ఇంట్లోనే రంజాన్‌ తారావీహ్‌ ప్రార్థనలు

Amid Corona Lockdown Ramadan Taraweeh Prayers At Home - Sakshi

తారావీహ్‌ను ఇంట్లోనే చేసుకోవాలి

ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ

సాక్షి, హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో పవిత్ర పుణ్య మాసమైన రంజాన్‌ తారావీహ్‌ నమాజ్‌లను ఇళ్లలోనే పూర్తి చేసుకోవాలని ఉలేమాలు, ముఫ్తీలు, ఇస్లామిక్‌ స్కాలర్‌లు ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జామియా–నిజామియా గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. రంజాన్‌ ఉపవాస దీక్షల సందర్భంగా సహర్‌తో పాటు ఇఫ్తార్‌లను కూడా ఇళ్లలోనే చేసుకోవాలని కోరింది. డబ్బులు వృథా చేయకుండా పేదలకు చేయూత అందించాలని, లాక్‌డౌన్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరింది.  
(చదవండి: ఇంకా చాలానే ఉంది..!)

ఇక రంజాన్‌ నెలలో తారావీహ్‌ను ఇంట్లోనే చేసుకోవాలని ఉలేమాన్, ముఫ్తిలు కోరడాన్ని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ స్వాగతించారు. గురువారం ఆయన ఈ మేరకు ట్వీట్‌ చేస్తూ కరోనా వైరస్‌ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించినందున ఇదో మంచి విజ్ఞప్తిగా పేర్కొన్నారు. అన్ని ముస్లిమ్‌ పాఠశాలలకూ మార్గదర్శకాలు జారీ చేశారని, వీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కచ్చితంగా పాటించాలన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top