
ఆకట్టుకున్న సైకత శిల్పం
ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలోని స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ విభాగం నేతృత్వంలో సైకత శిల్పం నిర్మించారు. సృజనాత్మకత శక్తి ద్వారా పర్యావరణంపై అవగాహన పెంచడానికి, సముద్ర కాలుష్యం నియంత్రణ దిశగా ప్రత్యేక కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. చైన్నెలోని ఎలియట్స్ బీచ్లో విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది ఇసుకను అద్భుతమైన కళాత్మక వ్యక్తీకరణగా మార్చారు. మహాసముద్రాలు , మంచినీటి పర్యావరణ వ్యవస్థలను రక్షించడంపై ఆవశ్యకతను ప్రతిబింబిస్తు దీనిని రూపకల్పన చేశారు. బీచ్లో సముద్రాన్ని తలపిస్తూ, వివిధ రకాల జల రాశులకు ఎదురయ్యే పరిస్థితులను గుర్తు చేస్తూ బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన ఈ సైకత శిల్పం ఆదివారం ఎలియట్స్ బీచ్లో ప్రత్యేక ఆకర్షణగా మారింది.
– సాక్షి, చైన్నె

ఆకట్టుకున్న సైకత శిల్పం