-
బొత్స.. గెలుపు ధీమా
చీపురుపల్లి రూరల్ (గరివిడి): సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరం గరివిడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఆయన మంగళవారం విచ్చేశారు. ఈ మేరకు నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యాలయానికి చేరుకుని ఎన్నికలు జరిగిన విధానాన్ని వివరించారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లోనూ వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓట్లు వేశారని తెలిపారు. పార్టీకి గ్రామస్థాయి నుంచి మంచి ఆదరణ ఉన్న క్రమంలో ఫ్యాన్ హవా జోరుగా ఉందని తెలియజేయగా, ఈ మేరకు ఆయన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ధీరా ఫౌండేషన్ అధినేత బొత్స సందీప్, నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
మొక్కలతో పర్యావరణ పరిరక్షణ
వేపాడ: ప్రతి ఒక్కరం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడదామని గ్రీన్ ఎర్త్ ఆర్గనైజేషన్ (జియో) వ్యవస్థాపకుడు బి.రామకృష్ణ అన్నారు. గ్రామాల్లో నిర్వహించే పండగలు, శుభకార్యాల సమయంలో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. గ్రామానికి చెందిన ఓ జంట వివాహ వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలోని పశలమ్మ, వీరగౌరమ్మ, వీరబ్రహ్మేంద్రేస్వామి, పైడితల్లమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం 66 కొబ్బరి మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీఎమ్ డైరెక్టర్ విజయలక్ష్మి, కర్రిశ్రీనివాసరావు, ఎ.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
రాజీయే రాజమార్గం
● సీనియర్ సివిల్ జడ్జి వివేక్ ఆనంద్ శ్రీనివాస్ రాజాం సిటీ: సివిల్ తగాదాలు, భార్యాభర్తల మధ్య రాజీ కుదిర్చేలా మధ్యవర్తిత్వం చేయాలని, రాజీయే రాజమార్గమని సీనియర్ సివిల్ జడ్జి సీహెచ్ వివేక్ ఆనంద్ శ్రీనివాస్ అన్నారు. రాజాం కోర్టు సముదాయంలో న్యాయవాదులతో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భార్యాభర్తల గొడవల విషయంలో మధ్యవర్తిత్వం ఆవశ్యకతను వివరించారు. గొడవలు పడుతున్నవారిని మధ్యవర్తిత్వ కేంద్రాలకు పంపుతామని, అక్కడ శిక్షణ పొందిన న్యాయవాదులు, ఉపాధ్యాయులు, సోషల్ వర్కర్స్, ఎన్జీఓ సంబంధిత వ్యక్తులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తారని వెల్లడించారు. మధ్యవర్తిత్వం ద్వారా ఇరు పార్టీల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు. నిర్దేశించిన కాలంలో మధ్యవర్తిత్వం జరిపి రిపోర్టును న్యాయ సంస్థలకు అందజేయాలని సూచించారు. అది కూడా విఫలమైతే సంబంధిత కోర్టులో విచారణ జరుగుతుందన్నారు. రాజాం బార్ అసోసియేషన్లో ఇప్పటికే శిక్షణ పొందిన న్యాయవాదులు మధ్యవర్తులుగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి పీఎస్వీబీ కృష్ణసాయితేజ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.రామినాయుడు, వై.ఈశ్వరరావు, ఎస్.పోలారావు, తదితరులు పాల్గొన్నారు. -
రాయల్ ఎన్ఫీల్డ్ దగ్ధం
కొత్తవలస: మండలంలోని కొత్తవలస–విజయనగరం రోడ్డులో ప్రమాదవశాత్తు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మంగళవారం దగ్ధమైంది. కొత్తవలస మండల కేంద్రానికి చెందిన వెంకటరావు బైక్పై పనిమీద బయటకు వెళ్లి వస్తుండగా భారత్ డిఫెన్స్ అకాడమీ వద్దకు వచ్చేసరికి బైక్ నుంచి పొగలు రావడం గమనించి రోడ్డుపక్కకు తీసి ఆపాడు. అంతలోనే పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. ఆర్పేందుకు ప్రయత్నం చేసినా అదుపు చేయలేకపోయాడు. కొత్తవలస అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే బైక్ పూర్తిగా కాలిపోయింది. -
వైఎస్సార్సీపీ గెలుపుకోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు
సాలూరు: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపొందేందుకు శక్తివంచన లేకుండా పనిచేసిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు,పార్టీ అభిమానులు, ప్రజలు అందరికీ ధన్యవాదాలని, వారందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని వైఎస్సార్సీపీ సాలూరు అసెంబ్లీ అభ్యర్థి పీడిక రాజన్నదొర తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయనను సాలూరు పట్టణంలో గల ఆయన స్వగృహంలో నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజన్నదొర విజయం తధ్యమని, మండలాల వారీగా పోలింగ్ తీరు తదితర నివేదికలను వివరించారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపుకోసం శక్తి వంచన లేకుండా పనిచేసిన అందరికీ ఎప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఎన్నికల వేళ టీడీపీ నాయకుల వల్ల కొందరు వైఎస్సార్సీపీ శ్రేణులు ఇబ్బందులు పడ్డారని, వారందరికీ చివరివరకు ఎప్పుడూ అండగా ఉంటానని, అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. సాలూరులో వైఎస్సార్సీపీ గెలుపు తధ్యమని, రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మళ్లీ కొలువుదీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. పీడిక రాజన్నదొర -
చికెన్
బ్రాయిలర్లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ150 శ్రీ270 శ్రీ28016, 17న ‘గురుకుల’ మిగులు ఇంటర్మీడియట్ సీట్లకు కౌన్సెలింగ్విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని డాక్టర్ బీఆర్అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 2024–25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ కోర్సుల్లో మిగులు సీట్ల భర్తీ కోసం ఈ నెల 16, 17వ తేదీన కౌన్సెలింగ్ చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా సమన్వయకర్త టి.పద్మజ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షలోని ప్రతిభావంతులతో మొదటి లిస్ట్ ఇటీవల భర్తీ చేశామని తెలిపారు. ఇంకా మిగిలిన సీట్ల భర్తీ కోసం మెరిట్ లిస్ట్లో తదుపరి ప్రతిభావంతులైన బాలురుకు ఈ నెల 16న పూసపాటిరేగ మండలం కొప్పెర్ల డాక్టర్ బీఆర్అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, అదేవిధంగా ఈ నెల 17న బాలికల కోసం చీపురుపల్లిలోని డాక్టర్ బీఆర్అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో కౌన్సెలింగ్ చేపడతామన్నారు. ఆయా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. మెరిట్లిస్ట్లో ఉన్న తదుపరి విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరుకావాలని, వారి మొబైల్ నంబర్లకు ఫోన్ చేసి, మెసేజ్ రూపంలో కూడా సమాచారం ఇచ్చామన్నారు. పూర్తి సమాచారం కోసం బాలికలైతే 8333033434 ఫోన్కు, బాలురు 6303838657 ఫోన్ నంబర్ను సంప్రదించాలని కోరారు.త్రుటిలో తప్పిన ప్రమాదంపాలకొండ రూరల్: ఎన్నికల విధులు ముగించుకుని మంగళవారం సాయంత్రం పార్వతీపురం నుంచి కారులో తిరిగి వస్తున్న పాలకొండ, సీతంపేట మండలాల తహసీల్దార్లు వరహాలు, మహేశ్వరరావులకు పెనుప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న కారు పాలకొండ మండలంలోని రాజుపేట వద్దకు చేరుకునే సమయానికి టైరు పంక్చర్ కావడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకువెళ్లింది. అక్కడి స్థానికులు గమనించి కారులో ఉన్న వారిని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ జీవీ.కృష్ణారావు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. మలుపు వద్ద కారు అదుపు తప్పినప్పటికీ లోపల ఉన్న అధికారులకు ఎటువంటి ప్రమాదం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చిన్నచిన్న గాయాలు కావడంతో అధికారులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందారు. రాయి మీద పడి ఉపాధి వేతనదారు మృతి● మరొకరికి గాయాలు సీతంపేట: మండలంలోని బిల్లుగూడ కాలనీకి చెందిన సవర ఆదమ్మ (50) ఉపాధి పనులు చేస్తుండగా తలపై రాయి పడడంతో మృతిచెందింది. ఆమె పక్కన పనిచేస్తున్న సవర గంగమ్మకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఏపీవో సాగర్ అందించిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం ట్రెంచింగ్ పనులు చేస్తుండగా ఒక్క ఉదుటున రాయి వారిద్దరిపై పడడంతో గాయాలపాలయ్యరు. వెంటనే కుశిమి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం పాలకొండ ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఆదమ్మ పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. గంగమ్మ పాలకొండలో చికిత్స పొందుతోంది. మృతురాలికి భర్త తుంబయ్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులకు కుటుంబసభ్యులు సమాచారమందించారు. జోరుగా తాటి ముంజెల విక్రయంరామభద్రపురం: వేసవి తాపాన్ని తగ్గించే.. పోషకాలు మెండుగా లభించే తాటిముంచెలకు పల్లెలు, పట్టణాల్లో గిరాకీ నెలకొంది. గీత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయి. పొలాల్లోని తాటిచెట్లనుంచి సేకరించిన కాయలనుంచి ముంజెలను తీసి డజను రూ.30 చొప్పున విక్రయిస్తున్నారు. కాయ రూపంలో అయితే రూ.5కు అమ్ముతున్నారు. రోజుకు కనీసం రూ.600 వరకు సంపాదిస్తున్నారు. -
రామతీర్థంలో వైభంగా పూర్ణాహుతి
నెల్లిమర్ల రూరల్: పుష్యమి నక్షత్రాన్ని పురస్కరించుకుని పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఆలయ అర్చకులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత..యాగశాలలో గత 27 రోజుల నుంచి జరుగుతున్న సుందరకాండ హవనం మంగళవారం పూర్తైన సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామి సన్నిధిలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వేడుకగా జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు నరసింహాచార్యులు, సాయిరామాచార్యులు, మల్లికార్జునశర్మ, కిరణ్కుమార్, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
దళిత మహిళా సర్పంచ్పై జనసేన దాడి
వీరఘట్టం: మండలవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. అయితే తెట్టంగి గ్రామంలో మాత్రం జనసేన, టీడీపీ సభ్యులు కవ్వింపు చర్యలకు పాల్పడడంతో జరిగిన గొడవ కొట్లాటకు దారితీసింది.ఈ కొట్లాటలో దళిత మహిళా సర్పంచ్ అలజంగి విజయమ్మకు గాయాలు తగలడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకున్నారు.అయితే కవ్వింపు చర్యలు, గొడవల్లో గ్రామానికి చెందిన ఓ రెవెన్యూ ఉద్యోగి ప్రోద్బలం ఉందని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.ఇటీవల ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్లు గ్రామంలో చేపట్టిన ప్రచార ర్యాలీకి గ్రామస్తుల నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే కూటమి సభ్యులకు అనుకూలంగా ఉన్న ఓ ఉద్యోగి వైఎస్సార్సీపీకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక పోలింగ్ రోజున తగాదాకు ప్లాన్ చేసినట్లు వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికలు ఎన్నడూ లేనివిధంగా తగాదాలకు దారితీశాయంటే ముమ్మాటికీ ఆ ప్రభుత్వ ఉద్యోగి కుట్రేనని సర్పంచ్ అలజంగి విజయమ్మ, వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. సదరు రెవెన్యూ ఉద్యోగి ఫోన్ కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పలకరింపు ఈ కొట్లాటలో గాయపడిన సర్పంచ్ విజయమ్మ, కొందరు వైఎస్సార్సీపీ నాయకులు సోమవారం రాత్రి పాలకొండ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ విషయం తెలియడంతో గాయాలపాలైన సర్పంచ్ విజయమ్మను, వైఎస్సార్సీపీ నాయకులను ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్సీ విక్రాంత్లు ఫోన్ చేసి పలకరించారు.ఈ గొడవలకు కారకులైన వారిపై తగు చర్యలు చేపట్టాలని పోలీసులను కోరారు. అయితే తెట్టంగిలో సోమవారం పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన తగాదాపై ఇరువర్గాలు పరస్పరం ఇచ్చిన ఫిర్యాదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై షేక్ ఫకృద్దీన్ తెలిపారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు తమ సిబ్బంది పహారా కాస్తున్నట్లు చెప్పారు. తెట్టంగిలో ఇరువర్గాల కొట్లాట సర్పంచ్తో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తకు గాయాలు ఇరువర్గాలపై కేసు నమోదు చేసిన పోలీసులు -
ఎవరి లెక్క వారిదే..!
–8లోరామతీర్థంలో వైభంగా పూర్ణాహుతి పుష్యమి నక్షత్రాన్ని పురస్కరించుకుని పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయనగరం: 2024 సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. పోటీలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో చివరి ఘట్టమైన ఓట్ల లెక్కింపు కోసం పార్టీల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలే కాకుండా సాధారణ ఓటల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి ఏ అభ్యర్ధి విజేతగా నిలుస్తారు? రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న విషయంలో ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఈనెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో విజయనగరం జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 80.48 శాతం పోలింగ్ నమోదైంది. అభ్యర్థులు వారి విజయావకాశాలపై లెక్కలు వేసుకుంటున్నారు. విజయనగరం జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పోలింగ్తో పాటు ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్యనే పోరు ఉండడంతో గెలుపు ఓటములపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇదే అదునుగా బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందాలు కాస్తున్నారు. సోషల్ మీడియా విస్తృతంగా వాడులోకి వచ్చాక ప్రతి చిన్న స్థానిక అంశం నుంచి జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ప్రతి ఒక్కరూ చర్చించడం సాధారణమైపోయింది. ఈ క్రమంలో అత్యంత కీలకమైన, ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు, ఆయా నియోజకవర్గాల్లో ఏ రాజకీయ పార్టీ అభ్యర్థి గెలుస్తారనే విషయమై చర్చ సాగుతోంది. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకు ఎన్నికలపై ఒక లెక్క ఉంటే, పోలింగ్ పూర్తయ్యాక మరో లెక్కన ఎవరి విశ్లేషణలు వారు చేస్తున్నారు. ఓ వైపు గడిచిన ఐదేళ్లలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో పూర్తి స్థాయిలో సఫలీకృతమైన వైఎస్సార్సీపీ అభ్యర్థులు వారి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా.. ప్రతిపక్ష కూటమి అభ్యర్థులు మేక పోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు సగం నియోజకవర్గాల్లో నియోజకవర్గాల్లో ఫలితం అంచనాలకు అందకపోవడంతో కూడికలు, తీసివేతలతో ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురుచూపు ఇక రాష్ట్రంలో ఆయా పార్టీలు గెలుచుకునే సీట్లు ఇవేనంటూ వివిద సర్వే సంస్థలు వెలువరించే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ వెలువడితే బెట్టింగ్లు మరింత జోరందుకోనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే నెల 4వ తేదీన వెలువడే ఫలితాల రోజు ఎప్పుడు వస్తుందానన్న చర్చ సాగుతోంది. కొందరైతే ఆయా ఫలితాలపై బెట్టింగులు పెడుతున్నాం. పరిస్థితి ఏ విధంగా ఉంటుదంటూ స్నేహితులకు ఫోన్ చేసి మరి తెలుసుకుని బెట్టింగ్లకు దిగుతుండడం గమనార్హం. పోలింగ్ సరళిపై పార్టీ నేతలతో అభ్యర్థుల సమీక్షలు గెలుపు ధీమాలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూపు ఏ నలుగురు కలిసినా ఎన్నికల పోలింగ్పైనే చర్చ భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ విజయనగరం క్రైమ్: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎమ్లను భద్రపరిచిన జేఎన్టీయూ వర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్లను జిల్లా అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్ మంగళవారం పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. -
పశువుల ఎరువుతో భూసారం పెంపు
● వేసవి దుక్కుతో మేలురామభద్రపురం: వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం పెరిగిపోవడంతో నేలలోని పోషకాల నిల్వల్లో సమతుల్యంలోపించి ఉత్పాదకత తగ్గుతోంది. చీడపీడలు ఆశించడం, సూక్ష్మ పోషకాల లోపాలతో దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ సమస్యను అధిగమించాలంటే సేంద్రియ పద్ధతులను పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు పేర్కొంటున్నారు. సేంద్రియ ఎరువులతో సాగు పశువులు, మేకలు, గొర్రెల ఎరువు పంటల సాగులో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది సేంద్రియ ఎరువులతో సమానం.దీన్ని దుక్కులు దున్నడానికి ముందే పంట భూముల్లో వేసి దున్నితే చాలా మంచిది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడానికి వీలవుతుంది. దుక్కులు దున్నిన తర్వాత పశువుల పేడ మొత్తం భూమిలోకి వెళ్లి పంట దిగుబడిని పెంచడానికి దోహదపడుతుంది. పంట ఎదుగుదల, మొక్కలు బలంగా ఉండేందుకు పశువుల ఎరువు ఉపయోగపడుతుంది. ఒక ఎకరాకి నాలుగు నుంచి ఐదు ట్రాక్టర్ల పశువుల ఎరువును వినియోగించాలి. భూసారం పదిలం సాధారణంగా రైతులు వేసవిలో పశువుల ఎరువును వ్యవసాయ పొలాలకు తరలిస్తుంటారు. అదే సమయంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. అధిక ఎండల కారణంగా పొలంలో జల్లితే వాటిలో ఉన్న పోషకాలు ఆవిరవుతాయి. కాబట్టి పశువుల పేడను పొలంలో కుప్పలు పోసుకోవాలి. భూమిలో తగు తేమ ఉన్న సమయంలోనే వెదజల్లి వెంటనే దుక్కిలో కలియదున్నాలి. దీని వల్ల భూసారం పెరుగుతుంది. సహజసిద్ధమైన లక్షణాలు అందుతాయి. నేలలోని ఆమ్లత్వం, క్షారత్వం, నిటిని నిల్వ ఉంచే గుణాన్ని అదుపుచేసి పోషకాలు మొక్కలకు అందేవిధంగా సహాయపడతాయి.దీంతో రైతులు తక్కువ ఖర్చుతో అధిక లాభాలు సాధించవచ్చు. ఇలా దున్నాలి పొలాన్ని ఎలా పడితే అలా దున్నడం వల్ల సాగుచేసే పంటలకు నష్టం వాటిల్లుతుంది. రైతులు వేసవి కాలంలో మెట్ట భూములను వానాకాలంలో సీజన్ కోసం సన్నద్ధం చేస్తుంటారు. మెట్ట ప్రాంతాల్లో భూమి వాలుకు అడ్డంగా దుక్కి చేయాలి. ఎందుకంటే వేసవిలో వచ్చే అధిక వర్షాలకు ఎంతో సారవంతమైన మట్టి నీటి వరదకు వాలు ప్రాంతంలో కొట్టుకుపోతుంది.వాలుకు అడ్డంగా దుక్కి దున్నితే నీటి ప్రవాహం తగ్గి మట్టి కొట్టుకుపోకుండా ఉంటుంది.పశువుల ఎరువుతో భూసారం పెంపు పశువులు,మేకలు, గొర్రెల ఎరువు వేయడం వల్ల భూసారం పెరుగుతుంది. సహజసిద్ధమైన లక్షణాలు అందుతాయి.నేలలోని నిటిని నిల్వ ఉంచే గుణాన్ని అదుపుచేసి పోషకాలను మొక్కలకు అందే విధంగా సహాయపడతాయి. రైతులు తక్కువ ఖర్చుతో అధిక లాభాలు సాధించవచ్చు. – జ్యోత్స్న, గ్రామ వ్యవసాయ సహాయకురాలు -
సీబీఎస్ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల
● సత్తా చాటిన కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు విజయనగరం అర్బన్: జాతీయస్థాయి సీబీఎస్ఈ సిలబస్లో పదవ, పన్నెండవ తరగతుల ఫైనల్ పరీక్షా ఫలితాల్లో విజయనగరంలోని కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు సత్తా చాటారు. ఈ మేరకు విద్యాలయం ప్రిన్సిపాల్ దిలీప్మోడీ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదవ తరగతి ఫలితాలలో ఎంపీ గాయత్రి వసంత 97.4 శాతంతో 487 మార్కులు తెచ్చుకుని ప్రథమస్థానంలో నిలించిందని తెలిపారు. సీహెచ్.ప్రవల్లిక 467 మార్కుల (93.4 శాతం)తో ద్వితీయ స్థానం, కేవీకేఎన్ఎస్ఆర్శ్రీకర్ 465 మార్కుల (93 శాతం) తృతీయ స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. అదేవిధంగా పన్నెండవ తరగతిలో జి.వెంకటగాయత్రి అమృత 456 మార్కుల(91.2 శాతం)తో ప్రథమ స్థానంలో జి.లక్ష్మిసాయి ప్రశాంతి 442 మా ర్కుల (88.4 శాతం)తో ద్వితీయ స్థానంలో, పి.సాయిమహిత లిఖిత 437 మార్కుల(87.4 శాతం)తో తృతీయ స్థానంలో నిలిచారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులు, మంచి ఫలితాలను అందించిన అధ్యాపకులను ప్రిన్సిపాల్ అభినందించారు. ఆకట్టుకున్న ఆధ్యాత్మిక ప్రవచనం విజయనగరం టౌన్: విజయనగరం మూడులాంతర్లు వద్దనున్న పైడితల్లి చదురుగుడి ఆవరణలో మంగళవారం రాత్రి ఆర్.బి.రామానాయుడు ఆధ్యాత్మిక ప్రసంగం ఆద్యంతం ఆహు తులను ఆకట్టుకుంది. అమ్మవారి జీవిత చరిత్ర, అమ్మవారి విశిష్టతను భక్తులకు వివరించారు. ఆయనను ఆలయ కార్యనిర్వహణాధికారి డీవీవీ.ప్రసాదరావు దుశ్సాలువతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పైడిమాంబ కళాపీఠం వ్యవస్థాపకుడు ఆర్.సూర్యపాత్రో, సూపర్వైజర్ ఏడుకొండలు, భక్తులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాగావళి నది పరిసర ప్రాంతాల్లో ఏనుగులు జియ్యమ్మవలస: మండలంలోని బాసంగి గ్రామ సమీపంలోని నాగావళి నదిలో ఏనుగులు మంగళవారం మధ్యాహ్నం వరకు సేదతీరాయి. సాయంత్రానికి అరటి, పామాయిల్ తోటలోకి చేరుకున్నాయి. ఏనుగుల సంచారంతో అరటి పంటకు నష్టం వాటిల్లుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు ఏనుగులను తరలించే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. గుర్తు తెలియని మహిళ మృత దేహం బొబ్బిలి: మండలంలోని రాముడు వలస–శివడ వలస గ్రామాల మధ్యలోని మామిడి తోటలో పడి ఉన్న గుర్తు తెలియని మహిళ మృత దేహాన్ని గుర్తించినట్టు ఎస్సై జి.లోవరాజు మంగళవారం రాత్రి తెలిపారు. అటువైపుగా వ్యవసాయ పనులకు వెళ్తున్న రాముడు వలస గ్రామస్తులకు దుర్వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి పోలీ సులు చేరుకుని పరిశీలించారు. మహిళ చనిపోయి నాలుగు రోజులై ఉండొచ్చని ప్రాథమికంగా గుర్తించామని ఎస్ఐ తెలిపారు. మహిళ ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవారనే విషయం దర్యాప్తులో తేలుతుందన్నారు. మృతదేహానికి బుధవారం పోస్టుమార్టం జరుగుతుందన్నారు. -
గ్రామాల్లో ద్రాక్ష పంట
రాజాం/రేగిడి: ద్రాక్ష పంట తీగలను ఇప్పుడు గ్రామాల్లో పలువురు తమ ఇండ్ల వద్ద పెంచుతూ ఆకర్షణగా మలుస్తున్నారు. ప్రతి గ్రామంలో ద్రాక్ష పాదులు కనువిందు చేస్తున్నాయి. రేగిడి మండలంలోని ఉణుకూరు గ్రామానికి చెందిన జిల్లా వ్యవసాయ సలహామండలి అధ్యక్షుడు గేదెల వెంకటేశ్వర్లు తన ఇంటి ముందు భాగాన ద్రాక్షపాదులు వేశారు. రెండు సంవత్సరాల వయస్సు ఉన్న ఈ ద్రాక్ష తీగలు ఇంటిముందు పందిరిని అల్లుకుని గుత్తులుగుత్తులుగా పూతకు వచ్చాయి. ఇవి పలువురిని ఆకర్షిస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఆన్లైన్లో ఈ ద్రాక్ష విత్తనాలను కొనుగోలు చేసినట్లు వెంకటేశ్వరరావు సాక్షికి తెలిపారు. ఓ వైపు ఇంటి ముందు అందంతో పాటు మరో వైపు చల్లదనాన్ని ఈ తీగలు అందిస్తున్నాయి. పండిన రెడ్ గ్రేప్ చాలా తియ్యగా ఉంటున్నాయని ఆయన తెలిపారు. -
ఓటరు తీర్పు... ఈవీఎంలలో భద్రం
విజయనగరం అర్బన్: ఎన్నికల అంకం ముగిసింది. పార్లమెంట్, అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు ఉన్నారో ఓటర్లు తీర్పునిచ్చేశారు. వారి మనసులో మాట ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. దీన్ని జిల్లా అధికారులు డెంకాడ మండలం లెండి ఇంజినీరింగ్ కళాశాల, జేఎన్టీయూ వర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూమ్లలో అత్యంత భద్రత నడుమ భద్రపరిచారు. ఓటింగ్ ప్రక్రియ సోమవారం అర్ధరాత్రి వరకు సాగడంతో ఈవీఎంలను రిసెప్షన్ సెంటర్లకు తరలింపు మంగళవారం తెల్లవారు వరకు సాగింది. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 1,874 పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను తరలించారు. ఈవీఎంలు, కౌంటింగ్ సామగ్రిని జిల్లా కేంద్రంలోని విజయనగరంలో రెండు రిసెప్షన్ కేంద్రాల్లో గల స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. జేఎన్టీయూ జీవీ యూనివర్సిటీ ప్రాంగణానికి విజ యనగరం, బొబ్బిలి నియోజకవర్గాల ఈవీఎంలు తరలించారు. డెంకాడ మండలం లెండి కళాశాలలో నెల్లిమర్ల, చీపురుపల్లి, రాజాం, ఎస్.కోట, గజపతినగరం నియోజకవర్గాల ఈవీఎంలను భద్రపరిచారు. ఇక్కడే వచ్చే నెల 4వ తేదీన ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్దే లెక్కింపు ఓట్ల కౌంటింగ్ కోసం ఏర్పాటు చేసే రిసెప్షన్ సెంటర్ స్ట్రాంగ్రూంల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. నిర్దేశిత నమూనాలో కట్టుదిట్టంగా స్ట్రాంగ్ రూమ్లను సిద్ధం చేశారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు, పటిష్టంగా బారికేడింగ్తో కౌంటర్ల వద్ద, ప్రాంగణంలో లైటింగ్ వంటి పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా సాధారణ ఎన్ని కల పరిశీలకులు హనీష్ చాబ్రా, తలాత్ పర్వేజ్ ఇక్బాల్ రోహెల్లా పర్యవేక్షణలో నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లకు సీళ్లు వేశారు. పార్లమెంట్, శాసనసభ నియోజక వర్గాలకు వేర్వేరుగా స్ట్రాంగ్రూంలకు మూడంచెల భద్రత, బందోబస్తు కల్పించారు. మొదటి స్థాయిలో స్థానిక పోలీసులు, రెండవ స్థాయిలో రాష్ట్ర సాయుధ బలగాలు, మూడవ స్థాయిలో కేంద్ర సాయుధ బలగాలతో పహారా ఏర్పాటు చేశారు. రిసెప్షన్ సెంటర్ల వద్ద పటిష్ట భద్రత స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేసిన అధికారులు స్ట్రాంగ్ రూమ్ల వద్దే కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు ఉత్కంఠకు జూన్ 4న తెర -
రెండు కార్లు ఢీకొని ముగ్గురికి గాయాలు
బొండపల్లి: మండలంలోని బొడసింగిపేట గ్రామానికి సమీపంలో జాతీయ రహదారి 26పై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. విశాఖపట్నం నుంచి బొబ్బిలి వెళ్తున్న కారు, గజపతినగరం నుంచి విజయనగరం వెళ్తున్న కారు ఎదురెదురుగా బలంగా ఢీకోనడంతో రెండు కార్లు కూడా పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి కాలు విరిగి పోగా 108 వాహనంలో విజయనగరంలోని కేంద్ర సర్వజన ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరిని గజపతినగరంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. -
మెరుగైన వైద్యసేవలు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో● ఏటా 10 లక్షల మందికి ఓపీ ● లక్ష నుంచి 1.30 లక్షల వరకు ఐపీ ● 7 వేల వరకు మేజర్ ఆపరేషన్లు ● 15 వేల వరకు ప్రసవాలువిజయనగరం ఫోర్ట్: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రుల్లో సేవలు మెరుగుపడ్డాయి. వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని నియమించడం వల్ల రోగులకు సకాలంలో వైద్య సేవలు అందుతున్నాయి. అన్ని రకాల సేవలు రోగులకు అందుతుండడం వల్ల అధిక సంఖ్యలో ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓపీ, ఐపీతో పాట శస్రత్తచికిత్సలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెరిగాయి. సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రుల్లో ప్రభుత్వం మౌలికవసతులు కల్పించింది. ముఖ్యంగా ప్రతి సీహెచ్సీ, ప్రాంతీయ ఆస్పత్రిలో గైనకాలజిస్టు, పిడియాట్రిక్, అనస్తీషియా, జనరల్ ఫిజీషియన్, డెర్మటాలజీ, దంత, ఈఎన్టీ వైద్యులను నియమించడంతో అన్ని రకాల సేవలు అందుతున్నాయి. ఫలితంగా ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. ప్రసవాలు, సిజేరియన్లు, ఇతర శ్రస్త్రచికిత్సలు, వైద్య పరీక్షలు అల్ట్రాసౌండ్, ఈసీజీ వంటి సేవలు పెరిగాయి. జిల్లాలో 8 ఆస్పత్రులు ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులు (ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు) 14 ఉండేవి. జిల్లాల పునర్విభజన అనంతరం విజయనగరం జిల్లాలో 8 ఆస్పత్రులు ఉన్నాయి. వాటిలో ఎస్.కోట, గజపతినగరంలలో ప్రాంతీయ ఆస్పత్రులు, బాడంగి, భోగాపురం, నెమర్ల, చీపురుపల్లి, బొబ్బిలి, రాజాంలలో సీహెచ్సీలు ఉన్నాయి. గణనీయంగా పెరిగిన ఓపీ సేవలు వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రుల్లో ఏటా లక్షలాది మందికి వైద్య సేవలు అందుతున్నాయి. అందులో 10 లక్షల మందికి వరకు ఓపీ(ఔట్ పేషేంట్)సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా లక్ష నుంచి 1.30 లక్షల మంది వరకు ఇన్పేషేంట్ (ఐపీ) సేవలు అందిస్తున్నారు. 6 వేల నుంచి 7 వేలు మేజర్ ఆపరేషన్లు చేస్తున్నారు. 14 వేల నుంచి 15 వేల వరకు ప్రసవాలు నిర్వహిస్తున్నారు. 35 వేల నుంచి 40వేల వరకు అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తున్నారు.11 లక్షల నుంచి 16 లక్షల వరకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఎక్స్రేలు 40 వేల నుంచి 43 వేల వరకు, 20 వేల నుంచి 23 వేల వరకు ఈసీజీలు తీస్తున్నారు. -
టీడీపీ నేతల ‘విష’ ప్రయోగం
పోలాకి: మండలంలోని బెలమర గ్రామానికి చెందిన చింతు అప్పన్న అనే ఆక్వా రైతుకు చెందిన రొయ్యల చెరువుల్లో గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేశారు. దీంతో రొయ్యిలన్నీ చనిపోయాయి. బాధితుడు పోలాకి పోలీస్స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశాడు. బాధితుడు వైఎస్సార్సీపీ సానుభుతిపరుడు కావడంతో ఎన్నికల నుంచి డైవర్ట్ చేసే ప్రయత్నంగా దుండగులు ఈ చర్యకు పాల్పడినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. దీనిపై ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. ఇలాంటి చర్యలను ఖండిస్తున్నామని చెప్పారు. గొడవకు దిగిన కూటమి నేతలు ఇచ్ఛాపురం రూరల్: మండలంలోని తేలుకుంచి పోలింగ్ బూత్ వద్ద స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బెందాళం ఎదుట టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు వైస్సార్సీపీ నాయకులతో సోమవారం బాహాబాహీకి దిగారు. అంతలో అక్కడకు వచ్చిన పీఏసీఎస్ అధ్యక్షుడు నర్తు నరేంద్ర యాదవ్ ఇరువర్గాలతో మాట్లాడి పరిస్థితి సద్దుమణిగించారు. -
కేఎస్సార్ పురం పీఓపై చర్యలకు డిమాండ్
● రీ ఓటింగ్ జరపాలంటూ ఆర్వోకు ఫిర్యాదు గజపతినగరం: గజపతినగరం మండలం కొత్తశ్రీరంగ రాజపురం గ్రామం 100వ పోలింగ్ స్టేషన్లో ఓట్ల రిగ్గింగ్కు పాల్పడిన పీఓ రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ సర్పంచ్ ఇజ్జిరోతు పైడిపునాయుడు, గ్రామ పెద్దలు గెద్ద సన్యాసప్పలనాయుడు, వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు బూడి వెంకటరావు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఎమ్.వి.సూర్యకళకు సోమవారం ఫిర్యాదు చేశారు. బొబ్బిలి మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రాంబాబును కొత్త శ్రీరంగరాజపురంలో ఎన్నికల విధులకు వేశారు. ఆయన గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి చేరుకుని టీడీపీ నేతలతో కుమ్మక్కై ఓటింగ్ రిగ్గింగ్కు పాల్పడినట్టు గ్రామస్తులు ఆర్వోకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే రీఓటింగ్ జరిపించి, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్పీ విజయనగరం క్రైమ్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతయుతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు చేపట్టిన భద్రతా ఏర్పాట్లను ఎస్పీ ఎం.దీపిక సోమ వారం స్వీయపర్యవేక్షణ చేశారు. పట్టణంలోని ఎమ్ఎస్ఎన్ కళాశాల, లంకాపట్నం, దాసన్నపేట, బీసీ కాలనీ, వి.టి.అగ్రహారం, నెల్లిమర్ల, గుర్ల మండలం గుజ్జంగివలస, గరివిడి, చీపురుపల్లి, పూసపాటిరేగ మండలం కుమిలి, భోగాపురం మండలం పోలిపల్లి, గుడివాడ, అప్పన్నపాలెం పోలింగ్ కేంద్రాలను సందర్శించి, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. భద్రతా సిబ్బందికి, అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. గత మూడు నెలలుగా పోలీస్ అధికారులు, సిబ్బంది గ్రామసందర్శనలు చేసి, ప్రజలతో మమేకమై, ఎలక్షన్ మీటింగులు నిర్వహించి, విభేదాలు లేకుండా చేయడం, సమస్యలు సృష్టించే వ్యక్తులను పార్టీలకతీతంగా గుర్తించి బైండోవర్ చేయడం, బాండులు తీసుకోవడం, ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదుచేయడం ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో సత్ఫలితాలినిచ్చాయి. రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో భద్రతా ఏర్పాట్లను ఏఎస్పీ అస్మాఫర్హీన్, ఇతర అసెంబ్లీ నియోజక వర్గాల్లో డీఎస్పీలు పర్యవేక్షించారు. ఓటు వేసిన ఎస్పీ... స్థానిక ఎమ్ఎస్ఎన్ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో సామాన్య ఓటర్లతో పాటూ క్యూలో నిలబడి ఎస్పీ ఎం.దీపిక తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగబద్ధమైన తమ ఓటుహక్కును తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు విజయనగరం అర్బన్: జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి స్థానిక కణపాక వద్ద ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె స్వయంగా క్యూలో నిల్చొని, తమ వంతువచ్చాక ఓటు వేశారు. అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ కూడా అదే పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, మాజీ ఎంపీ డాక్టర్ బొత్స ఝాన్సీలక్ష్మి కుటుంబ సమేతంగా ఎం.ఆర్.కళాశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్గజపతిరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి కంటోన్మెం సెయింట్ మేరీస్ పాఠశాలలో ఓటు హక్కు వినియగించుకున్నారు. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చీపురుపల్లి మండలం బాలికల గురుకుల పాఠశాలలో ఓటు వేశారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి జొన్నగుడ్డి పాఠశాలలో ఓటు హక్కును వినియగించుకున్నారు. -
20న పైడితల్లి దేవర మహోత్సవం
● 21 నుంచి చదురుగుడిలో పైడితల్లి దర్శనం ● చాటింపు వేసిన ఆలయ తలయారీలువిజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తలయారులు సోమవారం చాటింపు వేశారు. ప్రతి ఏటా వైశాఖమాసంలో ఉత్సవ చాటింపు ప్రక్రియను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ మేరకు స్థానిక మూడు లాంతర్లు వద్దనున్న చదురుగుడి ఆవరణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ తలయారులు డప్పు వాయిద్యాలతో అమ్మవారికి మనవి చెప్పారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఆలయ ఈఓ డీవీవీ ప్రసాదరావు నేతృత్వంలో దేవర మహోత్సవం చాటింపు వేశారు. అలాగే చిన పైడిరాజు బృందం డప్పులతో ఆలయంలోను, కోట వద్దనున్న కోటశక్తి అమ్మవారికి మనవి చెప్పారు. అనంతరం ఈఓ ప్రసాదరావు మాట్లాడుతూ.. ఈ నెల 20న సోమవారం సాయంత్రం 4 గంటలకు రైల్వేస్టేషన్ వద్దనున్న పైడితల్లి అమ్మవారి వనంగుడిలో ఉత్సవ విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహిస్తామన్నారు. అక్కడ నుంచి బాజా,భజంత్రీలు, మేళ తాళాలతో అమ్మవారిని రైల్వేస్టేషన్ నుంచి గాడీఖానా, సీఎంఆర్ జంక్షన్, ఎన్సీఎస్ రోడ్డు, కన్యకపరమేశ్వరి ఆలయం, న్యూపూర్ణ జంక్షన్ మీదుగా హుకుంపేటలో ఉన్న పూజారి ఇంటివద్దకు తీసుకువెళ్తారన్నారు. అక్కడ అమ్మవారి ఘటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాత్రి 12 గంటలు దాటిన తర్వాత మేళతాళాల నడుమ శివాలయం మీదుగా పెద్దచెరువు పశ్చిమభాగానికి చేరుకుని అక్కడ పెద్దచెరువులో పూజలు నిర్వహిస్తామని తెలిపారు. అక్కడ నుంచి వేకువజామున అమ్మవారిని మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడికి తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారన్నారు. మంగళవారం వేకువజామున 6 గంటల నుంచి అమ్మవారు ఆరు నెలల పాటు చదురుగుడిలోనే భక్తులకు దర్శనమిస్తారన్నారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించి, తరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, సూపర్వైజర్ ఏడుకొండలు, పైడిమాంబ కళాపీఠం వ్యవస్థాపకుడు ఆర్.సూర్యపాత్రో, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘించిన టీడీపీ నేతలు
● పోలింగ్ కేంద్రాల వద్ద ఎంపీ అభ్యర్థి రామ్మోహన్నాయుడు హడావిడి ● సెల్ఫోన్లతో అనుచరుల ఓవరాక్షన్ శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ కూటమి అభ్యర్థి కె.రామ్మోహన్నాయుడు హడావిడి చేశారు. క్యూలైన్లలో ఉన్న ఓటర్లను ప్రలోభపెట్టేలా ఓటు వేయకముందే వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ ప్రలోభపెట్టారు. తమ సిబ్బందితో ఫోటోలు దిగిన వారి వాట్సాప్ నంబర్లను తీసుకున్నారు. ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాలకు సెల్ఫోన్ల అనుమతి లేదని స్వయంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్పష్టంచేసిన విషయం తెలిసిందే. అయితేనా రామ్మోహన్తోపాటు అనుచరులంతా సెల్ఫోన్లలో పోలింగ్ కేంద్రాల వద్ద హంగామా సృష్టించడం విమర్శలకు తావిచ్చింది. స్థానిక టీడీపీ నాయకులు కూడా ఎన్నికల కోడ్ను యథేచ్ఛగా ఉల్లింఘించారు. గుజరాతీపేటలోని వరం మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ కేంద్రం వద్ద టీడీపీ నేతాలు ఓటర్లకు ప్రలోభపెట్టారు. ప్రధాన గేట్ వద్ద సైకిల్కు ఓటు వేయాలంటూ వరం కుమారులు, స్థానిక టీడీపీ నాయకులు చేసిన రచ్చ చేశారు. దీంతో ప్రత్యేక బెటాలియన్తోపాటు ఎస్పీ జీఆర్ రాధిక కూడా పోలింగ్ కేంద్రానికి చేరుకుని శాంతిభద్రతలను స్వయంగా పర్యవేక్షించారు. స్థానిక నాయకులను అక్కడ నుంచి పంపించి వేశారు. -
స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలు
విజయనగరం అర్బన్: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. ఇప్పటికే కేటాయించిన రిసెప్షన్ సెంటర్లకు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన 1,874 పోలింగ్ కేంద్రాల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లను తరలిస్తున్నారు. డెంకాడ మండలం లెండి ఇంజినీరింగ్ కళాశాలలో ఎస్.కోట, నెల్లిమర్ల, గజపతినగరం, చీపురుపల్లి, రాజాం నియోజకవర్గాల ఈవీఎంలు, జేఎన్టీయూ జీవీ యూనివర్సిటీ ప్రాంగణంలోని స్ట్రాంగ్రూమ్లో విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గాల ఈవీఎంలు భద్రపరుస్తున్నారు. -
అధికారుల అత్యుత్సాహం.. కూటమికి సహకారం
రణస్థలం: మండలంలోని రెండు చోట్ల బీజేపీ, టీడీపీకి అనుకూలంగా ఎన్నికల అధికారులు అత్యుత్సాహం చూపించారు. ఈ విషయమై బంటుపల్లి, గిరివానిపాలెం బూత్ ఏజెంట్లు ఎచ్చెర్ల నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తికి ఫిర్యాదులు చేశారు. గిరివానిపాలెం 142 పోలింగ్ కేంద్రంలో ఎన్నికల పోలింగ్ అధికారి ఎస్.తిరుపతిరావు బీజేపీ, టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని, వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేసిన సమయంలో వాళ్లకి సహాయంగా వచ్చిన వారిని ఈవీఎంల వద్దకు పంపకుండా నేరుగా వెళ్లి ఓట్లు వేశారని బూత్ ఏజెంట్లు ఆరోపించారు. ఇలోగా ఇప్పిలి చిన్న అనే వృద్ధుడు ఓటు తన కుమార్తె సమాయంతో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. బూత్ ఏజెంట్లు పరిశీలించి ఓటు వేయడానికి ఈవీఎంల దగ్గరకు వెళ్లినప్పుడు పీఓ కూడా వెళ్లారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని వృద్ధుడు చెప్పగా పీవో సైకిల్పై బటన్ నొక్కడం, ఇది గమనించిన అతని కుమార్తె ఎందుకిలా చేశారని నిలదీశారు. దీంతో గందరగోళం ఏర్పడింది. ఇలా అప్పటికే యాభై పైచిలుకు ఓట్లు వేశారని బూత్ ఏజెంట్లు ఆరోపించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఎల్.రామారావు పోలింగ్ కేంద్రానికి వచ్చి వివాదం సద్దుమణించారు. బూత్ ఏజెంట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్వో కార్యాలయానికి పీవో తిరుపతిరావును సరెండర్ చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా పీవోపై చర్యలు తీసుకుంటామని ఆర్వో లక్ష్మణమూర్తి తెలిపారు. బంటుపల్లి పోలింగ్ కేంద్రం 185, 186లో ఇజ్జు దుర్గా ప్రసాద్ రెండుసార్లు ఓట్లు వేయడంపై అభ్యంతరం తెలుపుతున్నా వీఆర్వో చిన్నారావు నేరుగా ఓటు వేయించారని బూత్ ఏజెంట్లు ఆర్వోకు ఫిర్యాదు చేశారు. -
● పోలీస్ సేవలు భేష్
విజయనగరం క్రైమ్: సార్వత్రిక ఎన్నికల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది అందించిన సేవలను పలువురు అభినందించారు. జిల్లా కేంద్రంలోని కంటోన్మెంట్, కణపాక, జొన్నగుడ్డి, సుంకరివీధి, ఆబాద్వీధి, కొత్త దేవరవీధి, తదితర ప్రాంతాల్లో సోమవారం ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులకు సేవలందించారు. వీల్చైర్ల ద్వారా వృద్ధులను కేంద్రంలోకి తీసుకురావడం, ఓటు వేసిన తర్వాత బయటకు తీసుకెళ్లడం వంటి పనులతో పోలీసులు ప్రజల మన్ననలు అందుకున్నారు. అలాగే సత్య కళాశాల, ఎంఆర్ కళాశాల ఎన్సీసీ క్యాడెట్లు ఓటర్లకు సహకరించారు. -
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
● కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించిన కలెక్టర్ నాగలక్ష్మి విజయనగరం అర్బన్: జిల్లాలో సాధారణ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం 7 గంటలకు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. అక్కడక్కడా ఈవీఎంల్లో స్వల్ప అవాంతరాలు తలెత్తగా వెంటనే అధికారులు స్పందించి సరిచేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,847 పోలింగ్ కేంద్రాల్లో తొలుత పోలింగ్ ప్రారంభమైనప్పటికీ ఆ తరువాత పుంజుకుంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులుతీరారు. జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశాల మేరకు ఉదయం 5.30 గంటలకే చాలా పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. ఎండను దృష్టిలో ఉంచుకొని అన్ని పోలింగ్ కేంద్రాల్లో నీడ కోసం టెంట్లు వేశారు. తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. పలు చోట్ల అంగన్వాడీ సిబ్బంది ఆధ్వర్యంలో చిన్న పిల్లల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల కోసం వీల్ చైర్లు అందుబాటులో ఉంచారు. పోలింగ్ కేంద్రాల్లోకి చేరుకోవడానికి ర్యాంపులు కూడా ఉండడంతో దివ్యాంగులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందీ కలగలేదు. అంధులకోసం అభ్యర్థుల జాబితాలను బ్రెయిలీ లిపిలో పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచారు. జిల్లాలోని మొత్తం 11 మోడల్ పోలింగ్ కేంద్రాల్లో మరిన్ని అదనపు హంగులు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నుంచి కలెక్టర్ నాగలక్ష్మి పర్యవేక్షణ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి కలెక్టరేట్లోని ఎన్నికల కంట్రోల్ రూం నుంచి పోలింగ్ ప్రక్రియను రోజంతా పర్యవేక్షించారు. ఆమె ఉదయం 4.30 గంటలకే కంట్రోల్ రూమ్కి చేరుకున్నారు. అప్పటి నుంచి వెబ్కాస్టింగ్ ద్వారా ఆర్ఓల ద్వారా పోలింగ్ బూత్ల్లో పరిస్థితి ఎప్పిటికప్పుడు పరిశీలిస్తూ వచ్చారు. అవసరమైన ఆదేశాలను జారీచేసి పోలింగ్ సిబ్బందిని ముందుకు నడిపించారు. ఉదయం 5.45 గంటలకల్లా మాక్ పోల్ పూర్తి చేసేలా పోలింగ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈవీఎంల్లో సమస్యలు తలెత్తిన చోట, వెంటనే సంబంధిత అధికారులను హెచ్చరించి, వాటిని సరిచేసి పోలింగ్ కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై మరింత దృష్టి సారించారు. ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ నడిపించారు. విస్తృతంగా పర్యటించిన ఎన్నికల పరిశీలకులు ఎన్నికల సాధారణ పరిశీలకులు హనీష్ చాబ్రా, తలాత్ పర్వేజ్ ఇక్బాల్ రోహెల్లా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. పోలింగ్ తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. మైక్రో అబ్జర్వర్లు ద్వారా పోలింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. పోలీస్ పరిశీలకులు సచింద్ర పటేల్, జిల్లా వ్యయ పరిశీలకులు ప్రభాకర్ ప్రకాష్ రంజన్, ఆనంద్ కుమార్, ఆకాష్ దీప్ జిల్లాలో పర్యటించి, పోలింగ్ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. -
ఓటేసిన కొద్ది సేపటికే మృత్యువాత
డెంకాడ: అంతవరకు బాగానే ఉన్నాడు. భార్యతో కలిసి ఓటు వేసి ఇంటికి వచ్చిన కాసేపటికి ఆ వృద్ధుడు మరణించాడు. ఈ విచారకర సంఘటన మండలంలోని డెంకాడ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. డెంకాడ గ్రామానికి చెందిన కోయనేని సత్యం (85) భార్య చంద్రమ్మతో కలిసి పోలింగ్ బూత్కి వెళ్లి ఓటు వేసి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. అక్కడకు కొద్దిసేపటి తర్వాత కన్నుమూశాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆటో ఢీకొని వ్యక్తి మృతి గజపతినగరం: మండలంలోని గుడివాడ గ్రామ సమీపంలో ఆటో ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుడివాడకు చెందిన దుప్పాడ అసిరయ్య తన పనులు ముగించుకుని గ్రామానికి వస్తుండగా... గ్రామ సమీపంలోకి వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న ఆటో ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు స్పందించి అసిరయ్యను విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు కార్తీక్ ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన రామభద్రపురం: మండలంలోని ఎన్నికల పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు ఇక్బాల్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పీఓలతో మాట్లాడుతూ, పోలింగ్ సరళిపై ఆరా తీశారు. పోలింగ్ బూత్ల వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం ఓటర్లతో మాట్లాడారు. ఆయన వెంట తహసీల్దార్ సులోచనారాణి ఉన్నారు. కొత్తూరులో ఈదురుగాలుల బీభత్సం ● పోలింగ్ స్టేషన్ల వద్ద ఎగిరిపోయిన టెంట్లు ● నిలిచిన విద్యుత్ సరఫరా కొత్తూరు : సార్వత్రిక ఎన్నికల వేళ కొత్తూరులో సోమవారం సాయంత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. గాలుల ధాటికి పోలింగ్ స్టేషన్ల వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు నేలకొరిగాయి. పలుచోట్లు చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో పోలింగ్ స్టేషన్ల వద్ద జనరేటర్లను సిద్ధం చేశారు. అవి కూడా సక్రమంగా పనిచేయకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. రాత్రి పది గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు గ్రామాలు అంధకారం అలముకుంది. విద్యుత్ సరఫర నిలిచిపోవడంతో పోలంగ్ స్టేషన్ వద్ద జనరేటర్లు సక్రమంగ పనిచేయక పోవడంతో పోలింగ్ సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. కొత్తూరు, మెట్టూరులతో పాటు పలు గ్రామాల్లో గంటల తరబడి ఈవీఎంలు మొరాయించాయి. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. కొత్తూరుతో పాటు పలు పోలింగ్స్టేషన్లను అడిషనల్ ఎస్పీ ప్రేమ్కాజల్ సందర్శించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అంధవరంలో దాడి జలుమూరు: మండలంలోని అంధవరం పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్త సవలాపురం రాముపై అదే గ్రామానికి చెందిన పల్లి శంకరరావు, తిరుమలరావులు సోమవారం దాడికి పాల్పడ్డారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓట్లు పడటంతో ఓర్వలేని టీడీపీ వర్గీయులు రెచ్చకొట్టే మాటలు ఆడుతూ ఓటు వేసి వచ్చిన రామును నేలపై దొర్లించి రాయితో కంటి కింద గాయం చేశారు. స్థానిక వైద్యసిబ్బంది ప్రథమ చికిత్స నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ మధుసూదనరావు సిబ్బందితో వెళ్లి పరిస్థితి సద్దుమణిగించారు. -
సంక్షేమంలో మేటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం
● పేదలందరికీ ఇళ్లు... మొత్తం మంజూరైన ఇళ్లు: 78,429 నిర్మాణం పూర్తి అయినవి: 38,161 ● గడప గడపకు మన ప్రభుత్వంలో పనులు ప్రతిపాదిత పనులు : 3,208 అంచనా వ్యయం: రూ.101.12 కోట్లు పూర్తి అయినవి: 773 పురోగతిలో ఉన్నవి: 1,670 ● ప్రాధాన్యతా భవనాల నిర్మాణం గ్రామ సచివాలయాలు: 530 రైతుభరోసా కేంద్రాలు: 496 వైఎస్సార్ హెల్త్ సెంటర్లు: 435 డిజిటల్ లైబ్రరీలు: 173 బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు: 50 ● ఆరోగ్య రక్షణకు అధిక ప్రాధాన్యం... ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు: 50 అందుబాటులోనున్న వైద్యులు: 117 యూపీహెచ్సీలు: 18 అందుబాటులోనున్న వైద్యులు: 15 సీహెచ్సీలు: 5 108 వాహనాలు: 28 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లు: 22 104 వాహనాలు: 47 ఏఎన్ఎంలు: 640 బర్త్ వెయిటింగ్ హోమ్స్: 4 జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్లు: 541 ప్రయోజనం పొందినవారు: 2,53,679
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement