సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పేదల ఆశలపై నీళ్లు చల్లింది టీడీపీనేనని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖలో ఆదివారం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ హయాంలోనే విశాఖ అభివృద్ధి చెందిందని చెప్పారు. ‘చంద్రబాబు తన పాలనలో విశాఖకు ఎన్నెన్నో చేశానని చెబుతున్నారు. హుద్హుద్ సమయంలో ఇక్కడే కూర్చొని అన్నీ బాగుచేశానంటున్నారు. ఆనందపురం, పెందుర్తి, భీమిలి, పరవాడ తహసీల్దార్ కార్యాలయాల్లో హుద్హుద్ తర్వాత భూ రికార్డులు ఎలా మారిపోయాయి?’ అని ప్రశ్నించారు.
ఎన్ని గుండెలు ఉన్నాయి బాబూ..: చంద్రబాబు ఎక్కడికి వెళితే ఆ ప్రాంతమే తన గుండెల్లో ఉందంటాడని, అమరావతి, హైదరాబాద్, విశాఖలో అవే అబద్ధాలు చెబుతున్నాడని, ఇంతకీ చంద్రబాబుకి ఎన్ని గుండెలున్నాయో అర్థంకాలేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడడం చంద్రబాబుకి తగదని, 14 ఏళ్లపాటు సీఎంగా చేసిన సంస్కారం ఇదేనా అని మండిపడ్డారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఒక్క ఇల్లు అయినా పేదలకు ఇచ్చారా? అని ప్రశ్నించారు. విశాఖ భూగర్భ డ్రైనేజీ గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. దాదాపు రూ.900 కోట్ల వ్యయంతో మురుగునీటిని శుభ్రం చేసి పరిశ్రమలకు ఇచ్చే ప్రాజెక్టు తెచ్చారని చెప్పారు.
దాన్లో రూ.450 కోట్లు అప్పు, మరో రూ.50 కోట్లు బాండ్ల రూపంలో సేకరించారన్నారు. దానికి జీవీఎంసీ బిల్డింగ్లను తాకట్టు పెట్టారు తప్ప గ్యారెంటీ ఇవ్వలేదన్నారు. అందుకే దాన్ని రీస్ట్రక్చర్ చేసి రుణం తగ్గించి, తమ ప్రభుత్వం రూ.200 కోట్లు ఇచ్చి పనులు చేపడుతోందని.. ప్రభుత్వ బాధ్యతంటే అది.. అని చెప్పారు. తాము పన్నులు పెంచబోతున్నామని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని, నిజానికి చంద్రబాబు హయాంలో 33 శాతం నీటిపన్ను పెంచారని గుర్తు చేశారు. ప్రస్తుత పన్నుపై 15 శాతానికి మించి పెంచొద్దని చట్టం కూడా చేశామన్నారు.
పేదలకు ఒక్క ఇల్లయినా ఇచ్చావా బాబూ..
Published Mon, Mar 8 2021 3:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement