Etela Rajender: కేసీఆర్ను ఓడిస్తాననే సవాల్కు కట్టుబడి ఉన్న
Published
Tue, Jul 12 2022 2:22 AM
సాక్షి, హైదరాబాద్: గజ్వేల్లో సీఎం కేసీఆర్పై పోటీచేసి ఓడిస్తానన్న సవాల్కు కట్టుబడి ఉన్నానని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. కేసీఆర్ను కొట్టగల దమ్ము ఈటలకు ఉందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. గజ్వేల్లో కేసీఆర్ను బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. మళ్లీ చాలా రోజులకు కేసీఆర్కు కళ్లు బైర్లు కమ్మి, మీడియా సమావేశం పెట్టి మోకాళ్ల హైట్.. అంటూ వ్యాఖ్యానించారన్నారు.
సోమవారం ఈటల విలేకరులతో మాట్లాడుతూ ‘బుల్లెట్ అర అంగుళం పొడ వుంటుంది. గుండెల్లో దిగితే చచ్చిపోతారన్న విషయం కేసీఆర్కు తెలుసు’ అని వ్యంగ్యంగా అన్నారు. కేసీఆర్కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని సవాల్ విసిరారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ సిద్ధమని.. జాతీయ కార్యవర్గ సమావేశాలపుడు కేంద్రమంత్రి అమిత్షా చెప్పి వెళ్లిన విషయాన్ని గుర్తుచేశా రు. అసెంబ్లీలో మోదీని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క విమర్శించినపుడు.. ప్రధాని కుర్చీకి గౌరవం ఇవ్వాలని నీతులు చెప్పిన కేసీఆర్... ఇప్పుడు అదే కుర్చీపై ఎంతదిగజారి మాట్లాడుతున్నారో చూస్తున్నామన్నారు.