పరిశ్రమలకు తగ్గించైనా రైతులకు విద్యుత్ | Sakshi
Sakshi News home page

పరిశ్రమలకు తగ్గించైనా రైతులకు విద్యుత్

Published Sat, Aug 23 2014 7:03 PM

హరీష్ రావు - Sakshi

హైదరాబాద్: పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరా తగ్గించైనా రైతులకు 7 గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తామని  మంత్రి హరీష్‌ రావు చెప్పారు. రైతు రుణమాఫీ అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  తెలంగాణలో కరువు పరిస్థితులపై మంత్రి  సమీక్షా సమావేశం నిర్వహించారు.

కరువును ఎదుర్కొనేందుకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చెరువుల పునరుద్దరణ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. తీవ్రమైన కరువు దృష్ట్యా ఉపాధి హామీ పనిదినాలను 100 నుంచి 150 రోజులకు పెంచే విధంగా కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు.

Advertisement
Advertisement