breaking news
verse
-
మహా గుణపతి
విఘ్నేశ్వరుడు గణాలకే కాదు... గుణాలకూ అధిపతే! మన సంప్రదాయంలో ఓ దైవం గురించీ, ఓ పూజ గురించీ దేన్ని గురించైనా సరే తెలుసుకోదగ్గ ఎన్నో విశేషాలను తెలుసుకోగలుగుతున్నాం. అలా తెలుసుకోగలిగినంత సమాచారం మనకి అందేలా చేయాలని భావించిన నాటి రుషులు అంతంతటి సమాచారాన్ని చిన్న చిన్న శ్లోకాల్లో పెట్టి మనకి అందించి ఉంచడం మరింత గొప్పదనం నిజంగా. వీటిప్రాముఖ్యాన్నీ ప్రాశస్త్యాన్నీ గమనించిన వాళ్లు కాబట్టే నాటి వారంతా నేటికాలంలో లాగా ఏ విధమైన దృశ్య– శ్రవణ మాధ్యమాలు లేకున్నా అలా నిత్యం పఠిస్తూ పఠింపజేస్తూ కేవలం నోటి ద్వారా చెవి ద్వారా మనందరికీ వాటిని సంప్రదాయపు ఆస్తి సుమా అంటూ అందజేసి వెళ్లారు. వీటిని పరిరక్షించుకో(లేని) పక్షంలో నిజమైన కళ్లున్న గుడ్డివాళ్లం అనేది వాస్తవం. ఈ నేపథ్యంలో మన మహాగణపతి మనకి ఎలా ఉండాలో, ఏయే గుణాలు మనకి అవసరమో ఆవశ్యకమో అద్భుతంగా తెలియజేశాడు తనని పఠిస్తుండే శ్లోకంలో ఇమిడిపోయి. సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదర శ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః అష్టా వష్టౌ చ నామాని యః పఠే చ్ఛృణుయా దపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. వినాయకునిలో నుండి గ్రహించవలసిన గుణాలని చెప్పే నామాలు 8. వినాయకుని రూపాన్ని వర్ణిస్తూ ఆ రూపం ద్వారా ఆయన గుణ సౌందర్యాన్ని అర్థం చేసుకుంటూ కళ్లలో ఆయన రూపాన్ని నిలుపుకునేలా చేసే నామాలు 8. మొత్తం 16 నామాలు పై శ్లోకంలో ఉన్నాయి. ఈ విశేషాన్ని గుర్తించవలసినదిగా చెప్పేందుకే అష్టౌ అష్టౌ చ నామాని అని కనిపిస్తుంది శ్లోకంలో. రూపాన్ని వర్ణించదలచడం ప్రస్తుత వ్యాస శీర్షిక ప్రకారం అప్రస్తుతం కాబట్టి నేరుగా ఆయన గుణాలని గురించి వివరించుకుంటూ, ఇలాంటి గుణాలని మనం ఆయన నుండి నేర్చుకోవాలనే యథార్థాన్ని తెలుసుకుందాం! 1 సుముఖః సు– ముఖః అంటే ఎవరు ఏ కోరికను తన ముందుకొచ్చి చెప్పదలిచినా, మనసులో అనుకుంటున్నా ఆ అభిప్రాయాన్ని ఎంతో సుముఖునిగా ఉంటూ (వినాలనే ఆసక్తితోనూ, చెప్పేవానికి తప్పక తన పని తీరుతుందనే నమ్మకం కలిగేలాగానూ ఆ విషయాన్నంతటినీ వింటాడాయన. లోకంలో కొందరి దగ్గరకు పోయి ఏదైనా చెప్పుకోదలిస్తే, ఏదో పరాకుగా వింటూనో మధ్యమధ్యలో ఎవరినుండో వచ్చిన మాటల్ని వింటూనో ఆ మధ్య మధ్యలో ‘ఏం చెప్పా?’వంటూ అడుగుతూనో వినే మనుషులుంటారు. అలాంటి వాళ్లకి వినాయకుడు చెప్తాడు– వినదలిస్తే సుముఖునిగా ఉండి విను. లేదా తర్వాత వింటానని చెప్పు తప్ప వింటున్నట్టుగా వినకుండా ఉండటం సరికాదని. సు–ముఖః అనే పదంలో ముఖమనే మాటకి చక్కని నోరు కలవాడనేది కూడా అర్థం. అందుకే ముఖం కడిగావా? అనే వాక్యానికి దంతధావన చేశావా? అనేదే అర్థం. ‘నీ మొహం అంటాం. అంటే నోటితో చెప్పే ఆ మాటలెంత పేలవంగా ఉన్నాయో గుర్తించు!’ అని చెప్పడం దాని భావం. ఇలా ముఖమనే మాటకి నోరు అనేదే అర్థం. వినాయకుడు చక్కని నోరు కలవాడనేది దీనర్థం. నోటితో సంభాషిస్తాం కాబట్టి నొప్పించకుండా మాట్లాడేవాడనేది ఈయనకున్న మరో చక్కని గుణమన్నమాట. ఎందరిలోనో కొరవడేది ఇదే కదా!కాబట్టి ‘సుముఖ’ నామం ద్వారా ఎవరేది తనకి చెప్పుకోదలిచి ఏదైనా చెప్పదలిచి వచ్చినా – తల్లి తన బిడ్డ తన దగ్గరకొచ్చి ఏదో చెప్పదలిచి వస్తే – ఎలా వింటుందో అలా వినాలన్నమాట. రెండవది దానికి సమాధానాన్ని కూడా అతని కష్టం. తీరేలాగా చక్కని శైలిలో చక్కని స్వరంలో చెప్పాలన్నమాట. ఆయన నోటి నుండి అంతా విన్నాక ‘ఆ మాటొచ్చింది. చాలు’ అనుకున్నానని అంటుంటామే! అలా మాట్లాడుతాడన్నమాట గణపతి. ఆ గుణం మనకి రావాలని ఆయన చెబుతున్నట్లుగా ఆయన నామాన్ని బట్టి మనం గ్రహించాలి. 2 ఏక+దంతః గజ ముఖం కలిగిన ఆయనకి నిజంగా 2 దంతాలుండాలి. వ్యాసుడంతటివాడు భారత గ్రంథమంతనీ తన బుద్ధిలో నిలుపుకుని ‘నేను చెప్తూంటే రాయగల బుద్ధిమంతుడెవరా?’ అని బ్రహ్మ గురించి ప్రార్థిస్తే ఆయన గణపతి పేరుని చెప్పాడు. గణపతిని ప్రార్థిస్తే ఆయన – తప్పక రాస్తాను. అయితే నా రాత వేగానికి సరిపోయేలా నువ్వు కవిత్వాన్ని చెప్పా–లనే నియమాన్ని పెట్టాడు. (...భవేయం లేఖకోహ్యహమ్). దాన్ని విని వ్యాసుడు మరో నియమాన్ని పెడుతూ – ‘నేను చెప్పే ప్రతి అక్షరాన్నీ నువ్వు అర్థం చేసుకున్నాక మాత్రమే రాయాలి తప్ప ఏదో యథాలాపంగా రాయకూడ’దన్నాడు. (అబుద్ధ్వామా విఖ! క్పచిత్) వ్యాసుని నియమాన్ని వింటూనే మహాగ్రంథాన్ని రాయబోతే తప్ప తనంతటివానితో ఇలాంటి ఒప్పందాన్ని చేయనే చేయదలచడని భావించిన గణపతి ఆ రాయబోయే గ్రంథాన్ని తన చేతులతో బిగించడం కోసం తన దంతాన్నే పెరికి (పెకలించి) గంటంగా చేసి మరీ రాశాడు.దీన్ని గమనిస్తూ మనమూ అర్థం చేసుకోగలగాలి. మన శరీరంలోని ఏ అవయవమైనా అవతలివానికి సహాయపడేలా చేయాలని. దధీచి మహర్షి తన వెన్నెముకని రాక్షస వధ కోసం ఇంద్రునికి వజ్రాయుధంగా చేశాడంటేనూ, అలర్కుడనే మహారాజు తన కన్నుల్ని దానం చేశాడంటేనూ... ఇలాంటివన్నీ దీనికుదాహరణలే. మరి మన స్థాయిలో మనం చేదోడు వాదోడు (పనిలో సహాయపడటం – మాట సహాయం చేయడం)గా ఉండగలిగితే చాలు. నిందని ఎదుటివాళ్ల మీద నెట్టేలా సముఖంలో మాట్లాడటం, చాటున చాడీలు చెప్పడం వంటివి మానేస్తే చాలు. ఒక్కొక్కరికి ఓ వింత వ్యాధి ఉంటూంటుంది. ఈ రోజు ఆకాశానికెత్తెయ్యడం, రేపటి రోజున పాతాళంలోకి పడేస్తూ పదిమంది మధ్య అవమానించడం. ఇదుగో ఇలాంటివన్నీ మానాలని చెప్పడం దీని భావం. శరీరావయవాలన్నీ ఎదుటివారికి తోడ్పడేలా చేయగలగాలి. 3 కపిలః రెండు రంగులు కలిసిన తనాన్ని ‘కపిల’మంటారు. ఇటు శివ లక్షణమూ అటు విష్ణు విధానమూ కలిగినవాడు కాబట్టి కపిలుడు (శుక్లాం బరధరం విష్ణుమ్... కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా!) దీన్ని మనకి అన్వయించుకుంటే ఎవరైనా నేరాన్ని చేస్తే ‘వాడు మనవాడా? మనకి ఉపయోగపడేవాడా?’ అని ఈ తీరుగా లెక్కించి తప్పుచేసినా రక్షించదలిచే (రావణుడికి కుంభకర్ణునిలా) చేయరాదనీ శిక్షించే తీరాలని చెప్తుంది ఒక పద్ధతి. అదే తీరుగా ధర్మబద్ధంగా పనిచేస్తూ ఉండేవాణ్ని మెచ్చుకోవడమే కాక వానికి కొంత వెసులుబాటుని కల్పించాలని కూడా దీని భావంగా అర్థం చేసుకోవాలి! 4 గజకర్ణికః ఏనుగు చెవులే తనకి చెవులుగా కలవాడనేది పై అర్థం. ఏనుగుకున్న లక్షణాల్లో రెండు ఆశ్చర్యాన్ని కలగజేస్తాయి. అంత ఎత్తున్న ఏనుగుకున్న ఆ చిన్న కళ్లు నేలమీద పడ్డ సూదిని కూడా గుర్తించగలవు.అలాగే ఆ చెవులు దూరంగా పాము బుసకొడుతూంటే వినగలిగినంతటి శక్తిమంతమైనవి. చెవుల వరకే దీన్ని మనకి అన్వయించుకుంటే ఎవరు మన ప్రవర్తన గురించి తేడాగా అనుకుంటున్నారో గమనించుకుంటూ ఉండాలి. లోకం నుండి అపవాదు వస్తుందేమో అనే భయంతో మన ప్రవర్తన ఉండాలి తప్ప ‘ఎవ్వరేమనుకున్న నాకేమి సిగ్గు?’ అన్నట్టుగా ఉంటే పశువుకీ వీనికీ భేదం లేనట్టే. ఇక ఏనుగు తన చెవుల్ని నిరంతరం ఆడిస్తూనే ఉంటుంది. ఇదే తీరుగా అధికారికి ఎందరెందరో ఇచ్చకాలు పలుకుతూ పొగిడేస్తూ దగ్గరైపోతుంటారు. మరోపక్క గిట్టనివారి మీద చెప్పేస్తూ వ్యతిరేకతని నూరిపోస్తూ ఉంటారు. అంటే వేటిని వినాలో వేటిని వినకూడదో గమనించుకోవాలి తప్ప చెవికి చేరిన అన్నిటినీ నమ్మడం సరికాదని. 5 లంబోదరః పెద్ద బొజ్జ ఉన్నవాడనేది దీనిపై అర్థం. ‘లంబ’మనే మాటకి వేలాడుతున్న (లంబమానః) అనేది సరైన అర్థం. బొజ్జ మరింతగా అయినప్పుడు కిందికి వేలాడుతూ ఉంటుంది.‘నా కడుపులో ఎన్నో రహస్యాలని దాచుకున్నా’నంటుంది తల్లి. అలా రహస్యాలెందరు తనకొచ్చి చెప్పినా వాటికి తన పైత్యాన్ని కూడా జోడించి ప్రచారం చేయడం కాకుండా ‘కడుపులో దాచుకోగలగడ’మనే గొప్ప లక్షణాన్ని అలవర్చుకోవాలనేది గణపతి మనకి చెప్తున్నాడన్నమాట! 6 వికటః కటమంటే చెక్కిలి. ఏనుగు రూపం అయిన కారణంగా ఏటవాలుగా అయి దృఢంగా అయిన చెక్కిలి కలవాడనేది దీనర్థం. దీన్ని మనకి అన్వయించుకుంటే చెక్కిలి (కటం) అనేదే వ్యక్తి చెప్పదలిచిన అభిప్రాయాన్ని చెప్పించగల ముఖ్య అవయవం ముఖంలో. అందుకే ఆంజనేయుడికి ‘హనుమాన్’ చక్కని హనువులు కలవాడనే పేరు. ఏ పదం తర్వాత ఏ పదాన్ని పలకాలో, ఎంతగా ఊది ఏ పదాన్ని పలకాలో దేన్ని తేల్చి పలకాలో, ఏ మాటని ముందు చెప్పి తర్వాత దేన్ని పలకాలో ఆ విశేషాన్ని వివరించేది ఈ నామం. మనం కూడా స్పష్టంగా అవగాహనతో నిదానించి మాట్లాడాలనే గుణాన్ని గ్రహించాలన్నమాట. 7 విఘ్నరాజః ప్రారంభించబడ్డ పని – ఇక ఎప్పటికీ ముడిపడనే పడ–దన్న రీతిలో వచ్చిన అభ్యంతరాన్ని విఘ్నమంది శాస్త్రం. (ప్రారబ్ధం కర్మ విశేషేణ ఘ్నంతీతి విఘ్నః) అలాంటి విఘ్నాలకి రాజు ఆయన అని అర్థం.రాజుకి చతురంగ బలాలు (పదాద్రి–అశ్వ–గజ–రథ) ఉన్నట్లే విఘ్నాలని తొలగించేందుకై నాలుగు విధాలుగా ప్రయత్నించడం నలుగురి సహాయాన్ని అర్ధించడం నాలుగు చోట్లకి వెళ్లి విచారించి ఆ విఘ్నాన్ని తొలగించుకోవాలి తప్ప విఘ్నం వచ్చిందనుకుంటూ దుఃఖిస్తూ ఉండిపోవడం సరికానిదని గణపతి చెప్తున్నాడన్నమాట! 8 గణాధిపః యక్ష కింనర కింపురుష గంధర్వ విహంగ నాగ రాక్షస దేవ... మొదలైన అన్ని గణాలకీ అధిపతి అనేది దీనర్థం.లోకంలో ఏ ఒక్కరూ శత్రువంటూ లేనివాళ్లుండరు. కాబట్టి ఏక–గ్రీవంగా (ముక్తకంఠంతో) ఎన్నుకోవడమనేది అసాధ్యమైన అంశం. అయితే వినాయకుడు మాత్రం సర్వగణాధిపతి కాగలిగాడంటే దాని ద్వారా ‘అందరూ మెచ్చుకునే తీరులో తన ప్రవర్తనని ఎప్పటికప్పుడు దిద్దుకుంటూ నడుచుకోవాలనే గుణాన్ని మనం గ్రహించుకోవాలన్నమాట.మరో విశేషమేమంటే పైన కనిపిస్తున్న అన్ని గుణాలవీ ఒకే తీరు లక్షణం కలవి కావు. ఎవరి తీరు వారిది అయితే అలాంటి భిన్న భిన్న లక్షణాలున్న అందరినీ ఒకే తీరుగా అంగీకరించేలా చేసి ఆధిపత్యాన్ని సాధించగలిగాడంటే ఆ తీరుగా అధికారి ఉండాల్సిందేనని చెప్తున్నాడన్నమాట గణపతి.తనకి తగిన శక్తి లేకపోయినా తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేస్తూ నారాయణాష్టాక్షరీ మంత్ర మననం చేస్తూ విజయాన్ని సాధించగలిగాడు కాబట్టీ, గణాధిపుడు ఆ కారణంగానే కాగలిగాడు కాబట్టీ అధికారికి ఉండాల్సింది దైవ విశ్వాసమూ తన తల్లిదండ్రుల మీద గౌరవమున్నూ – అని గణపతి తెలియజేస్తున్నాడన్నమాట! ఇలాంటి 8 గుణాలలో సంవత్సరానికొకటి చొప్పున అయినా పొందగలిగే ప్రయత్నాన్ని ప్రారంభిస్తే వ్యక్తిలో మార్పు సంభవం అవుతుంది. లేని పక్షంలో పూజావస్తువులు కొన్న మూల్యం, పూజ చేసిన కాలం దండగ అవుతాయి. కాలక్షేప పూజే అవుతుంది!ఈ 8 గుణాలనీ అర్థం చేసుకున్నాక ఈ మొత్తం మీద మనకి అర్థమయ్యే మరో గుణం – దాన్ని 9వ గుణం అనుకోవచ్చు – గురించి అనుకుందాంగణాధిపత్యాన్ని పొందడానికి – ఎవరు అన్ని నదీ నద సముద్ర జలాల్లో స్నానం చేసి వస్తే వాళ్లు అర్హు–లనేది విషయం. ఈ మాటని వింటూనే సన్న శరీరం వాడూ, నెమలి వాహనం వాడూ అయిన కుమారస్వామి వాయు వేగంతో ఆకాశంలోకి దూసుకుపోతూంటే వినాయకుడు అసూయపడలేదు. తమ్మునికి పరాజయం లభించేలా శపించవలసిందనో అనుకూలత లేకుండా చేయవలసిందనో ప్రార్థించలేదు – లేదా – తనకి తానే ఓ మంత్రాన్ని మననం చేయడం చేయలేదు.మనకి అసాధ్యమైన పనిని మరొకరు చేస్తూంటే దాన్ని చెడగొట్టించుదాం – చెడగొడదామనే ఆలోచన లేకపోవడాన్ని నేర్చుకోవాలి గణపతి నుండి. తనకి ఆ పదవి ఎలాగైనా లభించేలా ఏ అకృత్యాన్నో చేయవలసిందని అనలేదు – తల్లిదండ్రుల్ని తూలనాడలేదు. గమనించుకోవాలి. లోకంలో ఎందరో చేసే సర్వసాధారణమైన పని ఇదే.వినాయకుడు చేసింది – తన అçశక్తతని అంగీకరిస్తూ తల్లిదండ్రుల దగ్గరికి మౌనంగా వెళ్లి కన్నీరు పెట్టడం. అంటే ఏమన్నమాట? గుండె నిండు దుఃఖానికి మన అశక్తత గాని కారణమయ్యుంటే, ఆ బాధ నుండి తాము బయటపడాలంటే శత్రువుని ఓడించడం, ఓడించే ప్రయత్నాలని ఇతరుల ద్వారా చేయించడం, తనవాళ్లని నిందించడం కాదు – కనిపించే దైవాల్లా ఉండే తల్లిదండ్రుల్ని ఆరాధించడమే అని చెప్తున్నాడన్నమాట! ఎంత గొప్ప ఉపాయం ఇది! ఎవరైనా తమ తల్లిదండ్రులకి గౌరవాన్నిస్తూ చూసుకుంటూ ఉంటే – వీళ్లెవరో తనలాగా తల్లిదండ్రుల పట్ల గౌరవం కలవాళ్లనే అభిప్రాయంతో విజయాన్నిస్తాడన్నమాట! ఎంత గొప్ప గుణం అది!! – డా. మైలవరపు శ్రీనివాసరావు పౌరాణిక ప్రవచకులు -
పద్య నాటకం.. పౌరాణిక పరిమళం
- అలరించిన నంది నాటకోత్సవాలు కర్నూలు(కల్చరల్): నంది నాటకోత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక టీజీవి కళాక్షేత్రంలో ప్రదర్శించిన పౌరాణిక నాటకాలు పురాణ గాథలకు అద్దం పట్టాయి. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ జనతా సేవా సమితి ఆధ్వర్యంలో ‘అన్నమాచార్య’ నాటకం ప్రదర్శించారు. నందవర వైదిక బ్రాహ్మణ వంశంలో జన్మించిన అన్నమాచార్యులు వెంకటేశ్వరస్వామి భక్తుడిగా మారడం.. ఆయనపై వేలాది కీర్తనలు పాడడం.. శ్రీవారి సన్నిధికి చేరుకునేందుకు అనేక అష్టకష్టాలు ఎదుర్కోవడం.. కాళ్వ నరసింహరాయుడు అనే రాజు అన్నమయ్యను ఆస్థాన గాయకుడుగా నియమించడం..తదితర ఘట్టాలు ప్రేక్షకులను అలరింపజేశాయి. అన్నమయ్య..వెంకటేశ్వరస్వామిని చేరి ఆయనలో ఐక్యవడంతో నాటకం ముగుస్తుది. వరకవుల నరహరి రాజు.. రచన, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపిన సతీసావిత్రి... అనంతపురం లలిత కళాపరిషత్ నాటక సమాజం వారు ప్రదర్శించిన సతీసావిత్రి పద్యనాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. భర్త ప్రాణాలను కాపాడుకోవడంలో సతీసావిత్రి చూపిన చొరవ, అంకితభావాన్ని ఈ నాటకంలో చక్కగా ప్రదర్శించారు. రాజకుమారి అయిన సావిత్రి సత్యవంతుణ్ణి ప్రేమించి వివాహమాడాలని నిశ్చయించుకుంటుంది. అయితే సత్యవంతుడికి వివాహ అనంతరం ప్రాణగండముందని నారదుడు తెలియజేస్తాడు. అయినా సత్యవంతుడినే వివాహమాడతానని సావిత్రి భీష్మించుకుంటుంది. తన ప్రేమను నిరూపించుకున్న సావిత్రికి ఆమె తల్లిదండ్రులు సత్యవంతుడికిచ్చి వివాహం చేస్తారు. వివాహం తర్వాత సావిత్రి, సత్యవంతుడు అడవికి వెళ్లి కట్టెలు కొడుతుంటారు. కట్టెలు కొడుతూ కింద పడిపోయిన సత్యవంతుని ప్రాణాలను యమధర్మరాజు తీసుకెళ్తుంటాడు. తన భర్త ప్రాణాలను తిరిగి ఇవ్వమని వెంటపడిన సావిత్రి వాగులు, వంకలు, అరణ్యాలు దాటి ఇహలోకాన్ని చేరుతుంది. సావిత్రి పాతివ్రత్యాన్ని గ్రహించిన యముడు సత్యవంతుని ప్రాణాలు తిరిగి ఇచ్చేస్తాడు. భార్యాభర్తల మధ్య అమితమైన అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచిన సావిత్రి కథను ఈ నాటకం అత్యంత హృద్యంగా చిత్రించింది. ఆకట్టుకున్న కృష్ణా నదీ చరిత్ర... తిరుపతి వెంకటపద్మావతి నాట్యమండలి వారు ప్రదర్శించిన కృష్ణానదీ చరిత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. భూలోకంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆకాశవాణి.. ఇంద్రుని వద్దకు వెళ్లి ప్రజల కష్టాలను తీర్చమని వేడుకుంటుంది. ఇంద్రుడు విష్ణుమూర్తిని వేడుకుని కృష్ణవేణిని ఉద్భవింపజేస్తాడు. విష్ణుమూర్తి కృష్ణవేణిని నదీ ప్రవాహినిగా ప్రవహింపజేస్తూ ఆమెకు తగిన ప్రదేశాన్ని చూపించమని బ్రహ్మను కోరతాడు. సహ్యముని తపస్సు చేసి పర్వత ప్రాంతమే కృష్ణవేణికి తగిన ప్రాంతమని సూచిస్తాడు. విష్ణుమూర్తి.. కృష్ణవేణిని పర్వత ప్రాంతానికి పంపించగా సహ్యముని రావి చెట్టుగా మారి కృష్ణవేణిని నదిగా ప్రవహింపజేస్తాడు. వి.ఎస్.భరద్వాజ్ రచన, దర్శకత్వ బాధ్యతలు వహించిన ఈ పద్య నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్నేహభావానికి ప్రతిబింబంగా నిలిచిన కుచేలోపాఖ్యానం... కళామయి సాంస్కృతిక సంస్థ(రంగారెడ్డి జిల్లా) కళాకారులు ప్రదర్శించిన కుచేలో పాఖ్యానం పద్యనాటకం కృష్ణ, కుచేలుర స్నేహబంధానికి ప్రతీకగా నిలిచింది. సాందీపుడు అనే గురువు వద్ద ఆశ్రమ పాఠశాలలో సుధాముడు, శ్రీకృష్ణుడు విద్యను అభ్యసిస్తారు. విద్యను అభ్యసించే క్రమంలో వారిద్దరి మధ్య తరగని స్నేహం ఏర్పడుతుంది. పేద బ్రాహ్మణుడు. తొడుక్కోవడానికి సరిౖయెన దుస్తులు కూడా లేని దుస్థితిలో ఉన్న సుధాముడిని అందరూ కుచేలుడు అని అవహేళన చేస్తుంటారు. అదే అతని పేరుగా ప్రాచుర్యంలోకి వస్తుంది. విద్యాభ్యాసం అనంతరం కృష్ణుడు ద్వారకకు వెళ్లిపోగా కుచేలుడు పౌరహిత్యం చేసుకుంటూ జీవిస్తుంటాడు. వివాహ అనంతరం చాలీచాలని జీతం చూసిన అతని భార్య కృష్ణుని వద్దకు వెళ్లిరమ్మని సలహా ఇస్తుంది. కృష్ణుడిని వెతుక్కుంటూ అరణ్యాలకు వెళ్లిన కుచేలుడిని చూసిన కృష్ణుడు గరుత్మంతుడితో ద్వారకకు తరలిస్తాడు. ద్వారకలో ద్వారపాలకులు కుచేలుడిని అడ్డగిస్తారు. అయితే కృష్ణుడు ప్రత్యక్షంగా కుచేలుడిని చూసి లోపలికి తీసుకెళ్లి సింహాసనంపై కూర్చుండబెట్టి కుచేలుడు తెచ్చిన అటుకులను ఆరగిస్తాడు. కుచేలునికి తగిన సత్కారము చేస్తాడు. నిజమైన స్నేహానికి పేద, ధనిక అనే భేదభావములు ఉండవు అని తెలియజెప్పిన భారత గాథను ఈ నాటకం చక్కగా వివరించింది. ఈ నాటకానికి రచన, దర్శకత్వం బాధ్యతలను అమరలింగ శర్మ నిర్వహించారు. నేటి నాటక ప్రదర్శనలు... ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మార్కండేయ విజయం పద్యనాటకం, సాయంత్రం 4 గంటలకు స్వామి అయ్యప్ప పద్యనాటకం, సాయంత్రం 7 మైరావన పద్యనాటక ప్రదర్శనలు ఉంటాయని లలిత కళాసమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య ఒక ప్రకటనలో తెలిపారు. -
పొడుపు పద్యాలు
తెలుగు పద్యాల్లో టంగ్ ట్విస్టర్లే కాదు, చమత్కారభరితమైన పొడుపు కథలూ ఉన్నాయి. బుర్రకు పదును పెట్టే చమత్కారానికి మచ్చుగా కొన్ని పద్యాలు... ఇంటికిని వింటికిని ప్రాణమేది చెపుమ కంట మింటను మనమేమి కాంచగలము? నవ్వు పువ్వు దేనిని గూడి పొలుపుగాంచు ఒకటె రెండేసి ప్రశ్నల కుత్తరంబు ♦ ఇంటికి ప్రాణం ఏది? వింటికి ప్రాణం ఏది? అనే రెండు ప్రశ్నలు ఉన్నాయి మొదటి పాదంలో. రెండింటికీ ఒకటే సమాధానం- నారి. ఇంటికి ప్రాణం ఇల్లాలు (నారి), విల్లుకు ఆధారం అల్లెతాడు (నారి). ♦ కంటిలో దేనిని చూస్తాం? మింటిలో (ఆకాశంలో) దేనిని చూస్తాం? అనే రెండు ప్రశ్నలు రెండో పాదంలో ఉన్నాయి. ఈ రెండింటికీ ఒకటే సమాధానం-తారలు. తారలు అంటే నక్షత్రాలనే అర్థంతో పాటు కనుపాపలనే అర్థం కూడా ఉంది. ♦ నవ్వు దేనితో కలిసి మనోహరంగా ఉంటుంది? పువ్వు దేనితో కలిసి మనోహరంగా ఉంటుంది? అనే రెండు ప్రశ్నలు మూడో పాదంలో ఉన్నాయి. సమాధానం ఒక్కటే-వలపు. వలపు పండినప్పుడే నవ్వులూ పువ్వులూ రాణిస్తాయని కవిహృదయం. ఒడల నిండ కన్నులుండు నింద్రుడు కాడు కంఠమందు నలుపు! కాడు శివుడు! ఫణుల బట్టి చంపు పక్షీంద్రుడా? కాదు దీని భావమేమి తెలిసికొనుడు ఒళ్లంతా కళ్లుంటాయి గాని ఇంద్రుడు కాడట. మెడ నల్లగా ఉంటుంది గాని శివుడు కాడట. పాములను పట్టి చంపగలిగినా గరుత్మంతుడు కూడా కాడట. ఇదీ పొడుపు కథ. దీనికి సమాధానం ఏమిటంటారా? నెమలి. కరయుగంబు గలదు చరణంబులా లేవు కడుపు, నడుము, వీపు, మెడయు గలవు శిరము లేదు గాని నరుల బట్టుక మ్రింగి సొగసు గూర్చు దీని సొగసు గనుడి చేతులు ఉన్నాయి కాని కాళ్లు లేవు. కడుపు, నడుము, వీపు, మెడ ఉన్నాయి. తల లేదు. ఇలాంటిది ఏకంగా మనిషిని మింగేసి, సొగసునిస్తుందట? ఇదేమిటంటారా? చొక్కా. వండగ నెండిన దొక్కటి వండక మరి పచ్చిదొకటి వడికాలినదిన్ తిండికి రుచియై యుండును ఖండితముగ దీని దెల్పు కవియుం గలడే! వంటలో ఉడికించగా ఎండినది (కాచు), వండకుండా పచ్చిగా ఉన్నది (తమలపాకు), బాగా కాలినది (సున్నం). ఈ మూడు కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అదేమిటో అర్థమైంది కదా! ఆకు, వక్క, సున్నం, కాచు కలిపి చుట్టిన కిళ్లీ తింటే రుచిగా ఉండదూ మరి! -
ఐబీఎం కొత్త మెయిల్ సర్వీస్
న్యూఢిల్లీ: ఐబీఎం సంస్థ వ్యాపార సంస్థల కోసం వెర్స్ పేరుతో కొత్త ఈ మెయిల్ సర్వీస్ను ఆవిష్కరించింది. ఫైల్స్ షేరింగ్, ఎనలిటిక్స్, సోషల్ మీడియాలను సమ్మిళితం చేస్తూ సంస్థల ఉత్పాదకతను మెరుగుపరచడానికి తోడ్పడే నిమిత్తం ఈ కొత్త యాప్ను అందిస్తున్నామని ఐబీఎం పేర్కొంది. ఈ ఆప్తో కంపెనీ ఉద్యోగులు ఈ మెయిల్స్, కేలండర్స్, ఫైల్ షేరింగ్, ఇన్స్టంట్ మెసేజింగ్, సోషల్ అప్డేట్స్, వీడియో చాట్స్.... ఇవన్నీ ఒకే ప్లాట్ఫామ్పై యాక్సెస్ చేసుకోవచ్చని వివరించింది. ఈ మెయిల్స్లో కావలసిన కంటెంట్ ఉన్న మెయిల్స్ను సరిగ్గా సెర్చ్ చేసే ఫేసెటెడ్ సెర్చ్ ప్రత్యేకత ఈ వెర్స్ ఈమెయిల్ సర్వీస్కు ఉందని పేర్కొంది. ప్రస్తుతం బీటా వెర్షన్ను అందిస్తున్నామని, వచ్చే ఏడాది మార్చికల్లా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ అవుట్లుక్, గూగుల్ ఇన్బాక్స్ ఈ మెయిల్ సర్వీసులకు ఇది గట్టిపోటీనివ్వగలదని నిపుణులంటున్నారు. రోజుకు 10,800 కోట్ల ఈ మెయిల్స్ను ఉద్యోగులు పంపుతున్నారని, దీంతో ఉద్యోగులు గంటకు 36 సార్లు తమ ఈ మెయిల్స్ను చెక్ చేస్తున్నారని అంచనా. అయితే వీటిల్లో 14 శాతం ఈ మెయిల్స్ మాత్రమే ముఖ్యమైనవి కావడం విశేషం.