నటుడు చంద్రమోహన్‌కు సాగర్‌తో అనుబంధం | Sakshi
Sakshi News home page

నటుడు చంద్రమోహన్‌కు సాగర్‌తో అనుబంధం

Published Sun, Nov 12 2023 1:10 AM

- - Sakshi

నాగార్జునసాగర్‌ : సినీ నటుడు చంద్రమోహన్‌కు నాగార్జునసాగర్‌తో అనుబంధం ఉంది. సాయి సూరజ్‌ ఫిలింస్‌ పతాకంపై ఎస్‌కె.సైదా స్వీయ దర్శకత్వంలో ‘పాషా అందరివాడు’ అనే చిత్రం నిర్మించారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడైన చంద్రమోహన్‌, ప్రభాకర్‌, చిన్న, హరి, అనంత్‌రాంజగన్‌ నటించారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిసరాల్లో ఈ సినిమా చిత్రీకరణ సాగింది. ఈ చిత్రంలోని పలు సన్నివేశాలను సాగర్‌మాత ఆలయం, చర్చి, మసీదు తదితర ప్రాంతాల్లో తీశారు. 2014లో విడుదలైన ఈ చిత్రం సందేశాత్మకమైన సినిమాగా పేరు తెచ్చుకుంది.

Advertisement
Advertisement