breaking news
Para cyclist
-
దృఢ సంకల్పానికి కేరాఫ్ అడ్రస్ ఈ పారాసైక్లిస్ట్..!
ధృఢ సంకల్పం ఎంతటి వైకల్యాన్ని అయినా అధిగమించి లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తుంది. అందుకు ఎన్నో ఉదంతాలు ఉదాహరణగా నిలిచాయి. తాజాగా ఈ పారాసైక్లిస్ట్ కూడా ఆ కోవలోకి చేరిపోయారు. ఆయన తన రాష్ట్ర అభ్యున్నతి కోసం అనితరసాధ్యమైన యాత్ర చేపట్టారు. ఆ జర్నీ అతడి శారీరక స్థితి రీత్యా అత్యంత సవాలుతో కూడినది. అయినప్పటికీ అన్ని కష్టాలను ఓర్చుకుంటూ లక్ష్యాన్ని చేధించి దృఢ సంకల్పానికి మారుపేరుగా నిలిచారాయన. ఆయనే పారాసైక్లిస్ట్ రాకేష్ బానిక్. అతను తన శారీరక అసమానతలు, కఠినమైన వాతావరణ పరిస్థితులను పలు అవాంతరాలు అధిగమించి మరి ఏకంగా ఏడు వేల కిలోమీటర్లు చుట్టొచ్చారు. అదంతా ఎలా సాధ్యమైందో ఆయన మాటల్లోనే విందామా..!.అస్సాంకి చెందిన ఆయన ఇది వ్యక్తిగత విజయం కాదని తన రాష్ట్రాన్ని, భారతదేశాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టడానికి చేసిన చిన్న ప్రయత్నమని అన్నారు. తాను ఈ యాత్రను అస్సాం పర్యాటక మంత్రిత్వ శాఖ విదేశాంగ మంత్రిత్వ శాఖ మద్దతుతో ఏప్రిల్ 29న మాస్కోలోని భారత రాయబార కార్యాలయం నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. దాదాపు మూడు నెలల పాటు, రష్యా, కజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ గుండా సైకిల్ తొక్కుతూ దాదాపు 6 వేల కిలోమీటర్లు ప్రయాణించారు. ఒంటికాలితో తొక్కుతూ ఈ యాత్రను విజయవంతంగా పూర్తి చేయడం విశేషం. తాను ఈ నాలుగు దేశాలలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లోని విద్యార్థులతో సంభాషించారట. వారికి భారతీయ సంస్కృతి, వారసత్వం, ఆతిథ్యం గురించి పరిచయం చేశారట. ఎదురైన ఇబ్బందులు..విదేశీ భూభాగంలో కృత్రిమ కాలుతో సైక్లింగ్ చేయడం చాలా కష్టమైన పని. ప్రతికూల వాతావరణంలో చేస్తున్న కఠినమైన ప్రయాణంలా ఉందని అన్నారు. రష్యాలో మైనస్లలో ఉష్ణోగ్రతలు పడిపోతుంటే..ఉజ్బెకిస్తాన్లో ఏకంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతని ఎదుర్కొంటూ సైక్లింగ్ చేయాల్సి వచ్చిందని అన్నారు. ఆ విధమైన వాతావరణ మార్పులకు తట్టుకుంటూ ప్రయాణించడం అత ఈజీ కాదని అన్నారు. పైగా సరైన ఫుడ్ దొరకక పడ్డ ఇబ్బందులు అంత ఇంత కాదని కూడా అన్నారు. ఈ పరిస్థితులన్నింటికి తోడు చైనా వీసా తిరస్కరణ ఎంతగానో బాధించిందన్నారు. దాంతో నేపాల్ గుండా వెళ్లేలా జర్నీని ప్లాన్ చేసుకున్నట్లు తెలిపారు. పర్యాటక ప్రమోషన్ లక్ష్యంగా చేస్తున్న ఈ యాత్ర చైనా ప్రభుత్వానికి నచ్చకపోవడంతోనే టిబెట్లోకి అడుగుపెట్టనివ్వలేదని బానిక్ తెలిపారు. ఇక అఫ్ఘనిస్తాన్ గుండా సైక్లింగ్ చేస్తూ వెళ్లడం అన్నది అత్యంత సవాలుతో కూడినది. తాలిబాన్ నుంచి నేరుగా రాలేకపోయినా..అక్కడకు ఒక అద్దె కారులో 150 కిలోమీటర్లు ప్రయాణించి తాలిబాన్ చెక్పోస్ట్లు దాటి కాబూల్కి వెళ్లినట్లు తెలిపారు. కాబూల్లోని భారత రాయబార కార్యాలయం తన ప్రతి కదలికను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసినట్లు వివరించారు. అక్కడ ఏకంగా ఏడెంచల కట్టుదిట్టమైన భద్రత ఏదోలా అనిపించిందన్నారు. అయితే అక్కడ తాలిబాన్ల నుంచి తనకు ఎలాంటి ముప్పు వాటిల్లకపోయినా..హై సెక్యూరిటీ నడుమ బానిక్ని త్వరగా పంపిచేయాలన కాబోల్లోని భారత రాయబార కార్యాలయం భావంచిందట. అదీగాక ఆయన ఆహార్యం కూడా ఈజీగా విదేశీయుడని గుర్తించేలా ఉండటంతో, హోటల్ నుంచి బయటకు వెళ్లేలా కాబూల్ భారత రాయబార కార్యాలయం ప్లాన్ చేసినట్లు వివరించారు. చివరికి భారత రాయబార కార్యాలయం సురక్షితమైన వాహనంలో విమానాశ్రయానికి చేర్చిందని తెలిపారు. తాను ఇక అక్కడి నుంచి నేపాల్కి పయనమైనట్లు తెలిపారు. ఓ పెనువిషాదంలో..2012లో అస్సాంలోని కాలిబోర్ సమీపంలో జరిగిన ఒక విపత్కర ప్రమాదంలో రాకేష్ బానిక్ తన కాలును కోల్పోయాడు. దాంతో రెండేళ్లు మంచానికే పరిమితమయ్యాడు. అయితే 2014లో కృత్రిమ కాలుని పొంది.. ఆ వైకల్యాన్ని తన బలంగా మార్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అలా పారాసైక్లిస్ట్గా మారి ఖార్దుంగ్ లా పాస్ (17,582 అడుగులు) ఎత్తు నుంచి బ్యాంకాక్, గౌహతి మధ్య తేమతో కూడిన మైదానాల వరకు విభిన్న యాత్రలు చేశారు. పైగా సుమారు 21 వేల కిలోమీటర్లు సైకిల్పైనే చుట్టొచ్చారు.(చదవండి: ఎవరీ సంధ్యారాణి మాఝి..? ఏకంగా ప్రభుత్వ వాహన మహిళా డ్రైవర్గా..) -
క్రీడలకు మరింతగా ప్రాధాన్యత ఇస్తాం: సీఎం జగన్
-
ఒంటికాలిపై.. 43 రోజుల్లో 3,800 కి.మీ.
భోపాల్ : అవయవాలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ ఒక చోట నుంచి మరోచోటకి ప్రయాణం చేయాలంటే చిరాకు పడుతుంటాం. అటువంటిది ఒంటి కాలుతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసి రికార్డు సృష్టించింది మధ్యప్రదేశ్కు చెందిన తాన్య దగా. బీఎస్ఎఫ్ సహకారంతో నడిచే ఆదిత్యా మెహతా ఫౌండేషన్.. దేశవ్యాప్తంగా శారీరకంగా వికలాంగులైన విద్యార్థులకు పారా స్పోర్ట్స్పై అవగాహన కల్పించి, విరాళాలు సేకరిస్తుంది. ఇందులో భాగంగా ఏటా ‘ఇన్ఫినిటీ రైడ్’ను నిర్వహిస్తోంది. అయితే ‘ఇన్ఫినిటీ రైడ్ కె2కే– 2020’లో తొమ్మిది సభ్యుల బృందంలో ఏకైక ఫిమేల్ పారసైక్లిస్ట్గా పాల్గొన్న తాన్య.. 43 రోజుల్లో 3,800 కిలోమీటర్ల (కశ్మీర్ టు కన్యాకుమారి) సైకిల్ యాత్ర పూర్తి చేసింది. 3,800 కిలోమీటర్లు ప్రయాణించి దేశంలోనే ఏకైక ఫిమేల్ పారా సైక్లిస్ట్గా తాన్య గుర్తింపు తెచ్చుకుంది. ‘‘అది 2018. నేను డెహ్రాడూన్ లో ఎంబీఏ చదువుతున్నాను. ఒకరోజు విధి నాపై కన్నెర్ర చేయడంతో కారు ప్రమాదంలో నా కుడికాలిని కోల్పోయాను. దాంతో ఆరునెలలపాటు బెడ్మీద నుంచి కదలలేని పరిస్థితి. అప్పుడు జీవితం అంతా అయిపోయిందనిపించింది. ఆ సమయంలో నాన్న నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాలో ధైర్యాన్ని నూరిపోసారు. శరీరంలో ఓ భాగం కోల్పోయినంత మాత్రాన మన జీవితం అక్కడితో ఆగిపోదని, మన లక్ష్యం కోసం శ్రమించాలని నాన్న చెప్పిన మాటలే నాకు మరో జీవితాన్నిచ్చాయని తాన్య చెప్పుకొచ్చింది. ఆరు నెలల తర్వాత శారీరకంగాను మానసికంగా దృఢంగా తయారై పారాస్పోర్ట్స్ను ప్రోత్సహించే ఫౌండేషన్ లో చేరాను’’ అన్నది. ‘‘ఈ క్రమంలోనే 2020 నవంబర్ 19న కశ్మీర్ టు కన్యాకుమారి యాత్రకు మా టీమ్తో బయలు దేరాము. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో విధి మరోసారి నన్ను వెక్కిరించింది. డిసెంబర్ 18న హైదరాబాద్లో ఉండగా.. నాన్న చనిపోయాడనే వార్త నన్ను ఒక్కసారిగా కలిచివేసింది. మరోసారి జీవితం అంధకారమైనట్లు అనిపించింది. ఆ బాధతోనే మధ్యప్రదేశ్ వెళ్లి నాన్నను కడసారి చూసి వచ్చి.. మళ్లీ మా బృందంతో కలిసి యాత్ర కొనసాగించాను. నన్ను ఎంతగానో ప్రోత్సహించి, కుంగిపోకుండా కొత్త జీవితాన్ని పరిచయం చేసిన నాన్న చివరి కోరిక ఈ యాత్రను పూర్తి చేయడం. అందుకే అంత బాధలోనూ నాన్న స్ఫూర్తితో లక్ష్యాన్ని పూర్తి చేసి నాన్న కోరికను తీర్చానని తాన్య గర్వంగా చెప్పింది’’. -
ఆరు గంటల్లో తిరుమల కొండెక్కిన పారా సైక్లిస్ట్
తిరుమల: ప్రముఖ పారాసైక్లిస్ట్ ఆదిత్య మెహతా బుధవారం అలిపిరి మెట్లమార్గంలో తిరుమల కొండెక్కారు. తొమ్మిది కిలోమీటర్ల మార్గంలోని మొత్తం 3,300 మెట్లను తన కృత్రిమ కాలు (ఆర్టిఫిషియల్ లెగ్) తో ఆరు గంటల్లో ఎక్కారు. అలిపిరి వద్ద ఉదయం 10.45 గంటలకు నడక ప్రారంభించిన ఆయన సాయంత్రం 4.45 గంటలకు తిరుమలలోని జీఎన్సీ టోల్గేట్ వద్దకు చేరుకున్నారు. గతంలో మూడు కిలోమీటర్ల దూరంలోని శ్రీవారిమెట్టు మార్గంలో 2.05 గంటల్లోనే ఎక్కారు. ఆదిత్య మెహతా మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల బెంగళూరు, హైదరాబాద్ మధ్య ఒంటికాలితో పారాసైక్లింగ్ విజయవంతం కావడంతో శ్రీవారికి మొక్కు చెల్లించేందుకు వచ్చానన్నారు. గతంలోనూ శ్రీవారికి మొక్కు చెల్లించడంతో పారాసైక్లింగ్, వికలాంగ క్రీడలకు మంచి ప్రోత్సాహం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. పెట్టుడు కాలుతో ఎక్కేందుకు కొంత ఇబ్బంది ఉన్నా స్వామిపైన భారం వేసి ఆనందంగానే తిరుమలకొండకు చేరుకున్నానని ఆదిత్య మెహతా తెలిపారు. -
హైడ్రాలిక్ లెగ్తో.. తిరుమల కొండకు పారా సైక్లిస్ట్
సాక్షి, తిరుమల: ప్రమాదంలో కుడికాలు కోల్పోయిన ఆదిత్యా మెహతా మొక్కవోని దీక్షతో అంతర్జాతీయ స్థాయిలో ఫారా సైక్లిస్ట్గా పేరు సంపాదించాడు. అదే స్ఫూర్తితో మంగళవారం ఒకే కాలుతోపాటు కుడికాలికి అమర్చుకున్న హైడ్రాలిక్ కాలి సాయంతో తిరుమల కొండెక్కి శ్రీవేంకటేశ్వర స్వామివారికి మొక్కు చెల్లించుకున్నాడు. 2,400 మెట్లను 2.05 గంటల్లోనే ఎక్కాడు. హైదరాబాద్కు చెందిన 35 ఏళ్ల మెహతా ప్రమాదంలో కుడికాలు కోల్పోయాడు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న హైడ్రాలిక్ లెగ్తో సైక్లింగ్లో శిక్షణ పొంది అంతర్జాతీయ పారా స్లైక్లింగ్ పోటీల్లో రాణించాడు. 2013లో 100 కిలోమీటర్ల సైక్లింగ్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించాడు. 2014 లోనూ మరోసారి స్థానం సంపాదించాడు.