-
MI Vs KKR: బుమ్ బుమ్ బుమ్రా.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ బాల్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ మరో ఓటమి చవి చూసింది. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (21 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలవగా.. నితీశ్ రాణా (23 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, ఆరోరా, రస్సెల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.అయితే ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సంచలన బంతితో మెరిశాడు. అద్భుతమైన బంతితో కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన బుమ్రా తొలి బంతినే నరైన్కు అద్భుతమైన ఇన్-స్వింగింగ్ యార్కర్గా సంధించాడు.బుమ్రా వేసిన బంతికి నరైన్ దగ్గర సమధానమే లేకుండా పోయింది. నరైన్ బ్యాట్ కిందకు దించే లోపే బంతి స్టంప్స్ను గిరాటేసింది. ఇది చూసిన నరైన్ బిత్తర పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు వరల్డ్క్రికెట్లో యార్కర్ల కింగ్ అంటూ బుమ్రాను పొగడ్తలతో ముంచెత్తున్నారు. ఈ మ్యాచ్లో బుమ్రా తన నాలుగు ఓవర్ల కోటాలో 39 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. Jasprit Bumrah is my happiness.pic.twitter.com/wvLPZSbhs5— R A T N I S H (@LoyalSachinFan) May 11, 2024 -
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఎలా ఉన్నా ఆ జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు జరిగిన 12 మ్యాచ్లలో భాగమైన బుమ్రా.. 18 వికెట్లు కూల్చాడు.తద్వారా అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో అగ్రస్థానం(మే 7 నాటికి) అగ్రస్థానంలో నిలిచి.. పర్పుల్ క్యాప్ తన దగ్గర పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. సన్రైజర్స్ హైదరాబాద్తో సోమవారం నాటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలుపొందిన విషయం తెలిసిందే.ఆశలు సజీవమేవాంఖడే వేదికగా హైదరాబాద్ జట్టును ఏడు వికెట్ల తేడాతో ఓడించిన ముంబై.. ఈ సీజన్లో నాలుగో విజయం నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్నప్పటికీ అధికారికంగా ముంబై ఇంకా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించలేదు.ఇక ఇప్పటికి 12 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్కు లీగ్ దశలో ఇంకో రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఒకవేళ ప్లే ఆఫ్స్ చేరితే సంగతి వేరు!కాగా మే 26 నాటి ఫైనల్తో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్కు తెరపడనుండగా.. జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. జూన్ 5న టీమిండియా ఐర్లాండ్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలిఈ నేపథ్యంలో పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం విశ్రాంతినివ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ విషయమై అసిస్టెంట్ కోచ్ కీరన్ పొలార్డ్కు సోమవారం ప్రశ్న ఎదురైంది.కుదరదుఇందుకు బదులిస్తూ.. ‘‘ఈ విషయంపై నేను స్పష్టతనివ్వలేను. అయితే, మేమంతా ఇక్కడున్నది సీజన్ ఆసాంతం సేవలు అందించడానికే! ఇతర విషయాల గురించి పెద్దగా ఆలోచించే పరిస్థితిలో లేము. వరల్డ్కప్ గురించి ఇప్పటి నుంచే మాట్లాడటం అనవసరం. ఇలాంటివి ప్రస్తుత ప్రదర్శనలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది’’ అని కీరన్ పొలార్డ్ చెప్పుకొచ్చాడు. బుమ్రాకు ప్రస్తుతం విశ్రాంతినిచ్చే ఆలోచన లేదని పరోక్షంగా స్పష్టం చేశాడు.చదవండి: Rohit Sharma Crying Video: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్ -
తండ్రిని ఎంకరేజ్ చేసేందుకు వచ్చిన జూనియర్ బుమ్రా..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా నిన్న (మే 6) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ సన్రైజర్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు శతకంతో (51 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడి ముంబైని ఒంటిచేత్తో గెలిపించాడు. తొలుత ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సన్రైజర్స్ 173 పరుగుల నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. ఛేదనలో ముంబై సైతం ఆదిలో తడబడినప్పటికీ స్కై.. తిలక్ వర్మ (37 నాటౌట్) సహకారంతో ముంబైని విజయతీరాలకు చేర్చాడు. ఐపీఎల్లో స్కైకు ఇది రెండో సెంచరీ. Angad bumrah is here !!! So cute ,,#MIvSRH #bumrah #RohitSharma @Jaspritbumrah93 pic.twitter.com/EzxEdHwRPI— Randhir_45 (@Mr_Randhir_45) May 6, 2024ఈ మ్యాచ్లో ముంబై బౌలర్లు హార్దిక్ పాండ్యా (4-0-31-3), పియూశ్ చావ్లా (4-0-33-3) సైతం సత్తా చాటారు. నాలుగు వరుస పరాజయాల తర్వాత ఎట్టకేలకు ముంబైకు ఊరటనిచ్చే గెలుపు దక్కింది. ఈ గెలుపుతో ముంబై పాయింట్ల పట్టికలో పదో స్థానం నుంచి తొమ్మిదో ప్లేస్కు ఎగబాకింది. ఈ సీజన్లో ముంబై మరో రెండు మ్యాచ్లు (మే 11న కేకేఆర్తో, మే 17న లక్నోతో) ఆడాల్సి ఉన్నా ప్లే ఆఫ్స్కు చేరే పరిస్థితి లేదు. అలాగని టెక్నికల్గా ఇంకా ఔట్ కాలేదు. ఏదైనా మహాద్భుతం జరిగితే తప్ప ముంబై ఈ సీజన్ ప్లే ఆఫ్స్కు చేరలేదు.జూనియర్ బుమ్రా వచ్చాడు..ఇదిలా ఉంటే, నిన్న వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లో ఓ చిట్టిపొట్టి అతిథి అందరి దృష్టిని ఆకర్శించాడు. అతడే బుమ్రా తనయుడు అంగద్ బుమ్రా. అంగద్.. తన తల్లి సంజనా గణేశన్తో కలిసి తన తండ్రి జస్ప్రీత్ బుమ్రాను ఎంకరేజ్ చేసేందుకు వాంఖడేకు వచ్చాడు. వీఐపీ స్టాండ్స్లో సంజనా.. అంగద్ను ఒడిలో కూర్చొబెట్టుకుని కెమెరా కంటికి చిక్కింది. ఈ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. అంగద్ తొలిసారి పబ్లిక్లోకి రావడంతో చిన్నారిని చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. అంగద్ ముంబై ఇండియన్స్ జెర్సీ ధరించి ఉండటంతో ఆ ఫ్రాంచైజీ అభిమానులు తెగ సంబురపడిపోతున్నారు. జూనియర్ బుమ్రా వచ్చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్లో బుమ్రా బౌలింగ్లో యధావిధిగా అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో తన కోటా నాలుగు ఓవర్లు పూర్తి చేసిన బుమ్రా కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన అభిషేక్ శర్మ (11) వికెట్ పడగొట్టాడు. మొత్తానికి బుమ్రా కొడుకు అంగద్ నిన్నటి మ్యాచ్ సందర్భంగా చర్చనీయాంశంగా మారాడు. -
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ వరుస ఓటుములతో సతమతమవుతోంది. శుక్రవారం వాంఖడే వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 24 పరుగుల తేడాతో ఓటమి పాలైన ముంబై.. తమ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం మూడింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో కొనసాగుతోంది. ఇక ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ నిరాశపరుస్తున్నప్పటికి.. ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం తన వంతు న్యాయం చేస్తున్నాడు.కేకేఆర్తో మ్యాచ్లోనూ బుమ్రా నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. ఓవరాల్గా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 17 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. వరల్డ్కప్-2024కు ముందు బుమ్రా సూపర్ ఫామ్లో ఉండటం భారత జట్టు కలిసిచ్చే ఆంశం.ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కు చేరే అవకాశాలు దాదాపు లేకపోవడంతో మిగిలిన మ్యాచ్లకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని జాఫర్ అభిప్రాయపడ్డాడు.ఈ ఏడాది ఐపీఎల్లో మరో మ్యాచ్ తర్వాత ముంబై భావితవ్యం తేలిపోనుంది. ఆ మ్యాచ్లో ముంబై ఓటమి పాలైతే ప్లే ఆఫ్స్ రేసు అధికారికంగా నిష్క్రమిస్తోంది. ఒకవేళ అది జరిగితే మిగిలిన మ్యాచ్లకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడం బెటర్. అది టీమిండియాకు బాగా కలిసిస్తోందని ఈఎస్పీఈన్ క్రిక్ ఈన్ఫోలో జాఫర్ పేర్కొన్నాడు. -
IPL 2024: ముంబై ఇండియన్స్ ఓపెనర్గా జస్ప్రీత్ బుమ్రా..?
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఏప్రిల్ 27న అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో ముంబై తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు ముంబై ఇండియన్స్ స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ కాకుండా బ్యాటింగ్ తీవ్రంగా ప్రాక్టీస్ చేయడం చర్చనీయాంశమైంది. నెట్స్లో గంటల కొద్దీ బుమ్రా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ గడిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఫ్రాంఛైజీ ఎక్స్లో షేర్ చేసింది. బుమ్రా రివర్స్ స్వీప్, పుల్ షాట్లు ప్రాక్టీస్ చేస్తున్నటు ఈ వీడియోలో కన్పించింది. కాగా ఢిల్లీతో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మెనెజ్మెంట్ బ్యాటింగ్ ఆర్డర్లో బుమ్రాకు ప్రమోషన్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ తరహాలో.. బుమ్రాతో ఓపెనింగ్ చేయంచాలని ముంబై మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అదే జరిగితే రోహిత్ శర్మతో కలిసి బుమ్రా ముంబై ఇన్నింగ్స్ను ఆరంభించే ఛాన్స్ ఉంది. కాగా ఈ ఏడాది సీజన్లో బుమ్రా బంతితో అదరగొడుతున్నాడు. 13 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్గా బుమ్రా కొనసాగుతున్నాడు. Aaj batting tera Jassi bhai karega! 😎💥#MumbaiMeriJaan #MumbaiIndians | @Jaspritbumrah93 pic.twitter.com/RO0WWHh7Fz— Mumbai Indians (@mipaltan) April 26, 2024 -
ఐపీఎల్ 2024లో సగానికి పైగా మ్యాచ్లు పూర్తయ్యాయి.. టాప్లో కోహ్లి, బుమ్రా
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సగానికి పైగా మ్యాచ్లు (38 మ్యాచ్లు) పూర్తయ్యాయి. ప్లే ఆఫ్స్ బెర్తులపై పూర్తి క్లారిటీ రానప్పటికీ ఓ అంచనా అయితే వచ్చింది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ (8 మ్యాచ్ల్లో 7 విజయాలు) పాయింట్ల పట్టికలో టాప్లో ఉండగా.. కేకేఆర్ (7 మ్యాచ్ల్లో 5 విజయాలు), సన్రైజర్స్ (7 మ్యాచ్ల్లో 5 విజయాలు), సీఎస్కే (7 మ్యాచ్ల్లో 4 విజయాలు), లక్నో సూపర్ జెయింట్స్ (7 మ్యాచ్ల్లో 4 విజయాలు) వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం ఈ ఐదు జట్ల మధ్యనే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే గుజరాత్, ముంబై, ఢిల్లీల్లో ఏదో ఒక జట్టుకు లైన్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం గుజరాత్ (8 మ్యాచ్ల్లో 4 విజయాలు) ఆరు, ముంబై (8 మ్యాచ్ల్లో 3 విజయాలు) ఏడు, ఢిల్లీ (8 మ్యాచ్ల్లో 3 విజయాలు) ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. 8 మ్యాచ్ల్లో రెండిట గెలిచిన పంజాబ్ తొమ్మిదో స్థానంలో ఉండగా.. 8 మ్యాచ్ల్లో ఒకే ఒక మ్యాచ్ గెలిచిన ఆర్సీబీ చివరి స్థానంలో పాతుకుపోయింది. ప్రస్తుత సీజన్లో 70 మ్యాచ్లు (క్వాలిఫయర్స్, ఎలిమినేట్, ఫైనల్స్ కాకుండా) జరగాల్సి ఉండగా.. ఇప్పటివరకు 38 మ్యాచ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం వ్యక్తిగత విభాగాల్లో (అత్యధిక పరుగులు, వికెట్లు) విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా టాప్లో కొనసాగుతున్నారు. విరాట్ ఈ సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడి 63.17 సగటున 150.40 స్ట్రయిక్రేట్తో 379 పరుగులు చేయగా.. బుమ్రా 8 మ్యాచ్ల్లో 13 వికెట్లు తీసి చహల్, హర్షల్ పటేల్తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. ఈ సీజన్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అగ్రస్థానాల్లో ఉన్న ఆటగాళ్ల వివరాలు.. అత్యధిక పరుగులు-విరాట్ కోహ్లి (379) అత్యధిక వ్యక్తిగత స్కోర్-విరాట్ కోహ్లి (113) అత్యధిక సగటు-రవీంద్ర జడేజా (141) అత్యధిక స్ట్రయిక్రేట్-రొమారియో షెపర్డ్ (280.00) అత్యధిక శతకాలు-బట్లర్ (2) అత్యధిక హాఫ్ సెంచరీలు-రియాన్ పరాగ్, శాంసన్, క్లాసెన్, డికాక్ (3) అత్యధిక బౌండరీలు-ట్రవిస్ హెడ్ (39) అత్యధిక సిక్సర్లు- క్లాసెన్ (26) బౌలింగ్ విషయానికొస్తే.. అత్యధిక వికెట్లు-13 (బుమ్రా, చహల్, హర్షల్) ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో అత్యధిక బౌలింగ్ సగటు లక్నో సంచలన పేసర్ మయాంక్ యాదవ్ (9.0) పేరిట ఉంది. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు-సందీప్ శర్మ (5/18) (బుమ్రా,యశ్ ఠాకూర్, సందీప్ శర్మ.. ఈ ముగ్గురు చెరోసారి ఐదు వికెట్ల ఘనత సాధించారు) అత్యుత్తమ సగటు-మయాంక్ యాదవ్ (6.00) -
IPL 2024: బుమ్రాను భయపెట్టిన అశుతోష్.. ఊహలకందని సిక్సర్
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో నిన్న (ఏప్రిల్ 18) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 9 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓడినా.. ఇద్దరు బ్యాటర్లు మాత్రం ముంబైకి ముచ్చెమటలు పట్టించారు. 184 పరుగుల లక్ష్య ఛేదనలో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి గెలుపుపై ఏ మాత్రం ఆశలు లేని పంజాబ్ను అశుతోష్ శర్మ (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), శశాంక్ సింగ్ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లతో తిరిగి మ్యాచ్లో నిలబెట్టారు. అయితే ఆఖర్లో ముంబై బౌలర్లు పుంజుకోవడంతో పంజాబ్కు ఓటమి తప్పలేదు. - He is 25-Year old. - He's playing debut IPL. - He scored 61(28) in today's match. - 156 runs, 52 ave, 205.3 SR in this IPL. - He hits 13 Sixes & 9 Fours. ASHUTOSH SHARMA - THE FUTURE OF INDIAN CRICKET. ⭐ pic.twitter.com/JgVu4UsDab — CricketMAN2 (@ImTanujSingh) April 18, 2024 ఈ మ్యాచ్లో పంజాబ్ ఓడినా ఆశుతోష్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం హైలైట్గా నిలిచింది. ఈ మ్యాచ్లో ఆశుతోష్ ఆడిన కొన్ని షాట్లు క్రికెట్ పండితులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించాయి. బుమ్రా బౌలింగ్లో ఆడిన ఓ షాట్ అయితే న భూతో న భవిష్యతి అన్నట్లుగా ఉంది. ప్రపంచ బ్యాటర్లనంతా గడగడలాడించే బుమ్రా బౌలింగ్లో అశుతోష్ ఊహలకందని స్వీప్ షాట్ సిక్సర్ కొట్టాడు. బుమ్రా బౌలింగ్లో ఇలాంటి షాట్ ఆడటం దాదాపుగా అసాధ్యం. ASHUTOSH SHARMA PLAYED ONE OF THE BEST SHOT IN IPL 2024. 🥶 pic.twitter.com/WhO7RgfNEF — Johns. (@CricCrazyJohns) April 18, 2024 అయితే అశుతోష్ మాత్రం ఏమాత్రం తడబడకుండా ఈ షాట్ను అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశాడు. అశుతోష్ ఈ షాట్ ఆడిన విధానం చూసి ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా నోరెళ్లబెట్టాడు. మ్యాచ్ అనంతరం ఈ సిక్సర్ గురించి మాట్లాడుతూ నమ్మశక్యంగా లేదని అన్నాడు. ఈ షాట్ చూసిన క్రికెట్ అభిమానులైతే బుమ్రా బౌలింగ్ ఇలా కూడా సిక్సర్ కొట్టొచ్చా అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్లో అశుతోష్ ఆడిన సుడిగాలి ఇన్నింగ్స్లో దాదాపు ప్రతి షాట్ అణిముత్యమే అని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. టీమిండియా నయా 360 ప్లేయర్లంటున్నారు. అశుతోష్ సిక్సర్కు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. From sweeping Bumrah for six, to soaking pressure and consistantly delivering when team needs, taking Punjab almost par yesterday. The new 360 player in town, Ashutosh Sharma pic.twitter.com/SsniN2ad13 — Jahazi (@Oye_Jahazi) April 19, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. సూర్యకుమార్ యాదవ్ (53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (25 బంతుల్లో 36;2 ఫోర్లు, 3 సిక్సర్లు), తిలక్ వర్మ (18 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగా.. ఛేదనలో పంజాబ్.. శశాంక్ సింగ్ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), అశుతోష్ శర్మ (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగినప్పటికీ లక్ష్యానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బుమ్రా (4-0-21-3), గెరాల్డ్ కొయెట్జీ (4-0-32-3), అద్భుతంగా బౌలింగ్ చేసి పంజాబ్ ఓటమిని అడ్డుకున్నారు. Hardik Pandya said - "The way Ashutosh Sharma middle every ball and played unbelievable knock. I'm happy for him for future". pic.twitter.com/gOTmHmphiQ — CricketMAN2 (@ImTanujSingh) April 18, 2024 -
PBKS Vs MI: బుమ్ బుమ్ బుమ్రా.. ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ బాల్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సంచలన బంతితో మెరిశాడు. ఈ మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్ రిలే రూసోను అద్బుతమైన యార్కర్తో క్లీన్ బౌల్డ్ చేశాడు. బుమ్రా వేసిన బంతికి రూసో దగ్గర సమాధానమే లేకుండా పోయింది. పంజాబ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్లో మూడో బంతికి సామ్ కుర్రాన్.. రూసోకు స్ట్రైక్ ఇచ్చాడు. ఈ క్రమంలో రూసోకు బుమ్రా అద్బుతమైన యార్కర్ వేశాడు. రూసో తన బ్యాట్తో బంతిని అడ్డుకునే లోపే స్టంప్స్ను గిరాటేశాడు. ఇది చూసిన రూసోకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ బాల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్లో బుమ్రా సంచలన ప్రదర్శన కనబరిచాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ కింగ్స్పై 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. Simply unplayable Bumrah 🫡🔥#PBKSvMI #TATAIPL #IPLonJioCinema #IPLinHindi | @mipaltan | @Jaspritbumrah93 pic.twitter.com/fGmNlFNIqZ — JioCinema (@JioCinema) April 18, 2024 -
ఈ బ్యూటీని గుర్తుపట్టారా? టీమిండియా స్టార్ భార్య.. అంతేకాదండోయ్! (ఫొటోలు)
-
కోహ్లి, బుమ్రా, రోహిత్ కాదు.. అతడే మా జట్టుకు ఆడాలి: బట్లర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్ జోస్ బట్లర్ రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2018 సీజన్ నుంచి బట్లర్ రాజస్తాన్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2023 సీజన్లో 863 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా నిలిచాడు. అయితే ప్రస్తుత సీజన్లో తొలి మూడు మ్యాచ్ల్లో ఇబ్బంది పడిన బట్లర్.. ఆర్సీబీతో మ్యాచ్లో సెంచరీ చేసి తన ఫామ్ను తిరిగి పొందాడు. శనివారం ముల్లానాపూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో కూడా సత్తాచాటాలని బట్లర్ ఊవ్విళ్లరుతున్నాడు. అయితే ఈ మ్యాచ్కు ముందు బట్లర్ తన సహచర ఆటగాడు ట్రెంట్ బౌల్ట్త్ కలిసి "రాయల్స్ ర్యాపిడ్ ఫైర్" అనే ఇంటర్వ్యూలో పాల్గోనున్నాడు. ఈ క్రమంలో బట్లర్కు అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది. ప్రస్తుత ఐపీఎల్ క్రికెటర్లలో ఏ ఆటగాడు రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడాలని మీరు కోరుకుంటున్నారు? అని బౌల్ట్ ప్రశ్నించాడు. అందుకు బట్లర్ ఏమీ ఆలోచించకుండా వెంటనే అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పేరు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా బట్లర్ టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మలను ఎంచుకోపోవడం అందరని విస్మయానికి గురిచేస్తోంది. From his favourite wicket to one player he would like at the Royals, here’s Jos and Boulty like never before 🔥😂 pic.twitter.com/F7524zWiQZ — Rajasthan Royals (@rajasthanroyals) April 12, 2024 -
IPL 2024: హార్దిక్ పాండ్యాపై అనుమానం
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ డౌల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాండ్యా ఏదో ఇబ్బందితో బాధ పడుతున్నాడని.. అయినా ఆ విషయాన్ని మాత్రం బయటపెట్టడం లేదని అభిప్రాయపడ్డాడు. కావాలనే తన సమస్య గురించి అతడు దాచిపెడుతున్నట్లు కనిపిస్తోందని సైమన్ డౌల్ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2024 సందర్భంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్గా కొత్త ప్రయాణం మొదలుపెట్టిన హార్దిక్ పాండ్యాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. హేళనలు.. విమర్శల వర్షం ఓవైపు రోహిత్ శర్మపై కెప్టెన్గా వేటుకు పాండ్యానే కారణమని ముంబై అభిమానులు అతడిని పెద్ద ఎత్తున ట్రోల్ చేయగా.. మరోవైపు హ్యాట్రిక్ పరాజయాల కారణంగా పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు వరల్డ్క్లాస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కాదని.. తొలి మ్యాచ్లో తానే బౌలింగ్ అటాక్ ఆరంభించడం కూడా పాండ్యాపై విమర్శలకు కారణమైంది. అయితే, తర్వాత ఈ పేస్ ఆల్రౌండర్ పంథా మార్చాడు. బౌలింగ్ చేయడం కంటే బ్యాటింగ్ చేయడంపైనే ఎక్కువ దృష్టి సారించాడు. ఈ క్రమంలో వరుసగా రెండు విజయాలు అందుకుని విమర్శకులకు సమాధానం ఇచ్చాడు. పాండ్యా తీరుపై అనుమానం ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయకపోవడాన్ని ప్రస్తావిస్తూ కివీస్ మాజీ పేసర్ సైమన్ డౌల్ అనుమానం వ్యక్తం చేశాడు. ‘‘తొలి మ్యాచ్లో తొలి ఓవర్ను వేసిన బౌలర్.. అకస్మాత్తుగా జట్టుకు తన సేవలు అవసరం లేదన్నట్లుగా వ్యవహరించడం ఆశ్చర్యంగా ఉంది. అతడు గాయపడ్డాడు. ఏదో సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఆ విషయాన్ని బయటపెట్టడం లేదు. కచ్చితంగా ఏదో దాచిపెడుతున్నాడని నా మనసు బలంగా చెబుతోంది’’ అని సైమన్ డౌల్ క్రిక్బజ్ షోలో వ్యాఖ్యానించాడు. అప్పుడు చీలమండకు గాయం కాగా గుజరాత్ టైటాన్స్తో పదిహేడో ఎడిషన్ ఆరంభించిన ముంబై ఇండియన్స్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం పాండ్యా మాట్లాడుతూ.. సరైన సమయంలో మళ్లీ పూర్తి స్థాయిలో బంతితో బరిలోకి దిగుతానని చెప్పిన విషయం తెలిసిందే. ముంబై జట్టులో కావాల్సినంత మంది పేసర్లు ఉన్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అయితే, సైమన్ డౌల్ మాత్రం అతడి వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదు. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా పాండ్యా చీలమండకు గాయం కాగా.. కోలుకున్న అనంతరం ఐపీఎల్-2024 ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. చదవండి: గైక్వాడ్ ఈ ఒక్క ఏడాదే.. వచ్చే సీజన్లో CSK కెప్టెన్ అతడే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కోహ్లి, ధోని కాదు.. ఐపీఎల్ సూపర్స్టార్ అతడే: భజ్జీ
‘‘మొదటి రోజు నుంచి ఇప్పటి దాకా అతడి బౌలింగ్లో ఎంతో వైవిధ్యం కనిపిస్తోంది. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడంలో అందరికంటే తనే ముందుంటాడు. ప్రతి రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాడు. ఈరోజు ఐదు వికెట్లు తీసినా సరే.. మళ్లీ రేపటి కోసం కొత్తగా సంసిద్ధమవుతాడు. తన వీడియోలన్నీ మరోసారి చూసుకుంటాడు. ఎక్కడ లోపాలున్నాయి.. వాటిని సరిచేసుకుని మరింత మెరుగ్గా ఎలా ఆడాలన్న అంశం మీదే దృష్టి పెడతాడు. కూల్గా.. కామ్గా ఉంటాడు. తన పని తాను చేసుకుంటూ పోతాడు. ముఖ్యంగా ఒత్తిడిలో మరింత గొప్పగా రాణిస్తాడు. చాలా మంది విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇది బ్యాటర్ల గేమ్ కాబట్టి అలా మాట్లాడతారు. కానీ నిజానికి సూపర్స్టార్ల గురించి మాట్లాడాల్సి వస్తే నా దృష్టిలో ఐపీఎల్ సూపర్ స్టార్ అతడే. ఒంటిచేత్తో మ్యాచ్లు గెలవగల సత్తా ఉన్నవాడు. అతడిలా మ్యాచ్ను మలుపు తిప్పి గెలిపించిన బ్యాటర్లు ఎంత మంది ఉన్నారు? మహా అయితే.. ఓ నలుగురు.. ఐదుగురు బ్యాటర్ల పేర్లు చెప్తారేమో! అదే బౌలర్ల విషయానికొస్తే.. కేవలం బుమ్రా ఒక్కడి పేరే వినిపిస్తుంది. కొంతమంది లసిత్ మలింగ పేరు కూడా చెప్పవచ్చు. ఏదేమైనా ఎంత ఎదిగినా కొత్తగా ఏదో ఒక విషయం నేర్చుకుంటూ రోజురోజుకు మరింత మెరుగవ్వాలన్న తపన ఉండటం గొప్ప విషయం. బుమ్రా అత్యంత నిరాడంబరంగా.. కఠిన శ్రమకోరుస్తూ.. సింపుల్గా ఉండటం తనకే చెల్లింది. యువకులందరికీ తను ఆదర్శం. గొప్ప పాఠం’’ అని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఆకాశానికెత్తాడు. ప్రస్తుతతరం బౌలర్లలో బుమ్రాను మించిన ఆటగాడు మరొకరు లేరంటూ ఈ ముంబై ఇండియన్స్ స్టార్ను భజ్జీ కొనియాడాడు. విరాట్ కోహ్లి, ధోని వంటి బ్యాటర్ల కంటే మ్యాచ్ను ఒంటిచేత్తో గెలిపించగల బుమ్రానే తన దృష్టిలో నిజమైన ఐపీఎల్ సూపర్ స్టార్ అని ప్రశంసించాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీతో గురువారం నాటి మ్యాచ్లో బుమ్రా విశ్వరూపం ప్రదర్శించిన విషయం తెలిసిందే. 5/21తో దుమ్ములేపిన బుమ్రా ఆర్సీబీ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. సంచలన ప్రదర్శనతో ముంబై ఇండియన్స్ను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ముంబై మాజీ కెప్టెన్ హర్భజన్ సింగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా ఐపీఎల్ తాజా సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఐదింట మొదటి మూడు మ్యాచ్లు వరుసగా ఓడింది. ఢిల్లీ క్యాపిటల్స్పై విజయంతో బోణీ కొట్టి.. తాజాగా ఆర్సీబీని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక ఐపీఎల్-2024లో బుమ్రా ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్లలో కలిపి పది వికెట్లు పడగొట్టి ప్రస్తుతం పర్పుల్ క్యాప్ తన దగ్గరపెట్టుకున్నాడు. చదవండి: Rohit Sharma: అప్పటి వరకు కెప్టెన్ రోహిత్ శర్మనే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); We have seen this one, it's a classic 🤌#IPLonJioCinema #TATAIPL #MIvRCB pic.twitter.com/spSGO73CwH — JioCinema (@JioCinema) April 11, 2024 Boom Boom Bumrah!@Jaspritbumrah93 comes into the attack and gets the big wicket of Virat Kohli. Live - https://t.co/7yWt2uizTf #TATAIPL #IPL2024 #MIvRCB pic.twitter.com/1QbRGjV2L0 — IndianPremierLeague (@IPL) April 11, 2024 -
ముంబై విజయంలో అదే హైలైట్.. సచిన్ ట్వీట్ వైరల్
ఐపీఎల్-2024లో హ్యాట్రిక్ పరాజయాల అనంతరం ముంబై ఇండియన్స్ కోలుకున్న తీరుపై ఆ జట్టు మెంటార్ సచిన్ టెండుల్కర్ హర్షం వ్యక్తం చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం నాటి మ్యాచ్లో సమిష్టి రాణించి గెలుపొందిన తీరు అమోఘమని కొనియాడాడు. ఆర్సీబీతో మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా సంచలన ప్రదర్శన కనబరిచాడన్న సచిన్.. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ దూకుడైన షాట్లతో విరుచుకుపడ్డారని ప్రశంసించాడు. ఇక గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ బాల్ను హిట్ చేస్తున్న తీరు చూసి ముచ్చటేసిందని ఈ టీమిండియా దిగ్గజం ‘స్కై’ని ఆకాశానికెత్తాడు. 𝘼 𝙎𝙆𝙔 𝙛𝙪𝙡𝙡 𝙤𝙛 s̶t̶a̶r̶s̶ 𝙨𝙞𝙭𝙚𝙨 🤩#MIvRCB #TATAIPL #IPLonJioCinema #IPLinMarathi pic.twitter.com/WUlm5lJPzL — JioCinema (@JioCinema) April 11, 2024 అదే విధంగా ఆఖర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా సిక్సర్ బాది మ్యాచ్ను ముగించడం కన్నుల పండుగ చేసిందని సచిన్ టెండుల్కర్ ముంబై ఇండియన్స్ సారథిపై ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు.. ‘‘వరుస ఓటముల తర్వాత.. వరుసగా రెండు విజయాలు.. జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ పవర్ ప్లేలో ఏమాత్రం భయపడకుండా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి గొప్ప ఆరంభం అందించారు. ఇక సూర్యకుమార్ యాదవ్ గాయం తర్వాత తిరిగి వచ్చి ఈ విధంగా హిట్టింగ్ చేయడం సంతోషాన్నిచ్చింది. హార్దిక్ పాండ్యా మ్యాచ్ను ఫినిష్ చేసిన తీరు అన్నిటికంటే మరింత గొప్పగా అనిపించింది’’ అని సచిన్ టెండుల్కర్ ట్వీట్ చేయగా సోషల్ మీడియలో వైరల్గా మారింది. కాగా వాంఖడే ఆర్సీబీతో మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ప్రధాన పేసర్,‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ బుమ్రా(5/21) ఐదు వికెట్లతో చెలరేగగా.. గెరాల్డ్ కోయెట్జీ, ఆకాశ్ మధ్వాల్, శ్రేయస్ గోపాల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ క్రమంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అయితే, మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ బ్యాటింగ్కు అనుకూలించిన నేపథ్యంలో.. పరిస్థితులకు తగ్గట్లుగా ముంబై బ్యాటర్లు బ్యాట్ ఝులిపించారు. ఓపెనర్లు ఇషాన్ కిషన్ 34 బంతుల్లోనే 69, రోహిత్ శర్మ 24 బంతుల్లో 38 పరుగులతో దంచికొట్టారు. ఇక వన్డౌన్లో వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాట్ పవరేంటో చూపించాడు. కేవలం 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 52 పరుగులతో దుమ్ములేపాడు. ఇక హార్దిక్ పాండ్యా కేవలం ఆరు బంతుల్లోనే 21 పరుగులతో అదరగొట్టాడు. స్ట్రైక్రేటు 350గా నమోదు చేసిన ఈ ఆల్రౌండర్ సిక్స్ బాది ముంబైని విజయతీరాలకు చేర్చాడు. తిలక్ వర్మ 10 బంతుల్లో 16 రన్స్ చేసి పాండ్యాతో కలిసి ఆఖరి వరకు అజేయంగా ఉన్నాడు. A @Jaspritbumrah93 special with the ball backed 🆙 by a power packed batting performance help @mipaltan win ✌ in ✌ 💙 Scorecard ▶️ https://t.co/Xzvt86cbvi#TATAIPL | #MIvRCB pic.twitter.com/ro7TeupAQj — IndianPremierLeague (@IPL) April 11, 2024 ఫలితంగా 15.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి ముంబై లక్ష్యాన్ని ఛేదించింది. ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కాగా ఐపీఎల్-2024లో ముంబైకి ఇది రెండో గెలుపు. తొలి మూడు మ్యాచ్లలో ఓడిన పాండ్యా సేన.. ఢిల్లీ క్యాపిటల్స్పై విజయంతో బోణీ కొట్టిన విషయం తెలిసిందే. చదవండి: Jasprit Bumrah: కెనడా క్రికెట్ జట్టులో చేరాలనుకున్న బుమ్రా.. సంచలన విషయం వెల్లడి 𝗜𝗡 comes Hardik Pandya, and 𝗢𝗨𝗧 goes the ball 💫#MIvRCB #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/ufHR4tyY2u — JioCinema (@JioCinema) April 11, 2024 Two wins on the trot now for @mipaltan after a tricky start to the tournament. @Jaspritbumrah93 was sensational, once again proving why he's the best in the business. @ImRo45 and @ishankishan51's fearless batting during the powerplay overs effectively reduced the required run… pic.twitter.com/khxtvuEVAJ — Sachin Tendulkar (@sachin_rt) April 11, 2024 -
రోహిత్ బాగా ఆడాడు.. బుమ్రా నా జట్టులో ఉండటం అదృష్టం: పాండ్యా
సొంత గడ్డపై ముంబై ఇండియన్స్ మరోసారి సత్తా చాటింది. వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్పై విజయంతో పాయింట్ల ఖాతా తెరిచిన పాండ్యా సేన.. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరును మట్టికరిపించింది. అద్భుత ఆట తీరుతో గురువారం నాటి మ్యాచ్లో ఆర్సీబీని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి.. ఐపీఎల్-2024లో వరుసగా రెండో గెలుపు నమోదు చేసింది. ఐదు వికెట్లు పడగొట్టి ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ను దెబ్బకొట్టిన ముంబై ఇండియన్స్ ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. Boom Boom Bumrah!@Jaspritbumrah93 comes into the attack and gets the big wicket of Virat Kohli. Live - https://t.co/7yWt2uizTf #TATAIPL #IPL2024 #MIvRCB pic.twitter.com/1QbRGjV2L0 — IndianPremierLeague (@IPL) April 11, 2024 మరోవైపు.. హార్డ్ హిట్టర్, ఇంపాక్ట్ ప్లేయర్గా దిగిన సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్(19 బంతుల్లో 52)తో తిరిగి ఫామ్లోకి రావడంతో.. ముంబై శిబిరంలో సంతోషం వెల్లివిరిసింది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ ఇద్దరు ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు. ICYMI - Surya lighting up the night SKY with a flurry of SIXES 🔥🔥🔥 Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvRCB | @surya_14kumar pic.twitter.com/7CiLtcwTyI — IndianPremierLeague (@IPL) April 11, 2024 వరుసగా రెండో విజయం సాధించడంపై స్పందిస్తూ.. ‘‘ గెలవడం ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటుంది. అయితే, ఈ మ్యాచ్లో గెలిచిన తీరు మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కెప్టెన్గా నాకు కాస్త వెసలుబాటు కల్పించిందనే చెప్పాలి. రోహిత్(24 బంతుల్లో 38), ఇషాన్ కిషన్(34 బంతుల్లో 69) బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. వాళ్లిద్దరూ కలిసి మా విజయానికి పునాది వేశారు. నెట్ రన్ రేటు మెరుగుపరచుకునే క్రమంలో త్వరగా లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నది మా ప్రణాళిక. బుమ్రా లాంటి అద్భుతమైన బౌలర్ నా జట్టులో ఉండటం నా అదృష్టం. ప్రతి ఓవర్లోనూ ప్రభావం చూపాడు. నేను తనకు అప్పగించిన పని పూర్తి చేశాడు. తను జట్టు కోసం ఏం చేయగలడో అదంతా చేశాడు. ఏ మ్యాచ్కు ముందైనా సరే నెట్స్లో తను తీవ్రంగా శ్రమిస్తాడు. అతడి నైపుణ్యాలు అమోఘం. ఇక నువ్వు ఫిఫ్టీ కొట్టడమే నీకు వెల్కమ్ బ్యాక్ లాంటిదని సూర్యకు చెప్పాను. సూర్య జట్టుతో ఉంటే నిశ్చింతగా ఉండొచ్చు. అపోజిషన్ కెప్టెన్గా ఉన్నపుడు కూడా తనను అవుట్ చేసేందుకు పదునైన వ్యూహాలు రచించాల్సి వచ్చేది. కొన్ని ఏరియాల్లో అతడు మాత్రమే హిట్టింగ్ ఆడగలడు. నేను ఇంతకు ముందు అలాంటి బ్యాటర్ను చూడలేదు’’ అని హార్దిక్ పాండ్యా.. బుమ్రా, సూర్యలను కొనియాడాడు. ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్కోర్లు: టాస్: ముంబై.. బౌలింగ్ ఆర్సీబీ స్కోరు: 196/8 (20) ముంబై స్కోరు: 199/3 (15.3) ఫలితం: ఏడు వికెట్ల తేడాతో బెంగళూరుపై ముంబై విజయం చదవండి: చాలా బాధగా ఉంది.. అతడే మా కొంపముంచాడు! లేదంటేనా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
RCB Vs MI: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. తొలి బౌలర్గా! ఎవరికీ సాధ్యం కాలేదు
ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్, టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 5 వికెట్ల ఘనత సాధించిన తొలి బౌలర్గా బుమ్రా రికార్డలకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా ఆర్సీబీతో మ్యాచ్లో బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగాడు. తద్వారా ఈ అరుదైన ఫీట్ను తన పేరిట బుమ్రా లిఖించుకున్నాడు. బుమ్రా కంటే ముందు ఎవరూ ఆర్సీబీపై ఫైవ్ వికెట్ల హాల్ సాధించలేదు. గతంలో ఆశిష్ నెహ్రా సీఎస్కే తరపున ఆడుతున్నప్పుడు ఆర్సీబీ 4 వికెట్ల ఘనత మాత్రమే నమోదు చేశాడు. ఇక బుమ్రాకు ఇది ఐపీఎల్లో రెండో ఫైవ్ వికెట్ల హాల్ కావడం గమానార్హం. ఈ మ్యాచ్లో తృటిలో హ్యాట్రిక్ వికెట్లు తీసే అవకాశాన్ని బుమ్రా కోల్పోయాడు. తన బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టాడు. విరాట్ కోహ్లి వంటి స్టార్ ఆటగాడిని సైతం బుమ్రానే ఔట్ చేశాడు. బుమ్రా తన నాలుగు ఓవర్లలో కోటాలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు సాధించాడు. అద్బుత ప్రదర్శనకు గాను బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు వరించింది. ఇక ఈ మ్యాచ్లో ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. Jasprit Bumrah becomes the FIRST player to take an IPL fifer against RCB. pic.twitter.com/z5WmLlPbiF — Kausthub Gudipati (@kaustats) April 11, 2024 -
IPL RCB Vs MI: బుమ్రా కళ్లు చెదిరే యార్కర్.. బ్యాటర్కు ఫ్యూజ్లు ఔట్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో చెలరేగాడు. తన సహాచర బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికి బుమ్రా మాత్రం తన బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తన నాలుగు ఓవర్లలో కోటాలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు సాధించాడు. అయితే ఈ మ్యాచ్లో బుమ్రా అద్బుతమైన యార్కర్తో మెరిశాడు. సంచలన బంతితో బెంగళూరు బ్యాటర్ మహిపాల్ లోమ్రోర్ను బుమ్రా బోల్తా కొట్టించాడు. బుమ్రా వేసిన బంతికే లామ్రోర్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన బుమ్రా.. నాలుగో బంతిని లెగ్ స్టంప్ టార్గెట్ చేస్తూ యార్కర్ సంధించాడు. ఈ క్రమంలో లోమ్రోర్ తన బ్యాట్తో బంతిని ఆపేలోపే నేరుగా వెళ్లి ప్యాడ్కు తాకింది. బుమ్రా ఎల్బీకి అప్పీలు చేయగా అంపైర్ వెంటనే ఔట్ అని వేలు పైకెత్తాడు. లోమ్రోర్ రివ్యూ తీసుకున్నప్పటికి ఫలితం మాత్రం శూన్యం. రిప్లేలో బంతి క్లియర్గా లెగ్ స్టంప్కు తాకుతున్నట్లు తేలింది. దీంతో లోమ్రోర్ గోల్డెన్ డక్గా మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ మ్యాచ్లో ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. pic.twitter.com/vjWj2R8FAc — Sitaraman (@Sitaraman112971) April 11, 2024 -
Bumrah: కెనడాకు వెళ్లి.. అక్కడి క్రికెట్ జట్టుకు ఆడాలనుకున్నా..
ప్రపంచంలో ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్న ఫాస్ట్ బౌలర్లలో టీమిండియా క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా ముందు వరుసలో ఉంటాడనడంలో సందేహం లేదు. టెస్టు, వన్డే, టీ20.. ఇలా ఫార్మాట్లకు అతీతంగా ఈ పేస్ గుర్రం సత్తా చాటుతున్నాడు. టెస్టుల్లో భారత జట్టు వైస్ కెప్టెన్గానూ సేవలు అందిస్తున్నాడు ఈ పేస్ దళ నాయకుడు. నిజానికి టీమిండియా తమ పేస్ బెంచ్ను పటిష్టం చేసుకునే సమయంలోనే బుమ్రా వెలుగులోకి వచ్చాడు. ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటి టీమిండియాలో అడుగుపెట్టి నంబర్ వన్గా ఎదిగాడు. వరల్డ్క్లాస్ ఫాస్ట్ బౌలర్గా నీరాజనాలు అందుకుంటూ ప్రస్తుతం స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్నాడు బుమ్రా. అయితే.. ఒకానొక సమయంలో బుమ్రా కెనడాకు వలస వెళ్లి అక్కడి క్రికెట్ టీమ్లో ఆడాలనుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. అవును.. కెనడాకు వలస వెళ్లాలి అనుకున్నా జియో సినిమా షోలో స్పోర్ట్స్ ప్రజెంటర్, తన సతీమణి సంజనా గణేషన్.. నువ్వు కెనడాకు వెళ్లి.. అక్కడే జీవించాలనుకున్నావా అని అడిగిన ప్రశ్నలకు బుమ్రా ఈ విధంగా సమాధానమిచ్చాడు. ‘‘అవును.. అలాంటి సంభాషణలు జరిగేవి. నాకు తెలిసి ప్రతి ఒక అబ్బాయికి క్రికెటర్ అవ్వాలన్న కోరిక ఉంటుంది. ఇండియాలో వీధి వీధికి సుమారుగా 25 మంది టీమిండియాకు ఆడాలనే కుర్రాళ్లు ఉంటారు. అదే సమయంలో మనకు బ్యాకప్ ప్లాన్ కూడా ఉండాలి కదా! మా బంధువుల్లో కొందరు కెనడాలో ఉన్నారు. నా విద్యాభ్యాసం పూర్తైన తర్వాత.. కుటుంబమంతా అక్కడికి వెళ్లిపోదాం అనుకున్నాం. అయితే, అక్కడి భిన్న సంస్కృతికి మేము అలవాటు పడలేమని భావించి.. మా అమ్మ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. అమ్మ వల్లే ఆట, అదృష్టం అమ్మ అలా చేయడం నాకు సంతోషాన్ని, అదృష్టాన్నీ ఇచ్చింది. ఇక్కడే నేను అనుకున్నవన్నీ వర్కౌట్ అయ్యాయి. లేదంటే బహుశా నేను కెనడా వెళ్లి అక్కడి క్రికెట్ జట్టుకు ఆడేందుకు ప్రయత్నించేవాడినేమో. ఇప్పుడు నేను టీమిండియాకు, ముంబై ఇండియన్స్కు ఆడుతుండటం సంతోషంగా ఉంది’’ అని జస్ప్రీత్ బుమ్రా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్న బుమ్రా.. ముంబై ఇండియన్స్ తరఫున ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడి ఐదు వికెట్లు తీశాడు. ఇక 2016లో టీమిండియాలో అడుగుపెట్టిన ఈ గుజరాతీ బౌలర్ 36 టెస్టులు, 89 వన్డేలు, 62 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 159, 149, 74 వికెట్లు తీశాడు. కాగా స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనాను పెళ్లాడాడు బుమ్రా. ఇటీవలే వీరికి కుమారుడు అంగద్ జన్మించాడు. చదవండి: Hardik Pandya: రోహిత్కు వయసైపోతోంది.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్లు వాళ్లిద్దరే! -
టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్లు వాళ్లిద్దరే!
‘‘రోహిత్ శర్మ వయసు ఇప్పుడు అటూ ఇటుగా.. 36- 37 ఏళ్లు ఉంటుంది. ఇంకో రెండేళ్లపాటు చురుగ్గా క్రికెట్ ఆడతాడేమో! వాస్తవానికి అతడు సూపర్ కెప్టెన్. అంతేకాదు అద్భుతమైన ఆటగాడు కూడా! అతడిని చూసినప్పుడల్లా కాలాన్ని తన బ్యాటింగ్ మాయతో ఆపేస్తాడేమో అన్నట్లుగా ఉంటుంది. అయితే.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. అతడి బాధ్యతలు తీసుకునేందుకు మరొకరిని సన్నద్ధం చేయాలి కదా. నా వరకైతే టీమిండియా ఫ్యూచర్ హార్దిక్ పాండ్యా’’ అని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా పగ్గాలు చేపట్టేది పాండ్యానేనని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసిందని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024 నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ రోహిత్ శర్మపై వేటు వేసి సారథ్య బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిర్ణయం అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. ఫలితంగా పాండ్యాపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఇక తొలి మూడు మ్యాచ్లలోనూ ముంబై ఓడిపోవడంతో పాండ్యాపై విమర్శలు శ్రుతిమించాయి. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్పై గెలుపుతో ముంబై ఆదివారం పాయింట్ల ఖాతా తెరిచింది. ఇదిలా ఉంటే.. పాండ్యాను ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ప్రకటించిన తరుణంలోనే బీసీసీఐ టీ20 వరల్డ్కప్-2024 సారథిగా రోహిత్ శర్మ పేరును అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో నవజ్యోత్ సింగ్ సిద్ధు ఈ పరిణామాలపై ఇండియా టుడేతో మాట్లాడుతూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘టెస్టులకు కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను నేను ఎన్నటికీ సూచించను. అయితే, అతడు టీమిండియా వైస్ కెప్టెన్ అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. రోహిత్ గైర్హాజరీలో దాదాపు ఏడాది పాటు టీ20 జట్టును నడిపించాడు. కాబట్టి సహజంగానే తదుపరి కెప్టెన్గా హార్దిక్ మాత్రమే ఛాయిస్. అందుకే బీసీసీఐ ముందస్తు చర్యల్లో భాగంగా అతడిని వైస్ కెప్టెన్గా నియమించింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు బోర్డు పెద్దలు అన్ని రకాలుగా ఆలోచించారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టుకు తదుపరి కెప్టెన్గా హార్దిక్ పాండ్యానే వారి ఛాయిస్’’ అని సిద్ధు అభిప్రాయపడ్డాడు. ఇక టెస్టుల్లో రోహిత్ శర్మ తర్వాత జస్ప్రీత్ బుమ్రా టీమిండియా కెప్టెన్ అవుతాడని నవజ్యోత్ సింగ్ సిద్ధు అంచనా వేశాడు. ఇంగ్లండ్లో జట్టును ముందుండి నడిపించిన అనుభవం అతడికి ఉందని పేర్కొన్నాడు. చదవండి: T20 WC: సెలక్టర్లూ.. అతడిపై ఓ కన్నేసి ఉంచండి: టీమిండియా దిగ్గజం -
రోహిత్, కోహ్లి కాదు.. ప్రపంచంలో అతడే బెస్ట్!
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భూగ్రహం మీద ప్రస్తుతం అత్యంత విలువైన క్రికెటర్ ఇతడేనంటూ టీమిండియా స్టార్లలో ఓ ఆటగాడి పేరు చెప్పాడు. డీకే చెప్పిన ఆ ప్లేయర్ రన్మెషీన్ విరాట్ కోహ్లినో లేదంటే హిట్మ్యాన్ రోహిత్ శర్మనో కానే కాదు! మరెవరు?.. దినేశ్ కార్తిక్ ప్రస్తుతం ఐపీఎల్-2024లో బిజీగా ఉన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగి ఫినిషర్గా తన బాధ్యతలు నెరవేరుస్తున్నాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. ఇక ఇప్పటి వరకు తాజా ఎడిషన్లో ఆడిన నాలుగు ఇన్నింగ్స్లో డీకే 90 పరుగులు చేశాడు. తదుపరి ముంబై ఇండియన్స్ ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా డీకే మళ్లీ గురువారం బరిలో దిగనున్నాడు. ముంబైలోని వాంఖడే వేదికగా జరుగనున్న మ్యాచ్లో ఆడనున్నాడు. ఇదిలా ఉంటే.. కేవలం ఆటగాడినే కాకుండా కామెంటేటర్గానూ దినేశ్ కార్తిక్ రాణిస్తున్న విషయం తెలిసిందే. భూగ్రహం మొత్తంమీద అత్యంత విలువైన క్రికెటర్ అతడే ఈ నేపథ్యంలో నాసిర్ హుసేన్, మైఖేల్ అథెర్టన్లతో కలిసి డీకే స్కై స్పోర్ట్స్తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా మోస్ట్ వాల్యూబుల్ క్రికెటర్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘నిజం చెప్పాలంటే అతడిలా మూడు ఫార్మాట్లలో ప్రత్యర్థులపై ఆధిపత్యం కనబరుస్తున్న మరొక ఆటగాడు లేడంటే అతిశయోక్తి కాదు. అతడి సత్తా అలాంటిది. కాబట్టి ప్రస్తుతం ఈ భూగ్రహం మొత్తంమీద అత్యంత విలువైన క్రికెటర్ అతడే. ఎందుకంటే.. మూడు ఫార్మాట్లలోనూ అతడు సమర్థవంతంగా ఆడుతున్నాడు. వేరే ఆటగాడికి లేని నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నాడు. అతడు బరిలో ఉంటే ప్రత్యర్థులు వణికిపోవాల్సిందే’’ అంటూ డీకే.. టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా పేరు చెప్పాడు. తన దృష్టిలో ప్రస్తుతం బుమ్రా మాత్రం ఈ ప్రపంచం మొత్తం మీద విలువైన క్రికెటర్ అని పేర్కొన్నాడు. కాగా భారత జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో కలిపి ఐదు వికెట్లు తీశాడు. ఇక గురువారం ముంబై- ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా బుమ్రా- డీకే ఎదురుపడే అవకాశం ఉంది. చదవండి: T20 WC: హార్దిక్, రాహుల్కు నో ఛాన్స్.. ఆ ముగ్గురూ ఫిక్స్! -
'బుమ్రా కాదు.. అతడే ఆఖరి ఓవర్లో 10 రన్స్ డిఫెండ్ చేయగలడు'
టీ20 వరల్డ్కప్-2024కు పాకిస్తాన్ క్రికెట్ జట్టు అన్ని విధాల సన్నద్దమవుతోంది. అంతేకంటే ముందు వరల్డ్కప్ సన్నహాకాల్లో భాగంగా స్వదేశంలో న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో పాక్ తలపడనుంది. టీ20 వరల్డ్కప్ నేపథ్యంలో ఆటగాళ్ల ఫిట్నెస్పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రధానంగా దృష్టిసారించింది. ఈ క్రమంలో తమ జాతీయ జట్టు సభ్యులందరికీ పాకిస్థాన్ సైన్యంతో పీసీబీ కఠిన శిక్షణ ఇప్పిస్తోంది. కాకుల్ ఆర్మీ క్యాంపులో పాకిస్తాన్ ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదే విధంగా టీ20ల్లో పాకిస్తాన్ జట్టు కెప్టెన్గా బాబర్ ఆజం మళ్లీ బాధ్యతలు చేపట్టాడు. ఏప్రిల్ 18 నుంచి న్యూజిలాండ్తో జరగనున్న టీ20 సిరీస్తో బాబర్ మళ్లీ పాక్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఇక తిరిగి పాక్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన బాబర్ ఆజం ఓ పోడ్కాస్ట్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో పోడ్కాస్ట్ హోస్ట్ నుంచి బాబర్కు ఓ ప్రశ్న ఎదురైంది. "టీ20 మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో కేవలం ఒక్క ఓవర్ మాత్రమే మిగిలి ఉంది. ప్రత్యర్ధి జట్టు విజయానికి చివరి ఓవర్లో 10 పరుగులు కావాలి. మీ వద్ద రెండు బౌలింగ్ ఆప్షన్ ఉన్నాయి. ఒకరు నసీమ్ షా, మరొకరు జస్ప్రీత్ బుమ్రా. అటువంటి అప్పుడు 10 పరుగులను కాపాడుకోవడానికి మీరు ఎవరికి బౌలింగ్ ఇస్తారన్న" ప్రశ్న హోస్ట్ అడిగాడు. బాబర్ ఏమీ ఆలోచించకుండా నసీం షా పేరును చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన భారత అభిమానులు బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలరని, నసీం షాకు అంత సీను లేదని కామెంట్లు చేస్తున్నారు. -
IPL 2024 MI VS DC: అరుదైన క్లబ్లో బుమ్రా
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో ఇవాళ (ఏప్రిల్ 7) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా అరుదైన క్లబ్లో చేరాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ పోరెల్ (41) వికెట్ పడగొట్టడంతో ఐపీఎల్లో 150 వికెట్ల అరుదైన మైలురాయిని తాకాడు. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం పది మంది (బుమ్రాతో సహా) మాత్రమే ఈ ఘనతను సాధించారు. ఈ జాబితాలో చహల్ 195 వికెట్లతో టాప్లో ఉండగా.. బ్రావో (183), పియుశ్ చావ్లా (181), అమిత్ మిశ్రా (173), అశ్విన్ (172), భువనేశ్వర్ కుమార్ (171), లసిత్ మలింగ (170), సునీల్ నరైన్ (166), రవంద్ర జడేజా (153) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. మూడో వేగవంతమైన బౌలర్గా.. బుమ్రా ఐపీఎల్లో 150 వికెట్ల మార్కును తాకిన మూడో వేగవంతమైన బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. బుమ్రా 150 వికెట్ల మైలురాయిని తాకేందుకు 124 మ్యాచ్లు తీసుకోగా.. మలింగ 105 మ్యాచ్ల్లోనే ఈ మైలురాయిని చేరుకుని ఈ ఘనత సాధించిన అత్యంత వేగవంతమైన బౌలర్గా నిలిచాడు. ఈ జాబితాలో మలింగ తర్వాతి స్థానంలో చహల్ ఉన్నాడు. చహల్ 118 మ్యాచ్ల్లో 150 వికెట్ల మైలురాయిని తాకాడు. YORKER OF IPL 2024. 🤯💥 - Jasprit Bumrah, the GOAT. 🐐 pic.twitter.com/PtfUrFbYNH — Mufaddal Vohra (@mufaddal_vohra) April 7, 2024 కాగా, ఢిల్లీతో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 235 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబైను ట్రిస్టన్ స్టబ్స్ భయపెట్టాడు. స్టబ్స్ కేవలం 19 బంతుల్లోనే అర్దసెంచరీ పూర్తి చేసి ముంబై శిబిరంలో గుబులు పుట్టించాడు. అయితే లక్ష్యం పెద్దది కావడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. ఆఖరి ఓవర్లో ఢిల్లీ గెలుపుకు 34 పరుగులు అవసరం కాగా.. కొయెట్జీ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీని గెలిపించేందుకు స్టబ్స్ చివరి వరకు ప్రయత్నించి 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. స్టబ్స్కు ముందు పృథ్వీ షా (40 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా రాణించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. కొయెట్జీ 4, బుమ్రా 2, షెపర్డ్ ఓ వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. రోహిత్ శర్మ (27 బంతుల్లో 49; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), టిమ్ డేవిడ్ (21 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (10 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. నోర్జే వేసిన ఆఖరి ఓవర్లో షెపర్డ్ విధ్వంసం సృష్టించాడు. 4 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేశాడు. -
కళ్లు చెదిరే యార్కర్ వేసిన బుమ్రా.. పృథ్వీ షాకు ఫ్యూజులు ఔట్
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో ఇవాళ (ఏప్రిల్ 7) జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా తనదైన శైలిలో కళ్లు చెదిరే యార్కర్ సంధించాడు. ఈ బంతిని ఎదుర్కోలేక బ్యాటర్ పృథ్వీ షా (40 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బుమ్రా వేసిన ఈ సూపర్ యార్కర్కు షా వద్ద సమాధానం లేకుండా పోయింది. అతనితో సహా మ్యాచ్ చూస్తున్న వారందరికీ ఈ యార్కర్ చూసి ఫ్యూజులు ఎగిరిపోయాయి. YORKER OF IPL 2024. 🤯💥 - Jasprit Bumrah, the GOAT. 🐐 pic.twitter.com/PtfUrFbYNH — Mufaddal Vohra (@mufaddal_vohra) April 7, 2024 235 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో షా అద్భుతమైన టచ్లో ఉన్నప్పుడు బుమ్రా తన మార్కు మ్యాజిక్ చేశాడు. ఫలితంగా ఢిల్లీ కష్టాల్లో పడింది. బుమ్రా సూపర్ యార్కర్కు సంబంధించిన వీడియో నెట్టంట వైరలవుతుంది. షాను ఔట్ చేసిన అనంతరం బుమ్రా మరోసారి విజృంభించాడు. 15వ ఓవర్ ఆఖరి బంతికి అభిషేక్ పోరెల్ను (41) కూడా పెవిలియన్కు పంపించాడు. దీంతో ఢిల్లీ కష్టాలు తీవ్రమయ్యాయి. 15 ఓవర్ల అనంతరం ఢిల్లీ స్కోర్ 144/3గా ఉంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలవాలంటే 30 బంతుల్లో 91 పరుగులు చేయాల్సి ఉంది. ట్రిస్టన్ స్టబ్స్ (26), రిషబ్ పంత్ క్రీజ్లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. రోహిత్ శర్మ (27 బంతుల్లో 49; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), టిమ్ డేవిడ్ (21 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (10 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. నోర్జే వేసిన ఆఖరి ఓవర్లో షెపర్డ్ విధ్వంసం సృష్టించాడు. 4 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేశాడు. -
పాండ్యా ఒక్కడిని అలా వదిలేశారు.. ఆటగాళ్లపై మండిపడ్డ భజ్జీ
ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మేనేజ్మెంట్ నిర్ణయం ఏదైనా.. దానిని అంగీకరించాలని సూచించాడు. సమిష్టిగా ముందుకు వెళ్తేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలరని పేర్కొన్నాడు. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు కెప్టెన్కు సహకరించాల్సిన అవసరం ఉందని భజ్జీ చురకలు అంటించాడు. కాగా ఐపీఎల్-2024 నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకున్న ముంబై ఇండియన్స్ అతడిని కెప్టెన్గా నియమించిన విషయం తెలిసిందే. ఐదుసార్లు జట్టును చాంపియన్గా నిలిపిన రోహిత్ శర్మపై వేటు వేసి ముంబై ఫ్రాంఛైజీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పాండ్యాను అవమానపరిచేలా హేళన చేస్తూ ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. ఇక రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్ల పట్ల పాండ్యా వ్యవహరిస్తున్న తీరు వారి కోపాన్ని మరింత ఎక్కువ చేస్తోంది. అదే విధంగా.. పాండ్యా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల జట్టు ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో మూడూ ఓడిపోవడం విమర్శలకు ఆస్కారం ఇచ్చింది. 𝙄𝙣 𝙎𝙩𝙮𝙡𝙚 😎 Riyan Parag's innings help @rajasthanroyals reach 🔝 of the table 💪#RR are the 2️⃣nd team to win an away fixture this season 👏👏 Scorecard ▶️ https://t.co/XL2RWMFLbE#TATAIPL | #MIvRR pic.twitter.com/ZsVk9rvam1 — IndianPremierLeague (@IPL) April 1, 2024 ఈ క్రమంలో రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో పరాజయం తర్వాత హార్దిక్ పాండ్యా ఒక్కడే డగౌట్లో కూర్చుని ఉండటం.. జట్టులోని విభేదాలను బయపెట్టింది. మిగతా ఆటగాళ్లంతా డ్రెసింగ్ రూంకి వెళ్లిపోగా పాండ్యా ఒంటరిగా అక్కడే ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ స్పందించాడు. ‘‘ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో.. లేదంటే యాధృచ్చికంగా అలా జరుగుతుందో తెలియదు కానీ.. జట్టులోని చాలా మంది అతడిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద తలకాయలు.. కెప్టెన్గా పాండ్యా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఇవ్వడం లేదని అర్థమవుతోంది. డ్రెసింగ్ రూం వాతావరణం కూడా సరిగ్గా లేనట్లు కనిపిస్తోంది. ఏ కెప్టెన్కు అయినా ఇలాంటివి కఠిన సవాళ్లే. ఆ విజువల్స్ అస్సలు బాగాలేవు. పాండ్యా ఒక్కడినే అలా వదిలేశారు. ఒక ఫ్రాంఛైజీకి ఆడుతున్న ఆటగాళ్లు కెప్టెన్ తమ వాడే అని కచ్చితంగా అంగీకరించాలి. మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తే బాగుంటుంది. ఈ ఫ్రాంఛైజీకి ఆడిన వ్యక్తిగా చెబుతున్నా.. ప్రస్తుతం అక్కడ వాతావరణం గందరగోళంగా ఉన్నట్లు కనిపిస్తోంది’’ అని భజ్జీ స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా 2012లో ముంబై ఇండియన్స్కు హర్భజన్ సింగ్ కెప్టెన్గా వ్యవహరించాడు. చదవండి: #Mayank Yadav: ఐపీఎల్ హిస్టరీలో తొలి ఫాస్ట్ బౌలర్గా మయాంక్ సంచలన రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్! నెటిజన్లు ఫైర్
ఐపీఎల్ 2014.. ముంబై ఇండియన్స్ ఆడిన తొలి ఐదు మ్యాచ్లలోనూ ఓడిపోయింది. ఆ తర్వాత తిరిగి పుంజుకుని టాప్-4లో నిలిచి ప్లే ఆఫ్స్ చేరింది.. ఆ మరుసటి ఏడాది అంటే 2015లో.. మొదటి నాలుగు మ్యాచ్లోనూ పరాజయమే పలకరించింది. కానీ ఆ తర్వాత అనూహ్య రీతిలో వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఆ ఏడాది ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించి ఏకంగా చాంపియన్గా అవతరించింది. అదే విధంగా.. 2018లోనూ ఇదే తరహాలో తొలి మూడు మ్యాచ్లలో ఓటమే ఎదురైంది. అయితే, తమకు ఇదేమీ కొత్త కాదన్నట్లు ఆఖరి వరకు పోరాడింది. ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోలేకపోయినా ఐదో స్థానం సాధించగలిగింది. ఇక తాజా ఎడిషన్ను కూడా ఓటమితోనే మొదలుపెట్టింది ముంబై ఇండియన్స్. తొలుత గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాభవం చెందిన హార్దిక్ సేన.. అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్.. తాజాగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లోనూ ఓడిపోయింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); ఈ నేపథ్యంలో విమర్శకుల వేళ్లన్నీ కెప్టెన్ హార్దిక్ పాండ్యావైపే చూపిస్తున్నాయి. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా వంటి వరల్డ్క్లాస్ బౌలర్ సేవలను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం సహా ఇలాంటి మరిన్ని అనాలోచిత నిర్ణయాల ఫలితమే హ్యాట్రిక్ పరాజయాలకు కారణమని అభిమానులు సైతం మండిపడుతున్నారు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ‘‘ఈ జట్టు గురించి ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మేము ఎప్పటికీ నిరాశ చెందము. పోరాడుతూనే ఉంటాం.. ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటాం’’ అని పాండ్యా ఎక్స్ వేదికగా ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల ఫొటోను పంచుకున్నాడు. If there's one thing you should know about this team, we never give up. We'll keep fighting, we'll keep going. pic.twitter.com/ClcPnkP0wZ — hardik pandya (@hardikpandya7) April 2, 2024 మిలియన్కు పైగా వ్యూస్ సంపాదించిన ఈ పోస్ట్పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘అప్పుడు కెప్టెన్గా ఉన్నది రోహిత్ శర్మ.. అందుకే గతంలో ఇలా జరిగినా జట్టు తిరిగి కోలుకుని విజయాల బాట పట్టింది. రోహిత్ ఎంఐని ఒక్కటిగా ఉంచాడు. కానీ నువ్వు.. సీనియర్లు అన్న గౌరవం లేకుండా.. కనీస మర్యాద పాటించకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నావు. కోచ్లతో కూడా సయోధ్య ఉన్నట్లు కనిపించడం లేదు. ఇక జట్టును ఎలా ఒక్కటిగా ఉంచగలవు? విజయాలెలా సాధించగలవు?’’ అని ఏకిపారేస్తున్నారు. కాగా ముంబై ఇండియన్స్ తదుపరి సొంత మైదానం వాంఖడేలో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. ఇరుజట్ల మధ్య ఆదివారం(ఏప్రిల్ 7) మ్యాచ్ జరుగనుంది. The @rajasthanroyals made it three out of three in #TATAIPL 2024 with an impressive 6-wicket win at the Wankhede Stadium 🏟️👏 Recap the #MIvRR clash 🎥🔽 pic.twitter.com/Xzq9qpVITY — IndianPremierLeague (@IPL) April 2, 2024 -
హార్దిక్ పై వేటు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా!?
ఐపీఎల్-2024 సీజన్ను ముంబై ఇండియన్స్ పేలవంగా ఆరంభించింది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓటమి పాలై తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటుంది. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన చివరి మ్యాచ్లో అయితే ముంబై దారుణ ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఏకంగా 277 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. ముంబై ఓటములకు ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. రోహిత్ శర్మ నుంచి ముంబై కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన హార్దిక్ తన మార్క్ చూపించడంలో విఫలమవుతున్నాడు. పాండ్యా కెప్టెన్స్ పరంగానే కాకుండా ఆటగాడిగా కూడా తీవ్ర నిరాశపరుస్తున్నాడు. ఈ క్రమంలో అతడిని నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. చాలా మంది మాజీలు సైతం హార్దిక్పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పాండ్యాను వెంటనే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా ముంబై కెప్టెన్సీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. హార్దిక్ పాండ్యా పట్ల ముంబై ఇండియన్స్ ప్రాంఛైజీ కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడిని తమ జట్టు పగ్గాల నుంచి తప్పించే ఆలోచనలో ముంబై ఫ్రాంచైజీ ఉన్నట్టు వినికిడి. అతడి స్ధానంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు తమ జట్టు సారథ్య బాధ్యతలు అప్పజెప్పాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం భావిస్తున్నట్లు వినిస్తున్నాయి. మరి రాబోయే మ్యాచ్ల్లో ఏమి జరుగుతుందో వేచి చూడాలి.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
T20 WC: నెదర్లాండ్స్ జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడికి చోటు
వర్షం ఎఫెక్ట్.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ ఔట్
ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ ఛాన్స్ . అలా జరిగితేనే?
రాజస్తాన్ రాయల్స్కు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన బట్లర్
డిప్రెషన్లో ఉపాసన, అత్తారింటికి వెళ్లిన రామ్చరణ్ (ఫోటోలు)
రోహిత్ శర్మ సంచలన నిర్ణయం.. త్వరలోనే రిటైర్మెంట్!?
ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా ఓటెత్తింది: సజ్జల
ఏపీలో పోలింగ్ శాతం పెరిగింది: ఏపీ సీఈవో
బాబర్ ఆజం అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా
పెట్రోల్ బాంబులతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement