breaking news
croploss
-
నీరందక.. పంట దక్కక!
సాక్షి, బొంరాస్పేట: వ్యవసాయ బోర్లలో రోజురోజుకు నీరింకిపోవడంతో సాగులో ఉన్న వరిపంట నిలువునా ఎండిపోతోంది. రైతులు లబోదిబోమంటున్నారు. పొట్టదశలో నీరులేక వరిపంట ఎండిపోతుండటంతో తిండిగింజలు, పశుగ్రాసం కరువయ్యే పరిస్థితి వస్తుందని రైతులు వాపోతున్నారు. మండలంలో 14 వేల హెక్టార్ల సాగు భూమి ఉంది. ఇందులో ప్రతిఏటా రబీలో వరిపంట 12 వందల హెక్టార్లలో పంట సాగవుతుంది. గత వర్షాకాలంలో జూన్ నుంచి అక్టోబర్ వరకు సాధారణ వర్షపాతం 525 మిల్లీ మీటర్లకుగానూ 291.8 మి.మీ వర్షపాతం నమోదైంది. 24 గంటల కరెంటుకు ఆశపడిన రైతులుఎక్కువ మొత్తంలో సాగు చేయడంతో ప్రస్తుతం భూగర్భజలం తగ్గిపోయి మధ్యంతరంగా వరిపంట నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. అలాగే మండల పరిధిలోని వడిచర్ల, బురాన్పూర్, చౌదర్పల్లి గ్రామాల్లో పెద్దమొత్తంలో బోర్లు నీరులేక ఇంతకింతకు అడుగంటి పంటలు నష్టమవుతున్నాయి. మరో వారంరోజుల్లో మరింత ఎక్కువగా పంటనష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టానికి కారణాలు.. సాధారణ వర్షపాతానికి 50 శాతం మాత్రమే వర్షపాతం నమోదు కావడం. 24 గంటల కరెంటుపై ఆశలు పెంచుకొని రెండంతలు సాగుచేయడం. అవసరానికి మించి సాగునీరు వాడటం. (300 –500 మి.మీ. వరకు ఆరుతడి పంటలకు సరిపోతుంది. కాగా ఇక్కడి రైతులకు వరి తప్ప మిగతా పంటలు పండించని అలవాటు ఉంది. వరిలో కరిగెటకు, పంటలో మొక్కకు 1200 మి.మీ. వరికి అవసరమున్నా 1400 మి.మీ. వరకు సాగునీరు అవసరమవుతుంది.) రైతులకు వ్యవసాయశాఖ వారు అవగాహన కల్పించకపోవడం. ఎక్కువ సాగునీరు వరి బదులు రబీలో ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు చైతన్యం, ప్రచారం చేపట్టకపోవడం. -
'ఈ కోతిగోల భరించలేం బాబూ'
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి అన్నిటికన్నా ప్రధానమైన ఇష్యూ నరేంద్ర మోడీ కారు. రాహుల్ గాంధీ అంతకన్నా కారు. టూజీ, బొగ్గు స్కామ్ ఇవేవీ ఎన్నికల ఇష్యూలు కావు. అక్కడ ఎన్నికల ఇష్యూ ఒకటే. కోతులే అక్కడ అసలు ఎన్నికల ఇష్యూ. అక్కడ పొలాల మీద పడి స్వైర విహారం చేస్తున్న కోతులను ఎవరు తొలగిస్తే వారికే మా ఓటంటున్నారు హిమాచల్ ప్రజలు. హిమాచల్ప్రదేశ్లోని షిమ్లా, బిలాస్పూర్, మండీ, చంబా తదితర ప్రాంతాల్లో కోతుల బెడద ఎక్కువైంది. కోతులు, ఇతర జంతువులు పంటలను సర్వనాశనం చేస్తున్నాయి. హిమాచల్ప్రదేశ్లో 80శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడింది. దాదాపు నాలుగు లక్షలకు పైఔగా కోతులు ఈ పంటలపై పడి నాశనం చేస్తున్నాయి. దీని ఫలితంగా ఏడాదికి 500కోట్ల రూపాయల పంట నష్టం వాటిల్లుతోంది. మొత్తానికి ఈ కోతుల వ్యవహారం ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో నేతలు కూడా వానరాలపై ఓ లుక్కేశారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకొమ్మని బిజెపి సలహానిస్తుండగా, కోతులకు స్టెరిలైజేషన్ సెంటర్స్ను ఏర్పాటుచేస్తామని కాంగ్రెస్ అభయహస్తమిస్తోంది. ఇక సిపిఐ-ఎం ఏకంగా కోతులను చంపేందుకు అనుమతి కోసం కోర్టుకెక్కింది. మొత్తం మీద హిమాచల్ ప్రదేశ్ లో కోతిగోల ఎక్కువైపోయింది.