-
బీజేపీ నేతలు తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించారు
కోల్కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశి్చమ బెంగాల్ సందేశ్ఖాలీ లైంగిక వేధింపులు, అత్యాచారాల వ్యవహారం మరో మలుపు తిరిగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమపై ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని సందేశ్ఖాలీకి చెందిన ముగ్గురు మహిళలు స్పష్టం చేశారు. స్థానిక బీజేపీ మహిళా నేత ఒకరు తెల్లకాగితాలపై తమతో బలవంతంగా సంతకాలు పెట్టించారని, ఈ కాగితాలపై బీజేపీ నాయకులే ఫిర్యాదులు రాసి, తమ పేరిట తృణమూల్ కాంగ్రెస్ నేతలపై పోలీసు స్టేషన్లో అత్యాచారం కేసులు పెట్టారని చెప్పారు. తమను మభ్యపెట్టి మోసం చేసిన బీజేపీ నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారు తమను వేధిస్తున్నారని, తమకు రక్షణ కలి్పంచాలని కోరారు. ఈ మేరకు ముగ్గురు మహిళలు చెబుతున్నట్లుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ వీడియోలను తృణమూల్ కాంగ్రెస్ షేర్ చేసింది. సందేశ్ఖాలీ మహిళలపై తమ పార్టీ నాయకులెవరూ లైంగిక వేధింపులకు పాల్పడలేదని, బీజేపీ నేతలే తప్పుడు ప్రచారం చేశారని పశి్చమ బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి పాంజా ఆరోపించారు. సందేశ్ఖాలీలో కొన్ని భూకబ్జా ఘటనలు మినహా లైంగిక వేధింపుల ప్రసక్తే లేదని అన్నారు. తమ పార్టీని అప్రతిష్టపాలు చేసేలా తప్పుడు ప్రచారం చేసిన బీజేపీ నాయకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదంతా కుట్ర: సువేందు అధికారి కొత్తగా తెరపైకి వచి్చన వీడియోలపై బీజేపీ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన సువేందు అధికారి స్పందించారు. వాటిని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిõÙక్ బెనర్జీ ఉద్దేశపూర్వకంగా సృష్టించాడని విమర్శించారు. దీనివెనుక ప్రైవేట్ ఎన్నికల, రాజకీయ వ్యూహ సంస్థ ‘ఐ–ప్యాక్’ ప్రోద్బలం ఉందని చెప్పారు. మహిళలను తీసుకొచ్చి, బీజేపీపై ఆరోపణలు చేయిస్తున్నారని, ఇదంతా కుట్రేనని స్పష్టం చేశారు. అభిషేక్ బెనర్జీ, ఐ–ప్యాక్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ త్వరలో కోర్టు ఆశ్రయిస్తామని అన్నారు. బీజేపీ నేతలపై ఫిర్యాదు సువేందు అధికారితోపాటు మరికొందరు బీజేపీ నేతలపై తృణమూల్ కాంగ్రెస్ నాయకులు గురువారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నాయకులపై అత్యాచార ఆరోపణలు చేసేలా సందేశ్ఖాలీ మహిళలను బీజేపీ నేతలు ప్రేరేపించారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
జగనన్న వెంట ఆ ఇంటి ఆడపడుచు లేకున్నా..మేము ఉన్నాం..
-
లోక్సభలో నారీ పవర్..
(మేకల కళ్యాణ్ చక్రవర్తి) : రాజకీయాల్లో రాణించడం.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయతీరాలకు చేరడం అంత సులువేమీ కాదు. భారత్లాంటి సాంప్రదాయ దేశాల్లో మహిళాలోకం రాజకీయంగా అభివృద్ధి చెందడం కొద్దిగా కష్టమే. అయినా ఉక్కు మహిళలుగా పేరొందిన మన దేశ నారీమణులు ప్రత్యక్ష ఎన్నికల్లో బ్రహా్మండంగా రాణిస్తున్నారు. సమకాలీన పరిస్థితులు, పురుషాధిపత్య రాజకీయాలను అధిగమిస్తూ అనేకస్థాయిల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గ్రామ సర్పంచ్ మొదలు దేశ ప్రధాని, రాష్ట్రపతి లాంటి మహోన్నత స్థానాల్లో కూడా కూర్చున్న ఘనత మన భారతీయ మహిళలది. మండల పరిషత్ అధ్యక్షురాలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా, ముఖ్యమంత్రులుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా, ఆర్థికం లాంటి కీలకశాఖలు నిర్వహించిన ధీర వనితలుగా మన దేశ మహిళలకు రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి భారతీయ మహిళల ప్రాతినిధ్యం పార్లమెంట్ దిగువసభ అయిన లోక్సభలో నానాటికీ పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో 4–5 శాతం ఉన్న మహిళల ప్రాతినిధ్యం ఇప్పుడు లోక్సభలో ఏకంగా 14 శాతం దాటింది. క్షేత్రస్థాయిలోనే కాదు జాతీయస్థాయిలో జరిగే లోక్సభ ఎన్నికల్లో నారీమణులు పురుషులను ఢీ కొడుతూ, రాజకీయ దిగ్గజాలను ప్రజాక్షేత్రంలో మట్టికరిపిస్తూ ప్రజల మన్ననలు పొంది దేశంలోనే అత్యున్నత చట్టసభలో అడుగుపెడుతున్నారు. మాటలే కాదు... చేతల మాస్కరీన్ యానీమాస్కరీన్...వాక్ స్వాతంత్య్రం, విద్యావికాసం, తిరుగుబాటు, మహిళా సాధికారతకు ప్రతీక ఈ పేరు. ప్రస్తుత కేరళ రాష్ట్రం, అప్పటి ట్రావెన్కోర్ సంస్థానంలో జన్మించిన ఈమె రాజకీయాల్లో మహిళాప్రాతినిధ్యానికి 20వ శతాబ్దం తొలినాళ్లలోనే బీజం వేసిన యోధురాలు. 1902 జూన్ 6న లాటిన్ కాజిnథలిక్ కుటుంబంలో జన్మించారు. ప్రభుత్వఉద్యోగి అయిన తండ్రి గాబ్రియెల్ పెంపకంలో తిరువనంతపురంలోని మహారాజాస్ కళాశాల నుంచి డబుల్ పీజీ (ఎకనామిక్స్, హిస్టరీ) చేశారు. ఆ తర్వాత న్యాయశాస్త్రం కూడా అభ్యసించారు. ఆ తర్వాత 1938లో ట్రావెన్కోర్ స్టేట్ కాంగ్రెస్లో చేరిన మాస్కరీన్ సంస్థానా«దీశులు, దివాన్లకు వ్యతిరేకంగా గళమెత్తారు. దివాన్గా పనిచేసిన రామస్వామి అయ్యర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ జరిపిన పోరాటంలో ఆమె క్రియాశీలపాత్ర పోషించారు. ఇందుకు ప్రతిఫలంగా ఆమె పోలీసు దెబ్బలు తిన్నారు. ఆమె ఇంటిని కూలగొట్టి, ఇంట్లోని వస్తువులను దొంగిలించారు. ఆ తర్వాత 1939లో ఆమె ట్రావెన్కోర్ సంస్థానంలో ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుకు ప్రాతినిధ్యం వహించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న మాస్కరీన్కు 1946, ఫిబ్రవరి 21న మహాత్మాగాంధీ రాసిన లేఖ అప్పట్లో సంచలనమైంది. బాంబేలో ఆమె ఇచ్చిన ఉపన్యాసానికి స్పందిస్తూ ‘మీ నాలుక అదుపులో లేదు. బుద్ధికి ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు.’అని రాస్తూనే ట్రావెన్కోర్ ప్రభుత్వం నుంచి ఆమెను తొలగించాలని గాందీజీ ఆ లేఖలో కోరడం గమనార్హం. ఇక, ఆ తర్వాత 1946లో ఏర్పాటైన 299మంది సభ్యులతో కూడిన కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియాలో నియమితులయ్యారు. 1951లో మొదటి లోక్సభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాతి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ ఆరుగురి అదృష్టం ఏంటో? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనన తర్వాత ఇప్పటి వరకు రెండుసార్లు ఎంపీ ఎన్నికలు జరగ్గా 2014 ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత(టీఆర్ఎస్) నిజామాబాద్ నుంచి, 2019 ఎన్నికల్లో మాలోతు కవిత(టీఆర్ఎస్) మహబూబాబాద్ నుంచి గెలుపొందారు. ఇక, 2024 ఎన్నికల్లో ఏకంగా ఆరుగురు మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత మళ్లీ మహబూబాబాద్ నుంచి పోటీలో ఉండగా, బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే.అరుణ మహబూబ్నగర్ నుంచి బరిలో నిలిచారు. హాస్పిటల్ రంగానికి చెందిన కొంపెల్లి మాధవీలత (బీజేపీ) హైదరాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించింది. ఆదిలాబాద్ నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ, వరంగల్ నుంచి డాక్టర్ కడియం కావ్య, మల్కాజ్గిరి నుంచి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్రెడ్డిలను రంగంలోకి దింపింది. జాతీయస్థాయి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సై అంటున్న నారీమణులు ♦ 1951లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన 22 మంది మహిళలు ♦ 2009లో 50 దాటిన మహిళా ఎంపీల సంఖ్య... 2019లో అత్యధికంగా 78 మంది గెలుపు -
జగనన్న పాటకు విశాఖ మహిళలు మాస్ డాన్స్
-
Lok sabha elections 2024: నాన్లోకల్ నాయిక
