పుజారా హాఫ్ సెంచరీ.. కోహ్లి ఔట్
సౌతాంప్టన్: ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి వికెట్ను కోల్పోయింది. సామ్ కరన్ బౌలింగ్లో కోహ్లి(46) కుక్కు చిక్కి హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. దీంతో మూడో వికెట్కు నమోదైన 92 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు పుజారా 100 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ సాధించాడు. క్రీజులోకి వచ్చిన రహానేతో పుజారా ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నాడు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు