మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల అగ్రనేతలు పరస్పరం బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ విషయాలను ప్రధాని మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. వ్లాదిమిర్ పుతిన్ తనకు మహాత్మాగాంధీ తన స్వహస్తాలతో రాసుకున్న డైరీలోని ఓ పేజీని కానుకగా ఇచ్చినట్లు మోదీ ట్వీట్ చేశారు. ఆ బహుమతి సమర్పించినందుకు పుతిన్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు 18వ శతాబ్దానికి చెందిన బెంగాల్ కత్తిని ప్రదానం చేసినట్లు మోదీ వెల్లడించారు.
బుధవారం రాత్రి ప్రధాని మోదీ మాస్కో చేరుకున్న విషయం తెలిసిందే. వార్షిక చర్చల్లో భాగంగా రెండు రోజుల రష్యా పర్యటనలో ప్రధాని మోదీ ఉన్నారు. భారత్, రష్యా మధ్య ఆర్థిక, శక్తి, రక్షణ సంబంధమైన అంశాలకు సంబంధించి అగ్రనేతలు ఒప్పందాలు చేసుకోనున్నారు. సాంకేతిక పరిజ్ఞానం, మైనింగ్ ఇతర రంగాల్లో పరస్పర ఒప్పందాలపై ఇరుదేశాల నేతలు చర్చిస్తారు.
President Putin gifted me a page from Gandhi ji's diary containing Bapu's handwritten notes. pic.twitter.com/L6xs9KdRq4
— Narendra Modi (@narendramodi) December 24, 2015
President Putin also gifted an 18th century sword from Bengal, featuring intricate silver artwork. I thank him for the gifts.
— Narendra Modi (@narendramodi) December 24, 2015