శనివారం శ్రీ 3 శ్రీ మే శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 3 శ్రీ మే శ్రీ 2025

May 3 2025 8:27 AM | Updated on May 3 2025 8:27 AM

శనివా

శనివారం శ్రీ 3 శ్రీ మే శ్రీ 2025

10లోu

200 ఎకరాల్లో

ఎగ్జోటిక్‌ జూ పార్కు

సింగపూర్‌ తరహాలో రూపుదిద్దే యోచన

ఇప్పటికే స్థలం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం

పీపీపీ విధానంలో పనులు ప్రారంభించనున్న టీఎఫ్‌డీసీ

మరో రెండేళ్లలో అందుబాటులోకి..

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌ నగరాలకు తోడు నాలుగో సిటీగా ఏర్పడనున్న ఫ్యూచర్‌ సిటీకి దగ్గరల్లో విదేశీ జంతు ప్రదర్శన శాల అందుబాటులోకి రానుంది. పాతబస్తీ చాంద్రాయణగుట్ట మీదుగా రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలుపుతూ ఫ్యూచర్‌ సిటీ వరకు మెట్రో రైలు కారిడార్‌ ఎక్స్‌టెన్షన్‌ ఏర్పాటు కానున్న దృష్ట్యా కొత్తగా ఏర్పడనున్న ఈ జూ పార్కుకు రోడ్డు మార్గంతో పాటు మెట్రో రైలు సేవలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌)తో పాటు రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ట్రిపుల్‌ ఆర్‌) తదితర అత్యంత సౌకర్యవంతమైన రవాణా సౌకర్యం సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. ఈ జూ పార్కుతో పాటు మరో 1,500 ఎకరాల అటవీ ప్రాంతాన్ని జూ సఫారీ పార్కు ఏర్పాటు చేయడానికి అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం 380 ఎకరాల్లో 2,200 జంతువులతో కొనసాగుతున్న నెహ్రూ జూ పార్కుకు అదనంగా ఈ విదేశీ జంతు ప్రదర్శన శాల అందుబాటులోకి రానుంది.

ఏయే దేశాల నుంచి..

ఆఫ్రికా, దక్షిణ అమెరికా, యూరప్‌, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన జంతు జాతులను ఎగ్జోటిక్‌ యానిమల్‌ జూ పార్కుకు తరలించనున్నారు. నెహ్రూ జూ పార్కులోని జంతువులు అక్కడే ఉండనున్నాయి. ఒకవైళ ఇప్పటికే ఇక్కడ ఉన్న విదేశీ జంతువుల సంతానం పెరిగితే వాటిని మాత్రమే అక్కడికి తరలించనున్నారు. జంతు మార్పిడిలో భాగంగా ఇతర దేశాల్లోని జూ పార్కుల నుంచి అవసరమైన జంతు జాతులను కొత్త జూ పార్కుకు తరలించనున్నారు. అలాగే.. ప్రైవేట్‌ యాజమాన్యాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఫామ్స్‌ నుంచి జంతువులను ఖరీదు చేసి ఇక్కడికి తీసుకురానున్నారు. నెహ్రూ జూ పార్కులో కొనసాగుతున్న ప్రస్తుత జంతు సేకరణకు భిన్నంగా ఈ ప్రక్రియ కొనసాగనుంది.

దేశంలోనే అతిపెద్దగా..

200 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఎగ్జోటిక్‌ యానిమల్‌ జూ పార్కు దేశంలో అతి పెద్దది కానుందని జూ పార్కు అధికారులు తెలిపారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రం మైసూర్‌లోని శ్రీ చామరాజేంద్ర జంతు ప్రదర్శన శాల (మైసూర్‌ జూ)లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల జంతువులకు ఆవాసంగా కొనసాగుతోంది. అంతరించిపోతున్న జంతు జాతుల పరిరక్షణ జరుగుతోంది. దీనికి తోడు ఆదాయంతో పాటు సందర్శకులకు వినోదం లభిస్తోంది. ఈ తరహాలోనే నగర శివారు ముచ్చర్లలో విదేశీ జంతు ప్రదర్శన శాల ఏర్పాటు కానుంది. అయితే ముచ్చర్ల జూ పార్కు మైసూర్‌ జూ పార్కు కన్నా.. విశాలంగా ఏర్పాటు కానుంది.

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 3 శ్రీ మే శ్రీ 20251
1/1

శనివారం శ్రీ 3 శ్రీ మే శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement