వైన్‌షాపు ఎదుట మృతదేహంతో ఆందోళన | Sakshi
Sakshi News home page

వైన్‌షాపు ఎదుట మృతదేహంతో ఆందోళన

Published Thu, Mar 28 2024 12:40 AM

మృతదేహంతో భైఠాయించిన కుటుంబ సభ్యులు - Sakshi

లోకేశ్వరం: మండల కేంద్రానికి చెందిన పోతరాజుల ప్రశాంత్‌ అతిగా మద్యం సేవించి లోకేశ్వరం కొత్త బస్టాండులోని లక్కీ వైన్స్‌ పర్మిట్‌ రూంలో మంగళవారం మృతి చెందాడు. మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ గ్రామస్తులు, కుటుంబ సభ్యులు బుధవారం వైన్స్‌షాపు ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. ముధోల్‌ సీఐ మల్లేశ్‌, లోకేశ్వరం ఎస్సై రాజు నచ్చజెప్పినా ఆందోళనకారులు వినిపించుకోలేదు. ఆందోళన 5 గంటల వరకు సాగడంతో కొత్త బస్టాండు ప్రాంతంలోకి రాకపోకలను నిలిపివేశారు. మృతిపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు బయటకు వచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. విషయం తెలుసుకున్న ఎంపీటీసీ సభ్యుడు జయసాగర్‌రావు, మాజీ సర్పంచ్‌ మెండే శ్రీధర్‌, కాంగ్రెస్‌ నాయకుడు శ్రీనివాస్‌ ఆందోళనకారులు, వైన్స్‌ యాజమానులతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి రూ.2లక్షల 50వేల ఆర్థికసాయం అందించేందుకు ఒప్పందం కుదరడంతో ఆందోళన విరమించారు.

Advertisement
Advertisement