రీపాద తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చురుక్కుగా ఉంటోంది. ఇటీవల ఎక్కువగా మహిళలు, బాలికలపై జరుగుతున్న దారుణాలను ప్రశ్నిస్తూ వారికి అండగా నిలుస్తోంది. అయితే నటుడు, దర్శకుడైన రాహుల్ రవీంద్రన్ను ఆమె పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది జూన్లో ఈ జంటకు ట్విన్స్ జన్మించారు. వారిలో ఓ బాబు, పాప ఉన్నారు. కానీ ఇప్పటి వరకు తమ కవలలను బయటికి చూపించలేదు. (ఇది చదవండి: నేను వాటిని పట్టించుకోను.. కాబోయే వాడు మాత్రం ఇలా ఉంటేనే: శోభిత ధూళిపాళ) దాదాపు ఏడాది తర్వాత తన పిల్లల మొహాలను అభిమానులకు పరిచయం చేసింది చిన్మయి. తన పిల్లలతో దిగిన ఫోటోలను ఇన్స్టా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ వావ్ క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. గతంలో చిన్మయి శ్రీపాద ప్రెగ్నెన్సీపై రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె సరోగసీ ద్వారా పిల్లలకు జన్మినిచ్చారని వార్తలొచ్చాయి. కానీ ఆమె తన బేబీ బంప్ ఫోటోలతో వాటికి చెక్ పెట్టింది. కానీ అదే సమయంలో తన పిల్లల ముఖాలను బహిర్గతం చేయనని కూడా శ్రీపాద చెప్పింది. నా వ్యక్తిగత జీవితం, నా కుటుంబం, నా స్నేహితుల విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంటానని తెలిపింది. మా పిల్లల ఫోటోలు షేర్ సోషల్ మీడియాలో షేర్ చేయనని తెలిపింది. (ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. విడిపోయిన జంట.. నటికి భర్త అసభ్యకర సందేశాలు!) View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
సింగర్ చిన్మయి శ్రీపాద కవలలను చూశారా? ఎంత క్యూట్గా ఉన్నారో! (ఫొటోలు)
-
అవి వేసుకోవడం మన కల్చర్ కాదు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి పరిచయం అక్కర్లేదు. సింగర్గా మాత్రమే డిబ్బింగ్ ఆర్టిస్ట్గానూ రాణించారు. అయితే మహిళల సమస్యలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎలాంటి విషయాన్నైనా ముక్కుసాటిగా మాట్లాడే చిన్మయి.. తాజాగా మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కొందరు యువకులు చేసిన ఇన్స్టా వీడియోపై ఆమె స్పందించారు. భారతీయ స్త్రీల వస్త్రధారణపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. బ్లౌజ్లు వేసుకోవడం మన దేశ సంస్కృతి కాదంటూ చిన్మయి తెలిపారు. (ఇది చదవండి: ఎస్పీ బాలు చనిపోయినప్పుడు రోడ్డుపై ఏడ్చుకుంటూ వెళ్లాను: సింగర్) కొందరు మహిళలు కనీసం చున్నీలు కూడా వేసుకోవడం లేదని ఓ యువకుడు ఇన్స్టాలో వీడియో షేర్ చేశాడు. దీనికి తనదైన శైలిలో సమాధానమిచ్చారు చిన్మయి. చున్నీలు వేసుకోవాలని చెప్పేవాళ్లు ముందు మన దేశ సంస్క్రృతి ఏంటో తెలుసుకోవాలని హితవు పలికారు. చిన్మయి మాట్లాడుతూ..'రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నయ్య సత్యేంద్రనాథ్ ఠాగూర్ భార్య జ్ఞానానందిని దేవి ఆడవాళ్లు వేసుకునే బ్లౌజ్ కల్చర్ను తీసుకొచ్చారు. అప్పటివరకు మనదేశంలో అసలు జాకెట్లు వేసుకునేవారు కాదు. మహిళలను చున్నీ వేసుకోమని చెప్పే మగవాళ్లు.. షర్ట్, ప్యాంట్లు వదిలి పంచెలు కట్టుకోండి. జాకెట్ లేకుండా ఉండటం చూసి బ్రిటిషర్లు షాక్ అయ్యారని.. అలా చూడడం వల్ల వారికి కలిగే లైంగిక కోరికల వల్లే భారతీయ మహిళలు జాకెట్లు వేసుకోవడం మొదలుపెట్టారు. మీ అమ్మమ్మలు, నాన్నమ్మలు బ్లౌజ్ వేసుకునేవారు కాదు. బ్లౌజ్ అనేది బ్రిటిష్ కల్చర్. ముందు మన కల్చర్ ఏంటో తెలుసుకోండి.' అంటూ ఘాటుగానే సమాధానమిచ్చారు. (ఇది చదవండి: PS 2లో జూనియర్ ఐశ్వర్యగా నటించిన ఈ చైల్డ్ఆర్టిస్ట్ ఎవరో తెలుసా?) View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
కష్టకాలంలో సమంత నాకు అండగా నిలిచింది : సింగర్ చిన్మయి
సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిన్మయి ఎక్కువగా సమంత నటించిన సినిమాలకు డబ్బింగ్ చెప్పడం ద్వారా పాపులర్ అయ్యింది. తొలి సినిమా ఏ మాయ చేశావే నుంచి సమంతకు-చిన్మయికి మంచి అనుబంధం ఉంది. కష్టకాలంలో ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్గా నిలుచున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిన్మయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు సమంత నాకు అండగా నిలబడింది. ధైర్యాన్నిచ్చింది. మీటూ సమయంలో నేను పని కోల్పోయాను. ఆ సమయంలో సామ్ నాకు పని కల్పించింది. నాకు అన్నిరకాలుగా మద్దతు పలికింది అని పేర్కొంది. కాగా మీటూ ఉద్యమ సమయంలో తమిళనాడు సీనియర్ రచయిత వైరముత్తుపై చిన్మయి లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వివాదంలో కోలీవుడ్ ఇండస్ట్రీ చిన్మయిపై బ్యాన్ విధించింది. మరోవైపు సమంత తన భర్త నాగచైతన్యతో విడిపోయినప్పుడు చిన్మయి ఆమెకు సపోర్ట్గా నిలిచింది. విడాకులకు సమంతను టార్గెట్ చేసినప్పుడు చిన్మయి సోషల్ మీడియా వేదికగా సమంతకు మద్దతు పలికింది. ఇక ఇటీవలె సమంత మయోసైటిస్ బారిన పడిన సమయంలో కూడా చిన్మయి, ఆమె భర్త రాహుల్ సమంతకు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చి ఆమెకు అండగా నిలిచారు. -
చాలా కాలం తర్వాత చిన్మయి గురించి ట్వీట్ చేసిన సామ్!
చాలా రోజుల తర్వాత తన స్నేహితురాలు, గాయని చిన్మయి గురించి ట్వీట్ చేశారు స్టార్ హీరోయిన్ సమంత. కాగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయంటూ ఇటీవల కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే చిన్మయి స్పందించినప్పటికీ సామ్ ఎలాంటి సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో సమంత తాజాగా చిన్మయి గురించి చేసిన ట్వీట్ ఆసక్తిని సంతరించుకుంది. కాగా మయోసైటిస్ బారిన పడిన సామ్ ప్రస్తుతం కోలుకున్నారు. చదవండి: తీవ్ర గాయాల నుంచి కోలుకున్న స్టార్ హీరో దీంతో ఆమె తన బాలీవుడ్ వెబ్ సిరీస్ సీటాడెల్ షూటింగ్ను ప్రారంభించారు. తాము తెరకెక్కించనున్న సిరీస్లోకి సామ్కు స్వాగతం పలుకుతూ హాలీవుడ్ దర్శక ద్వయం రస్సో బ్రదర్స్ ట్వీట్ చేశారు. ఇక దీనిపై చిన్మయి భర్త, నటుడు రాహుల్ స్పందించాడు. ‘సమంత ప్రయాణం ఎలా మొదలైందో నాకు ఇంకా గుర్తుంది. ప్రముఖ హాలీవుడ్ దర్శకులు రస్సో బ్రదర్స్ సామ్ను తమ ప్రాజెక్ట్లోకి ఆహ్వానించడం చూస్తుంటే గర్వంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక అదే ట్వీట్ను రీట్వీట్ చేస్తూ చిన్మయి.. ‘సమంత ఒక క్వీన్.. దానికి ఇదే నిదర్శనం’ అని ప్రశంసించింది. చదవండి: నడవలేని స్థితిలో నటుడు విజయకాంత్.. వీల్ చైర్లోనే.. ఇక చిన్మయి ట్వీట్పై సామ్ స్పందిస్తూ.. ‘‘నేను కాదు నువ్వే చిన్మయి’’ అని అంటూ కిస్ ఎమోజీని జత చేసింది. దీంతో ట్విటర్ వేదికగా జరిగిన వీరి సంభాషణకు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కాగా ఏమ మాయ చేసావే మూవీ నుంచి చిన్మయి సమంతకు డబ్బింగ్ చెబుతున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు. అయితే ‘యూటర్న్’ మూవీ నుంచి సామ్.. తెలుగులో తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటోంది. దాంతో చిన్మయి-సమంతకు మనస్పర్థలు వచ్చాయని, వారి మధ్య మాటలు లేవంటూ ప్రచారం జరిగింది. No you are @Chinmayi 💋 https://t.co/McAvAnedr9 — Samantha (@Samanthaprabhu2) February 1, 2023 -
ఆ నిర్మాతను కలిసిన నటి.. వార్నింగ్ ఇచ్చిన సింగర్ చిన్మయి
సింగర్ చిన్మయి.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. గాయనీగా, నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా చిన్మయి ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఆమె సింగర్గా కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా మీ టూ ఉద్యమం నేపథ్యంలో చిన్మయి బాగా పాపులర్ అయ్యింది. అప్పట్లో నిర్మాత వైరముత్తుపై ఆమె చేసిన లైంగిక ఆరోపణలు ఇండస్ట్రీలో హాట్టాపిక్గా నిలిచాయి. ఇక చిన్మయి సోషల్ మీడియా వేదికగా కూడా పలు సామాజీక అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. చదవండి: ఆనందంలో ఐశ్వర్యను హగ్ చేసుకున్న అభిషేక్, ఆకట్టుకుంటున్న వీడియో అంతేకాదు యువతకు, మహిళలు సూచనలు ఇస్తూ వారిలో ధైర్యం నింపుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా చిన్మయి సోషల్ మీడియా వేదికగా ఓ నటిని హెచ్చరించింది. ప్రముఖ తమిళ నిర్మాతను కలిసి ఆమెకు చిన్మయి వార్నింగ్ ఇస్తూ సూచనలు ఇచ్చింది. వివరాలు.. తమిళ నటి, వీజే అర్చనా అర్చన ఓ సినిమా షూటింగ్లో పాల్గొంది. ఆ షూటింగ్ సెట్కు వచ్చిన నిర్మాత వైరముత్తును ఆమె కలుసుకుంది. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫొటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దీంతో తన ఫొటోలపై చిన్మయి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘అది ఇలాగే మొదలవుతుంది. అతనితో చాలా జాగ్రత్తగా ఉండు. వీలైతే అతడికి తగినంత దూరం పాటించు. ముఖ్యంగా ఇలా ఒంటరిగా అసలు కలవకు. నీతో తోడుగా ఎవరైనా ఉండేలా చూసుకో.. జాగ్రత్త’ అంటూ అర్చన పోస్ట్కు కామెంట్ చేసింది. దీంతో ఆమె కామెంట్ తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. కాగా నటి చిన్మయి శ్రీపాద ప్రముఖ తమిళ పాటల రచయిత వైరముత్తు మధ్య గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ చిన్మయి సంచలన ఆరోపణలు చేశారు. చదవండి: రామ్ చరణ్పై ‘కింగ్ ఖాన్’ షారుక్ ఆసక్తికర వ్యాఖ్యలు View this post on Instagram A post shared by Archana R (@vj_archana_) -
హీరోయిన్పై బహిరంగ కామెంట్స్.. నటుడిపై సీరియస్ అయిన చిన్మయి
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న విషయాలు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తుంటుంది. కొన్నిసార్లు పలు అంశాల్లో తనదైనా శైలిలో స్పందించి వివాదాలు కూడా ఎదుర్కొంది. అలా తరచూ వివాదాలు, విమర్శలతో వార్తల్లో నిలిచే చిన్మయి తాజాగా ఓ నటుడిపై ఫైర్ అయ్యింది. పబ్లిక్లో ఓ హీరోయిన్ను పాయింట్ అవుట్ చేస్తూ చేసిన అతడి వ్యాఖ్యలను తప్పుబట్టింది. అసలేం జరిగిందంటే.. బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్, నటి దర్శగుప్తా లీడ్ రోల్లో నటిస్తున్న తమిళ చిత్రం ఓ మై ఘోస్ట్. ఇందులో తమిళ నటుడు సతీష్ ఓ కీ రోల్ పోషించాడు. చదవండి: రష్మికపై ఇంత నెగిటివిటీకి కారణం ఇదే! ఆ ఒక్క మాటకే విమర్శల దాడి ఈ మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న క్రమంలో తాజాగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ను చెన్నైలో నిర్వహించారు. ఈ ఈవెంట్కు సన్నీలియోన్ సాంప్రదాయంగా చీరకట్టులో రాగా దర్శగుప్తా మోడ్రన్ లెహెంగాలో వచ్చింది. ఇదే అంశంపై ఈవెంట్లో నటుడు సతీశ్ మాట్లాడుతూ నటి దర్శగుప్తాను ఉద్దేశిస్తూ పబ్లిక్గా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ... ‘ఎక్కబో ముంబై నుంచి తమిళనాడుకు వచ్చిన సన్నీలియోన్ పద్ధతిగా చీరకట్టుకుని వచ్చారు. చూడటానికి ఆమె చాలా అందంగా ఉన్నారు. కానీ అటూ చూడండి మన దగ్గరి అమ్మాయి మాత్రం మోడ్రన్ డ్రెస్ వేసుకుని వచ్చింది’ అంటూ దర్శగుప్తాను చూపిస్తూ అన్నాడు. చదవండి: భర్తకు దూరంగా ఉంటున్న నటి స్నేహ! కారణం ఇదేనా? అంతేకాదు తానేమి ఆమెను విమర్శించడం లేదని, జస్ట్ పాయింట్ అవుట్ చేశానంతేనని అనడంతో అక్కడి వచ్చిన వారంత పగలపడి నవ్వారు. ఇక అతడి వ్యాఖ్యలపై చిన్మయి స్పందించింది. మహిళల డ్రస్సింగ్పై బహిరంగంగా కామెంట్స్ చేయడాన్ని ఆమె తప్పుపట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేస్తూ ఆమె ఘాటుగా స్పందించింది. ‘ఒక స్త్రీని లక్ష్యంగా చేసుకుని, ఆమె వేసుకున్న డ్రెస్పై విమర్శలు చేయడమేంటి? ఆ మాటలకు జనాలు పగలబడి నవ్వడం ఏంటి? మహిళల డ్రస్పై విమర్శలు చేసే ఇలాంటి మగాళ్ల ప్రవర్తన ఇంకెప్పుడు మారుతుందో? ఇదేం అంత సరద విషయం కాదు’ అంటూ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె మాత్రమే నటుడు కామెంట్స్పై నెటిజన్లు సైతం మండిపడుతున్నారు. అలా బహిరంగంగా ఓ నటిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదంటూ ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. I mean - To actually *point* at a woman and ask for mass heckling of a crowd by a man on a woman who doesn’t dress according to culture. When will this behaviour from men stop? Its not funny. pic.twitter.com/HIoC0LM8cM — Chinmayi Sripaada (@Chinmayi) November 9, 2022 -
ఫ్రెండ్కి బ్రేకప్ చెప్పిన సమంత.. ఇకపై తనే స్వయంగా..
నాగ చైతన్యతో విడాకుల తర్వాత నెట్టింట సమంత పేరు వినిపించని రోజంటూ లేదు. ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది. గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సామ్.. ఇటీవల మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. మళ్లీ తన పంథాను కొనసాగిస్తూ..అభిమానులతో టచ్లో ఉంటుంది. ఇదిలా ఉంటే సామ్కి సంబంధించిన ఓవార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. (చదవండి: బాహుబలి ఆఫర్ని వదులుకున్నందుకు గర్వపడుతున్న: మంచు లక్ష్మీ) సామ్ తాజాగా తన ఫ్రెండ్కి బ్రేకప్ చెప్పిందట. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి. సామ్కు చిన్మయి చాలా క్లోజ్ ఫ్రెండ్. కెరీర్ స్టార్టింగ్ నుంచి సమంత పాత్రకు చిన్మయియే డబ్బింగ్ చెబుతూ వచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ తాజాగా వీరిద్దరి మధ్య స్నేహం చెడిందట. మనస్పర్థలు రావడంతో చిన్మయిని సామ్ పక్కకు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సామ్ పాన్ ఇండియా మూవీ యశోదకు చిన్మయి డబ్బింగ్ కూడా చెప్పలేదు. చిన్మయిని దూరం పెట్టి స్వయంగా సమంతనే డబ్బింగ్ చెప్పుకుందట. ఇకపై ప్రతి సినిమాకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకుందట. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది.. సామ్ కానీ చిన్మయి కానీ స్పందిస్తేనే తెలుస్తుంది. -
చిన్మయి త్రిపాఠి.. ఈమె కవిత్వం పాడుతుంది! రాక్ బ్యాండ్ ద్వారా...
తిలక్ని, కృష్ణశాస్త్రిని, శ్రీశ్రీని, జాషువాని పాడుతూ ఒక రాక్బ్యాండ్ ఉంటే ఎలా ఉంటుంది? తెలుగులో అలాంటిది లేదు. కాని చిన్మయి త్రిపాఠికి కవిత్వం అంటే ఇష్టం. కబీర్ని, తులసీదాస్ని, ఆధునిక హిందీ కవులను ఆమె తన రాక్ బ్యాండ్ ద్వారా పాడుతూ దేశమంతా తిరుగుతూ ఉంటుంది. ‘మ్యూజిక్ అండ్ పొయెట్రీ స్టుడియో’ పేరుతో చేస్తున్న ఈ కృషి చిన్మయిని ప్రత్యేకంగా నిలబెట్టింది. స్టేజ్ మీద ఇద్దరు ముగ్గురు వాద్యకారులు తప్ప ఎక్కువ మంది ఉండరు. చిన్మయి త్రిపాఠి తన భుజానికి ‘దోతార’ అనే సంప్రదాయ తీగ వాయిద్యాన్ని తగిలించుకుని పాడటం మొదలెడుతుంది. పాటంటే పాట కాదు. కవిత్వం. ఉదాహరణకు ప్రఖ్యాత హిందీ కవి వినోద్ కుమార్ శుక్లా రాసిన ‘మా ఇంటికి రాని అతిథుల కోసం’ అనే కవితను పాడుతుంది. ‘మా ఇంటికి కొందరు అతిథులు ఎప్పటికీ రారు. కొండలు, నదులు, రంగు రంగు చెట్లు, విరగపండిన పొలాలు ఇవి ఎప్పటికీ రావు. నేనే ఆ పొలాల వంటి మనుషులను కలవడానికి వెళతాను. నదుల వంటి మనుషుల్ని, కొండల వంటి, కొండ కొసల వంటి, చెట్లతో నిండిన అడవుల వంటి మనుషులను కలవడానికి వెళతాను. ఇదేదో నేను తీరుబడి చూసుకొని చేసే పని కాదు. చాలా అత్యవసరమైన పని అన్నట్టుగా వెళ్లి కలుస్తాను. మా ఇంటికి ఎప్పటికీ రాని అతిథుల కోసం నేనే బయలుదేరుతాను’ ఈ కవిత ఆమె పాడుతుంటే అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత ఆమె సుశీల్ శుక్లా అనే కవి రాసిన ‘వృక్షమా... నీవొక దర్జీవి’ అనే కవితను పాడుతుంది. ‘ఎన్ని గూళ్లను అల్లి ఉంటావు. ఎన్ని గాలులను కుట్టి ఉంచాము. ఎన్ని నీడలను ముక్కలు ముక్కలు చేసి కింద పరిచి ఉంటావు... ఓ వృక్షమా... నీవొక దర్జీవి’ అనే కవితను చాలా అందంగా పాడుతుంది. చిన్మయి త్రిపాఠిని చూస్తుంటే ఇలాంటి గాయని తెలుగులో గొప్ప గొప్ప కవిత్వాన్ని పాడేలా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. ఢిల్లీకి చెందిన చిన్మయి త్రిపాఠి ‘మ్యూజిక్ అండ్ పొయెట్రీ స్టుడియో’ స్థాపించి గాయకుడు, జీవన సహచరుడు అయిన జోయెల్ ముఖర్జీతో కలిసి హిందీ కవిత్వాన్ని దేశమంతా పాడుతోంది. నేను ఇందుకు పుట్టలేదు అనిపించింది ‘మాది ఢిల్లీ. చిన్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నాను. కాని అందరిలా చదువులో కొట్టుకుపోయాను. ఎం.బి.ఏ చేసి ఉద్యోగం మొదలెట్టాక నేను ఇందుకు పుట్టలేదు అనిపించింది. ‘స్పైస్ రూట్’ అనే ర్యాక్ బ్యాండ్ మొదలెట్టాను. కాని అది ఎక్కువ రోజులు నడవలేదు. ఒకరోజు స్నేహితులతో మాట్లాడుతుంటే ఇవాళ్టి పాటల్లో సరైన కవిత్వమే ఉండటం లేదన్న చర్చ వచ్చింది. హిందీలో భారతీయ సాహిత్యంలో ఎంతో గొప్ప కవిత్వం ఉంది. దానిని మళ్లీ ఈ తరానికి వినిపిస్తే ఎలా ఉంటుంది... అనిపించింది. ఈ విషయాన్ని నేనో క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్తో షేర్ చేసుకున్నాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. వెంటనే రంగంలో దిగాను’ అంటుంది చిన్మయి త్రిపాఠి. చిన్మయి కూడా కవిత్వం రాస్తుంది. చాలా కవిత్వం చదువుతుంది. కనుక ఆ కవిత్వం మీద ప్రేమతో పాడటం వల్ల వెంటనే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. కబీర్ దాస్తో మొదలెట్టి హిందీలో ఆధునిక కవులు– హరివంశ్రాయ్ బచ్చన్, మహదేవి వర్మ, నిరాలా, ధర్మ్వీర్ భారతి... వీరందరి కవిత్వాన్ని తనే ట్యూన్ కట్టి పాడుతుంది. చిన్మయి గొంతు చాలా భావాత్మకంగా ఉంటుంది. అందుకని కవిత్వంలో ఉండే ఎక్స్ప్రెషన్ బాగా పలుకుతుంది. ‘మన దేశంలో ఉర్దూలో చాలా మంచి కవిత్వం వచ్చి మరుగున పడిపోయింది. ఇప్పుడు దానిని వెతికి తీసే ప్రయత్నంలో ఉన్నాను’ అంటుంది చిన్మయి. ముంబైలో ఉంటూ తన బ్యాండ్తో తిరిగే చిన్మయి లండన్లో ప్రదర్శన ఇచ్చినప్పుడు అక్కడి ఇంగ్లిష్ ప్రేక్షకులకు హిందీ తెలియకపోయినా ఆ శబ్దాలకు తన్మయులయ్యారని చెబుతుంది చిన్మయి. తన ప్రదర్శనల్లో కశ్మీరీ, బెంగాలీ కవిత్వం కూడా పాడుతోంది చిన్మయి. ‘త్వరలో నేను భగవద్గీతను ఆధునిక సంగీత పరికరాలతో పాడాలని నిశ్చయించుకున్నాను. అదీ ఒక గొప్ప కవిత్వమే కదా’ అంటుంది చిన్మయి. మనకు ఘంటసాల పాడిన భగవద్గీత తెలుసు. ఆధునిక లయతో చిన్మయి ఎలా పాడుతుందో చూడాలి. చదవండి: గూగుల్ను వీడి.. పర్యావరణ పరిరక్షణ కోసం! నెదర్లాండ్స్ అమ్మాయి.. వ్యాన్నే ఇల్లుగా చేసుకుని! మన దేశమంతా చుట్టేస్తూ! View this post on Instagram A post shared by Chinmayi (@chinmayitripathi) -
వైరముత్తుకు భారీ షాక్.. ఓఎన్వీ అవార్డు వెనక్కి?
చెన్నై: సినీ గీత రచయిత వైరముత్తు తీవ్ర భంగపాటుకు గురి కాబోతున్నారని తెలుస్తోంది. ఆయనకు ఓఎన్వీ జాతీయ సాహితీ అవార్డును అందజేయనున్నట్టు ఆ అకాడమీ నిర్వాహకులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇంతకు ముందు తమిళంలో పూ, మరియాన్ తదితర చిత్రాల్లో కథానాయికగా నటించిన మలయాళ నటి పార్వతి ఓఎన్వీ గురుప్ అవార్డులు వైరముత్తుకు ప్రకటించడాన్ని తీవ్రంగా విమర్శించారు. గొప్ప కవి, సినీ గీత రచయిత ఓఎన్వీ పేరుతో నెలకొల్పిన అవార్డును లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వైరముత్తుకు ప్రకటించడం ఆయన్ని అగౌరవపరచడమేనని పేర్కొన్నారు. ఇక సంచలన గాయని చిన్మయి కూడా చాలాసార్లు వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆమె కూడా వైరముత్తుకు ఓఎన్వీ అవార్డు ప్రకటించడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో అవార్డు ప్రదానం చేసే విషయాన్ని పునర్ పరిశీలించనున్నట్లు ఓఎన్వీ కల్చరల్ అకాడమీ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. చదవండి : అవార్డు పొందడం సంతోషంగా ఉంది : వైరముత్తు వైరముత్తుకి పురస్కారం.. హీరోయిన్ల ఆగ్రహం -
లైంగిక ఆరోపణలేగా!.. మేమూ తగ్గం
చెన్నై: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ గేయ రచయిత వైరముత్తుకు వ్యతిరేకంగా మరోసారి గళం వినిపిస్తోంది. కేరళ ఒఎన్వీ గురువ్ జాతీయ పురస్కారాన్ని వైరముత్తుకు అందించడంపై పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ ఆ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గతంలో వైరముత్తుపై ఆరోపణలు చేసిన సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయితో పాటు మాలీవుడ్ హీరోయిన్లు కొందరు ఈ క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు. కాగా, 2018 మీటూ ఉద్యమ సమయంలో గేయరచయిత వైరముత్తుపైనా చిన్మయితోపాటు మరో పదహారు మంది తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలపై ఎటూ తేలకముందే.. ఓఎన్వీ అవార్డు ఇవ్వడం ఇప్పుడు మారం రేపుతోంది. మలయాళ నటి పార్వతి తిరువొతు, గీతూ మోహన్దాస్, రీమా కళింగల్ తో పాటు చిన్మయి కూడా గొంతు కలిపింది. అర్హతలేని ఆ వ్యక్తి నుంచి పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. అది జరగదు ఈ విమర్శలపై ఒఎన్వీ కల్చరల్ అకాడమీ ప్రెసిడెంట్ అదూర్ గోపాలకృష్ణన్ స్పందించారు. ఈ పురస్కారం ప్రతిభ ఆధారంగా ఇచ్చిందే తప్ప.. క్యారెక్టర్ చూసి కాదని అన్నారు. వైరముత్తు మంచి గేయ రచయిత. అయినా ఆయనపై ఉన్నవి కేవలం ఆరోపణలు మాత్రమే. ఈరోజుల్లో ఎవరు.. ఎవరిపైన అయినా ఆరోపణలు చేయొచ్చు. జ్యూరీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు అని గోపాలకృష్ణన్ స్పష్టం చేశారు. ఈ తరుణంలో తాము పోరాటాన్ని ఆపబోమని హీరోయిన్లు స్పష్టం చేశారు. నాన్-మలయాళీ మలయాళంలో దివంగత ప్రఖ్యాత కవి, సినీ గీత రచయిత ఓఎన్వీ గురుప్ పేరుతో 2017లో జాతీయ సాహితీ అవార్డులు ఏర్పాటు చేశారు. దీన్ని మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ కవులు, గీత రచయితలకే ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది తమిళ ప్రఖ్యాత గీత రచయిత వైరముత్తుకు ప్రకటించారు. ఈ అవార్డును రాష్ట్రేతర ప్రముఖులకు ప్రకటించడం ఇదే ప్రథమం. ఇక ఓఎన్వీ గురుప్ జాతీయ సాహితీ అవార్డు అందుకున్న వైరముత్తును తమిళనాడు సీఎం స్టాలిన్ అభినందించారు కూడా. -
ఇంకా విమర్శలు చేస్తే చిన్మయిపై పిటిషన్ వేస్తా
చెన్నై, పెరంబూరు: గాయనీ, డబ్బింగ్ కళాకారిణి చిన్మయిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని సీనియర్ నటుడు, సౌత్ ఇండియన్ డబ్బింగ్ కళాకారుల యూనియన్ అధ్యక్షుడు రాధార చెప్పారు. ఈయనపై గాయనీ చిన్మయి మీటూ ఆరోపణలు చేయడంతో ఆమెను డబ్బింగ్ కళాకారుల యూనియన్ నుంచి తొలగించారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. కాగా ఈ యూనియన్కు గత 15 తేదీన ఎన్నికలు జరిగాయి. నటుడు రాధారవి మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయగా, ఆయనకు వ్యతిరేకంగా చిన్మయి నామినేషన్ను వేసింది. అయితే ఆమె నామినేషన్ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. అది చట్టబద్దంగా లేదని పేర్కొన్నారు. దీంతో రాధారవి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. దీనిపై ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. డబ్బింగ్ కళాకారుల యూనియన్ సంక్షేమానికి పలు పథకాలును రచించినట్లు రాధారవి తెలిపారు. కాగా చిన్మయి వ్యవహారం గురించి మాట్లాడుతూ ఆమె తమపై ఆరోపణలు చేస్తున్నారని, ప్రచార ప్రియురాలిగా మారినట్లు విమర్శించారు. ఇంకా తమపై విమర్శలు చేస్తే చిన్మయిపై కోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు. -
చిన్మయి వర్సెస్ రాధా రవి
‘మీటూ’ ఉద్యమం మన దేశంలోనూ ఊపందుకున్నప్పుడు సౌత్ ఇండస్ట్రీల్లో ఎక్కువగా వినిపించిన పేరు చిన్మయి. గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా చిన్మయి పాపులర్. సాధారణంగా సినిమాల్లో హీరోయిన్లకు గొంతుగా ఉండే చిన్మయి, ఈ ఉద్యమంలో ఎందరో బాధితులకు గొంతుగా నిలిచారు. ధైర్యంగా నిలబడ్డారు. ‘మీటూ’ ఉద్యమంలో ఆమె ఎదుర్కొన్న లైంగిక వేధింపులను నిర్భయంగా బయటకు చెప్పడమే కాకుండా దాని వెనుక ఉన్నది ప్రముఖ గేయ రచయిత వైరముత్తు అని ఆయన పేరుని బయటపెట్టారు. తమిళ పరిశ్రమలో అది సంచలనం సృష్టించింది. ఆ తర్వాత తన ట్వీటర్ వేదికగా వైరముత్తు, నటుడు, నిర్మాత రాధారవిపై ఆరోపణలు చేసిన స్త్రీల వివరాలను గోప్యంగా ఉంచి వాళ్ల చేదు సంఘటనలు షేర్ చేస్తూ ఉన్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకే చిన్మయి డబ్బింగ్ యూనియన్ సభ్యత్వం రద్దయింది. సభ్యత్వం కొనసాగించకపోవడానికి వార్షికరుసుము చెల్లించకపోవడమే కారణం అని, అందుకే సభ్యత్వాన్ని రద్దు చేశామని యూనియన్ పేర్కొంది. అప్పుడు డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ పదవిలో రాధారవి ఉన్నారు. సభ్యత్వం రద్దు విషయమై చిన్మయి కోర్టుని ఆశ్రయించగా, కోర్టు చిన్మయి వాదనకు అనువుగా ఇంటర్న్ ఆర్డర్ (ఈ కేసు పరిశీలనలో ఉన్నంత కాలం ఆమె డబ్బింగ్ యూనియన్ సభ్యురాలిగానే పరిగణించాలి) మంజూరు చేసింది. ఆ తర్వాత తమిళంలో చిన్మయి డబ్బింగ్ కెరీర్ మందకొడిగా సాగుతోంది. తాజాగా ఈ నెల డబ్బింగ్ యూనియన్ ఎన్నికలు జరగనున్నాయనే ప్రకటన విడుదలైంది. మరోసారి ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయడానికి రెడీ అయ్యారు రాధారవి. ఆయనకు ప్రత్యర్థిగా, రామరాజ్యం పార్టీ తరపున ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేశారు చిన్మయి. విశేషం ఏంటంటే సభ్యత్వం రద్దు చేసినప్పుడే డబ్బింగ్ యూనియన్ ఓటర్ల జాబితాలో నుంచి చిన్మయి పేరును తొలగించారు. ‘సభ్యులు కానివారు ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారు?’ అని ఒక వర్గం వారు చిన్మయిని విమర్శించారు. ‘‘కోర్టు మంజూరు చేసిన ఆర్డర్లో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు నాకుంది’’ అని పేర్కొన్నారు చిన్మయి. ప్రస్తుతం చిన్మయి నామినేషన్ పత్రాలు పరిశీలనలో ఉన్నాయి. ఫిబ్రవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. మరి ఎలాంటి నాటకీయత చోటు చేసుకుంటుంది? చిన్మయి వర్సెస్ రాధారవి.. గెలుపు ఎవరిది? అని తమిళ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement