breaking news
C-section records
-
డెలివరీ డేట్ను ప్లాన్ చేసుకుంటే పుట్టే పిల్లలకు లుకేమియా ముప్పు
న్యూఢిల్లీ: తల్లీబిడ్డను కాపాడేందుకు అప్పటికప్పుడు చేసే సీ–సెక్షన్(కోత) ఆపరేషన్తో పోలిస్తే ముందస్తుగా ఒక తేదీ అనుకుని ప్లాన్చేసి ఆపరేషన్ చేయించిన సందర్భాల్లో పుట్టిన చిన్నారులకు రక్త క్యాన్సర్ (లుకేమియా) ముప్పు అధికంగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. బిడ్డ డెలివరీ సాధ్యంకాక ప్రసవవేదనతో ఇబ్బందిపడుతున్న గర్భిణికి మాత్రమే గతంలో సీ–సెక్షన్ విధానంలో కోతపెట్టి ఆపరేషన్ చేసేవారు. తదనంతరకాలంలో మంచిరోజు చూసుకుని, మరికొందరు తమకు వీలున్నప్పుడు, మరికొందరు సెలవుతేదీ ఇలా వేర్వేరు కారణాలతో డెలివరీ తేదీని ప్లాన్చేసుకునే ధోరణి ఎక్కువైంది. ఇలా ప్లాన్డ్ సిజేరియన్ సెక్షన్ ఆపరేషన్ ద్వారా పుట్టిన చిన్నారులు భవిష్యత్తులో లుకేమియా వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ పరిశోధకులు చెప్పారు. సంబంధిత పరిశోధన తాలూకు వివరాలు ‘ది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్’లో ప్రచురితమయ్యాయి. స్వీడన్లో మెడికల్ బర్త్ రిజిస్ట్రర్ గణాంకాల ద్వారా సేకరించిన 1982–89, 1999–2015 కాలాల్లో జన్మించిన 25 లక్షల మంది చిన్నారుల ఆరోగ్య రికార్డులను విశ్లేషించి ఈ అధ్యయన నివేదికను రూపొందించారు. వీరిలో 3.75 లక్షల మంది అంటే 15.5 శాతం మంది సీ–సెక్షన్ ద్వారా జన్మించారు. వీరిలో 1,495 మందికి లుకేమియా వ్యాధి సోకింది. సహజ ప్రసవం ద్వారా పుట్టిన చిన్నారులతో పోలిస్తే సీ–సెక్షన్ ద్వారా జన్మించిన పిల్లల్లో అత్యత తీవ్రమైన లింఫోబ్లాస్టిక్ లుకేమియా వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువ అని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లో పరిశోధకురాలు, ఈ పరిశోధనలో కీలక రచయిత క్రిస్టినా ఇమోర్ఫియా క్యాంపిస్టీ చెప్పారు. సహజ ప్రసవ సమయంలో ఒక్కోసారి ఉమ్మనీరు సంచి పగలిపోయి శిశువు బయటికొచ్చే వేళ యోని బ్యాక్టీరియా అంటుకుంటుంది. ఈ బ్యాక్టీరియా సోకడం పుట్టినబిడ్డకు ఎంతో మంచిదని సైన్స్ చెబుతోంది. తొలినాళ్లలోనే బ్యాక్టీరియా సోకడంతో భవిష్యత్తులో మంచి, చెడు బ్యాక్టీరియాల మధ్య తేడాలను గుర్తించడం, భవిష్యత్తులో అలర్జీలు, ఆటోఇమ్యూన్ వంటి సమస్యలు రావని, చిన్నారుల పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుదల బాగుంటుందని ఇప్పటికే పలు పరిశోధనలు చెబుతున్నాయి. -
సిజేరియన్లపై మేనక సీరియస్
న్యూఢిల్లీ: విచ్చలవిడిగా జరుగుతున్న సిజేరియన్ ఆపరేషన్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మహిళల ఆరోగ్యాన్నిదెబ్బతీయడంతోపాటు..కొన్నిచోట్ల మరణాలకు దారి తీస్తున్న వైనాన్ని మహిళా శిశు మంత్రిత్వ శాఖ సీరియస్గా పరిగణిస్తోంది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రి మేనకా గాంధీ ట్విట్టర్ లో దేశీయ గైనకాలజిస్టులకు కొన్ని హెచ్చరికలు లేదా మార్గదర్శకాలను జారీచేసేలా యోచిస్తున్నారు. దీనికి సంబంధించి బుధవారం ఆమె వరుస ట్వీట్లలో కొన్ని సూచనలు చేశారు. ఆయా ఆసుపత్రులు సిజేరియన్, సాధారణ కాన్పుల రికార్డులను బహిర్గతం చేయాలన్నారు. ఈ సమస్య తీవ్రత, పర్యవసానాలపై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జయప్రకాష్ నడ్డాకు లేఖ రాసినట్టు తె లిపారు. కొన్ని రాష్ట్రాల్లో సి సెక్షన్ శస్త్రచికిత్సలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిఫారసు చేసిన కంటే 10-15 శాతం చాలా ఎక్కువగా ఉన్నాయంటూ కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్న ఈ ఆపరేషన్లు తనకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ పరిస్థితి ప్రయివేట్ ఆసుపత్రుల్లో మరీ దారుణంగా ఆమె పేర్కొన్నారు. 2015-16 సంవత్సరానికి నేషనల్ ఫ్యామిటీ హెల్త్ సర్వే ప్రకారం తెలంగాణాలో 58శాతం, తమిళనాడు 34 శాతంగా ఉందన్నారు. గత నెల ఎయిమ్స్లో సిజేరియన్ ఆపరేషన్ తరువాత ఒక నర్సు చనిపోయిన నేపథ్యంలో ఆమె ఇలా స్పందించారు. సి-సెక్షన్లు-అదుపునకు కాన్పుల వివరాలను బహిర్గతం చేసే అంశాన్ని తప్పనిసరి చేయాలని సూచించాన్నారు. దేశంలో పెరుగుతున్న ఈ ధోరణికి చెక్ చెప్పే మార్గాలపై మహిళలు, భావి తల్లులు, వైద్యులు నుంచి సలహాలను కోరుతున్నట్టు ట్వీట్ చేశారు. I have written to Minister, @MoHFW_INDIA, Sh. @JPNadda ji today about the scale of the problem and its repercussions — Maneka Gandhi (@Manekagandhibjp) February 22, 201I seek suggestions from women, prospective mothers & doctors on ways in which we can check this increasing trend. /10 — Maneka Gandhi (@Manekagandhibjp) February 22, 2017