వేలూరు: వానియంబాడిలోని ఓ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తిరుపత్తూరు జిల్లా వానియంబాడి సమీపంలో శెట్టియప్పనూరు గ్రామానికి చెందిన కుప్పన్ పుదూరు ప్రాంతంలో పాత వస్తువులు విక్రయ, కొనుగోలు దుకాణం నడుపుతున్నాడు. అదేవిధంగా దుకాణం సమీపంలో పాత కార్ల కొనుగోలు, కారు విడి బాగాల గోడౌన్ నడుపుతున్నాడు. ఈక్రమంలో గురువారం ఉదయం గోడౌన్లో కార్మికులు పనుల్లో ఉండగా హఠాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన కార్మికులు వెంటనే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కుదరకపోవడంతో వానియంబాడి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. అప్పటికే కార్లు, ఆటో, కారు విడి బాగాల వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. వానియంబాడి పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.