దిగ్గజాల వంటి లోకల్ నేతలు ఎందరో ఉండొచ్చు. మేం మాత్రం పక్కా నాన్ ‘లోకల్’! పుట్టి పెరిగింది ఎక్కడన్నది మాకనవసరం. మేమెక్కడ ల్యాండైతే అదే మాకు ‘లోకల్’! ‘తగ్గేదే లే...’ అంటున్నారు మహిళా రాజకీయ వలస పక్షులు. వీరిలో చాలామంది ఉత్తరప్రదేశ్ను తమ రాజకీయ కర్మభూమిగా మార్చుకోవడం విశేషం. అతి పెద్ద రాష్ట్రమైన యూపీకి అత్యధిక సంఖ్యలో నాన్ లోకల్ నాయికలకు రాజకీయ భిక్ష పెట్టిన రికార్డు కూడా ఉంది. అలా ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడ రాజకీయ అరంగేట్రం చేసినవారిలో ఏకంగా రాష్ట్రాన్నే ఏలిన వారొకరు. కేంద్రంలో చక్రం తిప్పినవారు ఇంకొకరు. ఈ వలస పక్షుల్లో సినీ తారలూ ఉన్నారు... డింపుల్ ‘భాభీ’... డింపుల్ యాదవ్ స్వస్థలం ఉత్తరాఖండ్. సమాజ్వాదీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ భార్యగా యూపీలో అడుగుపెట్టారు. 2009 ఫిరోజాబాద్ ఉప ఎన్నికలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కానీ కాంగ్రెస్ నేత రాజ్బబ్బర్ చేతిలో ఓటమి చవిచూశారు. 2012లో కనౌజ్ లోక్సభ స్థానం ఉప ఎన్నికలో విజయం సాధించారు. 2019లో మళ్లీ ఓడినా 2022లో ములాయం సింగ్ యాదవ్ మరణం తర్వాత మెయిన్పురి ఉప ఎన్నికలో గెలుపొందారు. ‘వికాస్ కీ చాబీ.. డింపుల్ భాభీ..’ అంటూ సమాజ్వాదీ కార్యకర్తల నినాదాల నడుమ రెట్టించిన ఉత్సాహంతో ఈసారీ మళ్లీ మెయిన్పురిలో బీజేపీతో తలపడుతున్నారు. మీరా.. షీలా.. సుచేతా... బిహార్కు చెందిన లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ కూడా యూపీ నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు. 1985లో బిజ్నోర్ ఉప ఎన్నికలో విజయంతో ఆమె ప్రస్థానం ఆరంభమైంది. కానీ తర్వాత ఆమె యూపీ నుంచి మళ్లీ పోటీ చేయలేదు. 2017లో యూపీఏ రాష్ట్రపతి అభ్యరి్థగా ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవిద్ చేతిలో ఓడారు. ఢిల్లీ సీఎంగా సుదీర్ఘకాలం చక్రం తిప్పిన పంజాబ్ పుత్రి షీలా దీక్షిత్ కూడా కాంగ్రెస్ తరఫున 1994లో తొలిసారి యూపీలోని కనౌజ్ నుంచే గెలిచారు. యూపీ తొలి మహిళా సీఎంగా చరిత్రకెక్కిన ప్రముఖ స్వాతంత్య్ర యోధురాలు సుచేతా కృపలానీ స్వస్థలం పంజాబ్! రాజకీయాల్లోనూ జయప్రదం రాజమండ్రిలో పుట్టిన తెలుగుతేజం జయప్రద. అసలు పేరు లలితారాణి. తెలుగు సినిమాల్లో వెలుగు వెలగడమే గాక బాలీవుడ్లోనూ రాణించారు. ఏడెనిమిది భాషల్లో నటించి ఎనలేని స్టార్డం సొంతం చేసుకున్నారు. ఎనీ్టఆర్ ప్రోద్బలంతో 1994లో టీడీపీలో చేరడం ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. పారీ్టతో విభేదించి సమాజ్వాదీ పారీ్టలో చేరడం ద్వారా యూపీలో అడుగు పెట్టారు. 2004, 2009 లోక్సభ ఎన్నికల్లో రాంపూర్ నుంచి విజయం సాధించారు. అనంతరం సమాజ్వాదీతోనూ పొసగక రా్రïÙ్టయ లోక్మంచ్ పేరిట సొంత పార్టీ పెట్టి విఫలమయ్యారు. చివరికి 2019లో బీజేపీ గూటికి చేరారు. మాయావతి.. యూపీ క్వీన్ ఈ ‘బెహన్ జీ’ పుట్టింది, చదివింది ఢిల్లీలో అయినా దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగింది మాత్రం యూపీ నుంచే. 1984లో కాన్షీరాం స్థాపించిన బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో వ్యవస్థాపక సభ్యురాలిగా చేరిన మాయావతి 1989లో తొలిసారి యూపీ నుంచే ఎంపీగా గెలిచారు. తర్వాత ఆమె రాజకీయ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగింది. రాష్ట్రంలోనే గాక దేశ రాజకీయాల్లోనూ తిరుగులేని దళిత నేతగా ఎదిగారు. 1995లో కాన్షీరాం ఆశీస్సులతో అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. దేశంలో తొలి దళిత మహిళా సీఎంగా చరిత్ర సృష్టించారు. నాలుగుసార్లు యూపీ సీఎంగా చేశారు. ఆమె రాజకీయ ప్రస్థానాన్ని ప్రజాస్వామ్య సంచలనంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అభివరి్ణంచారు. స్మృతీ ఇరానీ.. జెయింట్ కిల్లర్ ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ సీరియల్ ‘క్వీన్’ బుల్లితెర నటిగా దేశవ్యాప్తంగా అభిమానుల మనసు దోచారు. 2003లో బీజేపీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2004 లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో పోటీ చేసిన ఓడినా వెనకడుగు వేయలేదు. రాజ్యసభకు నామినేటయ్యారు. 2014లో అమేథీలో రాహుల్తో పోటీ పడటం ద్వారా యూపీ గడ్డపై కాలుమోపారు. తొలి ప్రయత్నంలో ఓడినా 2019లో రాహుల్ను ఓడించడంతో జెయింట్ కిల్లర్గా ఆమె పేరు దేశమంతటా మారుమోగింది. తనను ‘అమేథీ కీ బిటియా (అమేథీ బిడ్డ)’గా అభివరి్ణంచుకుంటూ అక్కడే స్థిరపడిపోయారు. ఈసారీ అమేథీ బరిలో నిలచి, దమ్ముంటే తనతో తలపడాలంటూ రాహుల్కు సవాలు విసురుతున్నారు. హేమమాలిని... మథుర ‘గోపిక’ అందం, నటనతో దేశాన్ని ఉర్రూతలూపిన బాలీవుడ్ డ్రీమ్గాళ్ హేమమాలిని స్వస్థలం తమిళనాడు. తమిళ సినిమాల నుంచి బాలీవుడ్లో అడుగుపెట్టి బంపర్హిట్లతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ముంబైలో స్థిరపడిన హేమ 2011లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. తర్వాత బీజేపీలో చేరి యూపీ బాట పట్టారు. 2014లో మథుర నుంచి 3 లక్షల పై చిలుకు మెజారిటీతో గెలుపొందారు. 2019లోనూ అక్కడి నుంచే గెలిచారు. ఈసారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తన స్థానికతపై విపక్షాల విమర్శలను, ‘‘కృష్టుడిని ఆరాధించే గోపికగా మథురను నా స్వస్థలంగా మార్చుకున్నాను. పదేళ్లుగా ఇక్కడి ప్రజలకు సేవలందిస్తూ వారి మనసు గెలిచా. మళ్లీ గెలుపు నాదే’ అంటూ దీటుగా తిప్పికొడుతున్నారీ ‘బసంతి’! ధీశాలి... మేనక ఇందిర చిన్న కొడుకు సంజయ్ భార్యగా గాం«దీల కుటుంబంలో అడుగుపెట్టిన మేనక భర్త మరణాంతరం ఆ కుటుంబానికి పూర్తిగా దూరమయ్యారు. ఆమె స్వస్థలం ఢిల్లీ. 26 ఏళ్ల వయసులో రా్రïÙ్టయ సంజయ్ మంచ్ పేరుతో పార్టీ స్థాపించి 1984లో యూపీలోని అమేథీ నుంచి ఏకంగా రాజీవ్నే ఢీకొట్టి ఓడారు. 1989లో పిలిభిత్ నుంచి లోక్సభకు వెళ్లారు. 2004లో బీజేపీలో చేరారు. పిలిభిత్ నుంచి ఆరుసార్లు గెలిచారు. కేంద్ర మంత్రిగా రాణించారు. గత ఎన్నికల్లో సుల్తాన్పూర్ నుంచి గెలిచిన ఈ జంతు ప్రేమికురాలు ఈసారీ అక్కడి నుంచే బరిలో ఉన్నారు. ఇటలీ టు ఢిల్లీ.. వయా యూపీ యూపీకి రాజకీయంగా వలస వచ్చి దేశంలోనే పవర్ఫుల్ పొలిటీషియన్గా ఎదిగిన మహిళల్లో అగ్రతాంబూలం సోనియా గాం«దీదే. ఇటలీలో పుట్టి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని పెళ్లాడి, భారత్ను మెట్టినింటిగా చేసుకున్న సోనియా రాజకీయ రంగప్రవేశం చేసింది యూపీ నుంచే. గాం«దీల కంచుకోటైన అమేథీ నుంచే 1999 లోక్సభ ఎన్నికల్లో అరంగేట్రం చేశారు. 2004లో రాయ్ బరేలీ నుంచి గెలిచి దేశ రాజకీయాల్లో సూపర్స్టార్గా మారారు. యూపీఏ చైర్పర్సన్గా పదేళ్లు సంకీర్ణ ప్రభుత్వంలో చక్రం తిప్పారు. 2019 దాకా రాయ్బరేలీ నుంచే లోక్సభకు ఎన్నికవుతూ వచ్చారు. తాజాగా సోనియా రాజ్యసభకు వెళ్లడంతో ఈసారి కూతురు ప్రియాంక బరిలో దిగొచ్చని భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Rahul Gandhi: వీరి బాధలు ఎవరికీ పట్టట్లేవు
జైపూర్: తమను కష్టాల నుంచి గట్టెక్కించాలని రైతులు, నిరుద్యోగ యువత, మహిళలు ఎంత మొత్తుకున్నా బాధలను మోదీ సర్కార్ పట్టించుకోవట్లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. గురువారం రాజస్థాన్లోని బికనీర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అనూప్గఢ్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ తమ పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించాలని రైతులు డిమాండ్చేస్తున్నారు. ఉపాధి కల్పించాలని నిరుద్యోగ యువత విన్నపాలు చేస్తోంది. నిత్యా వసరాల ధరల నుంచి ఉపశ మనం కల్పించాలని మహి ళలు వేడుకుంటున్నా వీళ్ల గోడు ఎవరికీ పట్టదు’’ అని రాహుల్ అన్నారు. ‘‘ వెనుకబడిన వర్గా లు, దళితులు, గిరిజనులు, జనరల్ కేటగిరీలో ఉన్న పేదల అభ్యున్నతి కోసమే ఈ ఎన్నికలు. నిరుద్యోగమే దేశంలో అతిపెద్ద సమస్య. ద్రవ్యోల్బణం రెండో సమస్య. దేశంలో 90 శాతం మంది ఇవే చెబుతారు. కానీ ఒకవేళ కేంద్రంలో బీజేపీ చెప్పుచేతల్లో ఉన్న జాతీయమీడియాను ఫాలో అయితే మాత్రం మనకు అంబానీ కుమారుల పెళ్లివేడుకే దేశంలో అతిపెద్ద చర్చనీయాంశంగా కనిపిస్తుంది. మోదీ ఓసారి సాగరగర్భంలోకి వెళ్తారు, మరోసారి గస్తీవిమానంలో చక్కర్లు కొడతారు, మరోసారి డప్పు వాయిస్తూ కనిపిస్తారు, ఇంకోసారి సభలో మొబైల్ ఫ్లాష్లైట్లు వెలిగించాలని పిలుపునిస్తూ కనిపిస్తారు. జాతీయ మీడియాలో 24 గంటలూ మోదీ ముఖమే దర్శనమిస్తుంది’’ అని ఎద్దేవాచేశారు. -
శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకల్లో.. పదహారణాల తెలుగమ్మాయిలు (ఫొటోలు)
-
మా పెన్షన్లు ఆపేశావ్...ఈ జన్మలో నువ్వు సీఎం కాలేవు
-
జగన్ పాటకు.. మహిళల డ్యాన్స్
-
విష్ణుకుమార్ వ్యాఖ్యలపై మండిపడుతున్న వైఎస్ఆర్సీపీ మహిళ కార్యకర్తలు
-
పశ్చిమ కనుమలలో ప్రాణదాతలు
‘ప్రాణదాత’ అనే మాట మనుషులకు సంబంధించే ఎక్కువగా వినబడుతుంది. ‘ఆల్–ఫిమేల్ రెయిన్ ఫారెస్ట్ ఫోర్స్’లోని మహిళలు మాత్రం పశ్చిమ కనుమల అరణ్యాలలోని మొక్కల ప్రాణదాతలు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న మొక్కలు, చెట్లను కాపాడడానికి ‘గురుకుల బొటానికల్ శాంక్చువరీ’ ద్వారా మొక్కవోని కృషి చేస్తున్నారు. పచ్చటి అడవి పెదవుల మీద చిరునవ్వు చెరిగిపోకుండా కష్టపడుతున్నారు... పశ్చిమ కనుమల అడవులు అపూర్వమైన చెట్లజాతులు, జంతుజాలం, పక్షి, చేప జాతులకు ప్రసిద్ధి పొందాయి. అయితే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయుసిఎన్) పశ్చిమ కనుమల గురించి ఆందోళన వ్యక్తం చేసింది. అటవీ నిర్మూలన, వాతావరణ మార్పుల వల్ల మన దేశంలోని పశ్చిమ కనుమలు ప్రమాదంలో పడ్డాయి. ఈ ప్రాంతంలోని అడవులను రక్షించుకోవడానికి, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడానికి కేరⶠలోని పెరియాలో ఎన్నో సంవత్సరాల క్రితం ఏర్పాటైన ‘గురుకుల బొటానికల్ శాంక్చువరీ’ లోని ‘ఆల్–ఫిమేల్ రెయిన్ ఫారెస్ట్ ఫోర్స్’ కృషి చేస్తోంది. 27 మంది మహిళలు ఉన్న ‘ఆల్–ఫిమేల్ రెయిన్ ఫారెస్ట్ ఫోర్స్’ ‘గురుకుల బొటానికల్ శాంక్చువరీ’లో అరుదైన మొక్కలను సంరక్షిస్తోంది. ‘మొక్కలను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాం. ప్రమాదంలో ఉన్న మొక్కలకు ఈ గురుకులం శరణార్థి శిబిరంలాంటిది. ఆస్పత్రి కూడా అనుకోవచ్చు. మొక్కలకు సంబంధించిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మట్టిపాత్రలతో ఉంటుంది’ అంటుంది ఎకోసిస్టమ్ గార్డెనర్ సుప్రభా శేషన్. తొంభై శాతం అడవులు మాయమైన పరిస్థితిని ‘పర్యావరణ మారణహోమం’గా అభివర్ణిస్తుంది సుప్రభా శేషన్. అడవులనే ఇల్లుగా భావిస్తున్న సుప్రభ శేషన్ ‘గ్రీన్ ఆస్కార్’గా గుర్తింపు పొందిన యూకేలోని టాప్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ ‘విట్లీ’కి ఎంపికైంది. గురుకుల బొటానికల్ శాంక్చువరీ (జీబిఎస్) అరుదైన మొక్కల ‘స్వర్గధామం’గా పేరు తెచ్చుకుంది పశ్చిమ కనుమల ప్రాంతాలలో 50 లక్షల మందికి పైగా నివసిస్తున్నందున అడవులు ప్రమాదం అంచున ఉన్నాయి. 28 ఏళ్లుగా ‘జీబిఎస్’లో పనిచేస్తున్న సుప్రభా శేషన్ అరణ్యాలకు సంబంధించిన పరిస్థితులు విషమించడాన్ని ప్రత్యక్షంగా చూసింది. ‘అరుదైన మొక్కలను కాపాడడంలోని ఆనందం అంతా ఇంతా కాదు’ అంటుంది సీనియర్ గార్డెనర్ లాలీ జోసెఫ్. పాతిక సంవత్సరాలుగా ఈ అభయారణ్యంలో పనిచేస్తున్న జోసెఫ్ ‘మొక్కలు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉండగలం’ అంటోంది. ‘నేను చూస్తుండగా అడవిలో ఒక చెట్టు నేల కూలిపోవడాన్ని మించిన విషాదం మరొకటి లేదు’ అంటుంది లాలీ జోసెఫ్. కీటకాలు, పాముల నుంచి రక్షణగా పెద్ద బూట్లు ధరించిన ‘ఆల్–ఫిమేల్ రెయిన్ ఫారెస్ట్ ఫోర్స్’లోని మహిళలు అడవులలో తిరుగుతుంటారు. ప్రమాదంలో ఉన్న మొక్కలు, చెట్లను రక్షించడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. సహజ పదార్థాల నుంచి పురుగు మందులను తయారుచేస్తుంటారు. అడవి గుండె చప్పుడు విని... దిల్లీలో పెరిగిన సుప్రభా శేషన్... కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలోని బ్రోక్వుడ్ పార్క్ సెంటర్ (యూకే)లో చదువుకుంది. అక్కడ ఉన్నప్పుడు తొలిసారిగా కేరళలోని ‘గురుకుల బొటానికల్ శాంక్చువరీ’ గురించి విన్నది. ల్యాండ్ స్కేప్ గార్డెన్స్, పార్క్ ల్యాండ్ల చరిత్రపై ప్రాజెక్ట్ చేస్తున్న సుప్రభ శేషన్ని కేరళలోని ‘గురుకుల’ ఆకర్షించింది. అమెరికాలోని ల్యాండ్ ఇనిస్టిట్యూట్లో ఒక సంవత్సరం పాటు అధ్యయన కార్యక్రమాల్లో భాగం అయిన సుప్రభ ఆ తరువాత మన దేశంలోని ఆదివాసీ గూడేలలో మకాం వేసి అడవుల గుండె చప్పుడు విన్నది. తన ప్రయాణంలో భాగంగా ‘గురుకుల బొటానికల్ శాంక్చువరీ’ (జీబిఎస్) వ్యవస్థాపకుడు వోల్ఫ్ గాంగ్ను కలిసింది. ‘జీబీఎస్’ ద్వారా అడవులను రక్షించడానికి వారు చేస్తున్న ప్రయత్నాల గురించి తెలుసుకుంది. అలా లాలీ జోసెఫ్, సుమ కెలోత్లాంటి ఇతర ‘జీబియస్’ సభ్యులతో కలిసి అడవిబాట పట్టింది. పశ్చిమ కనుమలలోని పర్వతాలను అధిరోహించింది. అంతరించిపోతున్న మొక్కల జాతుల గురించి తెలుసుకోవడమే కాదు వాటి పరిరక్షణలో భాగంగా ‘జీబియస్’గా గార్డెనర్గా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ నల్లని రాళ్లలో.. ‘గురుకుల బొటానికల్ శాంక్చువరీ’లోని సీనియర్ గార్డెనర్ అయిన లాలీ జోసెఫ్, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న మొక్కల కోసం అన్వేషిస్తుంటుంది. గురుకులంలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ద్వారా వాటిని బతికించే ప్రయత్నం చేస్తుంది. కొండ, కోనలు తిరుగుతూ మొక్కల యోగక్షేమాలు తెలుసుకుంటుంది. -
ఇంటి పేరు మార్చుకుంటున్నారా..?
వివాహానంతరం మహిళల ఇంటి పేరులో మార్పు చూస్తుంటాం. ఆమెకు, ఆమె సంతానానికి సహజంగానే భర్త ఇంటి పేరు వర్తిస్తుంది. అప్పటి వరకు తండ్రి ఇంటి పేరును వారసత్వంగా మోసిన ఆమె, తన విద్యార్హతలు, ఇతర ధ్రువీకరణ, గుర్తింపు పత్రాల్లో అదే పేరును కలిగి ఉంటుంది. మరి పెళ్లి తర్వాత ముఖ్యమైన పత్రాల్లో భర్త ఇంటి పేరును చేర్చుకోవాలా..? వద్దా..? ఇదొక పెద్ద సందేహం. చాలా మంది ఈ విషయంలో డోలాయమాన స్థితిని ఎదుర్కొంటూ ఉంటారు. వివాహానంతరం తండ్రి ఇంటి పేరుతో కొనసాగేందుకు అందరూ అంగీకరించకపోవచ్చు. భర్త అంగీకరించినా, మార్చుకోవడం సులభమేమీ కాదు. ఇందులోని సాధక బాధకాలను పూర్తిగా తెలుసుకుంటే అప్పుడు ఏం చేయాలో సులభంగా తేల్చుకోవచ్చు. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత కేవలం ఆధార్లో మాత్రమే ఇంటి పేరును మార్చుకుని వదిలివేయడం సరైనది కాదు. విద్యార్హతలు సహా చట్టబద్ధమైన అన్ని పత్రాలు, పెట్టుబడుల డాక్యుమెంట్లలో ఇంటి పేరును మార్చుకోవాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు ఎదురుకావు. కేవలం పాన్, ఆధార్లోనే ఇంటి పేరు మార్చుకుంటే, అది ఎన్నో ఇక్కట్లకు దారితీయవచ్చు. ఈపీఎఫ్, బ్యాంక్ ఖాతాల్లోని పేర్లకు, పాన్, ఆధార్లోని పేర్ల మధ్య అంతరం ఏర్పడుతుంది. ఆయా ఖాతాల నుంచి నిధులను వెనక్కి తీసుకోవాలంటే.. పేరును అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందుకోసం మరోసారి కేవైసీ (నో యువర్ కస్టమర్) ప్రక్రియ పూర్తి చేయక తప్పదు. పేర్ల అప్డేట్ కోసం అఫిడవిట్, ఇతర డాక్యుమెంట్లను సమరి్పంచాల్సి రావచ్చు. ‘‘వివాహం తర్వాత ఇంటి పేరును మార్చుకోవడం అన్నది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమే. కానీ ఈ విషయంలో లాభ, నష్టాలు రెండింటినీ పరిశీలించుకోవాలి. పేరును మార్చుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటంటే కుటుంబం అంతటికీ ఒకే విధమైన గుర్తింపు, ఏకరూపత ఉంటుంది. అన్ని రకాల డాక్యుమెంట్లలోనూ పేరు ఒకే విధంగా ఉండేందుకు శ్రమ పడాల్సి రావడమే ప్రతికూలం’’అని ఫిన్ఎడ్జ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ దీపికా భారతి వివరించారు. పెళ్లయిన తర్వాత ఇంటి పేరును మార్చుకోవడం వల్ల ఎన్నో చట్టపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ‘అలగ్ అండ్ కపూర్ లా ఆఫీసెస్’ (న్యాయ సేవల సంస్థ) పార్ట్నర్ సోనాల్ అలఘ్ పేర్కొన్నారు. గతంలోని పేరుకు, ప్స్ట్రేతుత పేరుకు మధ్య మార్పు నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో ఎన్నో పరిశీలనలకు తోడు వృత్తిపరమైన ధ్రువీకరణలు అవసరం పడతాయన్నారు. భర్త ఇంటి పేరు అప్పటి వరకు ఉన్న ఇంటి పేరు స్థానంలో భర్త ఇంటి పేరును చేర్చుకుంటున్నట్టు అయితే చట్టబద్ధంగా గుర్తింపును మారుస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. అధికారిక రికార్డుల్లో పేర్లు మార్చుకోవడం అన్నది పరిపాలనాపరమైన పెద్ద చిక్కుగా, సవాలుతో కూడుకున్నదిగా అభివర్ణించారు సోనాల్ అలఘ్. ‘‘దీనికి తోడు విద్యా, ప్రభుత్వ సంస్థల్లో పేరు మార్పునకు సంబంధించిన కఠిన ప్రక్రియ కష్టాలను మరింత పెంచుతుంది. దీంతో గుర్తింపు సమస్యలు ఎదురుకావచ్చు’’అని ఆమె పేర్కొన్నారు. మహిళ ఇంటి పేరును మార్చుకుంటుంటే, అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లలోనూ ఆ మేరకు మార్పులు చేసుకోవాలని దీపికా భారతి సూచించారు. కేవలం కొన్నింటిలోనే మార్పు చేసుకుని వదిలేస్తే, విదేశాలకు వెళ్లే సందర్భాల్లో, పెట్టుబడుల సమయంలో, లేదంటే నామినీగా ఉండి పెట్టుబడులను క్లెయిమ్ చేసుకోవాల్సిన సందర్భాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఆస్తులు తదితర చట్టబద్ధమైన డాక్యుమెంట్లు, బీమా పాలసీల్లో పేరులో మార్పు చేయకపోతే, గుర్తింపును నిరూపించుకునేందుకు లేదా ఆయా ఆస్తులను సొంతం చేసుకునేందుకు ఇబ్బంది పడాల్సి వస్తుందని కరంజ్వాలా అండ్ కో పార్ట్నర్ మేఘనా మిశ్రా పేర్కొన్నారు. ఆస్తి పత్రాల్లో అధికారిక డాక్యుమెంట్లలో ఇంటి పేరును మార్చుకున్న ప్రతి ఒక్కరూ.. తమ పేరిట ఉన్న భౌతిక, ఆర్థిక ఆస్తులు అన్నింటిలోనూ ఆ మేరకు సవరణ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒక్కసారి ఆధార్, పాన్లో కొత్త ఇంటి పేరు ఆధారంగా సవరణ చేసుకుంటే, ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాల్లో మార్చుకోవడం సులభతరం అవుతుందని భారతి తెలిపారు. ఉద్యోగం చేసే చోట అధికారిక రికార్డుల్లోనూ ఇంటి పేరులో మార్పు చేసుకోవడం ద్వారా ఇబ్బందులను అధిగమించొచ్చు. మార్చుకోవడం వల్ల ప్రయోజనం ఉందా? నేటి రోజుల్లో దాదాపు అధిక శాతం మహిళలు పెళ్లయిన తర్వాత తమ ఇంటి పేరును మార్చుకుంటున్నారు. భర్త ఇంటి పేరుకు మారిపోవడం వల్ల గుర్తింపు సులభంగా ఉంటుందని మిశ్రా తెలిపారు. సామాజికంగా ఒకే కుటుంబం అన్న భావన, కుటుంబంలో ఐక్యతకు ఇది అనుకూలిస్తుందన్నారు. పాన్, ఆధార్, ఇతర డాక్యుమెంట్లు కీలక పత్రాల్లో ఇంటి పేరు మార్చుకునేందుకు మ్యారేజ్ సర్టిఫికెట్ (వివాహ ధ్రువీకరణ) సమరి్పంచాల్సి వస్తుంది. పాస్ పోర్ట్ ఆఫీస్, ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లి నిర్ధేశిత దరఖాస్తుకు అనుబంధంగా వివాహ ధ్రువీకరణ పత్రం, ఇతర డాక్యుమెంట్లను ఇవ్వాలి. మ్యారేజ్ సర్టిఫికెట్తోపాటు గుర్తి్తంపు, చిరునామా ధ్రువీకరణ, పేరు మార్పునకు సంబంధించి అఫడవిట్ అవసరమవుతాయని మిశ్రా తెలిపారు. ‘‘నిర్ధేశిత మార్పునకు సంబంధించి చటబద్ధమైన ప్రక్రియలకు కట్టుబడి ఉండడం కీలకం. ఇక్కడ చెప్పినవన్నీ ప్రాథమికంగా సమర్పించాల్సినవి. విడిగా ఆయా డాక్యుమెంట్లలో మార్పులకు గాను సమరి్పంచాల్సినవి వేరేవి కూడా ఉండొచ్చు’’అని మిశ్రా పేర్కొన్నారు. పదో తరగతి మెమో చాలా వాటికి పదో తరగతి విద్యార్హత సర్టిఫికెట్ కీలకంగా పనిచేస్తుంది. ఇందులో పేరు మార్చుకోవడం కష్టమేనంటున్నారు మేఘన మిశ్రా. ‘‘సీబీఎస్ఈ వంటి బోర్డులు సాధారణంగా సర్టిఫికెట్లలో పేర్ల మార్పునకు అనుమతించడం లేదు. పాన్, పాస్పోర్ట్కు టెన్త్ సర్టిఫికెట్ కీలకంగా పనిచేస్తుంది. పాన్/ఆధార్కు, సీబీఎస్ఈ పదో తరగతి సర్టిఫికెట్లో పేరుకు వ్యత్యాసం ఉంటే బ్యాంక్ ఖాతా లేదా పాస్పోర్ట్ తీసుకునే విషయంలో ధ్రువీకరణ కోసం అదనపు డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. వివాహానంతరం వృత్తిపరమైన విద్యార్హతల డాక్యుమెంట్లు, కోర్సుల్లో ప్రవేశాలకు నమోదు చేసే పేరు, అంతకుముందు డాక్యుమెంట్లలో మాదిరే ఉండాలి’’అని మిశ్రా వివరించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయవాది ఏక్తా రాయ్ అభిప్రాయం భిన్నంగా ఉంది. స్కూల్ సర్టిఫికెట్లు అన్నవి ఒక నిరీ్ణత కాలం వరకు పుట్టిన తేదీకి ధ్రువీకరణలుగా కొనసాగుతాయి. ఇతర కీలక డాక్యుమెంట్లు అయిన పాన్, ఆధార్ తదితర ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఇంటి పేరును అప్డేట్ చేసుకున్న తర్వాత, స్కూల్ సర్టిఫికెట్లకు అంత ప్రాధాన్యం ఉండదు. అయినప్పటికీ వివాహానంతరం మహిళ పాన్ లేదా ఆధార్లో పేరు మార్చుకునేట్టు అయితే లేదా ఉన్నత కోర్సులకు దరఖాస్తు చేసుకుంటున్నట్టు అయితే తన వివాహాన్ని రిజిస్టర్ చేసుకుని, వివాహ రిజిస్ట్రేటేషన్ సర్టిఫికెట్ను సిద్ధంగా ఉంచుకోవాలి. జిల్లా మేజి్స్ట్రేట్ నుంచి పాఠశాల సర్టిఫికెట్లలో ఇంటి పేరు మార్పును ధ్రువీకరిస్తున్నట్టు అటెస్టేషన్ తీసుకున్నా అది కూడా పరిగణనలోకి వస్తుంది’’అని ఏక్తా రాయ్ తెలిపారు. ఆస్తుల క్లెయిమ్ కుటుంబ పెద్దలు కొందరు వీలునామా రాస్తుంటారు. కుమార్తెలకు సంబంధించి వివరాలు నమోదు చేస్తున్నప్పుడు తమ ఇంటి పేరునే పేర్కొంటారు. వీలునామా రాసిన వ్యక్తి మరణానంతరమే అది అమల్లోకి వస్తుంది. అలా అమల్లోకి వచ్చే నాటికి మహిళలు వివాహాలు చేసుకుని, భర్త ఇంటి పేరుకు మారి ఉండొచ్చు. అటువంటి సందర్భాల్లో వీలునామాలోని వివరాల మేరకు తమ హక్కులను క్లెయిమ్ చేసుకునే సందర్భంలో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రాపర్టి, యాజమాన్యం లేదా వారసత్వ వివాదాల్లో ఇంటి పేరు, చట్టబద్ధమైన డాక్యుమెంట్లలోని ఇంటి పేరు ఒకే మాదిరిగా ఉండకపోతే సవాళ్లు ఎదురవుతాయని ఏక్తారాయ్ అంటున్నారు. వీలునామాలోని పేరుకు, ప్స్ట్రేతుతం మహిళ పేరుకు మధ్య వ్యత్యాసం ఉంటే, అదనపు రుజువులు, డాక్యుమెంట్లను సమరి్పంచాల్సి ఉంటుందని సోనాల్ అలఘ్ తెలిపారు. మహిళ ఇంటి పేరు మార్పు వెనుకనున్న అంశాలను కోర్టులు, అధికారులు పరిగణనలోకి తీసుకోవచ్చని చెప్పారు. ఏవైనా వ్యత్యాసాలు ఉంటే అందుకు సంబంధించి సహేతుక ఆధారాలు దగ్గర ఉంచుకోవాలని, దాంతో ఆస్తుల బదిలీ సాఫీగా పూర్తవుతుందని సూచించారు. వీసాకు దరఖాస్తు ‘‘వీసాలో పేరు అప్డేట్ చేసుకోవడం లేదంటే భాగస్వామి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంతర్జాతీయంగా ఉన్న భిన్నమైన కుటుంబ నిర్మాణాల నేపథ్యంలో ఇంటి పేరులో వ్యత్యాసాన్ని ఆయా దేశాల్లో గుర్తించేందుకు ఎన్నో రకాల రుజువులు సమరి్పంచాల్సి రావచ్చు. వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు.. మారిన పేరుకు అనుగుణంగా అప్డేట్ చేసుకోవాలని భావించే వారికి ఈ సవాలు ఎదురవుతుంది’’అని అలఘ్ అంటున్నారు. పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చుకుని వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే, అప్పుడు వివాహ స్థితిని తెలిపే డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. ఇది వీసా జారీని ఆలస్యం చేయవచ్చు. అందుకే పెళ్లి తర్వాత పాస్పోర్ట్లో భర్త ఇంటి పేరు ప్రతిఫలించేలా మార్పు చేసుకోవాలని మిశ్రా సూచించారు. దీనివల్ల ధ్రువీకరణ సమస్యలు తక్కువగా ఉంటాయన్నారు. పేరు మార్చుకోకపోతే..? వివాహం తర్వాత కూడా తన ఇంటి పేరునే కొనసాగించే మహిళలూ కొందరు ఉన్నారు. అలాంటప్పుడు సదరు మహిళ భర్త పేరును పేర్కొనే సమయంలో ఇద్దరి ఇంటి పేరు వేర్వేరుగా ఉంటుంది. కనుక తనకు, తన భర్తకు మధ్య బంధానికి నిదర్శనంగా మ్యారేజ్ సర్టిఫికెట్ ఒక్కటి దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది. ‘‘వివాహం తర్వాత మహిళ ఇంటి పేరు మార్చుకోకపోతే అప్పుడు వారి బంధాన్ని నిరూపించుకునేందుకు మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాల్సిందే. ఆదాయపన్ను రిటర్నుల దాఖలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్, ఆస్తుల లావాదేవీల సమయంలో ఇది అవసరపడుతుంది. మ్యారేజ్ సర్టిఫికెట్ లేకపోతే భర్త పేరుతో అప్డేట్ చేసిన ఆధార్, పాస్పోర్ట్, బ్యాంక్ జాయింట్ అకౌంట్ పాస్బుక్ లేదా స్టేట్మెంట్, ఒకే ఇంట్లో నివసిస్తున్నట్టు రుజువులు, అఫిడవిట్ సాయపడతాయి’’అని మిశ్రా తెలిపారు. పిల్లల బర్త్ సర్టిఫికెట్ వివాహానంతరం మహిళల ఇంటి పేరులో మార్పు లేనప్పుడు.. ఆ దంపతులకు జని్మంచే పిల్లల బర్త్ సర్టిఫికెట్లో తల్లి, తండ్రి ఇంటి పేరు వేర్వేరుగా ఉంటుంది. ఇదేమైనా సమస్యలు కలిగిస్తుందా.? అన్న సందేహం రావచ్చు. పిల్లల పేరిట పీపీఎఫ్, సుకన్య సముృద్ధి యోజన తదితర సాధనాల్లో ఇన్వెస్ట్ చే యాలనుకుంటే ఈ బర్త్ సర్టిఫికెట్ అవసరం పడు తుంది. అంతేకానీ, అందులో తల్లి, తండ్రి ఇంటి పేర్లు వేర్వేరుగా ఉంటే ఎలాంటి సమస్య రాదని మిశ్రా పేర్కొన్నారు. మొత్తం పేరే మారితే? కొన్ని వర్గాల ప్రజల్లో పెళ్లి తర్వాత మహిళ ఇంటి పేరే కాకుండా, మొదటి పేరులోనూ మార్పు చోటు చేసుకుంటుంది. ఇది సమస్యలకు దారితీస్తుందని మిశ్రా చెప్పారు. అధికారిక రికార్డులతో పోలిస్తే పేర్ల మధ్య పోలిక లేకపోవడం వల్ల సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పేరు మార్చుకునే విషయంలో చట్టబద్ధమైన నిబంధనలను పాటించడం వల్ల సవాళ్లను అధిగమించొచ్చని సూచించారు. -
మహిళల ప్రయాణం ఇక టీ–సేఫ్
సాక్షి, హైదరాబాద్: ఒంటరిగా ప్రయాణించే పౌరులు, ముఖ్యంగా మహిళలు సురక్షితంగా గమ్య స్థానం చేరే వరకు పర్యవేక్షించేలా దేశంలోనే మొదటి సారిగా తెలంగాణ పోలీసులు టీ–సేఫ్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి తెలిపారు. స్మార్ట్ఫోన్ లేక పోయినా, సాధారణ మొబైల్ ఫోన్ ఉన్నా..ఈ టీ–సేఫ్ సేవలను వినియోగించుకునే వీలుందని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక యాప్ మాత్రమే కాదని, కీలకమైన సర్వీస్ అని అన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న మహిళా శక్తి విధానం ఆవిష్కరణలో భాగంగా మంగళవారం సచివాల యంలో టీ–సేఫ్ను సీఎం ప్రారంభించారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, డి.అనసూయ (సీతక్క), తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 100 లేదా 112 నంబర్లకు డయల్ చేసి ఐవీఆర్ ఆప్షన్లో 8 నంబర్ను నొక్కడం ద్వారా టీ–సేఫ్ సేవలను వినియోగించుకోవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. ఒక్కసారి సమాచారం ఇస్తే చాలు స్మార్ట్ ఫోన్లు ఉన్న వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, లేదా టీ–సేఫ్ వెబ్పేజీ ద్వారా వీటిని వినియోగించుకోవచ్చని సీఎం తెలిపారు. దేశంలోనే తొలిసారిగా మహిళలు, చిన్నారుల సురక్షిత ప్రయాణం కోసం ఈ సేవలను అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ పోలీస్ శాఖకు సీఎం అభినందనలు తెలిపారు. టీ–సేఫ్కు డయల్ 100 ద్వారా లేదా యాప్ ద్వారా ఒకసారి సమా చారం ఇస్తే సరిపోతుందని, మళ్లీ మళ్లీ అత్యవసర సేవల కోసం 100 నంబర్కు ఫోన్ చేయాల్సిన పని లేకుండా పోలీసులే నిర్ధారిత సమయంలోపు పౌరులను సంప్రదిస్తూ వారు సురక్షితంగా గమ్యం చేరే వరకు పర్యవేక్షిస్తారని తెలిపారు. అవసరమైతే లైవ్ ట్రాకింగ్ లింక్ ఆ పరిధిలోని ప్యాట్రో వాహ నాలకు సైతం వెళుతుందని వివరించారు. లైవ్ లొకేషన్ పంపే వీలు టీ–సేఫ్ యాప్ను వినియోగించే పౌరులు ఆపదలో ఉన్నప్పుడు వారి లైవ్ లొకేషన్ను పోలీసులకు పంపే వీలు కూడా ఉందని రేవంత్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 791 ప్యాట్రో కార్లు, 1,085 బ్లూకోల్ట్స్ వాహనాలకు టీ–సేఫ్ అనుసంధానమై ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో మరింత సురక్షిత ప్రయాణం కోసం టీ–సేఫ్ యాప్ సేవలను ఇతర క్యాబ్, ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ సేవల యాప్లకు అనుసంధానిస్తామని మహిళా భద్రత విభాగం అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సీఐడీ, మహిళా భద్రత విభాగం అదనపు డీజీ శిఖాగోయల్, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ శివధర్రెడ్డి, శిక్షణ విభాగం అదనపు డీజీ అభిలాష బిస్త్, శాంతిభద్రతల అదనపు డీజీ సంజయ్ జైన్, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా పాల్గొన్నారు. -
ట్రేడింగ్లో మహిళల హవా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అన్ని రంగాలతో పాటు ట్రేడింగ్లోనూ మహిళలు దూసుకెడుతున్నారు. బ్రోకరేజీ ఫీజులు తగ్గడం, ట్రేడింగ్ వేళలు కొంత అనువుగా ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణంగా ఉంటున్నాయి. ఖాతాలు తెరవడమే కాకుండా మహిళలు ట్రేడింగ్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారని యస్ సెక్యూరిటీస్ ఒక నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది జనవరి 31 నాటికి మహిళా ఇన్వెస్టర్ల అకౌంట్లు వార్షికంగా 75 శాతం పెరిగినట్లు తెలిపింది. అలాగే, మరో బ్రోకరేజ్ సంస్థ రెలిగేర్ బ్రోకింగ్ ప్లాట్ఫాంలోని యాక్టివ్ ట్రేడర్లలో మహిళలు 30 శాతం ఉన్నారు. ఇక ఇన్వెస్ట్మెంట్పరంగా చూస్తే గతేడాది తమ ప్లాట్ఫామ్ను ఎంచుకున్న కొత్త ఇన్వెస్టర్లలో 41 శాతం మంది మహిళలే ఉన్నారని టెక్ ఆధారిత ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఫిన్ఎడ్జ్ తెలిపింది. రియల్ ఎస్టేట్లాగా కాకుండా చాలా తక్కువ మొత్తాన్నైనా షేర్లలో ఇన్వెస్ట్ చేసే వీలుండటం కూడా మహిళలు స్టాక్మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండటానికి కారణం కావచ్చన్నది విశ్లేషణ. ఆర్థిక స్వాతంత్య్రంపై అవగాహన.. కచి్చతంగా నిర్దిష్ట ప్రదేశానికే పరిమితం కాకుండా ఎక్కడి నుంచైనా ట్రేడింగ్ చేసే సౌలభ్యం ఉండటం, వేళలు కూడా అనుకూలంగా ఉండటం వల్ల మహిళలు కూడా ట్రేడింగ్ను ఎంచుకుంటున్నారని ఆర్థిక అక్షరాస్యత కన్సల్టెంట్, ఫుల్–టైమ్ ట్రేడర్ అయిన ప్రీతి చాబ్రా తెలిపారు. మహిళా ట్రేడర్లు పెరగడానికి గల కారణాల్లో ఆర్థిక స్వాతంత్య్రంపై అవగాహన మెరుగుపడుతుండటం కూడా ఒకటని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటి నుంచే ఆదాయాన్ని ఆర్జించే అవకాశాలను కలి్పంచే ట్రేడింగ్ ఆకర్షణీయంగా ఉంటోందని ఉమాదేవి అనే మరో ట్రేడర్ తెలిపారు. ట్రేడింగ్ అంత సులువైనదేమీ కాకపోయినప్పటికీ మార్కెట్ల గురించి అవగాహన పెంచుకుంటూ, రిస్కు మేనేజ్మెంటును అర్థం చేసుకుంటూ మహిళలు ఇప్పుడిప్పుడే ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ వైపు అడుగులు వేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. మహిళా ఖాతాదార్లకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫర్లు.. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్పొరేట్ సంస్థలు పలు కార్యక్రమాలు ప్రకటించాయి. ఈ ఏడాది జూన్ 30 వరకు మహిళా శక్తి సేవింగ్స్ ఖాతాలు లేదా ఉమెన్ పవర్ కరెంట్ అకౌంట్లు తీసుకున్నా, డిసెంబర్ 31లోగా రుణాలు తీసుకున్న మహిళలకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తెలిపింది. రిటైల్ రుణాలపై 25 బేసిస్ పాయింట్ల వరకు తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ చార్జీలు పూర్తిగా మినహాయింపు, వార్షికంగా సేఫ్ డిపాజిట్ లాకర్ చార్జీలపై 50 శాతం డిస్కౌంటు వంటివి వీటిలో ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కెరియర్లో వివిధ దశల్లో ఉన్న మహిళా ఉద్యోగుల కోసం రీకిండిల్, ర్యాంప్ బ్యాక్, యామ్వాయిస్ వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు అమెజాన్ వెల్లడించింది. మరోవైపు, వేతనాల్లో సమానత, ఉద్యోగం–వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యతను ప్రోత్సహించే విధానాలు అమలు చేస్తున్నట్లు ఐకియా తెలిపింది. మహిళా ఎంట్రప్రెన్యూర్స్కు తోడ్పాటు అందించేందుకు హర్స్టోర్ అనే వేదికను ఏర్పాటు చేసినట్లు బ్రిటానియా పేర్కొంది. హెచ్సీసీబీ 25,000 మంది మహిళలకు ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యతలో శిక్షణ కలి్పంచినట్లు తెలిపింది. -
ఇంతింతై.. ఆకాశమంతై..
సాక్షి, అమరావతి: ‘నేను ఒక స్త్రీని కాబట్టి నన్ను ఎవరు ఎదగనిస్తారు.. అన్నది ప్రశ్న కాదు. ఆత్మ విశ్వాసం ఉన్న నన్ను ఎవరు ఆపగలుగుతారు.. అన్నది ప్రశ్న.’ ప్రముఖ రచయిత్రి, తత్వవేత్త అయిన్ రైన్డ్ చెప్పిన ఈ మాటలకు అర్థం ఈ రోజు మన రాష్ట్రంలో కళ్లెదుటే కనిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న ప్రతి మహిళలోనూ కన్పిస్తున్న ఆత్మవిశ్వాసమే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో సామాజిక సాధికారత సాధించడానికి 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదిక నుంచే వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. రాజకీయ, విద్య, ఆర్థిక, మహిళా సాధికారత ద్వారా సామాజిక సాధికారత సాధించడానికి రచించిన ప్రణాళికను 58 నెలలుగా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకూ పదవుల్లో సింహభాగం వాటా ఇచ్చి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా రాజకీయ సాధికారత సాధించారు. అదే ఒరవడిలో అమ్మ ఒడి, ఆసరా, చేయూత వంటి పథకాల అమలుతో తరుణీమణులకు చేయూతనిచ్చి ఆర్థిక సాధికారత సాధించారు. విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల ద్వారా విద్యా సాధికారత, మహిళా సాధికారతకు బాటలు వేశారు. ఆ అవకాశాలను అందిపుచ్చుకున్న మహిళలు సాధికారత సాధించారు. మహిళా రాజకీయ సాధికారతలో దేశంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. కేబినెట్ నుంచి స్థానిక సంస్థల దాకా.. కేబినెట్ నుంచి స్థానిక సంస్థల వరకూ పదవుల్లో మహిళలకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారు. దేశ చరిత్రలో హోంమంత్రిగా తొలిసారి ఎస్సీ మహిళ మేకతోటి సుచరితను నియమించారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్పర్సన్గా ముస్లిం మహిళను ఎంపిక చేశారు. మండలి చరిత్రలో ముస్లిం మహిళను డిప్యూటీ ఛైర్ పర్సన్గా నియమించడం ఇదే తొలిసారి. మంత్రివర్గంలో నలుగురు మహిళలు తానేటి వనిత, కేవీ ఉషశ్రీచరణ్, విడదల రజిని, ఆర్కే రోజాలకు స్థానం కల్పించారు. హోం, వైద్యారోగ్య, మహిళా శిశుసంక్షేమం వంటి కీలక శాఖలు వారికి అప్పగించి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించారు. రాష్ట్ర తొలి చీఫ్ సెక్రటరీగానూ, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్నిని నియమించారు. మహిళా రాజకీయ సాధికారతలో మనమే నంబర్ వన్ ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకేనేమో.. స్త్రీవాద రచయిత చలం తన రచనల్లో.. ‘స్త్రీకి శరీరం ఉంది.. దానికి వ్యాయామం ఇవ్వాలి.. మెదడు ఉంది.. జ్ఞానం ఇవ్వాలి.. హృదయం ఉంది.. అనుభవం ఇవ్వాలి..’ అని ఉన్నతంగా చెప్పారు. ‘ముదితల్ నేర్వగరాని విద్యగలదె.. ముద్దారగ నేర్పించినన్..’ అన్నారో కవి. ఆచరణకొచ్చేసరికి అతివల మాటకు విలువిచ్చే నేతలెందరుంటారు? వారికి సమున్నతంగా రాజకీయ పదవులు ఇచ్చి గౌరవించే నాయకులు ఎందరుంటారు? మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ‘నేనున్నా..’ అని మహిళాలోకాన్ని అన్నింటా ముందు వరుసలో నిలిపి, ఊహలకు ఆచరణ రూపమిచ్చిన ధైర్యశాలి. అచ్చమైన మహిళా పక్షపాతి. కందుకూరి, గురజాడల ఆదర్శబాటసారి. చరిత్రాత్మక చట్టం చేసి మరీ పదవులు నామినేటెడ్ పదవులు, నామినేషన్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో 50 శాతం ఇంతులకు ఇచ్చేలా సీఎం జగన్ ఏకంగా చట్టం చేశారు. దేశ చరిత్రలో నామినేషన్ పదవుల్లో, పనుల్లో 50 శాతం నారీమణులకు రిజర్వేషన్ చేస్తూ చట్టం చేసి మరీ న్యాయం చేయడం ఇదే తొలిసారి. ఆ చట్టంలో పేర్కొన్న దాని కంటే నామినేటెడ్ పదవుల్లో 51 శాతం పదవులు పడతులకే ఇచ్చారు. మొత్తం 1,154 డైరెక్టర్ పదవుల్లో 586 ప్రమద లోకానికే ఇచ్చారు. రాష్ట్రంలో 202 మార్కెట్ యార్డు ఛైర్మన్ పోస్టుల్లో 102 మహిళలకే ఇచ్చారు. 1,356 రాజకీయ నియామకాల్లో 688, అంటే అక్షరాలా 51 శాతం తరుణీమణులకే కేటాయించారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఎస్సీ మహిళను హోంమంత్రిగా నియమించిన సీఎం వైఎస్ జగన్ ► రాష్ట్రంలో 13 జడ్పీ చైర్పర్సన్ పదవుల్లో ఏడుగురు (54 శాతం) మహిళలకు అవకాశం ఇచ్చారు. ► 26 జడ్పీ వై‹స్ చైర్పర్సన్లలో 15 మంది (58 శాతం) మహిళలకు పదవీయోగం కల్పించారు. ► 12 మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్ పదవులు.. మొత్తంగా 36 పదవుల్లో.. 18 అంటే 50 శాతం మహిళలకు ఇచ్చారు. ► మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లలో 671 మంది కార్పొరేటర్లు ఉంటే.. అతివలకే 54 శాతం అంటే 361 పదవులు దక్కాయి. ► 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే వాటిలో 73 చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించింది. వాటిలో 45 మంది.. అంటే 64 శాతం మహిళలే ఛైర్ పర్సన్లు. ► ఈ మున్సిపాల్టీల్లోని 2,123 వార్డు మెంబర్లలో 1,161 మంది.. అంటే 55 శాతం ప్రమదలకే దక్కేట్లు చేశారు. ► సర్పంచి పదవుల్లో 57 శాతం, ఎంపీటీసీల్లో 54 శాతం, మండలాధ్యక్షుల్లో 53 శాతం, జడ్పీటీసీల్లో 53 శాతం ముదితలే ఎన్నికయ్యారు. ► వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన దాదాపు 2.65 లక్షల వలంటీర్ ఉద్యోగాల్లో 53 శాతం వనితలనే నియమించారు. ఇంకా దాదాపు 1.34 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో.. 51 శాతం మహిళలే ఉన్నారు. -
International Womens Day 2024: ప్రతి రంగంలో ప్రతిభ
వివిధ రంగాలలో విజయపథంలో దూసుకుపోతూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న మహిళలు వినీతసింగ్ (కాస్మెటిక్స్) వినీతసింగ్కు తండ్రి తేజ్సింగ్ స్ఫూర్తిప్రదాత. ఆయన శాస్త్రవేత్త. ఏడాదిలో 365 రోజులూ పనిచేసేవాడు. తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో డిజిటల్–ఫస్ట్ కాస్మటిక్ బ్రాండ్ ‘సుగర్’తో ఎంటర్ప్రెన్యూర్గా విజయకేతనం ఎగరేసింది వినీత. ఐఐటీ–మద్రాస్, ఐఐఎం–అహ్మదాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వినీత ఒక ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో అధిక వేతనంతో కూడిన జాబ్ ఆఫర్ను వదులుకొని వ్యాపారరంగంలోకి అడుగు పెట్టింది. మొదటి స్టార్టప్ ‘క్వెట్జాల్’ ఘోరంగా విఫలమైంది. 2012లో మన దేశంలో ఇ–కామర్స్ ఊపందుకుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలకు ప్రతినెలా వివిధ రకాల బ్యూటీ ప్రాడక్ట్స్ తక్కువ ధరకు అందించే ‘ఫ్యాబ్ బ్యాగ్’ అనే సబ్స్క్రిప్షన్స్ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఈ వ్యాపారం హిట్ అయింది. అయితే ఈ మేకప్ బ్రాండ్లు మన భారతీయ స్కిన్టోన్, జీవన విధానానికి అనుగుణంగా లేవని గ్రహించింది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని 2015లో కాస్మటిక్ ‘సుగర్’ను స్టార్ట్ చేసి తిరుగులేని విజయం సాధించింది. నేహా సతక్ (ఆస్ట్రోమ్ టెక్నాలజీ) టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్శిటీ నుంచి పీహెచ్డీ, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్లో మాస్టర్స్ చేసింది నేహా సతక్.‘ఆస్ట్రోమ్ టెక్నాలజీ’తో ఎంటర్ప్రెన్యూర్గా తన సత్తా చాటింది. ‘నన్ను నేను ఒక ఇన్నోవేటర్గా భావిస్తాను’ అంటుంది ‘ఆస్ట్రోమ్ టెక్నాలజీ’ కో–ఫౌండర్, సీయీవో నేహా సతక్. ‘ఇన్నోవేటివ్ హై– బ్యాండ్విడ్త్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి, ఇంటర్నెట్ సేవలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటు ధరలోక్లి తీసుకురావడానికి, మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలనే ఆలోచనలో ఆస్ట్రోమ్ టెక్నాలజీ మొదలు పెట్టాం. ఆస్ట్రోమ్ గిగామెష్ డివైజ్ చుట్టుపక్కల ఉన్న నాలుగు డివైజ్లను కనెక్ట్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఒక పరికరాన్ని మాత్రమే కనెక్ట్ చేయగలదు’ అంటుంది నేహా సతక్. హర్దిక షా (ఫిన్టెక్) ముంబైలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది హర్దిక షా. చిన్నపాటి వ్యాపారం నిర్వహించడానికి తల్లి పడే కష్టాలను దగ్గరి నుంచి చూసిన షా యూఎస్లో కంప్యూటర్ సైన్స్ చేసింది. కొలంబియా బిజినెస్ స్కూల్లో ఎంబీఏ పూర్తయిన తరువాత టాప్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్స్లో పాల్గొంది. మన దేశంలో చిన్న వ్యాపారాలు చేస్తున్నవారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నిపుణులతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ఆ తరువాత బెంగళూరు కేంద్రంగా ‘కినార క్యాపిటల్’ అనే ఫిన్టెక్ను ప్రారంభించింది. ఈ ఫిన్టెక్కు ఆరు రాష్ట్రాల్లో 110 శాఖలు ఉన్నాయి. ‘గ్యారెంటీ లేని బిజినెస్. చాలా రిస్క్’ అన్నారు హర్థిక షా ఎంటర్ప్రెన్యూర్గా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు. అయితే ఆ మాటలేవీ ఆమెపై ప్రభావం చూపలేదు. తొలి అడుగుల్లోనే కస్టమర్లు, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని గెలుచుకుంది. ‘ఫిన్ టెక్’ ఫీల్డ్లో విజయకేతనం ఎగరేసింది. డా. ప్రియా అబ్రహం, వైరాలజిస్ట్ మన దేశంలోని ప్రసిద్ధ వైరాలజిస్ట్లలో డా. ప్రియా అబ్రహం ఒకరు. కేరళలోని కొట్టాయం జిల్లాలో పుట్టిన ప్రియ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు(సీఎంసీ)లో బయాలజీలో పీహెచ్డీ చేసింది. సీఎంసీ ‘క్లినికల్ వైరాలజీ సెక్షన్’ హెడ్గా పనిచేసింది. వైరల్ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన ఎన్నో కమిటీల్లో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీలో పనిచేసింది. నేషనల్ వైరల్ ఇన్ఫెక్షన్ సర్వైలెన్స్ రిసెర్చ్లో భాగం అయింది. కోవిడ్–19కి జస్ట్ రెండు నెలల ముందు పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ హెడ్గా బాధత్యలు చేపట్టింది. ‘ఆ టైమ్లో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను’ అని కరోనా కాలాన్ని గుర్తు తెచ్చుకుంటుంది ప్రియ. టెస్టింగ్ కిట్లను వివిధ టెస్టింగ్ ల్యాబ్లకు పంపే లాజిస్టిక్స్ను నిర్వహించడం నుంచి కొత్తగా పుడుతున్న వేరియెంట్లను నిశితంగా పరిశీలించడం వరకు వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో ప్రియ ఆమె బృందం ఎంతో కృషి చేసింది. లాజిస్టిక్స్ నిర్వహణకు మాత్రమే పరిమితం కాకుండా మన దేశంలో జరిగిన అన్ని వ్యాక్సిన్ ట్రయల్స్ పర్యవేక్షణలోనూ కీలక పాత్ర పోషించింది. ‘గుర్తింపు, విజయం రావాలని ఆశగా పరుగెత్తినంత మాత్రాన రావు. మనం చేసిన కృషిని బట్టి వెదుక్కుంటూ మన దగ్గరికే వస్తాయి’ అంటుంది ప్రియా అబ్రహం. రిమ్జిమ్ అగర్వాల్ (న్యూరో–ఇన్ఫర్మేటిక్స్) లైనా ఇమాన్యుయేల్తో కలిసి న్యూరో–ఇన్ఫర్మేటిక్స్ ప్లాట్ఫామ్ ‘బ్రెయిన్సైట్’ను ప్రారంభించింది రిమ్జిమ్ అగర్వాల్. బ్రెయిన్సైట్ ఏఐ సాఫ్ట్వేర్ మెంటల్ హెల్త్ ప్రాక్టిషనర్స్కు, న్యూరోసర్జన్స్ బాగా ఉపయోగపడుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్లో పీహెచ్డీ చేసిన అగర్వాల్ మెంటల్ హెల్త్కు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) అప్లికేషన్లను స్టడీ చేసింది. ‘గూగుల్ మ్యాప్ ఆఫ్ ది బ్రెయిన్’గా ‘బ్రెయిన్సైట్’ ప్లాట్ఫామ్ గుర్తింపు పొందింది. ఈ ప్లాట్ఫామ్ను నాలుగు రకాల టెక్నాలజీలతో రూపొందించారు. స్కిజోఫ్రెనియా, బైపోలార్ డిజార్డర్లాంటి మానసిక వ్యాధులకు సంబంధించి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. మెదడులో ఏం జరుగుతుందో అనేదానిపై ‘బ్రెయిన్సైట్’ సాంకేతికత దృష్టి సారిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే మానసిక సమస్యతో బాధపడుతున్న వారి గురించి సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ‘మా పరిశోధనలను ఎక్కువమందికి చేరువ చేయాలనే లక్ష్యంతో ఎంటర్ప్రెన్యూర్గా మారాను. ఫంక్షనల్ అంశాలకు కృత్రిమ మేధస్సును వర్తింప చేస్తున్న ప్రపంచంలోని అతి కొద్ది కంపెనీలలో మా కంపెనీ ఒకటి’ అంటుంది అగర్వాల్. అశ్వినీ అశోకన్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్శిటీలో ఇంటరాక్షన్ డిజైన్ కోర్సు చదువుతున్న రోజుల నుంచి అశ్వినీ అశోకన్కు కంప్యూటర్కు సంబంధించి విషయాలపై ఆసక్తి ఉండేది. ‘ఇంటెల్’లో దశాబ్దం పాటు వివిధ రకాల ఇంటర్నెట్ ఆధారిత ఉత్పత్తులకు సంబంధించిన విభాగాల్లో పనిచేసింది. ఈ అనుభవ జ్ఞానంతో ‘మ్యాడ్స్ట్రీట్ డెన్’ను ప్రారంభించింది. డిజిటల్, ఏఐ ట్రాన్స్ఫర్మేషన్కు సంబంధించి కంపెనీల జర్నీలో ‘మ్యాడ్స్ట్రీట్’ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. 2020–2021లో కంపెనీలో రకరకాల పరిశ్రమలలోకి విస్తరించింది. వ్యాపార విజయాలకు మాత్రమే కాదు ఉద్యోగాలలో జెండర్ ఈక్వాలిటీకి కూడా ప్రాధాన్యత ఇస్తోంది అశ్విని. కోవిడ్ సమయంలో ఉద్యోగాలు మానేసిన ఎంతోమందిని తిరిగి పనిలో చేరేలా కృషి చేసింది. ‘అన్ని రకాల కంపెనీలను నడిపించడంలో మహిళలు ముందుండాలి’ అని కోరుకుంటున్న అశ్వినీ అశోకన్ ఈ భూగోళంలో ప్రతి ఉద్యోగి, ప్రతి వ్యక్తిని ఏఐ నేటివ్గా చూడాలనుకుంటుంది. అపర్ణ పురోహిత్ (వినోద రంగం) మాస్ కమ్యూనికేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అపర్ణ పురోహిత్ ఎన్నో కలలతో దిల్లీ నుంచి ముంబైలోకి అడుగు పెట్టింది. ముంబైకి వచ్చిన ఐదేళ్ల తరువాత ఇండిపెండెంట్ డైరెక్టర్–ప్రొడ్యూసర్ కావాలనే తన కలను సాకారం చేసుకుంది. కథలు చెప్పాలనే కలతో ముంబైకి వచ్చిన అపర్ణ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా ఒరిజనల్స్’ హెడ్గా కొత్త ప్రయాణం ప్రారంభించింది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఎన్నో ప్రాజెక్ట్లలో పనిచేసింది. ‘ఇది నా పని కాదు’ అని ఎప్పుడూ అనుకోలేదు. ట్యూషన్ల్ చెప్పడం నుంచి వాయిస్ ఓవర్ వరకు ఎన్నో పనులు చేసింది. ‘అమెజాన్ ప్రైమ్వీడియో–ఇండియా’ హెడ్ హోదాలో పాతాళ్ లోక్, మీర్జాపూర్ మేడ్ ఇన్ హెవెన్, ది ఫర్గెటన్ ఆర్మీలాంటి ఒరిజినల్ ఇండియన్ బ్లాక్బస్టర్ కంటెంట్తో మంచి పేరు తెచ్చుకుంది. ‘సూపర్మెన్లాగా సూపర్ ఉమెన్ అనే మాట ఎందుకు వినిపించదు’ అనే మాటకు అపర్ణ పురోహిత్ ఇచ్చిన జవాబు... ‘తమ దైనందిన జీవితంలో మహిళలు ఎప్పుడూ సూపరే’. -
ఫార్చూన్ 500 లీడర్లలో మహిళలు అంతంతే ..
న్యూఢిల్లీ: కార్పొరేట్ ప్రపంచంలో మహిళలు దూసుకెడుతున్నా.. కంపెనీలకు సారథ్యం వహిస్తున్న వారి సంఖ్య అంతంతమాత్రంగానే ఉంటోంది. ఫార్చూన్ ఇండియా 500 కంపెనీల్లో కేవలం 1.6 శాతం సంస్థలు మాత్రమే మహిళల సారథ్యంలో ఉండటం ఇందుకు నిదర్శనం. ఫార్చూన్ ఇండియా, ఎస్పీ జైన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ దీనికి తోడ్పాటు అందించగా, ముంబై, కోల్కతా, బెంగళూరు, ఢిల్లీ–ఎన్సీఆర్లో 16 రౌండ్టేబుల్ సమావేశాలు నిర్వహించారు. వీటిలో 130 మంది పైచిలుకు పరిశ్రమ దిగ్గజాలు పాల్గొన్నారు. అలాగే సర్వే ప్రశ్నాపత్రం ద్వారా ఫార్చూన్ 500 కంపెనీల అభిప్రాయాలు కూడా సేకరించారు. ‘మహిళల సారథ్యంలో అభివృద్ధి లక్ష్యాన్ని సాధించే దిశగా పరిష్కరించుకోవాల్సిన సమస్యలను గుర్తించడంలో పరిశ్రమ పారదర్శకంగా వ్యవహరిస్తుండటం ప్రశంసనీయం‘ అని నివేదికను ఆవిష్కరించిన సందర్భంగా కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ .. సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. అధ్యయనం విశేషాలు.. ► ఫార్చూన్ ఇండియా ఏటా అత్యధిక ఆదాయాలు ఆర్జించే 500 టాప్ కంపెనీలతో జాబితా విడుదల చేస్తుంటుంది. అధ్యయనం ప్రకారం వీటిలో కేవలం 1.6 శాతం సంస్థల్లోనే మహిళా ఎండీలు/సీఈవోలు ఉన్నారు. తర్వాత స్థానంలో ఉండే నెక్ట్స్ 500 సంస్థల్లో 5 శాతం, ఫార్చూన్ ఇండియా 1000 కంపెనీల లిస్టులో 3.2 శాతం మంది ఉన్నారు. ► కుటుంబ బాధ్యతల కారణంగా 30–40 శాతం మంది ఉద్యోగినులు .. మిడిల్ మేనేజ్మెంట్ స్థాయికి రాగానే నిష్క్రమిస్తుండటంతో వారి ప్రాతినిధ్యం తగ్గుతోంది. ప్రసూతి సెలవులు తీసుకోవడం, ప్రసవం తర్వాత తిరిగి ఉద్యోగాల్లో చేరడం సవాలుగా ఉంటోంది. ► కార్పొరేట్ మైండ్సెట్పరమైన సమస్యలు కూడా కెరియర్లో మహిళల పురోగతికి సమస్యాత్మకంగా ఉంటున్నాయి. ఉద్యోగినులు ఆరు నెలల పాటు మెటర్నిటీ లీవులు తీసుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మిడ్–మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాల్లో మహిళలను తీసుకోవడానికి సంస్థలు సంకోచిస్తున్నాయి. ఇది పెయిడ్ లీవు కావడంతో చాలా మటుకు సంస్థలు – ముఖ్యంగా చిన్న సంస్థలు – పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడటం లేదు. అలాగే పిల్లల బోర్డు ఎగ్జామ్ల కోసం, తల్లిదండ్రులు..లేదా అత్తమామల సంరక్షణ కోసం నలభైలలో బ్రేక్ తీసుకోవాల్సి వస్తుండటం వంటివి కూడా మహిళ ఉద్యోగులకు సమస్యాత్మకంగా ఉంటున్నాయి. ► వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే మహిళలు వెళ్లలేరు, లాభనష్టాల పరిస్థితులను సరిగ్గా చక్కబెట్టగలిగే సామరŠాధ్యలు వారికి ఉండవు అనే మూస అభిప్రాయాలు కూడా వారి పురోగతికి అవరోధాలుగా ఉంటున్నాయి. ఇలాంటి అభిప్రాయాల వల్ల వారిని నేరుగా అడగకుండానే యాజమాన్యాలు మహిళా ఉద్యోగుల విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటోంది. ► అయితే, కంపెనీల్లో లింగ అసమానతలపై అవగాహన పెరుగుతోంది. రూ. 200 కోట్లు ఆర్జించిన ఎయిర్బీఎన్బీ మహిళా హోస్ట్లు ఆన్లైన్ హోస్టింగ్ ప్లాట్ఫాం ఎయిర్బీఎన్బీలోని మహిళా హోస్ట్లు (ఆతిథ్య సేవలు అందించేవారు) దేశీయంగా 2023లో రూ. 200 కోట్లు పైగా ఆర్జించారు. స్థానిక ఆర్థిక వ్యవస్థలు, కమ్యూనిటీల వృద్ధిపై మహిళలు చూపుతున్న సానుకూల ప్రభావాలకు ఇది నిదర్శనమని ఎయిర్బీఎన్బీ తెలిపింది. భారత్లోని తమ హోస్టింగ్ కమ్యూనిటీలో సుమారు 30 శాతం మంది మహిళలు ఉన్నారని ఎయిర్బీఎన్బీ ఇండియా జనరల్ మేనేజర్ అమన్ప్రీత్ బజాజ్ తెలిపారు. మహిళా పర్యాటకులకు, మహిళా హోస్ట్లకు సురక్షితమైన పరిస్థితులు కలి్పంచేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. మహిళా అతిథులు భారత్లో ఎక్కువగా గోవా, బెంగళూరు, ఢిల్లీ, పుణె, డెహ్రాడూన్, జైపూర్లను ఎంచుకుంటున్నారని వివరించారు. అంతర్జాతీయంగా లండన్, దుబాయ్, టొరంటో, ప్యారిస్ మొదలైనవి భారతీయ మహిళా పర్యాటకులకు ఫేవరెట్గా ఉంటున్నాయని బజాజ్ పేర్కొన్నారు. 2023 మహిళా రుణాల్లో భారీ పురోగతి మహిళా రుణాల విషయంలో 2023లో మంచి పురోగతి కనిపించింది. మహిళా రుణాలు పెరిగినట్లు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఒకటి పేర్కొంది. వ్యక్తిగత రుణాలు, ద్విచక్ర వాహన రుణాల పోర్ట్ఫోలియో అత్యంత వేగంగా 26 శాతం వృద్ధిని కనబరిచినట్లు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రిఫ్ హై మార్క్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం మహిళలకు సంబంధించి మొత్తం రుణ పోర్ట్ఫోలియో 2022 చివరి నాటికి రూ. 26 లక్షల కోట్ల నుండి 2023లో రూ. 30.95 లక్షల కోట్లకు ఎగసింది. వ్యాపారవేత్తలుగా మారేందుకు ఆసక్తి మహిళా ఉద్యోగస్థుల్లో అత్యధికుల అభిమతం ఇండియాలెండ్స్ సర్వేలో 76 శాతంమంది ఓటు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్పై అవగాహనకూ సై దేశీయంగా ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో అత్యధిక శాతంమంది వ్యాపారవేత్తలు(ఎంటర్ప్రెన్యూర్)గా మారేందుకు ఆసక్తిని ప్రదర్శించారు. సొంత బిజినెస్ ప్రారంభించాలనే ఆలోచనను కలిగి ఉన్నట్లు ఇండియాలెండ్స్ నిర్వహించిన సర్వే పేర్కొంది. 24–55 ఏళ్ల మధ్య వయసున్న 10,000 మంది వర్కింగ్ ఉమన్తో సర్వే చేపట్టినట్లు వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల గణాంకాలు అందించే ఆన్లైన్ మార్కెట్ప్లేస్ ఇండియాలెండ్స్ తెలియజేసింది. మెట్రో నగరాలతోపాటు టైర్–1, టైర్–2 పట్టణాలలో ఉద్యోగాలు చేసే మహిళలను సర్వేకు పరిగణించినట్లు వెల్లడించింది. వీరిలో 76 శాతం మంది సొంత బిజినెస్ను ప్రారంభించాలనే కోరికను వ్యక్తం చేసినట్లు పేర్కొంది. 86 శాతంమంది మహిళలు బడ్జెటింగ్, పెట్టుబడులు, పొదుపు తదితర విభిన్న ఆర్థిక ప్రొడక్టుల(ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్)పై అవగాహనను పెంపొందించుకోవాలనే పట్టుదలను ప్రదర్శించినట్లు వివరించింది. వ్యాపారవేత్తలు సైతం పలువురు మహిళా వ్యాపారవేత్తలను సైతం సర్వేకు పరిగణించినట్లు ఇండియాలెండ్స్ పేర్కొంది. వీరిలో 68 శాతం ఉమన్ ఎంటర్ప్రెన్యూర్స్ తమ కంపెనీ ఖాతాలను స్వతంత్రంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 32 శాతంమంది మాత్రమే ఇందుకు భర్తలు, కుటుంబ సభ్యులు, వృత్తి నిపుణులపై ఆధారపడుతున్నట్లు తెలియజేశారు. ఇక బిజినెస్ ఉమన్లో దాదాపు 69 శాతంమంది, వేతనాలు అందుకునే మహిళల్లో 51 శాతంమంది తమ సొమ్మును పెట్టుబడులకు మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. వీరిలో 79 శాతంమంది సొంతంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేశారు. కేవలం 21 శాతంమంది పెట్టుబడులకు సంబంధించి తమ భాగస్వాములు లేదా తల్లిదండ్రుల సహాయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇక 25 శాతంమంది మహిళలు విశ్వాసంలేక సొంత పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకపోగా.. మరో 29 శాతంమంది ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్పట్ల పరిమిత అవగాహన కారణంగా వెనకడుగు వేస్తున్నట్లు వెల్లడించారు. సర్వే వివరాలిలా సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 34 శాతంమంది మహిళలు 25–34 మధ్య వయసు కలిగినవారుకాగా.. సుమారు 26 శాతంమంది 35–44 మధ్యవయసు గలవారిగా ఇండియాలెండ్స్ తెలియజేసింది. 22 శాతంమంది 18–24 ఏజ్ గ్రూప్కాగా.. 45 ఏళ్లకుపైబడినవారు 19 శాతంగా వెల్లడించింది. ఈ మహిళల్లో 44.5 శాతంమంది ఉద్యోగస్థులు, సొంత ఉపాధిగలవారు 31 శాతంమంది, గృహిణులు 12 శాతంమంది, సీఏలు, అడ్వకేట్లు తదితర వ్యక్తిగత వృత్తి నిపుణులు 4.4 శాతంమందిగా తెలియజేసింది. -
అధిక రేటింగ్ కంపెనీ బోర్డుల్లో మహిళలు
న్యూఢిల్లీ: అధిక రేటింగ్ కలిగిన కంపెనీలు.. బోర్డు సభ్యులుగా మహిళలను ఎంపిక చేసుకుంటున్నట్లు రేటింగ్ దిగ్గజం మూడీస్ ఇన్వెస్టర్ సరీ్వస్ తాజాగా పేర్కొంది. తక్కువస్థాయి రేటింగ్ కలిగిన కంపెనీలతో పోలిస్తే వీటిలో బోర్డు సభ్యులుగా స్త్రీలకు అధికంగా చోటు కలి్పస్తున్నట్లు తెలియజేసింది. సంస్థ రేటింగ్ ఇచి్చన 3,138 కంపెనీలను విశ్లేషించినట్లు వెల్లడించింది. విశ్లేషణ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్(బీఏఏ, అంతకంటే అధిక రేటింగ్) కలిగిన కంపెనీల బోర్డు సీట్లలో సగటున 29 శాతం మంది మహిళలకు చోటు లభించింది. 2023తో పోలిస్తే 1 శాతం పెరిగినట్లు వెల్లడించింది. ఇక స్పెక్యులేటివ్ గ్రేడ్(బీఏ, అంతకంటే తక్కువ రేటింగ్) కంపెనీలలో సగటున 24 % బోర్డు సీట్లను మహిళలు పొందారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య యథాతథమే. అభివృద్ధిచెందిన ఆర్థిక వ్యవస్థల్లో బోర్డు సభ్యుల లింగభేదం, క్రెడిట్ రేటింగ్స్ మధ్య పరస్పర సంబంధమున్నప్పటికీ వర్ధమాన మార్కెట్లలో ఇది లేనట్లు మూడీస్ పేర్కొంది. విశ్లేషణకు పరిగణనలోకి తీసుకున్న కంపెనీలలో 24 ఏఏఏ, 146 ఏఏ, 728 ఏ, 1165 బీఏఏ, 582 బీఏ, 394 బీ, 90 సీఏఏ, 9 సీఏ రేటింగ్ కలిగినవి ఉన్నట్లు వెల్లడించింది. -
దేశాభివృద్ధిలో మహిళల శకం: ముర్ము
బెర్హంపూర్: దేశాభివృద్ధిలో మహిళల శకం మొదలైందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. జాతి నిర్మాణంలో నేడు బాలికలు అన్ని రంగాల్లో కీలకంగా మారారని, ఈ పరిణామం ఎంతో ప్రోత్సాహకరమైందని పేర్కొన్నారు. గంజాం జిల్లాలోని బెర్హంపూర్ యూనివర్సిటీ 25వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. సాహిత్యం, సంస్కృతి, సంగీతం వంటి రంగాల్లో మహిళ భాగస్వామ్యం ప్రశంసనీయమని తెలిపారు. ‘సైన్స్, టెక్నాలజీ మొదలుకొని పోలీసు, ఆర్మీ వరకు ప్రతి రంగంలోనూ మన కుమార్తెల సామర్థ్యం కనిపిస్తోంది. ఇప్పుడు మనం మహిళాభివృద్ధి దశ నుంచి మహిళల సారథ్యంలో అభివృద్ధి వైపు పయనిస్తున్నాం’అని రాష్ట్రపతి తెలిపారు. -
South Korea: మాతృత్వానికి దూరం.. దూరం!
ఆమె పేరు యెజిన్. టీవీ యాంకర్. ఓ సాయం వేళ స్నేహితురాళ్లతో సరదాగా గడుపుతుండగా మొబైల్లో ఓ పాపులర్ మీమ్ ప్రత్యక్షమైంది. ‘మాలా మీరూ అంతరించిపోకముందే జాగ్రత్త పడండి’ అని ఓ కార్టూన్ డైనోసార్ హితబోధ చేయడం దాని సారాంశం. దాంతో వారందరి మొహాల్లోనూ విషాద వీచికలు. 30 ఏళ్లు దాటుతున్నా వారెవరికీ ఇంకా పిల్లల్లేరు మరి! వారే కాదు, లో చాలామంది మాతృత్వానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నారు. అక్కడి సమాజంలోని సంక్లిష్టతే ఇందుకు ప్రధాన కారణం...! దక్షిణ కొరియా చాలా ముందుంది. దాంతో ఆడవాళ్లలో అత్యధికులు ఉద్యోగులే. ఇంటిపట్టున ఉండేవారు చాలా తక్కువ. అయితే అక్కడ ఏ రంగంలోనైనా పని ఒత్తిళ్లు విపరీతంగా ఉంటాయి. సుదీర్ఘ పనిగంటలు. పైగా తరచూ ఓవర్ టైమ్ చేయడం తప్పనిసరి. నిరాకరిస్తే ఆ ప్రభావం ప్రమోషన్లతో పాటు చాలారకాలుగా పడుతుంది. దాంతో విపరీతంగా అలసిపోయి ఇంటికొచ్చే భర్తలు పిల్లల బాధ్యతలను అస్సలు పంచుకోరు. పైగా వేతనాలతో పాటు చాలా అంశాల్లో మితిమీరిన. దీనికి తోడు దాల్ చేసేలా కంపెనీలు ఒత్తిడి చేయడం సర్వసాధారణం. దాంతో పిల్లల్ని కనే క్రమంలో కెరీర్ ఒకసారి వెనకబడితే తిరిగి కోలుకోవడం చాలా కష్టం. అదీగాక దక్షిణ కొరియాలో జీవన వ్యయం చాలా ఎక్కువ. ఒక్కరి సంపాదనతో ఇల్లు గడవడం కష్టం. ఇన్ని ప్రతికూలతల మధ్య పిల్లల్ని కని, సజావుగా పెంచేందుకు కావాల్సిన సమయం, ఓపిక, కుటుంబ మద్దతు మహిళలకు ఏ మాత్రమూ ఉండటం లేదు. పిల్లలు, కెరీర్లో ఏదో ఒక్కదాన్నే ఎంచుకోక తప్పని అనివార్య పరిస్థితి. అత్యధికులు రెండో ఆప్షన్కే ఓటేస్తున్నారు. అలా మొత్తంగా మాతృత్వానికే దూరమవుతున్నారు! అట్టడుగుకు జననాల రేటు ప్రపంచవ్యాప్తంగా సంపన్న దేశాలన్నింట్లోనూ చాలాకాలంగా జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. కానీ దక్షిణ కొరియాలో ఈ ధోరణి మరీ ప్రమాదకరంగా ఉంది. నిజానికి అతి తక్కువ జననాల రేటు విషయంలో 20 ఏళ్లుగా ఆ దేశానిదే ప్రపంచ రికార్డు! పైగా అది ఏటికేడు మరింతగా తగ్గుతూ వస్తోంది. తాజాగా బుధవారం విడుదలైన గణాంకాలైతే ప్రమాద ఘంటికలే మోగిస్తున్నాయి. 2023లో అక్కడ జననాల రేటు (ఒక మహిళ జీవిత కాలంలో కనే పిల్లల సంఖ్య) 8 శాతం తగ్గి కేవలం 0.73గా నమోదైంది. ఇదిలాగే కొనసాగితే 2100 నాటికి దేశ జనాభా సగానికి సగం తగ్గిపోనుంది. దాంతో ఈ పరిణామాన్ని జాతీయ ఎమర్జెన్సీగా ప్రభుత్వం ప్రకటించింది! ఫలించని ప్రోత్సాహకాలు... పిల్లల్ని కనేలా జనాలను ప్రోత్సహించేందుకు దక్షిణ కొరియాలో ప్రభుత్వాలు చేయని ప్రయత్నాల్లేవు. నగదు ప్రోత్సాహకం, ఇంటి కొనుగోలుపై సబ్సిడీ, పిల్లలను చూసుకునేందుకు ఉచితంగా ఆయా సదుపాయం వంటివెన్ని ప్రకటించినా లాభముండటం లేదు. మహిళలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలను పరిష్కరించనంత కాలం ఇటువంటి పథకాలు ఎన్ని తెచ్చినా ఒరిగేదేమీ ఉండబోదని సామాజికవేత్తలు అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
CG Case: కేంద్రానికి సుప్రీం కోర్టు అల్టిమేటం!
న్యూఢిల్లీ: కోస్ట్గార్డుకు చెందిన మహిళా అధికారులకు శాశ్వత కమిషన్లో చోటు కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. శాశ్వత కమిషన్లో చోటు కల్పించాలనే విషయంలో మహిళా అధికారుల అభ్యర్థనను వదిలిపెట్టలేమని మంగళవారం సుప్రీంకోర్టు పేర్కొంది. కోస్ట్గార్డుకు చెందిన మహిళా అధికారులకు శాశ్వత కమిషన్లో చోటు కల్పించాలని దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కేంద్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. కోస్ట్ గార్డుకు చెందిన మహిళా అధికారులకు సంబంధించిన శాశ్వత కమిషన్ను ఇప్పటికీ ఎందుకు ఏర్పాటు చేయటం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. మీకు(కేంద్ర ప్రభుత్వం) ఏర్పాటు చేయటం చేతకాకపోతే చెప్పండి.. మేం ఏర్పాటు చేస్తాం అని పేర్కొన్నారు. కావున త్వరగా శాశ్వత కమిషన్లో మహిళా కోస్ట్ గార్డు అధికారులకు చోటు కల్పించాలని చీఫ్ జస్టిస్.. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణీని ఆదేశించారు. ఈ విషయంలో అఫిడవిట్ దాఖలు చేయవల్సిందిగా కోస్ట్గార్డును కోరుతామని అటార్నీ జనరల్.. సుప్రీం కోర్టుకు తెలియజేశారు. అదేవిధంగా నేవి, ఆర్మీతో పోల్చితే కోస్ట్గార్డు భిన్నమైనదని అటర్నీ జనరల్ సుప్రీం కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ తదుపరి విచారణను సుప్రీం కోర్టు మార్చి 1కి వాయిదా వేసింది. ఇక.. ఇండియన్ కోస్ట్గార్డు అధికారి ప్రియాంక త్యాగి దాఖలు చేసిన పిటిషన్పై ఫిబ్రవరి 19 విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘కోస్ట్ గార్డు విషయంలో మహిళా అధికారుల పట్ల ఎందుకు తేడాలు చూపుతున్నారు. మహిళా అధికారులు కోస్ట్ గార్డులో ఎందుకు ఉండకూడదు?. దేశ సరిహద్దుల్లో మహిళలు ప్రహారా కాస్తున్నప్పుడు.. సముద్ర తీరం గస్తీ కాయటంలో తప్పేంటీ?. మీరే(కేంద్ర ప్రభుత్వం) నారీ శక్తి గురించి మాట్లాడుతున్నారు.. దాన్ని ఆచరణలో చూపించండి’ అని కేంద్రాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. -
సందేశ్ఖాలీలో పెల్లుబికిన నిరసనలు
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్, సోదరుడు సిరాజ్, వారి అనుచరులు తమపై లైంగిక దాడులకు పాల్పడి భూములను లాక్కున్నారంటూ పశి్చమబెంగాల్లోని సందేశ్ఖాలీలో కొద్దిరోజులుగా మహిళలు చేస్తున్న నిరసనలు మరింత ఎక్కువయ్యాయి. సందేశ్ఖాలీలోని ఝుప్ఖాలీ ప్రాంతంలోకి పోలీసులు రాకుండా ఆందోళనకారులు రోడ్లుపై దుంగలతో నిప్పుపెట్టారు. తృణమూల్ కాంగ్రెస్ నేతల ఆస్తులను తగలబెట్టారు. ఇన్నిరోజులైనా షాజహాన్, అతని అనుచరులను అరెస్ట్చేయకపోవడంపై పోలీసుల నిర్లిప్త వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. బెల్మాజూర్ దగ్గరి ఫిషింగ్యార్డ్ నిర్మాణాలను తగలబెట్టారు. పోగొట్టుకున్న భూములు, గౌరవాన్ని తిరిగి పొందేందుకు, పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ ఆందోళనలు చేపట్టామని స్థానికులు చెప్పారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. ఆందోళనలను అడ్డుకున్న పోలీసులు కొందరిని అరెస్ట్చేసి తీసుకెళ్లేందుకు ప్రయతి్నంచగా మహిళలు పోలీసు వాహనాలకు అడ్డంగా పడుకున్నారు. ‘షాజహాన్ను అరెస్ట్చేసే దమ్ములేని మీరు మా వాళ్లను ఎలా తీసుకెళ్తారు? మా మనుషుల అండలేకుండా మాకు రక్షణ ఎలా ఉంటుంది?’ అని ఒక మహిళ పోలీసులను నిలదీసింది. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. -
డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు
భద్రాచలం అర్బన్: డ్వాక్రా సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు అందించి సంఘాలు బలోపేతం అయ్యేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క భరోసా ఇచ్చారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఎంతోకాలంగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరలోనే విడుదల చేస్తామని ఆయన హామీనిచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో పలు సమస్యలతో సహజీవనం సాగిస్తున్న గిరిజనులకు అన్ని విధాలా లబ్ధి చేకూర్చేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. 19 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఆదివారం జరిగిన భద్రాచలం ఐటీడీఏ పాలకమండలి సమావేశంలో భట్టివిక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ హయాంలో ఐటీడీఏ పూర్తిగా నిర్వీర్యం అయిందని, దీనికి పూర్వ వైభవం తెచ్చేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. 2004 – 2014 సంవత్సరాల మధ్య ఐటీడీఏకు కేటాయించిన బడ్జెట్, చేసిన ఖర్చు వివరాల నివేదికను వచ్చే సమావేశం నాటికి అందజేయాలన్నారు. ఐటీడీఏ పరిధిలోని పలువురు విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారని, ఇందుకు గల కారణాలను విశ్లేషించి, వారు పాఠశాలలకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. యువతకు స్వయం ఉపాధి ద్వారా సాయం అందించే అంశాన్ని పరిశీలించాలన్నారు. పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులకు 2005లోనే నాటి వైఎస్సార్ ప్రభుత్వం మూడున్నర లక్షల ఎకరాలకు పట్టాలు పంపిణీ చేసిందని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. పక్క రాష్ట్రంలో గత సర్కారు ఇదే శాఖలో స్కామ్ చేసింది విద్యార్థులకు అందిస్తున్న సహకారంపై స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో మాట్లాడిన భట్టి.. పక్క రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇదే శాఖలో స్కామ్ చేసిందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 32 మండలాల పరిధిలో విస్తరించి ఉన్న ఐటీడీఏను విభజిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. భద్రాద్రి ఏజెన్సీ బాధ్యత తనదేనన్నారు. భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న రెండో బ్రిడ్జిని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. -
సీఎం వైఎస్ జగన్ పాలనలో మహిళలకు పెద్దపీట
-
భారత్లో మైక్రోసాఫ్ట్ సీడబ్ల్యూబీ ప్రోగ్రాం..
బెంగళూరు: మైక్రోసాఫ్ట్ తమ ‘కోడ్ వితౌట్ బ్యారియర్స్’ (సీడబ్ల్యూబీ) ప్రోగ్రాంను భారత్లోనూ ప్రవేశపెట్టింది. దీని కింద ఈ ఏడాది 75,000 మంది మహిళా డెవలపర్లకు శిక్షణ కలి్పంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ చీఫ్ సత్య నాదెళ్ల తెలిపారు. క్లౌడ్, కృత్రిమ మేధ, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో లింగ అసమానతలను తొలగించడంలో తోడ్పడే ఉద్దేశంతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని తొమ్మిది దేశాల్లో 2021లో ఈ ప్రోగ్రాంను ఆవిష్కరించినట్లు ఆయన చెప్పారు. దీని కింద మహిళా డెవలపర్లు, కోడర్స్కు శిక్షణ, నెట్వర్కింగ్ అవకాశాలు కల్పిస్తున్నట్లు సత్య నాదెళ్ల వివరించారు. మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు చెప్పారు. మరోవైపు శిక్షణ ఫౌండేషన్, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న శిక్షా కోపైలట్ ప్రోగ్రాం.. ప్రధానంగా ఉపాధ్యాయులకు సాధికారత కలి్పంచేందుకు ఉద్దేశించినదని సత్య నాదెళ్ల తెలిపారు. అజూర్ ఓపెన్ఏఐ మోడల్ తోడ్పాటుతో పాఠ్యాంశాలను విద్యార్థులు మరింత సులభంగా అర్థం చేసుకునేలా పాఠ్యప్రణాళికలను రూపొందించేందుకు శిక్షా కోపైలట్ ప్రోగ్రాం ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతం బెంగళూరులోని 30 గ్రామీణ, పట్టణ పాఠశాలల్లో ఉపయోగిస్తున్న ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు సత్య నాదెళ్ల వివరించారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement