చైనాలో మూడేళ్ల బాలికకు ఆపరేషన్ సక్సెస్
* 3డీ ప్రింటెడ్ లోహపుర్రె మార్పిడి
* ప్రపంచంలో ఇదే తొలిసారి
బీజింగ్: ప్రపంచ వైద్యరంగంలోనే కీలకమైన సరికొత్త పుర్రె మార్పిడి శస్త్రచికిత్సను చైనా వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. హైడ్రోసెఫలస్(తలలో నీరు చేరడం) అనే సమస్య బారిన పడిన ఓ మూడేళ్ల బాలికకు వారు త్రీడీ(3డీ) ప్రింటెడ్ లోహపు పుర్రెను మార్పిడి చేశారు.
ఇలా 3డీ ప్రింటర్ ద్వారా తయారు చేసిన పుర్రెను అమర్చడం ప్రపంచంలో ఇదే మొట్టమొదటిసారి. శస్త్రచికిత్స విజయవంతం అయిందని, బాలిక కోలుకుంటోందని వైద్యులు వెల్లడించారు. చైనాలోని హునాన్ రాష్ట్రంలో గల సెకండ్ పీపుల్స్ హాస్పిటల్లో బుధవారం జరిగిన ఈ విప్లవాత్మక శస్త్రచికిత్స వివరాల్లోకెళితే... హునాన్ రాష్ట్రానికి చెందిన మూడేళ్ల బాలిక హాన్ హాన్కు పుట్టుకతోనే హైడ్రోసెఫలస్ సమస్య వచ్చింది. ఫలితంగా తలలో నీరు చేరి క్రమంగా ఉబ్బిపోవడం మొదలైంది.
మూడేళ్లు వచ్చేసరికి ఆమె బరువు 32 కిలోలకు చేరితే.. అందులో 20 కిలోలు తల బరువే అయింది. తల విపరీతంగా ఉబ్బిపోవడం, నీరు అధికం కావడంతో నేత్రనాడిపై ఒత్తిడి పెరిగి చూపు పోయింది. మెదడుకు రక్త సరఫరా కూడా తగ్గింది. ఇప్పటికే పలుచబడిపోయిన పుర్రె మరింత ఆలస్యం చేస్తే.. ఏ క్షణమైనా పగిలిపోవచ్చని వైద్యులు గుర్తించారు. ఆమెకు 3డీ ప్రింటెడ్ పుర్రెను మార్పిడి చేసి ప్రాణాలు కాపాడాలని నిర్ణయించారు.
17 గంటల్లో ఆపరేషన్...: వైద్యులు తొలుత హాన్ హాన్ పుర్రె పైభాగాన్ని సీటీస్కాన్ చేసి, 3డీ రూపాన్ని డిజైన్ చేశారు. డిజైన్ మేరకు టైటానియం లోహ మిశ్రమంతో 3డీ ప్రింటర్ ద్వారా పుర్రెను 3 భాగాలుగా ముద్రించారు. తర్వాత బాలిక తలపై చర్మాన్ని, పుర్రె పైభాగాన్ని తొలగించి, అదనపు నీటిని మొత్తం తీసేశారు. అనంతరం మెదడును సరిగ్గా ఉంచి, దానిపై 3డీ ప్రింటెడ్ పుర్రె ఇంప్లాంట్లను కలిపి అమర్చి, తల చర్మాన్ని అలాగే ఉంచి కుట్లు వేశారు. బాలిక ప్రస్తుతం కోలుకుంటోందని వైద్యులు తెలిపారు.
కొన్నేళ్లలో ఆమె తలలో అమర్చిన ప్రస్తుత ఇంప్లాంట్ల మీదుగా అసలైన పుర్రె ఎముక పెరిగి కొత్త పుర్రె తయారవుతుందని వెల్లడించారు. కాగా, మొత్తం చికిత్స పూర్తయ్యేసరికి రూ. 40-50 లక్షల దాకా ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో పేదవాడైన హాన్ హాన్ తండ్రి ఆన్లైన్లో విరాళాల కోసం అభ్యర్థించగా ఇప్పటిదాకా రూ. 10 లక్షలు పోగయ్యాయి. ఇంకా విరాళాలు అందుతున్నాయి.
త్రీడీ పుర్రె మార్పిడి!
Published Sat, Jul 18 2015 12:23 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లక్నోపై ఢిల్లీ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
AP: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్
హీరోతో వివాదం.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్!
టీమిండియా హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..!?
తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
చెలరేగిన స్టబ్స్, అభిషేక్.. లక్నో ముందు భారీ టార్గెట్
వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. డీహెచ్ఎఫ్ఎల్ ధీరజ్ వాధావన్ అరెస్ట్
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement