
నూతన తరగతి గదులు ప్రారంభం
తిరువళ్లూరు: ఉలుందై పంచాయతీ మాజీ అధ్యక్షుడు ఎం.కే రమేష్ తన సొంత నిధులు రూ.1.30 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన తరగతి గదులను సోమవారం ప్రారంభించారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ ఉలుందై పంచాయతీ మాజీ అధ్యక్షుడు ఎంకే రమేష్ ఉలుందైలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాలుగు గదుల నిర్మాణం చేపట్టారు. అలాగే పాఠశాలలో శిథిలావస్థకు చేరిన గదులను సైతం మరమ్మతు చేయించారు. నూతనంగా నిర్మించిన గదుల్లో ఏసీ, శుద్ధి నీరు, బెంచీలు, ఫ్యాన్లు, డిజిటల్ క్లాస్రూమ్లను ఏర్పాటు చేశారు. వీటిని సోమవారం ప్రారంభించారు.