స్మార్ట్ఫోన్లు తయారు చేసే హెచ్టీసీ సంస్థ 816 మోడల్లో జీఎస్ఎం సిమ్లను మాత్రమే సపోర్ట్ చేసే స్మార్ట్ఫోన్ను మంగళవారం ఆవిష్కరించింది.
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్లు తయారు చేసే హెచ్టీసీ సంస్థ 816 మోడల్లో జీఎస్ఎం సిమ్లను మాత్రమే సపోర్ట్ చేసే స్మార్ట్ఫోన్ను మంగళవారం ఆవిష్కరించింది. డిజైర్ 816 జీ పేరుతో హెచ్టీసీ అందిస్తున్న ఈ డ్యుయల్ నానో సిమ్ స్మార్ట్ఫోన్ ధర రూ.18,990. అక్టోబర్ రెండో వారం నుంచి ఈ ఫోన్లను విక్రయిస్తామని హెచ్టీసీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ చియాంగ్-లిన్ చాంగ్ తెలిపారు.
డిజైర్ 816 జీ ఫోన్లో 5.5 అంగుళాల స్క్రీన్, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 8 జీబీ మెమొరి, 32 జీబీ ఎక్స్పాండబుల్ మెమరీ వంటి ఫీచర్లున్నాయని చెప్పారు. కాగా, 8-కోర్ ప్రాసెసర్తో రూపొందిన 4జీ డ్యుయల్ సిమ్ స్మార్ట్ఫోన్లు-డిజైర్ 820, 820క్యూలను కూడా కంపెనీ ఆవిష్కరించింది. నెల తర్వాత అందుబాటులోకి వచ్చే వీటి ధరలను కంపెనీ వెల్లడించలేదు. ఈ ఫోన్లలో 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా; 16జీబీ ఇంటర్నల్, 128జీబీ ఎక్స్పాండబుల్ మెమరీ ఫీచర్లున్నాయి.