దీపావళికి ద.మ. రైల్వే ప్రత్యేక రైళ్లు | Sakshi
Sakshi News home page

దీపావళికి ద.మ. రైల్వే ప్రత్యేక రైళ్లు

Published Wed, Oct 22 2014 8:38 AM

దీపావళికి ద.మ. రైల్వే ప్రత్యేక రైళ్లు

దీపావళి పండుగ సెలవుల దృష్ట్యా ప్రయాణికుల రద్దీ పెరగడంతో తిరుపతి, కాకినాడల నుంచి రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. బుధవారం రాత్రి తిరుపతి నుంచి 10 గంటలకు బయల్దేరే రైలు మర్నాటి ఉదయం 10.50 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి, శుక్రవారం 24వ తేదీ ఉదయం 6 గంటలకు రేణిగుంట చేరుకుంటుంది.

అలాగే కాకినాడ నుంచి సికింద్రాబాద్కు జనసాధారణ్ సూపర్ఫాస్ట్ ప్రత్యేక రైలు ఒకదాన్ని దక్షిణమధ్య రైల్వే నడుపుతోంది. ఈ రైలు 26వ తేదీ ఆదివారం సాయంత్రం 5.55 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి, మర్నాటి తెల్లవారుజామున 3.50 గంటలకు కాకినాడ చేరుకుంటుంది.

Advertisement
Advertisement