వాషింగ్టన్‌లో పట్టాలు తప్పిన రైలు.. ముగ్గురు మృతి! | Sakshi
Sakshi News home page

వాషింగ్టన్‌లో పట్టాలు తప్పిన రైలు.. ముగ్గురు మృతి!

Published Tue, Dec 19 2017 3:20 AM

Amtrak derailment: Train crashes near Tacoma, Washington,  - Sakshi

సియాటిల్‌: అమెరికాలోని వాషింగ్టన్‌ రాష్ట్రం టకోమా నగరం సమీపంలో సోమవారం రాత్రి(అమెరికా కాలమానం) రైలు పట్టాలు తప్పడంతో దాదాపు ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సియాటల్‌ నుంచి పోర్ట్‌లాండ్‌కు వెళ్తుండగా ఈ రైలు పట్టాలు తప్పింది. ప్రమాద సమయంలో రైలులో 78 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. ఒక బోగీ హైవేపై బోల్తా పడిందని స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు. గాయపడ్డ పలువురిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.  

Advertisement
Advertisement