చదువుతోపాటు క్రీడలూ తప్పనిసరి | Sakshi
Sakshi News home page

చదువుతోపాటు క్రీడలూ తప్పనిసరి

Published Thu, Mar 30 2023 12:30 AM

క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను 
ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ తదితరులు  - Sakshi

రాష్ట్రస్థాయి ఫ్లోర్‌ కర్లింగ్‌ పోటీలు

ప్రారంభం

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట) : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ తప్పనిసరిగా రాణించాలని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు వేదాయపాళెంలోని ఎల్‌ఎల్‌ఎఫ్‌ స్కూల్లో మూడో రాష్ట్రస్థాయి ఫ్లోర్‌ కర్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌–2023 పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే దేశానికి మంచి పేరు వస్తుందని, విద్యార్థులందరూ క్రీడల్లో పాల్గొనాలన్నారు. జిల్లా ప్రైవేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కర్తం ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగాన్ని ప్రోత్సహిస్తోందని, మహిళలకు సైతం ప్రత్యేక ఆటల పోటీలు నిర్వహిస్తోందన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారు జాతీయ పోటీలకు ఎంపికవుతారని కర్లింగ్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ జిల్లా సెక్రటరీ మనోహర్‌, రాష్ట్ర కర్లింగ్‌ అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, 28వ డివిజన్‌ ఇన్‌చార్జి మదన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement