-
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
ప్రకృతి అపూర్వమైన సంపద, మూలికలకు నిలయం. ప్రకృతిలో మమేకమైన పక్షులకు జంతువులే ఈ విషయాన్ని ఎక్కువగా పసిగడతాయి. మనుషులే కాదు అడవుల్లో జీవించే జంతువులు కూడా మొక్కలు, మూలికలతో వాటికవే వైద్యం చేసుకుంటాయి అనడానికి నిదర్శనంగా ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఒకటి వెలుగులో వచ్చింది. ఇండోనేషియాలో పరిశోధకులు తొలిసారిగా ఈ విషయాన్ని రికార్డు చేశారు.వివరాలు ఇలా ఉన్నాయిసుమత్రన్ ఒరాంగుటాన్స్ అనే జాతికి చెందిని రాకుస్ అనే మగ కోతి (ఒరంగుటాన్) తనకు తనే వైద్యం చేసుకుంది. సుమత్రన్ ఒరంగుటాన్ విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలోని గునుంగ్ ల్యూజర్ నేషనల్ పార్క్లో ఈ దృశ్యాలను రికార్డుచేశారు. ఇండోనేషియాలోని నేషనల్ యూనివర్సిటీ, జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్ సంస్థలకు చెందిన పరిశోధకులు కొన్ని రోజులుగా ఈ తోక లేని కోతులపై అధ్యయనం చేస్తున్నారు.సైంటిఫిక్ రిపోర్ట్స్లోని ఒక అధ్యయనం ప్రకారం ఒక మగ కోతికి మరో కోతితో జరిగిన కొట్లాటలో ముఖానికి గాయమైంది. ఒక చెట్టు ఆకులోని ఔషధ గుణాలను గుర్తించింది రాకూస్. ఫైబ్రేరియా టింక్టోరియా" అనే శాస్త్రీయ నామంతో పిలిచే మొక్కల ఆకులతో వైద్యం చేసుకున్నది. ఈ ఆకులు నమిలి, వాటి పసరును దవడ గాయంపై రాసుకుంది. తర్వాత నమిలిన ఆకులను గాయంపై పెట్టుకుంది. అంతేకాదు గాయం మానేందుకు ఈ కోతి ఎక్కువ సేపు నిద్రపోయిందని కూడా పరిశోధకులు గుర్తించడం విశేషం.ఒక అడవి జంతువు చాలా శక్తివంతమైన ఔషధ మొక్కను నేరుగా గాయానికి పూయడాన్ని గమనించడం ఇదే తొలిసారి అని జర్మనీలోని కాన్స్టాంజ్లోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్, జీవశాస్త్రవేత్, ఈ స్టడీ సహ రచయిత ఇసాబెల్లె లామర్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ మొక్కలో నిజంగానే ఔషధ గుణాలు ఉంటాయని, మలేరియా, విరేచనాలు, డయాబెటిస్ చికిత్సలో ఈ మొక్కలు వాడుతారని పేర్కొన్నారు. -
కొంచెం శ్రద్ధ ఉంటే చాలు..టెర్రస్ మీదే బోలెడన్ని మొక్కలు
డాక్టర్ ప్రిస్కిప్షన్ రాస్తూ... ఆరోగ్యంగా ఉండాలంటే కాఫీ, టీ లతో రోజును మొదలు పెట్టకండి’ అని చెబితే ఆ కఠోరమైన సూచనను జీర్ణించుకోవడం కొంచెం కష్టమే. డాక్టర్ ముందు బుద్ధిగా తలూపుతాం. పాటిస్తామని గొంతులో నిజాయితీని ధ్వనింపచేస్తూ బదులిస్తాం. మరునాడు తెల్లవారి కాఫీ–టీలు తాగిన తర్వాతగానీ ముందురోజు డాక్టర్కు ఇచ్చిన మాట గుర్తు రాదు. ఇదంతా మన బ్రెయిన్ మనతో ఆడుకునే ఆటలో భాగం. అయితే ఈ డాక్టర్ మాత్రం టీ వద్దనే వద్దని చెప్పనే చెప్పరు. ‘హాయిగా టీ తాగండి. దేహానికి హాయినిచ్చే తాజా ఔషధ ఆకులతో చేసిన టీని తాగండి’ అంటూ ఒక పెద్ద జాబితానే సూచిస్తారు. అవన్నీ ఇంట్లో సాధ్యమే అంటూ తన ఇంటి టెర్రస్ను చూపిస్తారీ ఉత్తరాఖండ్ డాక్టర్ అన్షు రాఠీ. ఆమె టెర్రస్ మీద 1500 అడుగుల విస్తీర్ణం కలిగిన టెర్రస్ మీద మిరియాలు, యాలకుల చెట్లతో సహా 400 మొక్కలను పెంచుతున్నారు. అందులో పండ్లు, కూరగాయలతో పాటు అశ్వగంధ, తులసి, ఆరెగానో, పసుపు, మిరియాలు, కుంకుమ పువ్వు, లవంగాలు, జాజికాయ, సోంఫు, మెంతులు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇంగువ, మిర్చి, కొత్తిమీర, కలోంజి (నల్ల జీలకర్ర) వంటి 15 రకాల ఔషధ మూలికల మొక్కలున్నాయి. ఏడాదంతా సీజనల్గా వచ్చే అనేక అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే... ఆయా కాలాల్లో ప్రకృతి ఇచ్చిన ఔషధాలను ఆహారంగా తీసుకోవాలని చెబుతున్నారు 36 ఏళ్ల అన్షురాఠీ. నేర్చుకోండి... పచ్చగా పెంచుకోండి! ‘‘మనదేశంలో వాతావరణం వైవిధ్యంగా ఉంటుంది. ప్రదేశాలు, కాలాలను బట్టి ఆయా నేలల్లో కొన్ని ప్రత్యేకమైన జాతులు విస్తరిస్తుంటాయి. వాటికి అనువైన పరిస్థితులను అంచనా వేయగలిగితే వాటన్నింటినీ ఒకే చోట పెంచవచ్చు. కొత్తిమీర, మిరియాలు, జీలకర్రలను పెంచాలంటే అక్టోబర్-నవంబర్ నెలల్లో నారు పోయాలి. పసుపును మే-జూన్ నెలల్లో నాటాలి. నాటడం నుంచి ప్రతి దశనూ ఆస్వాదించాలంటే అలా చేయవచ్చు. గార్డెనింగ్లో అనుభవం లేని వాళ్లు మాత్రం నారుమడిలో గింజలు చల్లడం నుంచి మొదలు పెట్టకుండా నర్సరీ నుంచి నారు మొలకలను కొనుక్కోవడం మంచిది. మిరియాలు, యాలకుల వంటి వాటిని నాటేముందు రాత్రంతా నానబెట్టాలి. జీలకర్ర, మెంతులు, ఆవాలను నానబెట్టాల్సిన అవసరం లేదు. అలాగే నాటే పంటల కాల వ్యవధిని కూడా గమనించుకోవాలి. కొత్తిమీర రెండు వారాల్లో చేతికొస్తుంది, మెంతికి నాలుగు రోజులు చాలు. జీలకర్ర నారు 45 రోజులు తీసుకుంటుంది. ముందుగా ఒక కప్పులో నారు పోసి మొలకలు వచ్చిన తర్వాత ఆ నారు తీసి పెద్ద కుండీలు లేదా ట్రేలలో నాటాలి. ఈ ట్రేలను ఓ వారం రోజుల పోటు నీరెండలో ఉంచి ఆ తర్వాత ఎండలోకి మార్చాలి. View this post on Instagram A post shared by 🦋Dr. Rathi Anshu / Sustainability/Plant care tips , DIY, Decor (@myplantsmygarden) జీలకర్ర, కొత్తిమీర (ధనియాలు రావడానికి) పంట రావడానికి ఐదు నెలలు పడుతుంది. మిరియాలు మూడేళ్లు, యాలకులు ఐదేళ్ల సమయం తీసుకుంటాయి. మొక్కలు పెంచడంలో మట్టిని పరిశీలించుకోవడం చాలా ముఖ్యం. మనం ఉన్న ప్రదేశంలో లభించే మట్టి స్వభావాన్ని గమనించుకోవాలి. మట్టిని పట్టుకుని ముద్ద చేసినప్పుడు సులభంగా బంతి ఆకారం వస్తే ఆ మట్టి జిగురుగా ఉన్నట్లు. అందులో 20 శాతం ఇసుక, 30 శాతం ఆవుపేడ, వేప పిప్పి కల΄ాలి. ఇలా తయారు చేసుకున్న మట్టిలో నాటిన మొక్కలకు తరచు ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. పంటకోతకు రావడానికి రెండువారాల ముందు వర్మీ–కంపోస్టు వేస్తే సరిపోతుంది. నేనున్నది గంగా నది–యమునా నదికి మధ్య విస్తరించిన నేల. ఇక్కడ మట్టి... మొక్కలు పెరగడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకమైన జాగ్రత్తలేవీ అవసరం లేదు. వంటగది వ్యర్థాలనే ఎరువుగా వేస్తున్నాను. వీటన్నింటినీ సొంతంగా పెంచుకోవడం అసాధ్యమేమీ కాదు. కొంత సమయం, మరికొంత శ్రద్ధ ఉంటే చాలు. ఉదయాన్నే అరలీటరు నీటిలో తులసి, మెంతితోపాటు నచ్చిన తాజాఆకులను వేసుకుని పావు లీటరు అయ్యే వరకు మరిగించి రుచి కోసం తేనె కలుపుకుని తాగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యం కోసం ప్రయాస పడాల్సిన అవసరమే ఉండదు. ఇంట్లోనే ఫార్మసీ, మీరే వైద్యులు’’ అని ఆరోగ్యం కోసం ఔషధాలను కప్పులో పోసి ఇస్తున్నారు డాక్టర్ అన్షు రాఠీ. -
మొక్కలు కూడా అరుస్తాయి..శబ్దాలు చేస్తాయ్.!
మొక్కలకు భాష ఉంటుందని, నీళ్లు పోసినపుడు ఆనందంతో కొమ్మలు ఊపూతూ ఆనందాన్ని ప్రకటిస్తాయని చాలా సార్లు విన్నాం. తాజాగా మొక్కలకూ బాధ ఉందనే విషయాన్ని తొలిసారిగా గుర్తించారు. తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు మొక్కలు కూడా గట్టిగా అరుస్తాయని పరిశోధకులు వెల్లడించారు. చెట్లు, మొక్కలను కూకటి వేళ్లతో సహా పెకలించినప్పుడు, లేదా వాటి కాండాన్ని మధ్యలో నరికినప్పుడు మొక్కలు ఆక్రోశిస్తాయి. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తమ పరిశోధనలో ఈ విషయాలను గుర్తించారు. సెల్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. నిశ్శబ్దమైన మైదానంలో కూడా మనకు వినబడని శబ్దాలు చేస్తాయి. ఆ శబ్దాలకు అర్థం ఉంటుంది. ఈ శబ్దాలను వినగలిగే జంతువులూ ఉన్నాయి. కాబట్టి చాలా శబ్ద పరస్పర చర్య జరిగే అవకాశం ఉందని పరిణామాత్మక జీవశాస్త్రవేత్త లిలాచ్ హడానీ తెలిపారు. సాధారణ సమయాల్లో కూడా మొక్కలు కొన్ని రకాల శబ్దాలు చేస్తాయని, మనిషి వినలేని ఈ శబ్దాలను కొన్ని జంతువులు, కీటకాలు గుర్తిస్తాయని తేల్చారు. లిలాచ్ హడానీ డా. హడానీ , ఆమె బృందం ఈ ప్రయోగాల కోసం టమాటాలు, పొగాకు మొక్కలను పరిశీలించారు. మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ ద్వారా ఒత్తిడి లేని మొక్కలు, కాండం పెకిలించిన మొక్కలు, నిర్జలీకరణ మొక్కలు ఉత్పత్తి చేసే శబ్దాల మధ్య తేడాను గుర్తించానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒత్తిడి ఎదుర్కొంటున్న సమయాల్లో మొక్కలు మీటరు దూరం మేర వినబడేలా హై పిచ్ శబ్దాలు చేస్తాయని గుర్తించారు. ఒత్తిడి లేని మొక్కలు ప్రశాంతంగానే ఉంటున్నట్టు గుర్తించారు. ఒత్తిడిలో ఉన్న మొక్కలు చేసిన శబ్దాలు అల్ట్రా సౌండ్ ఫ్రీక్వెన్సీల్లో ఉండే ఈ ధ్వనులు చిటికెలు లేదా క్లిక్ చేసినట్టుగా ఉంటాయని, మనుషులకు వినబడవని పేర్కొన్నారు. మొక్కలు తమ బాధలను తమ చుట్టూ ఉన్న ప్రపంచానికి తెలియజేయడానికి ఉపయోగించే మార్గాలలో ఇదొకటి కావచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ఒత్తిడి సమయాల్లో చెట్లు, మొక్కలు తమ రంగులు మార్చుకోవడం, లేదా ముడుచుకుపోవడం, ఇతర మార్పులకు లోనవుతాయని తెలుసు. అయితే, ఇవి శబ్దాలను కూడా వెలువరిస్తాయో లేదో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.. అయితే, మొక్కలు ఈ శబ్దాలను ఎలా చేస్తాయనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. -
ముఖేష్ సర్ప్రైజ్ గిఫ్ట్ : ఆనంద్ మహీంద్ర ఫిదా!
కొందరు వ్యక్తులు నిస్వార్థంగా జనం కోసం చేసే పనులు విశేషంగా నిలుస్తాయి. ప్రకృతిమీద, మానవాళి మీద వారి ప్రేమను చెప్పకనే చెబుతాయి. రాజస్థాన్కు చెందిన ముఖేష్ అలాంటి కోవలోకే వస్తారు. బోగన్ విల్లా మొక్కలతో అందమైన షెల్టర్ తయారుచేసిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బెటర్ ఇండియా షేర్ చేసిన ఈ వీడియో పారిశ్రామికవేత్త ఆనంద్మహీంద్రను కూడా ఆకట్టుకుంది. రాజస్తాన్లోని భిల్ వారాకుచెందిన ముఖేష్ జనానికి చక్కటి గిఫ్ట్ అందించాడు. 12 సంవత్సరాలకు పైగా కష్టపడి బోగన్విల్లా మొక్కలతో షెల్టర్ను అందంగా తీర్చి దిద్దాడు. గులాబీ రంగులో విరబూసిన ఈ పువ్వులు చూడటానికి రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. ఇది అందంగా ఉండటమే కాదు అందరికీ నీడను పంచుతోంది. Over 12 years, Mukesh turned a Bougainvillea shrub into, literally, a pavilion, giving shade to all travellers. One individual, passionately built a thing of beauty. Sustainability may eventually come from the collection of such individual deeds…pic.twitter.com/l2XhN918UY — anand mahindra (@anandmahindra) March 28, 2024 -
అదానీ గ్రూప్ ప్రపంచ అతిపెద్ద కాపర్ ప్లాంట్
గుజరాత్లోని ముంద్రాలో అదానీ గ్రూప్ భారీ కాపర్ ప్లాంటు తొలి దశను ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే సింగిల్ లొకేషన్లో ఏర్పాటైన అతి పెద్ద కాపర్ తయారీ కర్మాగారంగా నిలవనుంది. దీనితో దిగుమతులపై ఆధారపడే పరిస్థితి కొంత తగ్గనుంది. అంబుజాలో అదానీ వాటా అప్ రూ. 6,661 కోట్ల పెట్టుబడులు డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా అంబుజా సిమెంట్స్లో వాటాను పెంచుకుంది. 21.2 కోట్ల వారంట్లను ఈక్విటీ షేర్లుగా మార్పిడి చేసుకోవడం ద్వారా 3.6 శాతం అదనపు వాటాను పొందింది. ఇందుకు రూ. 6,661 కోట్లు వెచ్చించగా.. ప్రస్తుతం అంబుజాలో అదానీ వాటా 66.7 శాతానికి చేరింది. దేశీయంగా సిమెంట్ తయారీలో రెండో పెద్ద కంపెనీగా నిలుస్తున్న అంబుజాలో ప్రమోటర్ సంస్థ హార్మోనియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ షేరుకి రూ. 314.15 సగటు ధరలో వారంట్లను మార్పిడి చేసుకుంది. ఇంతక్రితం 2022 అక్టోబర్లోనూ ప్రమోటర్ సంస్థ వారంట్లను అందుకోవడం ద్వారా రూ. 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. దీనిలో భాగంగా హార్మోనియాకు 47.74 కోట్ల మార్పిడికి వీలయ్యే వారంట్లను అంబుజా సిమెంట్స్ జారీ చేసింది. -
రణపాలతో ఆరోగ్య ప్రయోజనాలు : పేరులోనే ఉంది అంతా!
ప్రకృతిలో వెదికి పట్టుకోవాలనే గానీ ఎన్నో ఔషధ మొక్కల నిలయం. సౌందర్య పోషణ దగ్గర్నించి, దీర్ఘకాల రోగా వలరు ఉన్నో ఔషధ గుణాలున్న మొక్కలు మన చుట్టూనే ఉన్నాయి. అలాంటి వాటిలో రణపాల ఒకటి. వాస్తవానికి రణపాల అలంకరణ మొక్కగా భావిస్తాం. కానీ ఆరోగ్య ప్రయోజనాలు కూడాచాలానే ఉన్నా యంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 150 వ్యాధులను నయం చేయగల శక్తి రణపాల మొక్కకి ఉంది. రణపాల శాస్త్రీయ నామం Bryophyllum pinnatum. దీని ఆకులు కాస్త మందంగా ఉంటాయి. రుచి కొద్దిగా వగరు, పులుపు సమ్మిళితంగా ఉంటుంది. ఆకు నాటడం ద్వారానే మరో మొక్కను అభివృద్ది చేసుకోవచ్చు. అంటే ఇంటి ఆవరణలో సులభంగా పెంచుకోవచ్చన్నమాట. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయోల్, యాంటీ ఫంగల్,యాంటీ హిస్టామైన్ తోపాటు అనాఫీలాక్టిక్ గుణాలు రణపాలలో అధికంగా ఉన్నాయి రణపాల ప్రయోజనాలు ♦ ఆకు తినడం ద్వారా గానీ, కషాయం తయారు చేసి తీసుకోవడం ద్వారా, ఆకు పేస్ట్ను కట్టు కట్టడం ద్వారా గానీ చాల ఉపయోగాలను పొందవచ్చు. ♦ అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ♦ డయాబెటిస్ ని క్రమబద్దీకరిస్తుంది. ♦ కిడ్నీ సమస్యలు తగ్గుతాయి. కిడ్నీ స్టోన్లు ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. ఈ ఆకులను తింటే రక్తంలోని క్రియాటిన్ లెవల్స్ తగ్గుతాయి. ♦ జీర్ణాశయంలోని అల్సర్లు తగ్గుతాయి. అజీర్ణం, మలబద్దకం సమస్యలను తగ్గించుకోవచ్చు ♦ ఆకులని వేడిచేసి గాయాలపై పెడితే గాయాలు త్వరగా మానుతాయి ♦ ఆకులని నూరి దాన్ని తలపై పట్టులా వేస్తే తల నొప్పి తగ్గుతుంది. ♦ రోజు ఈ ఆకుల్ని తినడం ద్వారా జుట్టు రాలడం తగ్గుతుంది. తెల్ల వెంట్రుకలు రావడం ఆగుతుందట ♦ ఈ ఆకుల్లో యాంటీ పైరెటిక్ లక్షణాలు జలుబు, దగ్గు, విరేచనాలను నయం చేస్తాయి. ♦ మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చిన వారు తీసుకుంటే మంచిది. ♦ రణపాల ఆకులను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మూత్రంలో రక్తం, చీము వంటి సమస్యలు తగ్గుతాయి. ♦ కామెర్లతో బాధపడేవారు రోజూ ఉదయం, సాయంత్రం ఈ ఆకుల రసాన్ని తీసుకుంటే వ్యాధి నయం అవుతుందని ఆయుర్వేదం చెబుతుంది. నోట్: ఈ చిట్కాలను పాటించేటపుడు, రెగ్యులర్గా సంప్రదించే డాక్టర్, ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. -
గన్నేరు మొక్కతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా!
గన్నేరు మొక్క శాస్త్రీయ నామం నెరియం ఒలియాండర్. దీనిని సాధారణ అలంకార మొక్కగా పెంచుతారు. దీనిలో పలు ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గన్నేరు చెట్టు భారతదేశానికి చెందిన ఒక మధ్య-పరిమాణపు చెట్టు. ఈ చెట్టు తన విస్తృతమైన, రంగురంగుల ఆకులకు ప్రసిద్ధి చెందింది. గన్నేరు ఆకులు సాధారణంగా రెండు రంగుల్లో ఉంటాయి: ఒక వైపు ఆకులు ఆకుపచ్చగా మరొక వైపు ఎరుపు, గులాబీ లేదా ఊదా రంగులో ఉంటాయి. వీటి పూలు ఎక్కువగా తెలుపు, గులాబీ, పసుపు, లేత గులాబీ రంగుల్లో ఉంటాయి. దేవుళ్ళకి ఇష్టమైన పూలా మొక్కగా ప్రసిద్ధి. వాస్తు శాస్త్ర ప్రకారం ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ మొక్క వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గన్నేరు మొక్క ఎలా ఉంటుందంటే.. గన్నేరు చెట్టు సుమారు 10 నుంచి 15 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది.గన్నేరు ఆకులు పొడవుగా ఉంటాయి 5 నుంచి 10 సెం.మీ వ్యాసం కలిగి ఉంటాయి. గన్నేరు పువ్వులు పెద్దవిగా, తెల్లగా ఉంటాయి 5 రేకులు కలిగి ఉంటాయి. ఇక కాయలు పొడవుగా, సన్నగా ఉంటాయి గోధుమ రంగులో ఉంటాయి. గన్నేరు చెట్టును అలంకార మొక్కగా, ఔషధ మొక్కగా ఉపయోగిస్తారు. ఆరోగ్య ప్రయోజనాలు.. గన్నేరు ఆకుల రసం జ్వరం, దగ్గు, అజీర్ణం వంటి వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగించబడుతుంది. గన్నేరు పువ్వులను రక్తహీనత చికిత్సకు ఉపయోగిస్తారు. గన్నేరు బెరడును క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. దీన్ని గుండె వైఫల్యానికి చికిత్స చేయడంలో ఉపయోగించబడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది: నొప్పిని తగ్గిస్తుంది చర్మ వ్యాధులకు చికిత్స చేస్తుంది అయితే దీన్ని వైద్యులు, ఆరోగ్య నిపుణుల పర్యవేక్షణలోనే వినియోగించాలి. లేదంటే ప్రమాదమే!. ఎందువల్ల అంటే..దీనిలోని విషపుతత్వం ఎక్కువగా జంతువులపైన ప్రభావం చూపిస్తుంది. జంతువులు వాటిని తిన్నప్పుడు ఆ చెట్టులోని విషంవల్ల అవి అక్కడికక్కడే మరణిస్తాయి. వీటిలో ఒలియాండ్రిన్, ఒలియాండ్రిజిన్ అనే రెండు రసాయనాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. అవి కార్డియాక్ గ్లైకోసైడ్స్గా బాగా ప్రసిద్ధి చెందినవి. అనగా అవి మనిషి శరీరంలోకి వెళ్లంగానే మరణించడం జరుగుతుంది. (చదవండి: రక్తంతో జుట్టురాలు సమస్యకు చెక్కు!) -
భారత అత్యున్నత న్యాయమూర్తి ఫాలో అయ్యే డైట్ ఇదే!
ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ భారతదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. గతంలో ఆయన అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ, బాంబే హైకోర్టు న్యాయమూర్తిగానూ పనిచేశారు. ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా పనిచేస్తున్నారు. సుదీర్ఘకాలంపాటు పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్ కుమారుడే ఈ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్. ఇక ఆయన ఒక మీడియా ఇంటర్వ్యూలో తన జీవనశైలి, ఫాలో అయ్యే డైట్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అంతేగాదు తన దైనందిన జీవితంలో ఆహార ప్రాధాన్యతలు, అలాగే తన రోజు ఎలా ప్రారంభమవుతుందనే వాటి గురించి కూడా చెప్పుకొచ్చారు డివై చంద్రచూడ్. అవేంటో తెలుసుకుందాం! ఆయన మంచి జీవనశైలే ఆరోగ్యంగా ఉండటంలోనూ రోజంతా ఉత్సాహంగా ఉండంటంలోనూ ఉపకరిస్తుందని అన్నారు. తాను ఉదయం 3.3 గంలకు యోగాతో రోజు ప్రారంభిస్తానని, ప్రాధమిక ఆయుర్వే ఆహార జీవనశైలిని అనుసరిస్తానని అన్నారు. ఇక తాను తన భార్య శాకాహారులమని చెప్పారు. తనకు ఎక్కువుగా మొక్కల ఆధారిత డైట్ బాగా పనిచేసిందన్నారు. ఎందుకంటే మన నాలుక మీదే మన శరీరం తీరు, మానసికోల్లాసం ఆధారపడి ఉందన్నారు. అంటే నాలుక రుచి కావాలనుకుంటే శరీరం బరువు అదుపుతప్పుతుంది. తద్వారా మానసిక ఆరోగ్యం ప్రభావితమవుతుందని అర్థం. ఇక్కడ నాలుకను నియంత్రణలో ఉంచుకుంటే ఎలాంటి ఆహారమైన అమృతంగా తీసుకోగలమని చంద్రచూడ్ చెబుతున్నారు. మరాఠి అయిన చంద్రచూడ్ తాను సాబుదానా కంటే రామాదాన ఇష్టపడతానన్నారు. అంటే ఇక్కడ రామదానా అంటే ఉసిరికాయ అని అర్థం. అలాగే తాను ఆరోగ్యకరమైన తృణధాన్యాలను తీసుకుంటానని చెప్పారు. ఈ డ్రైట్ ఒక్కోసారి తాను కూడా స్ట్రిట్గా ఫాలో అవ్వలేనని అన్నారు. ఎందుకంటే ఒక్కోసారి నాకిష్టమైన ఐసీక్రీ కూడా వచ్చి చేరుతుందిగ అంటూ నవ్వేశారు. కానీ తాను నాలుకును, మనసును నియంత్రణలో పెట్టుకోగలనని అందువల్లో ఒక్కోసారి స్కిప్ అయ్యినా, ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోగలనని అన్నారు. మొక్కల ఆధారిత డైట్ అంటే.. గత కొన్నేళ్లుగా ప్రజల జీవనశైలిలో పలు మార్పులు వచ్చాయి. ఎక్కువగా శాకాహారంవైపుకు మళ్లుతున్నారు. ఒకకరకంగా జంతు హింస జరగకుండా ఉండేలా చేయడం నుంచి మొదలయ్యిందే ఈ మొక్కల ఆధారిత డైట్ అని చెప్పొచ్చు. ఈ డైట్లో పచ్చగా ఉండే వాటితో ఆరోగ్యాన్ని మెరుగ్గు ఉంచుకుంటారు. ఈ శాకాహారం డైట్లో తప్పనిసరిగా తీసుకోవాల్సినవి పండ్లు, కూరగాయాలు, తృణధాన్యాలు, కాయధాన్యలు తోపాటు ఆకకూరలకు సంబంధించిన మొక్కల ఆధారిత ఆహారాలు. ఇక్కడ శాకాహార అనంగానే పాల ఉత్పత్తులను కూడా దగ్గరకు రానియ్యరు. దాని బదలు, బాదంపాలు, సోయా పాలు, కొబ్బరి పాలు, తదితర మొక్కల ఆధారిత పాలను ప్రత్నామ్నాయంగా తీసుకుంటారు కానీ ఇక్కడ ఇలా భారత అత్యున్నత న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ మాదిరిగా మొక్కల ఆధారిత డైట్ ఫాలో అవ్వాలంటే శరీరం, మనస్సు నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే సులభంగా, రుచికరంగా శాకాహారాన్ని వండుకునే యత్నం చేయాలి. అప్పుడే ఈ డైట్ని సక్రమంగా ఫాలో అయ్యి, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇక్కడ ఏదైనా ఇష్టంతో, ఆరోగ్య స్ప్రుహతో చేయగలిగితేన మెరుగైన ఫలితాలు పొందగలరనేది అత్యంత కీలకం. (చదవండి: 90 శాతం మంది నీళ్లను తప్పుగానే తాగుతారు! అసలైన పద్ధతి ఇదే..!) -
నల్లేరా..మజాకా...! ఈ అద్భుత ప్రయోజనాలు తెలుసా?
ప్రకృతిని ఆధునీకులు సరిగ్గా పట్టించుకోరు కానీ.. ప్రతి మొక్కలోనూ ఎన్నో విలువైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అలాటి వాటిల్లో నల్లేరు కూడా ఒకటి. తీగ జాతికి చెందిన దీన్నే వజ్రవల్లి, అస్థి సంహారక, అస్థి సంధని, అస్థి సంధాన అని కూడా పిలుస్తారు. నల్లేరు లాభాలు, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.! పట్టణ వాసులతో పోలిస్తే గ్రామీణ వాసులకు చాలా వరకు వీటిపై అవగాహన ఉంటుంది. గుబురు పొదల్లో, డొంకల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా ఈ కాడల్ని పాదుల మధ్య అక్కడడక్కడ వేస్తారు. తొండలు, ఉడతలు కూరగాయల పిందెల్ని కొరికేయకుండా ఇలాంటి జాగ్రత్త తీసుకుంటారు. ఎందుకంటే దీని కోసినా, కొరికినా దురద వస్తుంది. నల్లేరుతో వంటలు అలా కూరగాయల పాదులపై వేసిన కాడలే.. వాటంతట అవే క్రమేపీ విస్తరించి అల్లుకుపోతాయి. ఇది వంట ఇంటిలోకి కూడా చేరింది. అయితే నల్లేరును కోసేటప్పుడు చేతులకు నూనె రాసుకుంటే దురద రాదు. నల్లేరు తీగలోని లేత కణుపులు కోసి వాటి నారను తీసి పచ్చడి, పప్పు, కూర చేసుకుంటారు. దీనిని కాడలతో పులుసు పచ్చడి చేసుకొని చాలా ప్రాంతంలో తింటారు. వీటి కాడల్ని శుభ్రం చేసి నీడలో ఎండబెట్టి దంచి పొడిగా చేసుకుని భద్రపరచుకొని, వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే నడుము నొప్పి, కీళ్ల నొప్పులు తగ్గిపోతాయని ఆయుర్వేదం నిపుణులు చెబుతున్నారు. ఒకవంతు నల్లేరు గుజ్జుకు మూడు రెట్లు బియ్యం కలిపి తగినన్ని నీరు పోసి మెత్తగా నూరుకోవాలి. దీనిని రొట్టెలా తయారు చేసుకుని తింటే కొండ నాలుక రావడం, కోరింత దగ్గు తగ్గుతుంది. ఔషధ గుణాలు ఆస్థియో పోరోసిస్ ,ఎముకలు గుల్ల బారడం , ఎముకలు విరగడం లాంటి సమస్యలకు చక్కని ఔషధం నల్లేరు. నల్లేరులో కెరోటినాయిడ్స్, కాల్షియం, విటమిన్ సీ, కాల్షియమ్, సెలీనియమ్, క్రోమియం, విటమిన్ బి, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. నల్లేరు ఎముకల దృఢత్వాన్ని పెంచటమే కాకుండా ప్రక్కన వుండే కండరాల కూడా శక్తినిస్తుంది. ఎముకలు సులభంగా అతుక్కుంటాయి. దీనిలో నొప్పి నివారణ గుణాలు అధికంగా ఉన్నాయి. ఆస్ప్రిన్ మాత్రకి సమానంగా ఉండే ఇందులోని ఔషధగుణం నొప్పి నివారణకు బాగా ఉపయోగ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. సంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడతారు. నల్లేరులో యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్, యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. నల్లేరు రసంతో రక్తహీనత నుంచి కాపాడుకోవచ్చు. మహిళల్లో మెనోపాజ్ లక్షణాల్లోముఖ్యమైన ఎముకల బలహీనత చాలా ముఖ్యంది చెబుతారు. నల్లేరులో పీచు అధికంగా ఉండటం వలన పైల్స్ సమస్యను తగ్గిస్తుంది. నల్లేరు రసంలో నెయ్యి, పంచదార కలిపి తాగితే పీరియడ్స్కు సంబంధించిన దోషాలు తొలగిపోతాయట. అంతేకాదు ప్లాస్టిక్ నిరోధించే గుణాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు నిపుణులు. -
Potato Peel ‘తొక్క’ లే అనుకుంటే పప్పులో కాలేసినట్టే!
#Potato Peel : చిన్నపుడు అమ్మమ్మ బీర కాయ పొట్టు పచ్చడి చేసి. ఇది ఏం పచ్చడో చెప్పండర్రా.. అంటూ పెద్ద పజిల్ వేయడం గుర్తుందా? నిజంగా అమోఘమైన ఆ రుచికి, అసలు అది ఏం పచ్చడో అర్థం కాక.. తీరా గుట్టు విప్పాక, ‘బీర్’ కాయా అంటూ నోరు వెళ్లబెట్టడం కూడా తెలుసు. అలాగే సొరకాయ తొక్కులు, పచ్చి అరటికాయ తొక్కల పచ్చడి, ఆఖరికి పుచ్చకాయల తొక్క లోపల ఉండే తెల్లటి పదార్థంతో కూడా దోసెలు చేసి పెట్టడం కూడా తెలుసు. ఇపుడు అలాంటి తొక్కలు మరొక దాని గురించే తెలిస్తే.. నిజంగా ఔరా అంటారు.. అదిఏమిటంటే.. చిన్న పిల్లలకు ఆలూ ఫ్రై చేసి పెడితే చాలు..మారు మాట్లాడకుండా లాగించేస్తారు. పెద్దలకి కూడీ ఆలూ లేదా బంగాళా దుంప అంత ఫ్యావరేట్. కానీ ఆలూ తొక్కల వాడకం, ప్రయోజనాల గురించి మాత్రం చాలామంది తెలియదు. బంగాళాదుంపల తొక్కల్లో పోషకాలు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఈ తొక్కలను చర్మ, సౌందర్య సాధానాల్లో వినియోగిస్తారు. కాలిన గాయాలకు చికిత్స ఆలుగడ్డ తొక్కల్లో యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ ఉంటుంది. ఇది చిన్నపాటి కాలిన గాయాలకు చికిత్సగా ఉపయోపడుతుంది. అంతేకాదు వేసవిలో ఎండలకు కమిలిని చర్మానికి సహజమైన చిట్కాగా పని చేస్తుంది. సిల్కీ స్కిన్ మొటిమలతో ఎక్కువగా బాధపడుతున్నవారు ఆలూ తొక్కలను అప్లై చేసుకోవచ్చు.మొటిమల్ని గిల్లకుండా, ఎక్కువ రుద్దకుండా వాటిపై తొక్కలతో మెల్లిగా రాయాలి. అలాగే కళ్లకిందే ఉండే డార్క్ సర్కిల్స్ నివారణలో కూడా ఫలితాలు అందిస్తుంది. కెమికల్స్ లేని సహజమైన ఈ తొక్కల రసాన్ని చర్మానికి అప్పై చేయవచ్చు. ఈ జ్యూస్తో సిల్కీగా, ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని పొందవచ్చు. అందుకే వీటిని ఎప్పటినుంచో సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తున్నారు. ఐరన్ పాత్రల తుప్పు పట్టకుండా, స్టార్చ్ సహజమైన గ్రీజుగా పనిచేస్తుంది. అలా వంట ఇంటి చిట్కాగా పనిచేస్తుంది. ఆలూ తొక్కలు మొక్కలకు ఎంతో బలం మొక్కలకు కూడా ఇవి మంచి బాలన్నిస్తాయి. భాస్వరం, పొటాషియం, నత్రజని వంటి ముఖ్యమైన పోషకాలతో నిండిన ఈ తొక్కలు నేల నాణ్యతను మెరుగుపరుస్తాయి. మొక్కల ఎదుగుదల బాగా ఉంటుంది. ఆలూ తొక్కల పీల్ కంపోస్ట్ వేసిన వెంటనే గులాబీ, మల్లె లాంటి పూల మొక్కలు వెంటనే మొగ్గ తొడుగుతాయి. -
రాత్రిళ్లుమెరిసే మొక్కలు.. అమ్మకానికొచ్చాయ్!
రాత్రి అయిందంటే.. అడవిని చిమ్మ చీకటి కమ్ముకుంటుంది. మొక్కలు, చెట్లు, జంతువులన్నీ చీకట్లో ఉండిపోతాయి. కానీ అక్కడక్కడా మిణుగురు పురుగులు (ఫైర్ఫ్లై) వెలుగులు చల్లుతూ తిరుగుతుంటాయి. కొన్ని రకాల పుట్టగొడుగులు (బయో ల్యూమినిసెంట్ మష్రూమ్స్) చిన్నగా కాంతిని వెదజల్లుతుంటాయి. ఇది చూసిన శాస్త్రవేత్తలు వినూత్నంగా ఆలోచించి.. చీకట్లో కాంతిని వెదజల్లే మొక్కలను సృష్టించారు. పుట్టగొడుగుల్లో కాంతిని వెదజల్లే సామర్థ్యానికి కారణమైన జన్యువులను సేకరించి.. ‘పెటునియా’పూల మొక్కల్లో ప్రవేశపెట్టారు. వీటికి ‘ఫైర్ఫ్లై పెటునియా’అని పేరుపెట్టారు. తెలుపు రంగులో ఉండే ఈ మొక్కల పూలు.. రాత్రిపూట ఆకుపచ్చని కాంతులు వెదజల్లుతూ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడీ పూల మొక్కలను అమ్మకానికి కూడా పెట్టారు. ఒక్కో మొక్క ధర సుమారు రూ.2,500 మాత్రమే (30 డాలర్లు). ఈ ‘ఫైర్ఫ్లై పెటునియా’మొక్కలను అభివృద్ధి చేసినది అమెరికాలోని ఇడహో రాష్ట్రానికి చెందిన లైట్ బయో సంస్థ. 50వేల మొక్కలను అమ్మకానికి సిద్ధం చేసింది. ప్రస్తుతానికి ఇవి అమెరికాలో మాత్రమే విక్రయిస్తున్నట్టు ప్రకటించింది. ఇవి జన్యుమార్పిడి మొక్కలు కావడంతో.. అనుమతులను బట్టి ఇతర దేశాల్లోనూ అమ్మేందుకు ప్రయత్నిస్తామని పేర్కొంది. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
మొక్కలు సరిగా ఎదగడం లేదా? ఈ టిప్స్ ట్రై చేయండి!
ఇంటి కుండీలలో లేదా పెరటి తోటల్లో పెంచే మొక్కలు ఒక్కొక్కసారి ఎండి పోతుంటాయి. ఎండిన చెట్టు చిగురించాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అసలు చెట్లు ఎందుకు ఎండిపోవడానికి నీరు లేక, మరే ఇతర కారణమా అనేది గుర్తించాలి. నీరు తక్కువైనప్పుడే కాదు.. నీరు ఎక్కువగా ఉన్నా చెట్లు ఎండిపోతుంటాయి. కాబట్టి, అలా లేకుండా చూడండి. త్వరలో వసంత రుతువు రాబోతోంది. మీ పెరటి తోటలో లేదా ఇంటి కుండీలలో ఉన్న చెట్లను సంరక్షించుకోవడం ఇప్పటినుంచే ఆరంభిస్తేనే కదా అప్పటికి చక్కగా చిగిర్చి పూలు పూసేది! ఇంకెందుకాలస్యం? చూసేద్దామా మరి! మొక్కలకు జీవకళ మొక్కలు సాధారణంగా పురుగుల కారణంగా అనేక తెగుళ్ళ బారిన పడుతుంటాయి. అప్పుడు ఎండి, వాడిపోతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు వాటిని కాపాడుకోవాలి. ఆకులపై దుమ్ము, ధూళి పేరుకుపోయినా అవి కళ తప్పుతాయి. అందువల్ల వాటిని నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇందుకు చిన్న పాటి పైపు లేదా స్ప్రేయర్ ఉపయోగపడుతుంది. సూర్యకాంతి... చెట్లకి సరైన కాంతి అవసరం. అలాగని మరీ ఎండలో కూడా ఉంచరాదు. లేదా బాగా చీకటి ఉన్న ప్రదేశంలో ఉంచడమూ సరికాదు. ఎండ పొడ పడే ప్రదేశంలోనే కుండీలని ఉంచాలి లేదా చెట్లని పెంచాలి. కుండీల పరిమాణం... కుండీలో పెంచే మొక్క తీరును బట్టే కుండీని ఎంచుకోవాలి. చెట్ల కుండీలు అవి పెరగడానికి సరిపడనంత లేకుండా చిన్నగా ఉన్నా చెట్లు ఎండిపోవడానికి కారణమవుతాయి. కాబట్టి, సరైన పరిమాణంలో ఉన్న కుండీల్లో పెంచడం మేలు. మొక్కలని శుభ్రం చేయడం... దెబ్బతిన్న, ఎండిన, పండిన ఆకులని ఎప్పటికప్పుడు తుంచి శుభ్రం చేయాలి. వీటిని కత్తెరతో కత్తిరించడం మంచిది. తెగులు సోకిన కొమ్మలను, ఆకులని తుంచడం వల్ల మొక్కలు చక్కగా పెరుగుతాయి. ఎరువులు... ఎరువు లేకుండా పెంచడం వల్ల చెట్లు నిస్తేజంగా... సారం లేనట్లు... వడలిపోయినట్లు కనిపిస్తాయి. అందువల్ల వాటికి అప్పుడప్పుడు ఎరువులు వేయాలి. అప్పుడే మొక్కలు చక్కగా పెరుగుతాయి. వీలయినంత వరకు రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులను వాడటం మంచిది. బియ్యం, పప్పులు కడిగిన నీళ్లని పోయడం, ఉల్లిపొట్టు, కూరగాయల తొక్కలు వంటి వంటింటి వ్యర్థాలతో ఎరువులు తయారు చేసే ఉపకరణాలు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటి సాయం తో తయారు చేసిన ఎరువులు వాడటం వల్ల వాటికే కాదు, అవి తినే మన ఆరోగ్యానికి కూడా మంచిది. -
మొక్కల సంరక్షణకు నెయ్యి ఉపయోగిస్తారని తెలుసా!
మాములుగా శరీరానికి తగు మోతాదులో నెయ్యి అవసరం. శరీరానికి కావాల్సిన మంచి కొలస్ట్రాల్ నెయ్యి అని కూడా నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇది జ్ఞాపకశక్తిని, జీర్ణశక్తిని పెంచడమే గాక రోగనిరోధక శక్తిని మెరుగ్గా ఉంచుతుంది. అలాంటి నెయ్యి మొక్కల సంరక్షణ కోసం వినియోగిస్తారని విన్నారా?. ఈ నెయ్యి వల్ల మొక్కల కుండీల్లో నేల సారవంతమై మొక్క ఆరోగ్యంగా పెరిగేలా చేయడమే కాకుండా పురుగు, పుట్ర వంటివి దరిచేరనివ్వదని చెబుతున్నారు అగ్రికల్చర్ పరిశోధకులు. ఇంతకీ మొక్కలకు నెయ్యి వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఎలా వినియోగించాలి వంటివి తెలుసుకుందామా!. ►నెయ్యిలో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నందున , దానిని పెరుగుతున్న నేలలో వేయడం వల్ల సేంద్రీయ కూర్పు పెరుగుతుంది . దీన్ని మెక్క పెరుగుతున్న భాగంలో వేసి ఆ తర్వాత నీళ్లు పోసి వృద్ధి చెందేలా చూడాలి. ► అఫిడ్స్ స్లగ్లు కాండం, ఆకులపై దాడి చేయకుండా ఈ నెయ్యి రక్షిస్తుంది. దాని కుండే మృదు స్వభావానికి అవి దాడి చేయడం కష్టమవుతుంది. అలాగే ఇబ్బందికరమైన తెగుళ్ల నుంచి రక్షించుకోవడానికి నెయ్యి గొప్ప ప్రత్యామ్నాయం. ► దూదిపై 3-4 చుక్కల కరిగించిన నెయ్యి వేసి, తెగులు సోకిన మొక్క కాండం,ఆకులను తుడిస్తే..అఫిడ్స్, స్లగ్స్ పైకి రావు. నెయ్యిలోని కొవ్వులు నేలకు ఉపయోగపడే సూక్ష్మజీవులకు ఆహార వనరును అందిస్తాయి. మొక్క పెరుగుతున్న నేలలో సేంద్రీయ పదార్థం సమృద్ధిగా ఉండేలా చేస్తుంది. దీంతో మొక్క బాగా పెరగడమే గాక పచ్చగా పెరగడానికి సహాయపడుతుంది. ►ఇలా ప్రతి రెండు నుంచి మూడు నెలలకు చొప్పున రెండు నుంచి మూడు టీస్పూన్ల నెయ్యిని వేస్తే చాలు మంచి ఫలితాలు ఉంటాయి. ►రబ్బరు మొక్క వంటి పెద్ద ఆకులు కలిగిన మొక్కలకు నెయ్యితో మంచి ప్రయోజనం ఉంటుంది. తడిగా ఉన్న కాటన్ వస్త్రాన్ని ఉపయోగించి వాటి ఆకులను శుభ్రం చేయండి. పూర్తయిన తర్వాత, ఒక దూదీలో 4 నుంచి 5 చుక్కల కరిగించిన నెయ్యి వేసి, ఆకులను తుడవండి. ఇది ఆకులను మెరిసేలా చేయడమే కాకుండా కొవ్వు పొరను కూడా జోడిస్తుంది. గమనిక: నెయ్యి అప్లై చేసిన తర్వాత ఎక్కువ ధూళిని ఆకర్షిస్తుంది కాబట్టి 3-4 రోజుల తర్వాత మళ్లీ ఆకులను తుడవడం మంచిది. ప్రత్యక్ష సూర్యకాంతికి గురయ్యే మొక్కలపై దీనిని ఉపయోగించవద్దు. (చదవండి: స్టవ్ వెలిగించకుండానే.. పండంటి వంటలు..) -
మొక్కల సంగీతాన్ని వినొచ్చు తెలుసా!
మొక్కలకు, చెట్లకు అనుభూతులు ఉంటాయి. వాటిలో అవి సంభాషణలు జరుపుకుంటాయి అని శాస్త్రవేత్తలు ఇదివరకే కనుగొన్నారు. మొక్కలు సంగీతాన్ని కూడా ఆలపిస్తాయి. అయితే వాటి సంగీతం మన చెవులకు సోకదు. మొక్కల సంగీతాన్ని వినగలిగే పరికరాల తయారీ దిశగా శాస్త్రవేత్తలు కొంతకాలంగా కృషి సాగిస్తున్నారు. అందులో భాగంగానే స్వీడన్కు చెందిన వడ్రంగి, సంగీత పరికరాల తయారీదారుడు అయిన లవ్ హల్టన్ మొక్కల సంగీతాన్ని వినగలిగేందుకు వీలుగా ఈ పరికరాన్ని రూపొందించాడు. దీనికి ‘టెగెల్’ అని పేరు పెట్టాడు. చూడటానికి ఇది ఇటుకలతో తయారు చేసినట్లు కనిపిస్తున్నా, పూర్తిగా కలపతోనే తయారైంది. ఇందులోని మట్టి కుండీలో మొక్కను నాటి, దాని నుంచి వెలువడే ధ్వని తరంగాలను స్వీకరించేలా విద్యుత్తు తీగలను అమర్చాడు. దీనిలోని స్పీకర్ అమరిక ద్వారా మొక్కల నుంచి వెలువడే సంగీతం మనకు కూడా వినిపిస్తుంది. అలాగే దీనికి అమర్చిన కీబోర్డును వాయిస్తూ మనుషులు కూడా సంగీతాన్ని సృష్టించవచ్చు. ప్రయోగాత్మకంగా రూపొందించిన ఈ పరికరాన్ని మార్కెట్లోకి తేలేదు. (చదవండి: 93 ఏళ్ల వృద్ధుడు 40 ఏళ్ల వ్యక్తిలా.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు!) -
‘ఆక్సిజన్ మ్యాన్’ ఎవరు? ఎందుకాపేరు వచ్చింది?
నిస్వార్థంగా సేవ చేయడానికి సిద్ధమయ్యే యువత చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే దీనికి భిన్నంగా ప్రకృతిని అమితంగా ప్రేమిస్తూ, పర్యావరణ పరిరక్షణకు నిరంతరం పాటుపడుతున్న సునీల్ యాదవ్ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఒకవైపు జాతీయ స్థాయి కబడ్డీలో రాణిస్తూ, మరోవైపు పర్యావరణ పరిరక్షణలోనూ తన భాగస్వామ్యం ఉందంటున్న సునీల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సునీల్ తన 25 ఏళ్ల వయసుకే పదివేలకు పైగా మొక్కలు నాటి రికార్డు సృష్టించాడు. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్కు చెందిన సునీల్ యాదవ్ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. 2018-2019లో ఉత్తరప్రదేశ్ నుండి కబడ్డీ జూనియర్ జట్టులో ఆడి మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఆ తర్వాత 2020లో రెండోసారి రాష్ట్ర స్థాయిలో కబడ్డీ ఆడాడు. ఓవరాల్గా ఇప్పటి వరకు ఐదుసార్లు రాష్ట్ర స్థాయిలో ఆడాడు. ఒకవైపు క్రీడారంగంలో ఎదుగుతూనే మరోవైపు ప్రకృతిని కాపాడేందుకు కృషి సాగించాడు. లాక్డౌన్ సమయంలో జనమంతా ఇంట్లో ఉన్నప్పుడు సునీల్ ఉదయాన్నే నిద్రలేచి పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటేవాడు. తరువాత వాటిని సంరక్షించేవాడు. ఈ నేపధ్యంలోనే సునీల్ వినూత్న ప్రచారాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎవరినైనా అభినందిస్తూ పుష్పగుచ్ఛాలు ఇచ్చేందుకు బదులుగా ఔషధ మొక్కలు బహుమతిగా ఇవ్వాలనే ఆలోచన అందరిలో కల్పించాడు. తద్వార పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని భావించాడు. ఈ నేపధ్యంలో సునీల్ యాదవ్ ‘ఆక్సిజన్ మ్యాన్’గా గుర్తింపు పొందాడు. సునీల్ ఇప్పటివరకూ దేశంలోని మూడు రాష్ట్రాలలో సైకిల్ యాత్ర చేపట్టి, జనం మరింతగా మొక్కలు నాటేలా చైతన్యపరిచారు. సునీల్ చేపడుతున్న ప్రచారం నిరంతరం కొనసాగుతోంది. సునీల్ సుమారు 20 నుంచి 30 గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విరివిగా మొక్కలు నాటాడు. -
మొక్కల ఊసులు రికార్డయ్యాయి ఇలా!
ఇంతకుమునుపు మొక్కలు మాట్లాడతాయని, అవి కూడా బాధలకు ప్రతిస్పందిస్తాయని విన్నాం. అందుకు సంబంధించిన విషయాలను శాస్త్రవేత్తలు పరిశోధన పూర్వకంగా వెల్లడించారు కూడా. ఎప్పుడు ఎలా కమ్యూనికేట్ చేసుకుని ప్రతిస్పందిస్తాయన్నది ఓ మిస్టరీగా మిగిలిపోయింది. దీన్ని పరిశోధకులు తాజాగా చేధించడమే గాక మొక్కలు మాట్లాడుకోవడాన్ని కెమెరాలో బంధించి మరీ వివరించారు. వివరాల్లోకెళ్తే..జపాన్కి చెందిన శాస్త్రవేత్తల బృందం అందుకు సంబంధించిన ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేసింది.మొక్కలు ఒకదానికొకటి మాట్లాడుకోవడం నిజమేనని వీడియోలో బంధించి మరీ ప్రూవ్ చేసి చూపించారు. మొక్కలు కమ్యూనికేట్ చేయడానికి గాలిలో ఉండే సమ్మేళనాలను వినియోగించుకుంటాయిని, అవి పొగమంచుతో చుట్టబడి ఉంటాయని అన్నారు. ఈ సమ్మెళనాలను వాసనలుగా వినియోగించుగకుని ప్రమాదం గురించి మరొక మొక్కను హెచ్చరిస్తాయని చెబుతున్నారు. ఈ మేరకు జపాన్ శాస్త్రవేత్తలు రికార్డ్ చేసిన వీడియోలో.. మొక్కలు ఎలా ఆ సిగ్నల్స్ని స్వీకరించి ప్రతిస్పందిస్తాయన్నది ప్రత్యక్షంగా చేసి చూపించారు. సైతామ యూనివర్సిటీకి చెందిన మాలిక్యులర్ బయాలజిస్ట్ మసాత్సుగు టొయోటా నేతృత్వంలోని పరిశోధకులు బృందం ఈ విషయాన్నికమ్యూనికేషన్స్ జర్నల్లో వెల్లడించింది. ఇక్కడ మొక్కలు కీటకాలు లేదా ఇతరత్ర కారణాల వల్ల గాయపడిన లేదా దెబ్బతిన్న మొక్కలు మరోక మొక్కను హెచ్చరించేందుకు అస్థిర కర్బన సమ్మేళనాలను(వీఓసీ) విడుదల చేస్తుందని తెలిపారు పరిశోధకులు. గాల్లో విడుదలైన ఆ వీఓసీలను గాయపడిన మొక్కలు గ్రహించి తక్షణమే వివిధ రక్షణ ప్రతిస్పందనలు ప్రేరేపిస్తాయని తెలిపారు. అస్థిర కర్బన సమ్మేళనాలలో కాల్షియం అయాన్లు ఉండటం వల్ల మొక్కలు జరిపే ఈ కమ్యూనికేషన్ ప్రక్రియను కాల్షియం సిగ్నలింగ్ అని పిలవొచ్చని సైంటిస్టులు అన్నారు. ఈ ప్రయోగంలో భాగంగా రెండు టమాటా మొక్కలు, ఆవాల జాతికి చెందిన రెండు అరబిడోప్సిస్ థాలియానా జాతి కలుపుమొక్కలను పక్కపక్కన తొట్టిల్లో ఉంచారు. కాల్షియం సిగ్నలింగ్ అనేది మొక్కల ఆకులపై స్పష్టంగా కనిపించేలా ఈ మొక్కలకు బయో సెన్సర్లను బిగించారు. అనంతరం ఒక టమాటా మొక్క, ఒక అరబిడోప్సిస్ థాలియానా మొక్క ఉన్న తొట్టిలలోకి గొంగళి పురుగులను వేశారు. ఆ వెంటనే పురుగులు మొక్కలపైకి ఎక్కి ఆకులను తినడం ప్రారంభించాయి. దీంతో ఈ మొక్కలు స్పందించి.. వెంటనే కాల్షియం సిగ్నళ్లను రిలీజ్ చేశాయి. ఆ పక్కనే ఆరోగ్యకర స్థితిలో ఉన్న రెండు మొక్కలు ఈ సిగ్నళ్లను గ్రహించడం కూడా జరిగిపోయింది. దీంతో వెంటనే మొక్కల్లోని బయోసెన్సర్లు స్పందించి.. ఆకుల్లో కాల్షియం అయాన్లు యాక్టివేట్ అయిన ప్రదేశాన్ని మెరుస్తున్నట్లుగా హైలైట్ చేసి చూపించాయి. ఇదంతా లైవ్లో కెమెరాలో రికార్డయింది. If #plants could talk, they’d do so thru chemical signals about predators (aphids, caterpillars, gardeners with shears/pesticides…). Plants CAN talk (which we’ve known), but molecular biologists at Saitama University in Japan caught it 1st on film. https://t.co/44gXzMerK5 pic.twitter.com/DcLAlV1iti — HoneyGirlGrows (@HoneyGirlGrows) January 20, 2024 (చదవండి: మగవాళ్లు రోజూ వేడినీటి స్నానాలు చేయకూడదా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
ఇంటికో ఇప్పమొక్క!
ఒకప్పుడు భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఇప్పపూల సేకరణ జోరుగా సాగేది. ఏటా వందల క్వింటాళ్లు... ఒక్కో ఏడాది అంతకు మించి ఇప్పపూవు సేకరించే గిరిజనులు జీసీసీకి అమ్మి ఆర్థికంగా ఎంతోకొంత లబ్ధి పొందేవారు. తద్వారా వారికి ఉపాధి లభించడమే కాక ఆ పూవును మరింత శుద్ధి చేసి అమ్ముతూ జీసీసీ సైతం ఆదాయం గడించేది. కానీ రానురాను రకరకాల కారణాలతో ఇప్ప పూల సేకరణ తగ్గిపోయి అటు గిరిజనులు, ఇటు జీసీసీ ఆదాయానికి గండి పడుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ సేకరణను గాడిలో పడేసేలా రాష్ట్రంలోనే ప్రత్యేకంగా భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ చొరవ తీసుకుని అడుగులు వేస్తున్నారు. – సాక్షి, ఖమ్మం డెస్క్ అడవి లేక.. చెట్లు కానరాక పునర్విభజనతో భద్రాచలానికి సమీపాన ఉన్న చిక్కని అటవీ ప్రాంతం ఏపీ పరిధిలోకి వెళ్లింది. దీంతో అక్కడి గిరిజనులు ఇప్పపూవు సేకరించి పాడేరు ఐటీడీఏ పరిధి జీసీసీకి అమ్ముతున్నారు. ఇదేకాక పోడు సాగుతో ఇప్ప చెట్ల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. అదేవిధంగా భద్రాచలం జీసీసీకి గిరిజనులు ఇస్తున్న ఇప్పపూవు పరిమాణమూ తగ్గుతోంది. ఇక ఇప్పపూవు సేకరణ, శుద్ధి, అమ్మితే సమకూరే ఆదాయంపై ఆదివాసీ, గిరిజనులకు అవగాహన కల్పించే వారు కరువయ్యారు. ఏడాది క్రితం భద్రాచలం ఏటీడీఏ పీఓగా బాధ్యతలు స్వీకరించిన ప్రతీక్జైన్ గిరిజనుల ఉపాధి అవకాశాలు మెరుగపడేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జీసీసీ ఆధ్వర్యాన సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులపై ఆరా తీయగా ఇప్పపూవు విషయంలో హెచ్చుతగ్గులు గుర్తించి మళ్లీ గాడిన పడేయాలని రంగంలోకి దిగారు. గత ఏడాది 327 క్వింటాళ్లు భద్రాచలం జీసీసీ పరిధిలో ఆరు సబ్ బ్రాంచ్లు ఉన్నాయి. వీటి ద్వారా గడిచిన ఆర్థిక సంవత్సరం(2022–23)లో 327 క్వింటాళ్ల ఇప్ప పూవు సేకరించారు. అయితే, పదేళ్ల క్రితం వందలు దాటి వేల క్వింటాళ్లు సేకరించిన దాఖలాలూ ఉన్నాయి. ఇప్పపూవు నాణ్యత ఆధారంగా కేజీకి రూ.30 నుంచి రూ.35 చొప్పున జీసీసీ నుంచి గిరిజనులకు చెల్లిస్తారు. ప్రస్తుతం భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఇల్లెందు, కరకగూడెం నుంచి ఎక్కువగా ఇప్పపూవు తీసుకొ స్తున్నారని జీసీసీ అధికారులు చెబుతున్నారు. ఏం చేస్తారంటే? జీసీసీ ద్వారా సేకరించిన ఇప్పపూవును మరింత శుద్ధి చేస్తారు. దీన్ని ఎక్కువగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వ్యాపారులు లేదా అక్కడి ప్రజలు నేరుగా కొనుగోలు చేస్తారు. వీరు ఇప్పపూలతో గారెలు, లడ్డూలు, ఇతర వంటకాలు చేసుకుంటారు. మరోపక్క అనధికారికంగా ఇప్పపూలతో సారా కాచి తాగడం ఆదివాసీల్లో ఏళ్ల నుంచి ఆచారంగా కొనసాగుతోంది. పర్ణశాలలో అమ్మకం శ్రీసీతారామచంద్రస్వామి వన వాసానికి వచ్చినప్పుడు భద్రాచలం సమీపాన దుమ్ముగూడెం మండలం పర్ణశాలకు వచ్చినట్లు పురాణాల్లో ఉంది. సీతారాములు వనవాసానికి వచ్చినప్పుడు అన్ని అటవీ ఫలాలతో పాటు ఇప్పపూవు తీసుకున్నారని భక్తులకు నమ్మకంగా చెప్పే చిరువ్యాపారులు పర్ణశాల వద్ద ఇప్పపూలను కుప్పలుగా పోసి అమ్మడం కనిపిస్తుంది. కానీ దీనికి ఎలాంటి చారిత్రక, పురాణ ఆధారాలు లేవని అర్చకులు చెబుతారు. అయినప్పటికీ పర్ణశాల, భద్రాచలం వచ్చిన భక్తులు ఎంతో కొంత ఇప్పపూవు కొనుగోలు చేసి తీసుకెళ్లడం ఆనవాయితీగా కొనసాగుతోంది. 25వేలకు పైగా మొక్కలు ఇప్పపూవు సేకరణ పెరగాలంటే అదే సంఖ్యలో మొక్కలు ఉండాలి. అందుకోసం అటవీ శాఖ నుంచి 25వేలకు పైగా మొక్కలు సేకరించిన పీఓ.. ప్రతీ గిరిజన కుటుంబానికి ఒక్కో మొక్క పంపిణీ చేయడం ప్రారంభించారు. అయితే, ఈ మొక్కలు ఉచితంగానే ఇవ్వాలని తొలుత భావించినా.. అలా చేస్తే నాటడం, సంరక్షణపై శ్రద్ధ చూపరనే ఆలోచనతో నామమాత్రపు ధర నిర్ణయించారు. ‘ఇంటికో ఇప్పమొక్క’పేరిట ఆరంభించిన ఈ కార్యక్రమంతో మంచి ఫలితాలు వచ్చేలా స్వయంగా పీఓ సైతం ఐటీడీఏ కార్యాలయంలో మొక్క నాటారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చి ఇప్పమొక్కలు వనాలైతే పూల సేకరణ ద్వారా గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించడమే కాక జీసీసీకి సైతం ఆదాయం పెరగనుందని చెబుతున్నారు. -
సౌర వ్యవస్థలో గ్రహాలెన్ని? తొమ్మిదా? ఎనిమిదా?
మన సౌర కుటుంబంలోని గ్రహాలు ఎన్ని? తొమ్మిది అని.. అవి బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్, ఫ్లూటో.. అని వెంటనే చెప్పేముందు ఒకసారి ఆగండి.. గతంలో గ్రహానికున్న లక్షణాలు లేవంటూ ఫ్లూటోను ఆ లిస్టులోంచి తీసేశారు. కొన్నేళ్ల కిందట శాస్త్రవేత్తలు..గ్రహాలకు సంబంధించిన గుర్తింపునకు దాని పరిమాణం, ఆకృతి, కక్ష్య తదితర నిబంధనలు రూపొందించారు. ఈ లక్షణాలలో కొన్నింటికి అనుగుణంగా ఫ్లూటో లేకపోవడంతో దానిని గ్రహాల లిస్టు నుంచి తొలగించి.. మరుగుజ్జు గ్రహాల జాబితాలో చేర్చారు. ఖగోళ శాస్త్రవేత్తలు 1990ల ప్రారంభంలో సౌరకుటుంబంలోని నెప్ట్యూన్కు మించిన ఖగోళ పదార్థాలను కనుగొన్నారు. వీటిని ట్రాన్స్-నెప్ట్యూనియన్ ఆబ్జెక్ట్స్ (టీఎన్ఓఎస్) అని పిలుస్తారు. ఇవి సౌర వ్యవస్థ అంచున ఉన్న కైపర్ బెల్ట్ను కలిగి ఉంటాయి. కైపర్ బెల్ట్ అనేది మన సౌర వ్యవస్థలో ఒక భాగం. ఇది సూర్యుని నుండి దాదాపు 30 నుండి 50 ఖగోళ యూనిట్ల దూరంలో విస్తరించి ఉంది. 2005లో ‘ఎరిస్’(మరగుజ్జు గ్రహం)ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది దాదాపుగా ప్లూటోతో సమానమైన పరిమాణంలో ఉంది. కానీ దీనిని గ్రహంగా పరిగణించరాదనే వాదనను బలపడింది. సమయం గడిచేకొద్దీ శాస్త్రవేత్తలు విశ్వం అంతటా గ్రహాలు సమృద్ధిగా ఉన్నాయని కనుగొన్నారు. దీంతో అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల సమాఖ్య 2006లో గ్రహం అనే పదానికి సరికొత్త నిర్వచనం అవసరమని నిర్ణయించింది. సౌర వ్యవస్థలోని గ్రహం నిర్వచనం కోసం వారు మూడు ప్రమాణాలను సూత్రీకరించారు. ఒక గ్రహం అనేది సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండాలి. అది తప్పనిసరిగా గురుత్వాకర్షణ శక్తి కలిగి గుండ్రంగా ఉండాలి. అలాగే ఆ గ్రహం తన కక్ష్యలోని శిధిలాల మార్గాన్ని క్లియర్ చేయడానికి సొంత గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉండాలి. దీని ప్రకారం ప్లూటో మొదటి రెండు ప్రమాణాలను కలిగి ఉంది. మూడవ లక్షణం దానిలో లేదు. అందుకే ప్లూటో, ఎరిస్లతో పాటు ఇతర ట్రాన్స్-నెప్ట్యూనియన్ పదార్థాలను ‘మరగుజ్జు గ్రహాలు’గా వర్గీకరించారు. ఇప్పుడు సౌర వ్యవస్థలో గ్రహాలు ఎన్ని అనేదానికి సమాధానం చెప్పాల్సివస్తే అవి ఎనిమిది అని చెప్పాలి. ఇంతకుమించి ఏమున్నాయనే విషయానికొస్తే ప్రస్తుతం ధృవీకరించిన ఎక్సోప్లానెట్ల సంఖ్య ఐదు వేలకుపైగానే ఉంది. -
బొటానికల్ వండర్! మానవ పెదవులు పోలిన మొక్క!
ఈ ప్రకృతిలో ఎన్నో పర్యావరణ అద్భుతాలు ఉన్నాయి. అందులో ఉండే అత్యంత అరుదైన వృక్ష సంపద మానువుడిని విస్తుపోయాలే చేస్తుంది. ఇంతవరకు ఎన్నో వింత మొక్కలు చూసుంటారు. కానీ ఇలా లిప్స్టిక్ వేసిన పెదవుల్లా ఉండే అరుదైన మొక్కను గురించి విన్నారా? అదెక్కడుందంటే..? ఇలాంటి మొక్కలు కూడా ఉంటాయా ? అని ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే..? ఇలా మానవ పెదవులు పోలిన మొక్క ఈక్వెడార్, దక్షిణ అమెరికా వంటి దేశాల్లో ఎక్కువగా ఉంటాయి. సైకోట్రియా ఎలాటా లేదా హుకర్స్ లిప్స్ ప్లాంట్గా పిలిచే ఈ హాట్ లిప్స్ ప్లాంట్ ఈ భూమ్మీద ఉండే వృక్షజాతుల్లో అత్యంత అరుదైన మొక్కగా పేర్కొనవచ్చు. దీన్ని బొటానికల్ వండర్గా పిలుస్తారు. ఈ మొక్క ప్రత్యేకత ఏమిటంటే.. బ్రాక్ట్స్గా పిలిచే ఈ మొక్క ఆకులు ఎర్రటి రంగులో మానవ పెదవుల్లా కనిపిస్తాయి. ఇవి హమ్మింగ్ బర్డ్స్, సీతాకోక చిలుకలు పరాగ సంపర్కంలో ఆకర్షించడానికి ఈ ఎర్రటి ఆకుల భాగమే సహాయపడుతుంది. అయితే ఈ మొక్క ఆకులు ఉన్నంత ఆకర్షణీయంగా వాటి పువ్వులు కనిపించవు. పువ్వులు పూసే ముందే ఇలా పెదవుల ఆకారంలో ఈ మొక్క కనిపిస్తుందట. దీని లోపలి నుంచి నక్షత్రాల ఆకారంలో తెల్లని పువ్వులు పుష్పిస్తాయి. ఇవి అంతగా అట్రాక్టివ్గా కనిపించవు. సువాసనలు వెదజల్లే ఈ పువ్వులు డిసెంబర్, మార్చి నెలల్లో పుష్పిస్తాయి. మధ్య అమెరికాలోని ప్రజలు తమ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు ప్రేమను వ్యక్తం చేయడానికి ఈ మొక్కను బహుమతిగా ఇస్తారట. మరీ ముఖ్యంగా వేలంటైన్స్ డే రోజు ప్రేమికులు ఈ మొక్కను బహుమతిగా ఇస్తారట. దీని బెరడు, ఆకులను స్థానికులు చర్మ సంబంధ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. అయితే ఈ మొక్క ప్రస్తుతం కనుమరుగైపోతున్న జాబితాలో ఉందట. వాతావరణ మార్పులే ఇందుకు కారణమని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. భవిష్యత్తు తరాలకు ఈ హుకర్స్ లిప్స్ ప్లాంట్ తెలిసేందుకైనా..ఇది అంతరించిపోకుండా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. (చదవండి: శీతాకాలంలో స్ట్రాబెర్రీలు తినొచ్చా? బరువు తగ్గుతారా..?) -
అత్యంత ఖరీదైన మొక్కలు ధర మీకు తెలుసా..? (ఫోటోలు)
-
హ్యాపీ ఫోర్జింగ్స్ @ రూ. 808–850
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల కంపెనీ హ్యాపీ ఫోర్జింగ్స్ ఈ నెల 19న పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. 21న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 71.6 లక్షల షేర్లను ప్రమోటర్, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేరుకి రూ. 808– 850 ధరల శ్రేణిలో చేపట్టనున్న ఇష్యూ ద్వారా దాదాపు రూ. 1,009 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 18న షేర్లను కేటాయించనుంది. ఈక్విటీ జారీ నిధులను ఎక్విప్మెంట్, ప్లాంట్లు, మెషీనరీ కొనుగోలుతోపాటు.. రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 17 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. లూధియానా కంపెనీ ఆటో విడిభాగాలు, వ్యవసాయ పరికరాలు, ఇండస్ట్రియల్ మెషీనరీ విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. కస్టమర్లలో అశోక్ లేలాండ్, జేసీబీ ఇండియా, ఎంఅండ్ఎం, ఎస్ఎంఎల్ ఇసుజు, టాటా కమిన్స్ తదితరాలున్నాయి. గతేడాది(2022–23) ఆదాయం 39 శాతం ఎగసి రూ. 1,197 కోట్లకు చేరగా.. నికర లాభం 47 శాతం జంప్చేసి రూ. 209 కోట్లను తాకింది. -
రక్షిత వృక్ష జాతుల్లో ఎర్రచందనం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో మాత్రమే పెరిగే ఎర్రచందనం వృక్షాలను రాష్ట్ర ప్రభుత్వం రక్షిత వృక్ష జాతిగా, అరుదైన చెట్లున్న ప్రాంతాలను రక్షిత ప్రాంతాలుగా ప్రకటించినట్లు కేంద్ర అడవులు, పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈమేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అంతరించిపోతున్న జంతు, వృక్ష జాతుల అంతర్జాతీయ వాణిజ్య ఒడంబడిక జాబితాలో ఎర్రచందనాన్ని చేర్చిన కారణంగా ఇది అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రిస్తుందని చెప్పారు. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్డేంజరస్ స్పీసెస్ (సెట్స్) స్టాండింగ్ కమిటీ ఎర్రచందనాన్ని ముఖ్యమైన వాణిజ్య ప్రక్రియ సమీక్ష నుంచి తొలగించాలని సూచించిందన్నారు. గ్రామీణ ప్రజలు, చిన్న, సన్నకారు రైతులకు ఉపాధి, ఆదాయ మార్గాల సృష్టి, ఉత్పాదకత మెరుగుపరచడానికి పరిపూర్ణమైన, సమగ్ర పద్ధతిలో చెట్ల పెంపకాన్ని విస్తరించే లక్ష్యంతో ఆగ్రో ఫారెస్ట్రీని ప్రోత్సహించేలా కేంద్రం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఆగ్రో ఫారెస్ట్రీలో భాగంగా ఎర్రచందనం, టేకు వంటి వృక్ష జాతులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. పులికాట్ సరస్సు నిర్వహణకు ప్రణాళిక ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లోని పులికాట్ సరస్సు సహా చిత్తడి నేలల నిర్వహణకు ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ప్లాన్ (ఐఎంపీ) ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్లు మంత్రి అశ్వినికుమార్ చౌబే తెలిపారు. రాయదొరువు వద్ద సరస్సు ప్రవేశద్వారం నీటి ప్రవాహాన్ని అధ్యయనం చేయడంతోపాటు, ఇతరత్రా రక్షణ చర్యలను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయని వైఎస్సార్సీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వివరించారు. ఆ న్యాయమూర్తుల వివరాలు ప్రత్యేకంగా లేవు సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకంలో ఎలాంటి రిజర్వేషన్లు లేవని, అందువల్ల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ న్యాయమూర్తుల వివరాలేమీ ప్రత్యేకంగా నిర్వహించడం లేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యులు పిల్లి సుభాష్చంద్ర బోస్, ఆర్.కృష్ణయ్య ప్రశ్నకు మంత్రి ఈమేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. -
ఆత్మసంతృప్తి కోసం ఆ పని చేస్తున్నా: రాశీఖన్నా
తమిళసినిమా: నటి రాశీఖన్నా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ చక్కర్లు కొడుతున్న నటి ఈ బ్యూటీ. చాలా బోల్డ్ ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ సినీ వర్గాల్లో అటెన్షన్కు గురిచేస్తున్న రాశీఖన్నా తెలుగులో కొన్ని హిట్ చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యింది. అయితే ప్రస్తుతం అక్కడ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్లో ఎక్కువ దృష్టి సారిస్తోంది. కాగా తమిళంలో అరణ్మణై 4 చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. కాగా బ్యూటీ గురువారం తన పుట్టినరోజు వేడుకను జరుపుకుంది. పలువురు సినీ ప్రముఖులు అందించిన శుభాకాంక్షల్లో మునిగిపోయింది. కాగా ఈ సందర్భంగా ఆమె తన తోటలో కొన్ని మొక్కలను నాటింది. దీనికి సంబంధించిన ఫొటోలను తన ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేసింది. అందులో పేర్కొంటూ ‘నా కల్లను రంజింపజేసే విధంగా, నా ఆత్మను సంతృప్తి పరిచే విధంగా ఈ చిన్న బాధ్యతను తీసుకున్నాను. పలు కారణాలతో మొక్కలు పెంచుతున్నాను. ముఖ్యంగా చెట్టు నాకు సంతోషాన్ని పంచుతుంది. నా పుట్టినరోజు సందర్భంగా సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు’ అని పేర్కొంది. నాటిన మొక్కల ఫొటోలు ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
టమోటాలు ఇలా కూడా పెంచవచ్చు!
ఇటీవల కాలంలో స్థలం లేకపోయినా మొక్కల పెంచుకునే సరికొత్త పద్ధతులు వస్తున్నాయి. ఆఖరికి ఫ్లాట్లోని బాల్కనీలో కూడా సులభంగా పెంచుకునే పద్ధతులను కూడా చూశాం. చిన్ని చిన్ని కుండీల్లోనే జామ, దానిమ్మ వంటి పళ్లు కాసే మొక్కలను పెంచి చూపించారు. ఇదంత ఒక ఎత్తైతే ఇప్పుడు ఏకంగా మొక్కలను తలకిందులుగా పెంచే సరికొత్త పద్ధతి మన ముందుకు వచ్చింది. పైగా దీని వల్ల ఎన్నో చీడ పీడలను కూడా నివారించొచ్చు, మంచి దిగుబడి కూడా వస్తుందంటున్నారు. అందులోనూ టమోటా మొక్కలను ఇలా పెంచితే స్థలం ఆదా అవ్వడమే గాక ఎక్కువ టమోటాలు పండించొచ్చు అంటున్నారు అగ్రికల్చర్ నిపుణులు. ఇంతకీ ఇదెలా సాధ్యం? ఎలా పెంచుతారంటే.. టమోటాలను తలకిందులుగా పెంచే పద్ధతిని ఎంచుకొనేటప్పుడూ అన్ని రకాల టమోటాలకు ఈ పద్ధతి మంచిది కాదనే విషయాన్ని గుర్తించుకోవాలి. ముఖ్యంగా చెర్రీ టమోటా వంటి కొన్ని రకాల టమాటాలకు మాత్రమే ఈ పద్ధతి సరైనది. ముందుగా వేలాడే మొక్కల కంటైనర్లను తీసుకోవాలి. ముఖ్యంగా చక్కగా వేలాదీయగల బకెట్ లేదా కుండిని తీసుకోవాలి దాని అడుగు భాగన రంధ్రం ఉండేలా చూసుకోండి. ఒకవేళ్ల రంధ్రం లేకపోతే మనం ఏర్పాటు చేసుకోవాలి. దీనికి మంచి ఎరువుతో కూడిన మట్టిని కుండీలో నింపి దానిలో టమోటా వితనాలు వేసి ఉంచాలి. ఆ విత్తనాలు మొలకెత్తిన వెంటనే..ఆ కుండీ పైభాగం కవర్ అయ్యేలా కవర్ లేదా ఏదైనా మూత వంటి వాటిని ఏర్పాటు చేసి తలకిందులుగా వేలాడదీసి ఆ రంధ్రంలో ఈ మొలకెత్తిన మొక్కను చొప్పించాలి. దీన్ని సూర్యరశ్మీ తగిలే చోట వేలాదీయండి. ఆ తర్వాత మొక్కగా మొలికెత్తిన ఈ టమోటా మొక్కను చక్కగా పెరిగేలా తీగల వంటి సపోర్టు ఏర్పాటు చేసుకుని సమయానికి నీరు అందించాలి. చక్కగా గాలికి ఎక్స్పోజ్అయ్యి మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే పరాగ సంపర్కం సులభతరమవుతుంది. ఇక ఈ పద్ధతిలో మొక్క మట్టికి బయటకు బహిర్గతం కావడం వల్ల నేల ద్వారా వచ్చే తెగుళ్లు, ఫంగస్, కట్వార్మ్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువుగా ఉంటుంది. తలక్రిందులుగా వేలాడదీయడం వల్ల మొక్కలు ఎలాపడితే అలా వ్యాపించవు కాబట్టి చక్కగా నచ్చిన రీతీలో కట్ చేసుకుని ఆకర్షణీయంగా పెంచుకునే సౌలభ్యం ఉంటుంది. అంతేగాక వీటిని ఎండ తగిలే చోటికి తరలించుకుపోవడం సులభం, పైగా ఎక్కువ టమాటాలు కాస్తాయి కూడా. ముఖ్యంగా ఈ పద్ధతిలో పెంచాలనుకుంటే ఎంచుకునే బకెట్ లేదా కుండీ తోపాటు అందులో వేసే మట్టి, మనం వేసే మొక్కకు కాసే పళ్లని తట్టుకునే సామర్థ్యం తదితరాలు ఉన్నవాటినే ఎంచుకోవడం అత్యంత కీలకం. స్థలం సమస్యతో ఇబ్బంది పడే వాళ్లకు, ఇంటి పంటలంటే ఇష్టపడే వారికి ఈ విధానం చాలా బాగా ఉపయోగపడుతుంది. సులభంగా బాల్కనీల్లోనూ కిటికీల్లోనూ తలకిందులుగా టమాట మొక్కలను పెంచడమే గాక సమృద్ధిగా టమోటాలను పెంచగలుగుతారు కూడా. (చదవండి: ఇది గ్రీన్ పాలిటిక్స్ యుగం! రాజకీయ పార్టీలే గ్రీన్ పార్టీలుగా..!) -
దేశంలో మద్యం రాజధాని ఏది?
భారతదేశం భిన్నత్వం కలిగిన దేశం. దేశంలోని ప్రతీ నగరానికి తనదైన కథ ఉంటుంది. కొన్ని నగరాలు అక్కడి ఆహారానికి ప్రసిద్ధి చెందగా, మరికొన్ని సాంస్కృతిక వారసత్వానికి పెట్టిందిపేరుగా నిలిచాయి. దేశంలోని ఏ నగరానికి వెళ్లినా అక్కడ ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అయితే మన దేశంలో ‘వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’ అని పిలిచే ఒక నగరం ఉందనే సంగతి మీకు తెలుసా? మహారాష్ట్రలోని నాసిక్ నగరాన్ని ‘వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. అంటే భారతదేశ మద్యం రాజధాని. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మద్యంలో ఎక్కువ భాగం ఈ నగరంలోనే తయారవుతుంది. ఈ నగరంలో 52 వైన్ ప్లాట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో 18 వేల ఎకరాల్లో ద్రాక్షసాగు చేస్తున్నారు. దీనిలో అధిక భాగం వైన్ తయారీకి ఉపయుక్తమవుతుంది. నాసిక్లోని నేల రెడ్ లేటరైట్ రకానికి చెందినది. అంతే కాదు ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ ఎంతో మెరుగ్గా ఉంది. ద్రాక్ష సాగుకు అవసరమైన నీటి పరిమాణం. మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ కారణంగా, ఇక్కడ ద్రాక్ష విరగకాస్తుంది. ఒక నివేదిక ప్రకారం ఈ నగరంలో ప్రతి సంవత్సరం 20 టన్నులకు పైగా ద్రాక్ష ఉత్పత్తి జరుగుతుంది. ఇది కూడా చదవండి: ‘వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్’ ఏమిటి? ఎవరికి ప్రయోజనం?
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement