అందోల్ సెగ్మెంట్ అల్లాదుర్గ్లోని సభకు పీఎం హాజరు.. రేపు హైదరాబాద్కు అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో... బీజేపీ నిర్వహిస్తున్న ప్రచారాన్ని మరింత ఉధృతం చేయడంలో భాగంగా మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధి అందోల్ నియోజకవర్గం అల్లాదుర్గ్లోని ఐవీ చౌరస్తా వద్ద జరగనున్న జహీరాబాద్–మెదక్ జనసభలో ప్రధాని పాల్గొంటారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఎం.రఘునందన్ రావులకు మద్దతుగా అక్కడ ప్రచారం నిర్వహించనున్నారు.
మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామనే విషయాలను మోదీ ప్రస్తావిస్తారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మే 1 (బుధవారం) హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా కేంద్ర హోంశాఖ అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అదేవిధంగా మే 5న నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా మూడు చోట్ల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు.