lకారు ఢీకొని 12 గొర్రెల మృత్యువాత | Sakshi
Sakshi News home page

lకారు ఢీకొని 12 గొర్రెల మృత్యువాత

Published Thu, Sep 29 2016 1:43 AM

lకారు ఢీకొని 12 గొర్రెల మృత్యువాత - Sakshi

ఉండ్రుగొండ(చివ్వెంల)
కారు ఢీకొని 12 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన మండల పరిధిలోని వల్లభాపురం ఆవాసం ఉండ్రుగొండ గ్రామ స్టేజీ వద్ద బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన చెవుల వీరభద్రం తన గొర్రెలను మేపేందుకు వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లి ఇంటికి వచ్చే క్రమంలో గ్రామ స్టేజీ వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో 12 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. వీటి విలువ రూ.70 వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు. కాగా కారు నంబరు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
 

Advertisement
Advertisement