బైక్ ను ఢీకొట్టిన టాటా ఏస్ వాహనం: ఇద్దరి మృతి | Sakshi
Sakshi News home page

బైక్ ను ఢీకొట్టిన టాటా ఏస్ వాహనం: ఇద్దరి మృతి

Published Sun, Aug 30 2015 2:37 PM

two dies in a road mshap in nallagonda

చివ్వెంల: వేగంగా ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనం.. అదే వేగంతో ఎదురుగా వచ్చిన బైక్ ను ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. నల్లగొడ జిల్లా చివ్వెంల మండల కేంద్రంలో ఆదివారం మద్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.

మండల కేంద్రానికి చెందిన కృష్ణ (25), సైదులు (28) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరూ కలిసి బైక్‌పై అక్కనదేవి గూడెం గ్రామానికి వెళ్లి వస్తున్న సమయంలో చివ్వెంల శివారువద్ద సూర్యాపేట నుంచి ఖ్మమం వెళ్తున్న టాటా ఏస్ వాహనం వారి బైక్ ను ఢీకొట్టింది.

 

దీంతో కృష్ణ, సైదులు అక్కడికక్కడే మృతిచెందగా.. చారీ అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement
Advertisement