Sakshi News home page

చదవలేకపోతున్నా..అందుకే

Published Thu, Jul 30 2015 1:06 PM

inter student suicide in hindupuram

అనంతపురం(హిందూపురం): చదువు ఇష్టం లేక ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో గురువారం చోటుచేసుకుంది. హిందూపురంలోని ముదిరెడ్డి పల్లికి చెందిన నిఖిల(18) అనే యువతి స్థానిక ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ రెండో ఏడాది చదువుతోంది. అయితే చదవలేకపోతున్నా అని ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సుసైడ్ నోట్ రాసి గురువారం ఉదయం ఉరివేసుకుంది. కాగా, పది రోజుల కిందట ఇదే కళాశాలలో మరో విద్యార్థి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు.
 

Advertisement
Advertisement