
నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన
తిరువళ్లూరు: ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసే సమయంలో ఉపాధ్యాయులను ఏకవచనంతో సంబోధించడంతోపాటు వారిని కించపరిచేలా వ్యవహరించిన కలెక్టర్ ప్రతాప్ తీరును ఖండిస్తూ ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి తాలుకా పరిధిలో గత వారం మీఊరిలో–మీవద్దకు కలెక్టర్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తిరుత్తణిలోని డాక్టర్ రాధాకృష్ణన్ హైయ్యర్ సెకండరీ పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. తనిఖీల్లో ప్లస్టూ, పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తగ్గడంతో మీరంతా ఉపాధ్యాయులుగా పని చేయడానికి అనర్హులంటూ ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారు. ఈ సంఘటన పలు మీడియా, సోషల్ మీడియాల్లో వైరల్గా మారింది. దీంతో కలెక్టర్ వ్యవహరించిన తీరుపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి. కలెక్టర్ తీరును నిరసిస్తూ జూన్ రెండు నుంచి ఆరు వరకు నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టాలని ఉపాధ్యాయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. ఇందులో భాగంగానే పాఠశాల పునఃప్రారంభమైన మొదటి రోజు ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. కలెక్టర్ క్షమాపణ చెప్పకుంటే త్వరలోనే ఉపాధ్యాయ సంఘాలు ఉమ్మడిగా చర్చించి ప్రత్యక్ష ఆందోళన చేపడతామని జాక్జోజియో సంఘం నేతలు జవహర్, షేక్ కపూర్, రాజాజీ, జ్ఞానశేఖరన్, ప్రభాకరన్ తదితరులు హెచ్చరించారు.
త్వరలో ఆందోళనపై కార్యాచరణ
కలెక్టర్ తీరుకు నిరసనగా ఆందోళన
తిరుత్తణిలో..
తిరుత్తణి: ఉపాధ్యాయులను కించపరిచేలా వ్యవహించిన జిల్లా కలెక్టర్ తీరుకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో సోమవారం నిరసన చేపట్టారు. తిరుత్తణి డాక్టర్ రాధాకృష్ణన్ ప్రభుత్వ మహాన్నత పాఠశాలలో నాలుగు రోజుల కిందట తనిఖీ చేసిన తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ప్రతాప్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉందని, ప్రధానోపాధ్యా యుడు, ఉపాధ్యాయులను కించపరిచేలా బహిరంగ ప్రదేశంలో వ్యవహరించడం ఉపాధ్యాయుకు తీవ్ర ఆవేదనకు గురిచేసింది. జాక్టో జియో ఆ ధ్వర్యంలో వేసవి సెలవుల తరువాత సోమవారం పాఠశాలలు తెచుకున్న తొలి రోజు నుంచి శుక్రవారం వరకు ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో హాజరు కావాలని నిర్ణయించారు. ఈ మేరకు తిరుత్తణి, పళ్లిపట్టు, తిరువలంగాడు, ఆర్కేపేట మండలాల్లోని ప్రభుత్వ ఉన్నత, మహాన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు.

నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన