గద్వాల అర్బన్: బీఆర్ఎస్, బిజేపీ పార్టీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలను కేవలం ఓటుబ్యాంకుగా వాడుకున్నాయని.. వారికి రానున్న ఎన్నికల్లో ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని అఖిల భారత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వర్ రాజు అన్నారు. ఎంపీ ఆభ్యర్ధి మల్లురవికి మద్దతుగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్, బిజేపీల పాలనలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఎలాంటి కృషి చేయలేదని, కేంద్రంలో మరోసారి బిజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడమే కాకుండా రిజర్వేషన్లు కూడా పూర్తిగా తొలగించి, అట్టగడుగు వర్గాలకు అందాల్సిన రాజ్యాంగ ఫలాలు అందకుండా చేస్తుందన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, సంక్షేమం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఏ విధంగా కాంగ్రెస్ను ఏవిధంగా ఆదరించారో.. కేంద్రంలోనూ ఆదరించాలని కోరారు. అంతకు ముందు జెడ్పీ చైర్పర్సన్ సరితను మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలతో సన్మానించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, శ్రీనివాసులు, మహ్మద్ చాంద్, కృష్ణగౌడ్, కౌన్సిలర్ నరహరి గౌడ్, నాగేందర్ యాదవ్, తిమోతి, జమ్మిచేడు ఆనంద్, అమరవాయి కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.
ఓటు బ్యాంకు రాజకీయాలకు గుణపాఠం
Published Sat, May 4 2024 1:00 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement