బీమా సొమ్ము ఇవ్వలేదయ్యా | Sakshi
Sakshi News home page

బీమా సొమ్ము ఇవ్వలేదయ్యా

Published Fri, Apr 20 2018 6:16 AM

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

కృష్ణా జిల్లా : ‘అయ్యా.. నా భర్త వడ   దెబ్బతో రెండేళ్ల కిందట మృతి చెందారు. చంద్రన్న బీమా కింద అంత్యక్రియలకు రూ.5 వేలు ఇచ్చారు. రెండో దఫా రావాల్సిన రూ.30వేల కోసం అప్పటి నుంచి కాళ్లరిగేలా తిరుగుతున్నాను’ అంటూ ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామానికి చెందిన దివ్యాంగురాలు     బి.కోటమ్మ జననేత ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్‌ను కలసి కన్నీటి      పర్యంతమయ్యారు. అధికారుల చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా ఫలితం లేకపోయిందని వాపోయారు. రాజకీయ వివక్షతో బీమా సొమ్ము రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. తనకు న్యాయం చేయాలని జగన్‌ను కోరారు.

Advertisement
Advertisement