breaking news
Audit Section
-
కొలిక్కి వచ్చిన ‘ఆప్కో’ విభజన
45 షోరూంలు తెలంగాణకు ! తేలాల్సిన ఆంధ్రావాటా హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సహకార సంఘం (ఆప్కో) విభజన ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే పాలక మండలి విభజనకు ఆమోదం లభించడంతో జూన్ మొదటి వారంలోగా ఈ పక్రియ కొలిక్కిరానుంది. ఎక్కడి ఆస్తులు అక్కడే ప్రాతిపదికన మార్గదర్శకాలు రూపొందిం చారు. సంస్థ ఆదాయం, అప్పులపై ఆడిట్ విభాగం లెక్కలు సిద్ధం చేస్తోంది. ఆప్కో ఉత్పత్తుల విక్రయాల్లో కీలకమైన షోరూములను రెండు కేటగిరీలుగా విభజించారు. ఉమ్మడి రాష్ట్రంలో వున్న షోరూంలు, గోదాములను ఎక్కడివి అక్కడే ప్రాతిపదికగా కేటాయిస్తారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న షోరూములు ఎవరికి చెందాలనేదానిపై ఏకాభిప్రాయానికి రావాల్సి వుంది. ఆప్కో పరిధిలో మొత్తం 184 షోరూంలుండగా, వీటిలో తెలంగాణ పరిధిలోకి 45 వస్తున్నాయి. మరో 26 షోరూంలు బయటి రాష్ట్రాల్లో అనగా గుర్గాంవ్, ఔరంగాబాద్, నాందేడ్, కాన్పూర్, న్యూఢిల్లీ, కటక్, కోల్కతా, బెంగళూరు, మైసూరు, దావణగెరి, బళ్లారి తదితర పట్టణాల్లో ఉన్నాయి. బయటి రాష్ట్రాల్లో ఒకటి కంటే ఎక్కువ షోరూంలు ఉన్న చోట రెండు రాష్ట్రాలకు సమాన నిష్పత్తిలో కేటాయిస్తారు. వరంగల్, హైదరాబాద్లోని ఆప్కో గోదాములు తెలంగాణకే చెందనున్నాయి. పాలక మండలి విభజన పూర్తి ప్రస్తుతం ఆప్కో పాలక మండలిలోని మొత్తం 24 మంది డెరైక్టర్లకుగాను తెలంగాణకు 11, ఆంధ్రప్రదేశ్కు 13 మందిని కేటాయించారు. దీంతో మురుగుడు హన్మంతరావు నాయక త్వంలోని ప్రస్తుత పాలకమండలి ఉనికి కోల్పోయినట్లే. 42ః58 నిష్పత్తిలో తెలంగాణ, ఏపీకి ఉద్యోగుల పంపిణీ జరగనుంది. స్థానికత ఆధారంగా తెలంగాణకు 108, ఏపీకి 200 మంది ఉద్యోగులను కేటాయించాలని నిర్ణయించారు. జూన్ మొదటి వారంలోగా విభజన ప్రక్రియ పూర్తికానున్నట్లు అధికారులు వెల్లడించారు -
జీహెచ్ఎంసీకి ‘ఆడిట్’ అక్షింతలు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అంటేనే అక్రమాలకు నెలవనే ప్రచారం ఉంది. దానికి మరింత బలాన్నిస్తూ.. 2010-11 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీలోని ఆయా విభాగాల్లో పలు అవకతవకలు జరిగినట్లు ఆడిట్ విభాగం పేర్కొంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంది. ఆడిట్ విభాగం తప్పుబట్టిన అంశాలివే.. గోషామహల్లో అనుమతి పొందిన లేఔట్, అవసరమైన ఎల్ఆర్ఎస్ లేకున్నా బీపీఎస్ ద్వారా కొన్ని భవనాల్ని క్రమబద్ధీకరించారు. తద్వారా జీహెచ్ఎంసీకి ఫీజుల రూపేణా రూ. 12,95,092 నష్టం వాటిల్లింది మల్కాజిగిరి సర్కిల్లో బీపీఎస్/ఎల్ఆర్ఎస్ ఫైళ్ల క్లియరెన్స్ కోసమని అదనపు సిబ్బందిని ఔట్సోర్సింగ్పై తీసుకున్నారు. దాని కాంట్రాక్టును ఎస్వీఎస్ఎస్ అనే ఏజెన్సీకి అప్పగించి, రూ.4,59,100 చెల్లించారు. బీపీఎస్/ఎల్ఆర్ఎస్ ఫైళ్లలో ఎన్ని ఫైళ్లు సర్కిల్కు అందాయో, ఎన్ని పెండింగ్లో పడ్డాయో వివరాల్లేవు. ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి ఇతర వివరాలూ లేవు. దీనిపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి మల్కాజిగిరి సర్కిల్ గౌతంనగర్ రిజర్వాయర్ నుంచి 10 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను ఆర్నెళ్లపాటు కాంట్రాక్టరు బి.శ్రీనివాసరావుకు అప్పగించారు. ట్రిప్పుకు రూ. 116 చొప్పున చెల్లించారు. కానీ, ఏయే ప్రాంతాలకు నీళ్లు సరఫరా చేశారు?, నీటి కొరత ఉన్న ప్రాంతాలకే సరఫరా చేశారా? తదితర వివరాలేవీ లేవు. రూ.22,36,857 మేరకు చెల్లింపులపై అనుమానాలున్నాయి ఆస్తిపన్ను, వివిధ ఫీజులు, ట్యాక్సుల కింద జీహెచ్ఎంసీ స్వీకరించిన చెక్కుల్లో కొన్ని బౌన్స్ అయ్యాయి. మరికొన్ని చెక్కుల మొత్తం ఖజానాకు చేరలేదు. తద్వారా జీహెచ్ ఎంసీకి రూ. 28,55,133 నష్టం వాటిల్లింది. కాప్రా, అబిడ్స్ సర్కిళ్లలో ఈ తతంగం జరిగింది ఆబిడ్స్ సర్కిల్లో పావలావడ్డీ పథకం కింద రూ. 51,15, 538 మేర జీహెచ్ఎంసీ సాధారణ నిధులను వ్యయం చేయడం ఆక్షేపణీయం.