- జైలులో సాధారణ ఖైదీగానే చూస్తున్నాం: హరియాణ సీఎస్
- రాష్ట్రంలో సడలని ఉద్రిక్తత.. భారీగా సైన్యం మోహరింపు
- డేరా ఆశ్రమాలను ఖాళీచేయిస్తోన్న అధికారులు
సిర్సా/ఛండీగఢ్: అత్యాచారం కేసులో గుర్మీత్ సింగ్ రామ్ రహీమ్ దోషిగా తేలడంతో ఆయనకు కల్పిస్తోన్న జడ్ప్లస్ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకున్నట్లు హరియాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపిందర్ సింగ్ చెప్పారు. సీబీఐ కోర్టు తీర్పు అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింసాకాండపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆందోళనల్లో ఇప్పటి వరకూ31 మంది చనిపోయారని, 250 మంది గాయపడ్డారని సీఎస్ సింగ్ తెలిపారు. శుక్రవారం రాత్రి 15 మంది డేరా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నామని, ఆయా బృందాలపై రెండు దేశద్రోహం కేసులు పెట్టామని చెప్పారు. పంచకుల కోర్టు నుంచి గుర్మీత్ను హెలికాప్టర్లో రోహతక్ జైలుకు తరలించామన్న సీఎస్.. జైలులో దోషికి వీఐపీ సేవలు అందుతున్నాయన్న వార్తలను ఖండించారు. గుర్మీత్ను సాధారణ ఖైదీగానే చూస్తున్నామని, అందరూ తినే ఆహారాన్నే ఆయనకూ అందిస్తున్నామని వివరించారు.
హరియాణాలో సడలని ఉద్రిక్తత: గుర్మీత్పై కోర్టు తిర్పు అనంతరం ఉత్తరభారతంలోని ఆరు రాష్ట్రాల్లో డేరా సచ్ఛా సౌధా కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. హరియాణ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లలో శుక్రవారం రాత్రి వరకూ ఉద్రిక్తత కొనసాగింది. అయితే శనివారం మధ్యాహ్నానికల్లా పంజాబ్, ఢిల్లీ, యూపీ, హిమాచల్, రాజస్థాన్ల జిల్లాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం అక్కడ ఎలాంటి ఆందోళనలూ చోటుచేసుకోనప్పటికీ కర్ఫ్యూను మాత్రం కొనసాగిస్తున్నారు. అయితే, హరియాణాలోని పలు పట్టణాల్లో హింసాయుత ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఆందోళనలకు కేంద్ర బిందువులైన పంచకుల, సిర్సా, మన్సా, మన్కోట్ పట్టణాలకు శనివారం నాటికి పెద్ద ఎత్తున ఆర్మీ బలగాలు తరలివెళ్లాయి.
డేరా ఆశ్రమాల మూసివేత: హైకోర్టు ఆదేశానుసారం పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా గుర్మీత్కు చెందిన డేరా సచ్ఛా సౌదా ఆశ్రమాలను ఖాళీచేయిస్తున్నారు. అంబాలా, కురుక్షేత్ర, కర్నాల్, కైథాల్, పంచకుల తదితర పట్టణాల్లోని డేరా ఆశ్రమాల్లో ఆశ్రయం పొందుతోన్న లక్షల మందిని పోలీసు బలగాలు బయటికి పంపేస్తున్నారు. వారిలో మహిళలు, చిన్నపిల్లల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో తరలింపు ప్రక్రియ నిదానంగా సాగుతోంది.
డేరా స్వచ్ఛ సౌధా చీఫ్ గుర్మీత్ 2002లో తన ఆశ్రమంలో సాధ్విలుగా ఉన్న ఇద్దరు మహిళలపై అత్యాచారం చేశారనే ఆరోపణలు రుజువుకావడంతో పంచకుల సీబీఐ కోర్టు ఆయనను శుక్రవారం దోషిగా నిర్ధారించింది. సోమవారం గుర్మీత్కు శిక్షలు ఖరారు కానున్నాయి.
గుర్మీత్కు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉపసంహరణ
Published Sat, Aug 26 2017 3:18 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రెండు బైక్లు ఢీ.. ఇద్దరికి గాయాలు
వరుస చోరీలతో భయాందోళన
ఎన్నికల విధుల సమస్యల పరిష్కారంపై హామీ
గంజాయితో ముగ్గురు యువకుల అరెస్ట్
సుభలయలో కార్డన్సెర్చ్
● జూన్ 4 కోసం అందరి ఎదురుచూపులు ● కాళింగ కార్పొరేషన్ చైర్మన్ దుంపల లక్ష్మణరావు
వైభవంగా అశ్వవాహన సేవ
‘ప్రతి బోటుకు జీపీఎస్ తప్పనిసరి’
కౌంటింగ్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి
మనదేపెత్తనం
తప్పక చదవండి
- రాష్ట్రీయ గీతం.. రెండు వెర్షన్లలో
- వారణాసిలో వార్ వన్ సైడే
- ఎమ్మెల్సీ కవితపై చార్జిషీటు
- సన్న వడ్లపై సర్కార్ సన్నాయి నొక్కులు
- ‘పట్టభద్రులపై’ పట్టు కోసం!
- ఆక్వాలో అగ్రగామిగా ఏపీ
- మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు కన్నుమూత
- ఇక సులభంగా సేంద్రీయ ధ్రువీకరణ
- సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్
- చైనా గ్యాంగ్ చెరలో భారతీయులు
Advertisement