అధికారం కోసం చంద్రబాబు ఎంతకై నా దిగజారతారు | Sakshi
Sakshi News home page

అధికారం కోసం చంద్రబాబు ఎంతకై నా దిగజారతారు

Published Fri, Mar 29 2024 1:10 AM

-

తణుకు అర్బన్‌: అధికారం కోసం ప్రతిపక్షనేత చంద్రబాబు ఎంతకై నా దిగజారుతాడని, ఆఖరుకు గాడిద కాళ్లు పట్టుకోవడానికై నా సిద్ధమేనని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు అన్నారు. తణుకు హౌసింగ్‌ బోర్డు కాలనీలో గురువారం నిర్వహించిన సమావేశంలో ప్రతిపక్షాలపై ఆయన ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌పై ఒంటరిగా వెళితే ఓడిపోతామని వెన్నులో వణుకుపుట్టి అందరి కాళ్లు పట్టుకుని మూడు కండువాలతో వెళుతున్నాడని విమర్శించారు. పార్టీ స్థాపించి 12 ఏళ్లు అయినా ఇంతవరకు తన పార్టీ తరపున ఒక్క ఎమ్మెల్యేని అసెంబ్లీకి పంపించలేకపోయిన పవన్‌ను వెంటపెట్టుకుని ఎన్నికలకు వెళుతున్న చంద్రబాబుకు మరోసారి ఘోర ఓటమి తప్పదని దుయ్యబట్టారు. అంతేకాకుండా బీజేపీ నేత పురందేశ్వరి, షర్మిల, ఎంఆర్‌పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను కూడా రంగంలోకి దింపారంటే చంద్రబాబుకు జగన్‌ అంటే ఎంత భయం పుట్టిందో అర్థమవుతోందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తున్న బస్సుయాత్రకు కూడా ప్రజల నుంచి స్పందన విపరీతంగా ఉండడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని మంగ రాజు ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement